3, ఆగస్టు 2020, సోమవారం

నరకలోక ఏడుపులు?...(మిస్టరీ)



                                                                    నరకలోక ఏడుపులు?
                                                                                                (మిస్టరీ)

సోవియట్ యూనియన్ శాస్త్రవేత్త డాక్టర్ అజ్జాకోవ్, భూకంపాలను ఏర్పరస్తున్న భూమి క్రింద ఉన్నప్లేట్ టెక్టోనిక్ కదలికలను మరియు ఇతర విషయాలతోపాటు భూమి క్రింద ఉన్న ఉష్ణోగ్రతను రికార్డ్ చేయడానికి ఉద్దేశించి సైబీరియాలో ఒక బోరును తవ్వాలని ప్రభుత్వ సహాయంతో ఒక ప్రాజక్టుకు ప్లాను వేశారు.  దానికి ఒక తేదీ నిర్ణయించారు.

నిర్ణయించిన తేదీలో, డాక్టర్ విక్టర్ అజ్జాకోవ్ నేతృత్వంలో ఒక ప్రయోగాత్మక డ్రిల్లింగ్ బృందం వాళ్ళ మిషెన్లతో  సైబీరియాలో 14.5 కిలోమీటర్ల (9 మైళ్ళు) లోతైన 'బోర్హోల్' ను రంధ్రం చేయగలిగారు. వారు ఒక  గుహకు చేరుకున్నారని సూచిస్తున్నట్టు, డ్రిల్ మిషెన్ ఇష్టం వచ్చినట్టు క్రూరంగా తిరగడం ప్రారంభించింది. వెంటనే డ్రిల్లింగ్ ను ఆపేసారు. మిషెన్లో ఏదైనా లోపం ఉందేమోనని డ్రిల్లింగ్ పైపును పైకి తీసుకువచ్చి దానిని పరీక్షించారు. లోపు బృందం లోని కొందరు కుతూహలాన్ని ఆపుకోలేక బోరు చేయబడిన రంద్రం లోపలకు చూసేరు. కాని ఏమీ కనబడలేదు. అయితే వారికి రంద్రం నుండి ఏవో శబ్ధాలు వినబడ్డాయి.  శబ్ధాలను బాగా వినడానికి కొంతమంది శాస్త్రవేత్తలు చెవులు రంద్రానికి ఆనించారు. రంద్రంలో నుండి కొన్ని ఏడుపులు, కేకలూ వినబడ్డాయి. వాళ్ళు వెంటనే విషయాన్ని వాళ్ళ బృందం నాయకుడికి చెప్పారుమరుసటి రోజు డ్రిల్లింగ్ కొనసాగడానికి ముందు, పరిశోధకులు ప్రత్యేక మైక్రోఫోన్ మరియు ఇతర పరీక్ష పరికరాలను డ్రిల్లింగ్ మెషన్ కు తగిలించారు.

డ్రిల్లింగ్ మిషెన్ 9 మైళ్ళ లోతుకు దిగిన తరువాత ఆగిపోయింది. మైక్రోఫోన్ తో పాటూ ఇతర పరీక్ష పరికరాలను జత చేసిన వాటి నుండి అక్కడ  1,100 డిగ్రీల సెల్సియస్ (2012 డిగ్రీల ఫారెన్హీట్ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతను చూసిన వెంటనే, డ్రిల్లింగ్ మిషెనుకూ, మిగిలిన పరికరాలకూ ఏదీనా ప్రమాదం జరగవచ్చునేమో నన్ని డ్రిల్లింగ్ మిషెన్ను పైకి తీసేరు. చాలా వరకు పరికరాలు పెద్దగా డామేజ్ అవలేదు కానీ అవి అక్కడ పనిచేయలేదు. అన్నిటినీ శాత్రవేత్తలు పరీక్షించినప్పుడు మైక్రోఫోన్ వాళ్ళను ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే మైక్రోఫోన్ ప్లేట్ టెక్టోనిక్  కదలికలను గుర్తించలేకపోయింది. దానికి బదులుగా, లక్షలాది మంది  ప్రజలు అరుస్తున్న శబ్దాలను రికార్డు చేసింది. యుఎస్ఎస్ఆర్ నాస్తికుడైన యుఎస్ఎస్ఆర్ శాస్త్రవేత్త డాక్టర్ అజ్జాకోవ్ తాను వింటున్నదాన్ని నమ్మలేకపోయాడు. ఇతర పరిశోధకులతో పాటు, అజ్జాకోవ్ కూడా నరకానికి ఒక రంధ్రం వేసినట్లు తేల్చారు.


డాక్టర్ అజ్జాకోవ్ తో సహా అక్కడి శాత్రవేత్తలూ, వాళ్ళతో పాటూ పనిచేస్తున్న  ఇంజనీరింగ్ ఉద్యొగస్తులు మైక్రోఫోన్ రికార్డు చేసిన శబ్దాలు నరకం యొక్క శబ్దాలు అని ఖచ్చితంగా నమ్మారు. విషయాన్ని వెంటనే ప్రభుత్వానికి తెలిపారు. వాళ్ళందరినీ అక్కడే ఉండమని, సైనిక దళాలతో పాటూ మరి కొంతమంది శాస్త్రవేత్తలు వస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. కానీ చాలా మంది శాస్త్రవేత్తలు భయంతో వెంటనే ఉద్యోగ స్థలాన్ని విడిచిపెట్టారు. ధైర్యంగా అక్కడ బస చేసిన కొందరు శాస్త్రవేత్తలు రాత్రి తరువాత ఇంకొక పెద్ద షాక్కు గురయ్యారు. బోర్హోల్ నుండి ఒక ప్రకాశవంతమైన వాయువు పేలింది. పెద్ద రెక్కలతో ఒక రాక్షసుడి ఆకారం కనబడింది, అది రష్యన్ భాషలో "నేను జయించాను" అనే పదాలు అంటూ మళ్ళీ మంటల్లోకి వెళ్ళిపోయింది.

ప్రభుత్వం చెప్పినట్టు మరుసటి రోజు రష్యా సైనిక దళాలు అక్కడికి జేరుకున్నాయి. సైనికుల నాయకుడు అక్కడ జరిగిన అన్ని విషయాలనూ అడిగి తెలుసుకుని, ఆయన కూడా మైక్రోఫోన్ తో రికార్డు అయిన శబ్ధాలను విన్నాడు. ప్రభుత్వ అధికారులలో ఎవరితోనో మాట్లాడాడు. తరువాత ఆయన డాక్టర్ అజ్జాకోవ్ తో ' ప్రాజక్టు రద్దు చేయబడింది" అంటూ అందరినీ బయలుదేరటానికి రెడీ అవమనై చెప్పి, అక్కడున్న వాళ్ళందరిలో ఏర్పడిన ఒత్తిడి తగ్గటానికి సైనికి డాక్టర్లు అందరికీ ఒక ఇంజెక్షన్ చేశారు.

విచిత్రం ఏమిటంటే సైనిక వైద్యులు సైట్లోని ప్రతి ఒక్కరికీ స్వల్పకాలిక జ్ఞాపకశక్తిని చెరిపేయడానికి ఒక మత్తుమందు మోతాదును ఇంజెక్షన్ గా ఇచ్చినట్లు నివేదించబడింది.

సంఘటనకు సంబంధించిన వివరాలను సోవియట్ ప్రభుత్వం అణచివేసిందని చెప్పబడింది, కాని ఏదో ఒకవిధంగా వార్తాపత్రికలకు సమాచారం లీక్ అయింది, అందులో ఒకటి ఫిన్లాండ్లోని వార్తాపత్రిక. అక్కడ నుండి, కథ మరియు హేయమైన ఆత్మల రికార్డింగ్ రెండూ ఉత్తర అమెరికాకు వెళ్ళాయి.


డాక్టర్ విక్టర్ అజ్జాకోవ్ సైబీరియాలో ఎటువంటి ప్రయోగాత్మక డ్రిల్లింగ్ నిర్వహించినట్లు రికార్డులు లేవు. సైబీరియాలోనివెల్ టు హెల్యొక్క ఖచ్చితమైన స్థానం కూడా ఎప్పుడూ అందించబడలేదు.

సైబీరియాలో ప్రయోగాత్మక బోర్హోల్స్ లేకపోయినప్పటికీ, సోవియట్ ప్రభుత్వం 1970 లో కోలా ద్వీపకల్పంలో ఇటువంటి డ్రిల్లింగ్ కార్యకలాపాలను నిర్వహించింది సోవియట్ రష్యా . 1989 లో, ఒక ప్రయోగాత్మక బోర్హోల్ మిగతా వాటికి భిన్నంగా లోతును సాధించగలిగింది. కోలా ద్వీపకల్పంలో ప్రయోగాత్మక డ్రిల్లింగ్ 180 డిగ్రీల సెల్సియస్ (356 డిగ్రీల ఫారెన్హీట్) ఉష్ణోగ్రతతో 12.1 కిమీ (7.5 మైళ్ళు) లోతును సాధించింది. కోలా బోర్హోల్ ఇప్పటివరకు డ్రిల్లింగ్ చేసిన లోతైన రంధ్రంగా పరిగణించబడుతుంది.

ఫిన్లాండ్లోని వార్తా పత్రికలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తమ ఆఫీసకు వచ్చిన ఆడియో, శాస్త్రవేత్తల బృందం నేరుగా రికార్డింగ్ చేసిన ఒక శాస్త్రవేత్త నుండి వచ్చిందని అతను పేర్కోన్నాడు.

ఈ వివరాలు పురాణాలు చెప్పినట్లు వాటికి దగ్గరగా మరణానంతర జీవితం యొక్క వర్ణనలు ఎక్కువగా దృవీకరించబడి ఉన్నాయి అని నమ్ముతున్నారు.

అందుకే ఇది ఇంకా మిస్టరీగా ఉండిపోయింది.

Image Credit: To those who took the original photos

************************************************************************************************

4 కామెంట్‌లు:

  1. మరి ఇప్పుడు అంతకంటే లోతుకే తవ్వారు కదండీ కొన్నిచోట్ల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అదే నండీ మిస్టరీ...బహుశ ఆలోకం ఒక చోటే(రష్యాలోనే)ఉందేమో!!!

      తొలగించండి
  2. ఇలాంటివన్నీ... రష్యా, చైనాలాంటి కమ్యూనిస్ట్ దేశాల్లోనే జరుగుతాయెందుకో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బహుశ దేవుడు లేడు అనే వాళ్ళకు...లేదు ఉన్నాడు అని కనువిప్పు కలిగించటానికేమో!!!

      తొలగించండి