16, మే 2019, గురువారం

దైవరహస్యం (నవల)......Part-1

దైవరహస్యం (నవల)
                                            
1515 ఆగస్టు 15….విశాలపురం అనే గ్రామంలో

తన ఇంటి ముందున్న ఖాలీ స్థలంలో ఒక గుడి కట్టాలని అశోక వర్మ నిర్ణయించుకున్నాడు. ఆ మాట విని చాలా సంతోషపడింది భార్య శేషమాంబ. విశాలపురంలో ఇంట్లోనే గుడి అనేది బాగా శాస్త్రము తెలిసున్న వాళ్ళ ఇళ్ళల్లో మాత్రమే కట్టగలరు! మిగిలినవారు ఊరికి బయట పది మైళ్ళ దూరంలో ఉన్న అమ్మోరి గుడికి వెళ్ళాల్సిందే. పెళ్ళైన కొత్తలో శేషమాంబ కూడా ఊరి బయట ఉన్న అమ్మోరి గుడికే వెళ్ళింది.  అలా ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పాములను చూసి శేషమాంబ భయపడింది.   

పెళ్ళికి ముందు విజయనగరంలో శేషమాంబ ఇంటికి దగ్గరలోనే రెండు గుడులు ఉండేవి. రోజూ రెండు పూటలా గుడికి వెళ్ళి రావటం శేషమాంబకు అలవాటు. పెళ్ళి చేసుకుని విశాలపురంలోని భర్త ఇంటికి వచ్చినప్పుడు, శేషమాంబకి అంతా కొత్తగానూ, తేడాగానూ ఉండేది. వాటిల్లో శేషమాంబని ఎక్కువ కష్టపెట్టింది ఇదిగో గుడి సమస్య. గుడికి వెళ్ళాలంటే పది మైళ్ళ దూరం వెళ్ళాలి. ఆరు సంవత్సరాల తరువాత సమస్యకు ఇప్పుడు ముగింపు వచ్చింది. అదికూడా భర్త అశోక వర్మ ద్వారా రావడం శేషమాంబని ఎక్కువ సంతోష పెట్టింది.

తాపీ మేస్త్రీతో పాటు మరో నలుగురు వచ్చి దిగారు. అందరూ పని ముట్లతో సహా రెడీగా ఉన్నారు. తాపీ మేస్త్రీ గుడి కట్టాల్సిన ప్రదేశాన్ని చూశాడు.

ప్రదేశంలోని ఈశాన్య మూలలో ఐదడుగుల ఎత్తుతో ఒక రాయి ఉన్నది. మేస్త్రీ తన భుజం మీదున్న తుండుతో   రాయిని తుడిచాడు. రాయి పైన ఒక మూల త్రిశూలం ఆకారం చెక్కబడుంది. రాయి క్రింద బాగంలో ఏవో అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. అయితే అక్షరాలు చెరిగిపోయున్నాయి. 

" రాయిని తీసేసి పని మొదలు పెట్టండి. శుభమూహర్త సమయం దాటిపోతుంది. .." అన్నాడు అశోక వర్మ.

"అయ్యా రాయిపైన ఏవో రాతలు ఉన్నాయండి"

"పరవాలేదు తీసేయండి. ఆ రాతల గురించి తెలుసుకోవటానికి పండితులను పిలిపించాను. ఎవరూ చదవలేకపోయారు. కట్టేది గుడి కాబట్టి ఏ దోషమూ ఉండదని చెప్పారు "

"అలాగే అయ్యాగారు" అన్నాడు మేస్త్రీ.

రాయి పక్కనే నిలబడున్న ఒక కూలి రాయిని పట్టుకుని ఊపాడు.
                                                            **********************
2015 ఆగస్టు 15…… విశాలపురం సిటీలో
నాలుగు రోడ్ల కూడలిని చూస్తుంటే విదేశాలను గుర్తుకు తెస్తోంది. విశాలపురానికి అడ్డంగా నాలుగు రోడ్లు వెడుతున్నాయి. నాలుగు రోడ్ల మధ్యలో రావి, చింత చెట్లు వరుసక్రమంలో నిలబడున్నాయి.

ఊర్లో ఉన్న వృద్దులు కొంతమంది చెట్ల క్రింద నిలబడి రోడ్డు యొక్క అందాన్నీ, రోడ్డు మీద వేగంగా పోతున్న వాహనాలను చూసి ఆనందిస్తూ ఉంటారు.

సెల్ ఫోన్ యుగంలో కూడా ముక్కుపొడికి డిమాండ్ ఉందంటే అది ఊర్లోనే ఎక్కువ. తోటల క్రిష్ణారావ్ గారు భోజనం లేకుండా కూడా ఉండగలరు, కానీ ముక్కుపోడి లేకుండా ఉండలేరు. ముక్కు ద్వారా ముక్కుపొడిని పీలుస్తుంటే ఆయనకు ఒళ్లంతా కరెంటు పాకినట్లు అనిపిస్తుంది. శ్వాసించుకోవటం కోసం భగవంతుడు మనుషికి ముక్కు ఇచ్చాడు. అందులో ముక్కుపొడి వేసుకోవటాన్ని కనిపెట్టింది, రెండు విధాలుగా ముక్కును ఉపయోగుంచు కోవటం మానవుని తెలివితేటలు.

తోటల క్రిష్ణారావ్ గారికి డెబ్బై ఏళ్ల వయసు ఉంటుంది. వయసు పైబడితేనే కాలం గడపటానికి శ్రమ పడవలసి వస్తుంది. ఎందుకనో తెలియదు...టీ.వీ చూడటం ఆయనకు ఇస్టంలేదు. రేడియోలో పాటలు వినడానికి కూడా ఇష్టపడరు. కబుర్లు, చర్చ అంటే మాత్రం చాలా ఇష్టం. కబుర్లు, చర్చలలో ఊర్లోని గొడవ ఉండాల్సింది చాలా అవసరం.

ముక్కుపొడి వేసుకున్న ఉత్సాహంతో 'కబుర్లు చెప్పుకోవటానికి ఎవరైనా కనబడతారా?' అని ఆయన  ఎదురుచూస్తున్నప్పుడు ....ఎదురుగా వచ్చాడు మాటల కోటేశ్వర రావ్.

"ఎంతసేపు నీకోసం ఎదురుచూడాలి?" అని ఆయనతో గొడవ పడి కబుర్లలోకి వెళ్ళాడు క్రిష్ణారావ్. ఇద్దరూ కలిసి నాలుగు రోడ్ల కూడలిలోని రావి చెట్టు క్రింద ఉన్న బెంచి మీద కూర్చున్నారు.
సిమెంటు బెంచి మీద కూర్చుంటే చల్లగా ఉంది.

 "రోడ్డు వేసే కాంట్రాక్టర్ల దగ్గర నుండి చెట్టూ, సిమెంటు బెంచి ఎలాగో తప్పించుకున్నాయి...కదా కోటేశ్వర రావ్" 

"అవును క్రిష్ణారావ్! కానీ, చెట్టును కొట్టేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి కొట్టేయడానికి వచ్చిన మనుషులకు రక్తగాయలు ఏర్పడి రక్తం ప్రవాహంగా పోవటంతో భయపడ్డారు. దాంతోపాటూ కాలంలో కాశీకి వెళ్ళే మునులు, రుషులు సేద తీర్చుకోవటానికి చెట్టు క్రింద కూర్చునేవారట. తరువాత ఒక సర్పం చెట్టు సందులోకి వెళ్ళిందట. అప్పటి నుంచి చెట్టును నాగేంద్రుడి చెట్టు అని పిలుస్తారు. అందుకనే చెట్టును కొట్టేయడానికి ఎవరూ సాహసం చేయరు..."

"ఇప్పుడు కూడా పాము ఉన్నదా?"

"తెలిసే మాట్లాడుతున్నావా... చెట్టును వందో, రెండొందలో ఏళ్ళ క్రితం నాటారు. ఇంకానా పాము ఇక్కడుంటుంది?"

"మరి ఇప్పుడు కూడా చెట్టుకు దైవశక్తి ఉన్నదంటావా?"

" పాము లేకపొతేనేమి...వాళ్ళ వంశోద్ధారకులుండరా?”

"అలాగైతే పాములు వచ్చి కాటు వేసుండాలి కదా...వాళ్ళకు గాయాలు ఎలా తగిలినై?"

"ఇప్పుడు ఏమంటావు... చెట్టుకు దైవశక్తి లేదు అంటావా?"

"అది చెట్టు...అంతే! దేముడూ లేడు...దైవశక్తీ లేదు. నాగేంద్రుడికి లోకంలో వేరే చోటే లేదా... చెట్టులోకి వచ్చి తలదాచుకోవటానికి?"

"తలతిక్కగా మాట్లాడకపోతే నీకు తోచదా...?"

వాళ్ళిద్దరి మధ్యా చర్చ మొదలయ్యింది. వేగం పుంజుకుంది. వాళ్ళ చర్చలో ఎన్నో పాత విషయాలు చోటుచేసుకున్నాయి.

కనుచూపు మేరలోనే నాలుగు రోడ్ల 'టోల్ గేట్' తెలుస్తోంది. అక్కడ చాలా కార్లు, లారీలు,  బస్సులు వరుసగా నిలబడున్నాయి.

వాటిని చూసిన క్రిష్ణారావుకి నీరశం వచ్చింది.

"నువ్వెందుకు అలా నీరశంగా ఉన్నావు?"

"ఎందుకా? 'టోల్ గేట్' ఉన్న స్థలం నాది. ప్రభుత్వం లాక్కుంది. దానికొసం నాకు కొన్ని వేలు ఇచ్చారు. కానీ వాళ్ళు కోట్లకొద్ది సంపాదిస్తున్నారు"

"రోడ్డు వేసి దాన్ని బాగా ఉంచుకోవటానికే కదా వాళ్ళు వసూళ్ళు చేస్తున్నారు"

"వసూళ్ళు చేసి రోడ్డు బాగోగులు వీళ్ళేం చేసి చించేస్తున్నారు. రోడ్డుకు వెళ్ళి చూడు 'టోల్ గేట్' రెండువైపులా వంద మీటర్లదాకా ఎప్పుడూ బాగానే ఉంచుకుంటారు. తరువత అంతా గుంతలే. రోడ్డూ లేదు పాడూ లేదు. పోనీ రోడ్డు పక్కనున్న చెట్లకు నీళ్ళుపోస్తున్నారా....అదీలేదు"
"చివరగా నువ్వేం చెప్పదలచుకున్నావ్ క్రిష్ణా రావ్"

"దొచుకుంటున్నారు. ప్రజలను దోచుకుంటున్నారు...ఇలా అని తెలిసుంటే నా స్థలాన్ని ఇచ్చేవడినే కాదు"

"అలా గనుక నువ్వు చేసుంటే పాటికి నిన్ను జైల్లో తోసుంటారు...నోరు మూసుకుని ఉండు"

వెళ్ళి వస్తున్నప్పుడల్లా కార్ల వాళ్ళు, బస్సుల వాళ్ళు యాబై, వందా ఏడుస్తూ ఇచ్చుకుంటున్నారు. కారు, బస్సు కొనేటప్పుడే రోడ్డుకని ఒక టాక్స్ లాకుంటున్నారే, తరువాత ఎందుకీ 'టోల్ టాక్స్?"

"ప్రపంచం మొత్తం ఉందప్పా! పాత రోడ్డు ఎలా ఉండేది...ఇప్పుడెలా ఉన్నది?”

"ఏం మాట్లాడుతున్నావు...! ఇలా రోడ్డు వేసివ్వాల్సింది గవర్నమెంట్ బాధ్యత.  దానికొసం పన్ను కడుతున్నాం కదా...అలాంటప్పుడు ఎందుకు రోజు రోజు పన్ను?”

"నీకు మైండ్ దొబ్బింది...అందుకే అలా పిచ్చిగా మాట్లాడుతున్నావు!"

నీలాంటి వాళ్ళు ఉండబట్టే కాంట్రాక్ట్ తీసుకున్నవాడు తన ఇష్టం వచ్చినట్లు వసూలు చేసి....కొల్లగొడుతున్నాడు. కారు పెట్టుకున్న వాళ్ళందరూ పాపం! పెట్రోల్, డీజల్ రేట్లు ఒక పక్క వేధిస్తున్నాయి....వీళ్ళు ఒక పక్క పీక్కుతింటున్నారు"

క్రిష్ణా రావ్ దగ్గర ఇలాంటి సామాజిక కోపాలు చాలానే బయటపడతాయి. అందులో ఎక్కువ...న్యాయం ఉంటుంది. వాటికి సరిసమంగా జవాబు చెప్పలేక కోటేశ్వర రావ్ తికమక పడుతూంటే............

పడవలాంటి కారు వాళ్ళను ఆనుకున్నట్టు వచ్చి ఆగింది. కారు అద్దాలు క్రిందకి దిగటంతో లోపల కూర్చున్న లావుపాటి ఆకారం కనబడింది. నోటిలో సిగిరెట్టు ఒకటి.

క్రిష్ణా రావ్, కోటేశ్వర రావ్ లోతుగా చూశారు. ఆకారమూ సిగిరెట్టు పోగ వదుల్తూ...  

"ఇదేనా విశాలపురం?"

"అవును"

"ఇక్కడ పరమేశ్వర్ గారి ఇల్లు ఎక్కడుందో చెప్పగలరా?"

"పరమేశ్వర్ గారా... పరమేశ్వర్ గారిని అడుగుతున్నారు? ఊర్లో పేరుతో ఏడుగురున్నారు"

ఈయన చీరాల పక్కన కాలేజి ప్రొఫసర్ గా ఉన్నారు..."

...మన చదువుల మేధావి పరమేశ్వరా?"

 చదువుల మేధావి అవునో, కాదో నాకు తెలియదు సార్.......ప్రొఫసర్ పరమేశ్వర్"

"అరె.ఏమిటి సార్ మీరు....

పరమేశ్వర్ ను పరమేశ్వరుడు అని పిలవటం లోక సహజం. అందుకే అలా చెప్పాను. మా ఊర్లో ఎక్కువగా చదువుకున్నది ఆయనే. అందువల్లే చదువుల మేధావి పరమేశ్వరా అని అడిగాను" 
"సరే...ఆయన ఇళ్ళు చూపించగలరా?"

"తప్పకుండా... నేను నేరుగా వచ్చి చూపిస్తాను...కార్లో ఎక్కనా?"

అంటూనే కోటేశ్వర రావ్ ఎక్కవ చొరవతో వెనుక డోర్ ను తెరిచి కారులో ఎక్కి కూర్చున్నాడు.
కారు తీసుకుని ఎవడొస్తాడా: ఫ్రీగా సవారి చేశేద్దం అని పడుంటుంటాడు..." అంటూ క్రిష్ణా రావ్ గొణుకున్నాడు.

కారు బయలుదేరింది.

కారు వైపే చూస్తున్న క్రిష్ణా రావు కి కారు వెనుక భాగంలో రక్తపు మరకలు కనబడ్డాయి.
 
 *********************************************************************************  
మేస్త్రీతో పాటు,మరో ఇద్దరు కలిసి చెతితోనే రాయిని తీసేయడానికి ప్రయత్నించారు. అది కొంచంగా కదిలింది.

" రాయిని తీయడం అంత శులభం కాదు అయ్యగారు". మేస్త్రీ చెప్పాడు.

"క్రింద నుండి బాగా త్రవ్వండి...అదే వస్తుంది" అన్నాడు ఆశోక వర్మ.

"అవునండీ...అసలు ఇక్కడ రాయి ఎందుకుంది?" అడిగాడు మేస్త్రి.

"ఎవరికి తెలుసు... నా చిన్నప్పటి నుంచి ఆ రాయి అక్కడే ఉన్నది. దేముడి రాయి అని చెప్పారు. సరే ఉండనీ అని నేనూ వదిలేశాను"

"అబ్బే దేమిడి బొమ్మ ఏమీలేదండి. కానీ, రాతి మీద సూర్యుని గుర్తు, త్రిశూలం బాగా కనబడుతున్నాయి. రాతలు మాత్రం సరిగ్గా కనబడటం లేదు

పండితులు వచ్చినప్పుడు రాతలను కొద్దిగా చదవగలిగారు….పాండిత్య వంశ ప్రతాప్ రాయులు అనే పేరు రాసున్నదని చెప్పారు.  కొద్దికాలం క్రితం ఊర్లో వంశీయులు ఉండేవారని చెప్పారు "

"అలాగైతే వాళ్ళెవరు అయ్యగారూ?”

రోజుల్లో నాలుగు అక్షరాలు రాయగలిగే వాడిని పాండిత్య వంశం అనేవారు. రాతిమీద, చెక్క మీద రాసేవారట. అలా రాతిమీద చెక్కబడిందే రాయి"

మాట్లాడుతూనే... రాయిని ముగ్గురూ కలిసి లాగి, పైకి తీసి పక్కన పడేశారు. రాయి తీసిన చోట ఒక గుంట కనబడింది. గుంటలో లోతుగా చూశారు. క్రింద మంచం లాంటి ఆకారంలో ఎత్తుగా మట్టిదిబ్బె ఉన్నది.

అక్కడ గుంట ఉండటం, గుంట లోతులో అలా ఒక మట్టిదిబ్బె ఉండటం,ఎందుకుందో అర్ధం కాలేదు.

అక్కడున్న మేస్త్రి, మరో ముగ్గురి ముఖాలలో ఆశ్చర్యం చోటు చేసుకుంది.
                                                 ************************* 
కారు వెనుక భాగంలో రక్తం మరకలు చూసిన క్రిష్ణారావుకి గుండె గుభేల్ మన్నది.  
'వచ్చేదార్లో కారును ఎవరిమీదకు ఎక్కించాడో తెలియటంలేదు! కారు వెనుక భాగంలో రక్తం మరకలు ఉన్నాయి...'-అంటూ తనలో తానే అనుకుంటున్నప్పుడు క్రిష్ణారావును దాటి వేగంగా వెళ్ళింది ఎనిమిదడుగుల పాము. 

దాన్ని చూసిన మరుక్షణం అతని వెన్నుపూసలో వణుకు పుట్టింది.

అది వేగంగా చెట్టు బొందులో దూరి మాయమయ్యింది. క్రిష్ణారావుకు గొంతు ఎండిపోయింది.  
'కోటేశ్వరరావు చెప్పింది నిజమే కాబోలు! అమ్మో...ఎంతపెద్ద పామో?' అంటూ గొణుగుతూ...ఇక అక్కడ ఉండటానికి ధైర్యంలేక తన ఇంటివైపు నడవటం మొదలుపెట్టాడు.

ప్రొఫసర్ పరమేశ్వర్ గారి ఇల్లు!

ఇంటిముందు పెద్ద వేపచెట్టు. లేత ఆకులతో చిగురించి, వేప పువ్వుతో నిండిపోయింది.
నేల చుట్టూ రాలిపోయిన వేప పూత ఒక తివాచీలాగా ఉన్నది. తివాచీ మీదకు వచ్చి ఆగింది పడవలాంటి కారు. కారులో నుండి ఒక లావుపాటి మనిషి దిగాడు.

అలాగే కోటేశ్వరరావు కూడా కార్లోనుండి దిగాడు.

"ఇదేనండి మన పరమేశ్వర్ గారి ఇల్లు"
  
"పాతకాలం నాటి ఇల్లులాగా ఉన్నదే...?"

"అవునండి... ఊర్లోని అన్ని ఇళ్ళూ పాతకాలం నాటివే! ఇది రోజుల్లో జమీందారి రకం ఇల్లు. ఎలా కట్టేరో చూడండి. ఈరోజుల్లో ఇలా కట్టగలరా?"

కోటేశ్వరరావు గర్వంగా చెప్పాడు.

కారులోనుండి దిగిన లావుపాటి మనిషి, కళ్ళకు పెట్టుకున్న నల్ల కళ్ళద్దాలను తీసి జేబులో పెట్టుకుంటూ "ఇల్లు చూపించినందుకు చాలా ధ్యాంక్స్ అండి" అన్నాడు.  మాట ఎలా ఉందంటేఅలాగే మీరు ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు’. 
 కోటేశ్వరరావు అదేమీ పట్టించుకోకుండా "మీరు విషయం మీద వచ్చారో చెప్పనే లేదు?" అని అడిగినప్పుడు లావుపాటి మనిషి ముఖంలో చిరు మందహాసం.

ఈలోపు ఇంటి వాకిట్లో కారు వచ్చి ఆగటం తెలుసుకుని పరమేశ్వర్ గారే బయటకు వచ్చి చూశారు.  ఆయన్ను చూసిన వెంటనే లావుపాటి మనిషి దగ్గర ఒక చిరు నవ్వు.

"నమస్తే ప్రొఫసర్..."

"...మీరా?"

"నేనే! నన్ను మీరు ఇక్కడ ఎదురు చూడలేదుగా?"

"అవును! మీతో అప్పుడే చెప్పేశానే నేను స్థలం అమ్మను అని"

"అరె, ఏమిటి ప్రొఫసర్ సార్! చెప్పిందే చెబుతున్నారు? మొదట ఇంటికి వచ్చిన వాళ్ళను లోపలకు రండి అని పిలవరా?"

"లోపలకు రండి..."

మనసు అగీకరించక పోయినా ఆయన్ని లోపలకు రమ్మని పరమేశ్వర్ గారు పిలవటం,  కారులోనుండి దిగిన లావుపాటి మనిషి బయట మాట్లాడటం ఇష్టంలేక లోపలకు వస్తాననడం గ్రహించిన కోటేశ్వరరావు, ఏదో ముఖమైన విషయం అని గ్రహించాడు. పరమేశ్వర్ గారు కూడా తనని పిలవక పోవటంతో మెల్లగా వెనక్కి తిరిగాడు కోటేశ్వరరావు. ఎదురుగా క్రిష్ణారావు రావటం గమనించాడు. కోటేశ్వరరావును చూసిన క్రిష్ణారావుకి విపరీతంగా కోపం వచ్చింది.

"ఏమిటి క్రిష్ణారావు...నిన్ను అక్కడే వదిలేసి నేను కారులో ఎక్కి వచ్చాశానని కోపమా?"

"రాదామరి... నువ్వూ ఒక స్నేహితుడివేనా? ఒకడు కార్లో వచ్చి దారి అడిగితే...నోటితో చెప్పొచ్చుకదా! అదేమిటి చిన్న పిల్లాడిలాగా కార్లోకి ఎక్కి కూర్చోవటం? నిన్ను తలుచుకుంటే ఒళ్ళు మండి పోతోంది. మనకని ఒక గౌరవం ఉండద్దూ?"

క్రిష్ణారావు...కోటేశ్వరరావుని మందలిస్తుంటే పరమేశ్వర్ గారి ఇంట్లో నుండి గట్టిగా కేకల లాంటి మాటలు వినబడ్డాయి. అది పరమేశ్వర్ గారి గొంతు. 

"దయచేసి వెళ్ళండి సార్! స్థలాన్ని ఇప్పుడు అమ్మదలుచుకోలేదు. ఆస్థలంలో నేనే ఒక 'కాంప్లెక్స్కట్టి అద్దెలకు ఇవ్వాలనే ఆలొచనలో ఉన్నాను" అంటున్న ఆయన గొంతు కోటేశ్వరరావు,  క్రిష్ణారావు వాళ్ళిద్దరికీ విషయాన్ని తెలియపరిచింది!

చూస్తూ నిలబడ్డారు.

లావుపాటి వ్యక్తి నిరాశతో తిరిగి వచ్చాడు.

పరమేశ్వర్ గారు వెనక్కి తిరిగి ఇంటిలోపలకు వెళ్ళి తలుపులు వేసుకున్నారు.

క్రిష్ణారావు, కోటేశ్వరరవు ఇద్దరూ లావుపాటి వ్యక్తి దగ్గరకు చేరుకుని అతని ముఖంలోకి చూశారు. అతను కూడా ఇద్దరినీ అదొలాగా చూశాడు.

"వచ్చింది స్థలం కొనడానికా?" అడిగాడు కోటేశ్వరరవు.

అవునన్నట్లు తల ఊపాడు వ్యక్తి.

"మన పరమేశ్వర్ గరి స్థలమే కావాలా...?"

"అవును... మూడు ఎకరాలే కావాలి"

" స్థలాన్ని కొనడానికా ఆశపడుతున్నారు?"

"అవునండి! కానీ పరమేశ్వర్ గారు అమ్మనంటే అమ్మనని మొండికేస్తున్నారు"
"దానికి మీరు సంతోషపడాలి"

"ఎందుకని అలా చెబుతున్నారు?"

"అది పరమేశ్వర్ గారి వారసత్వపు ఆస్తి. వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా స్తలంలోనే పూడుస్తారు. అక్కడకెళ్ళి చూశారా?"

"చూడలేదు...! కానీ, సార్ దగ్గర స్థలం ఉన్నదని తెలుసుకునే, రేటెంతో అడుగుదామని వచ్చాను. అవును...ఇక్కడ ఒక సెంటు ఎంత?"

"అదెందుకు అడుగుతున్నారు?"

" మూడు ఎకరాలకూ నేను కోటి రూపాయలు ఇస్తానన్నాను. మీరే చెప్పండి...మంచి రేటే కదా?"
"ఏమిటీ...ఎందుకూ పనికిరాని మూడు ఎకరాల స్థలానికి కోటి రూపాయలా? ఈశ్వరా...ఇక్కడ అత్యధిక రేటే ఏకరానికి పది లక్షలు. మూడు ఎకరాలకు ముప్పై లక్షలు. అందులోనూ స్థలం శవాలను పూడ్చిన చోటు. శవాలను పూడ్చిపెట్టే చోటుకు పదిలక్షలే చాలా ఎక్కువ"
క్రిష్ణారావు  తల కొట్టుకున్నాడు.  

"ఇలా చూడండి! మేము వేరే మంచి స్థలాన్ని కొనిపెడతాం. అందులోనూ దీంట్లో సగం రేటుకే. మాకు మీరు 5 శాతం కమీషన్ ఇవ్వండి చాలు..." అని కోటేశ్వరరావు అప్పుడే వ్యాపారాన్ని మాట్లాడటం మొదలుపెట్టాడు.

కానీ లావుపాటి వ్యక్తి దగ్గర దీర్ఘమైన మౌనం.

"ఏమిటండీ మౌనంగా ఉన్నారు...?"

"ఏమీలేదు...మీరడిగే 5 శాతం కమీషన్ పరమేశ్వర్ గారి స్థలానికే ఇస్తాను. ఆయనతో మాట్లాడి నాకోసం ఆయన్ని ఒప్పించగలరా?" 

"అరే...ఏమిటండీ మీరు? అది ఎందుకూ పనికిరాని భూమి. శ్మశానం లాంటిది. దానికిపోయి ఇంతగా ఆశపడుతున్నారే"

"సరే...వదిలేయండి! నేను ఇంకెవరినైనా చూసుకుంటాను. అవును, ఊర్లో జీవానంద శ్వామీజీ అనే ఒకరున్నారా?"

"ఉన్నారు...! మీకు ఆయన తెలుసా?"

"బాగా తెలుసు. హైదరాబాద్ ఔటర్లో ఉన్న గాంధీనగర్ లో వ్యాపారం చేస్తున్న సింహాద్రిని తెలియని శ్వామీజీలే ఉండరు"

"అంటే శ్వామీజీలను వెతుక్కుంటూ వెలతరా మీరు?"

"అవును! నేను పరమ శివుడు భక్తుడ్ని. శ్వామీజీలన్నా చాలా ఇష్టం. ఇక్కడ నేను కొనాలనుకుంటున్న మూడెకరాల స్థలం శ్వామీజీ చెప్పబట్టే కొనడానికి వచ్చాను..."

"నాకు తెలియక అడుగుతున్నాన్ను...శ్వామీజీకి మతి చెలించిందా? ఒక శ్మశానాన్ని కొనమని చెబుతున్నారే...?"

"హైదరాబాదులో ఇలాంటి శ్మశానాలు కొన్నవారే రోజు కొటీశ్వరులుగా ఉన్నారు. స్థలాన్ని శుభ్రం చేసి...గుంతలు చేసి ఎముకలను తీసిపారేసి, వాస్తు దోషం పోవటానికి అక్కడొక యాగం చేస్తే సరిపోతుంది..."

"అదిసరేనండి...దానికి ఎందుకు అంత రేటు ఇవ్వాలి అని అడుగుతున్నా?"

క్రిష్ణారావు అసలు పాయింటు పట్టుకున్నాడు. కానీ, లావుపాటి మనిషి ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పలేదు. వాళ్ళతో ఇంకేమీ మాట్లాడటానికి లేకపోయేసరికి వ్యక్తి కారు ఎక్కి...శ్వామీజీని చూడటానికి వెళ్ళిపోయాడు.

Continued -part-2

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి