30, మార్చి 2020, సోమవారం

వెన్నెల…(కథ)




                                                                వెన్నెల
                                                                   (కథ)


ఆ లేఖను చదివిన తరువాత జగపతి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఆ లేఖలో రాసున్న ఒక్కొక్క అక్షరమూ సాన పడుతున్న కత్తిలో నుండి వెలువడుతున్న నిప్పురవ్వల లాగా అతన్ని కాలుస్తున్నాయి.

తిన్నగా విషయాన్ని మొదలు పెట్టి...లేఖను ముగించింది జగపతి భార్య మేనక.

డియర్ భర్తగారు,

“డబ్బును తరుముకుంటూ, ఎప్పుడు చూడూ ‘పని...పని’ అంటూ తిరగాలనుకున్నప్పుడు నన్నెందుకు పెళ్ళి చేసుకున్నారు?

మీరు ఇంటికి వస్తారని ఎన్ని రాత్రులు భోజనం చేయకుండా కాచుకోనున్నానో మీకు తెలియదు? కానీ, మీరు...'నేను తినేశాను, నువ్వు భోజనం చేసి పడుకో!’ అని చెప్పేసి పడుకునే వారు!

నా కడుపుకు మాత్రమే ఆకలి వేస్తుందా? చలికి దుప్పటి యొక్క వెచ్చదనం చాలా?

ఇవన్నీ చాలవని వారానికి రెండు మూడు రోజులు 'తాగి ఇంటికి వస్తారు. అడిగితే, 'హు'...బిజినస్ లో మనుషులను మాయ చేయటానికి ఇలా 'పార్టీ' ఇవ్వాల్సి వస్తోంది!

ఇలాంటి పరిస్థితుల్లో..........

'మీ బిడ్డను కడుపులో మోస్తున్నాను' అనే విషయాన్ని మీతో చెప్పటానికి ఎన్నో రోజులు ప్రయత్నం చేశాను!

నేను చెప్పేది వినటానికి మీకు టైమూ లేదు, ఓపికా లేదు… ఇక నాకు ఓర్పూ లేదు.

అందువల్ల ఒక నిర్ణయానికి వచ్చాను.

నన్నూ, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డను ప్రేమించి, ఇష్టపడి నన్ను ఏలుకునే ఒకతనితో జీవించదలచుకున్నాను.........."

మేనక.

దానితో లేఖ ముగిసిపోయింది!

ఆ లేఖను మళ్ళీ మళ్ళీ చదివాడు జగపతి.

దెబ్బతిన్న పక్షిలాగా జగపతి మనసు గిలగిలా కొట్టుకుంది.

'మేనక గర్భంగా ఉన్నదా? కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటూ ఇంకొకడితో లేచిపోయిందా? ఏంత పెద్ద ఘోరమైన పని చేసింది!

ఎన్ని కథలలో చదివుంటుంది, సినిమాలలో చూసుంటుంది. అమాయకపు ఆడవాళ్ళను ఆశ కలిగించే మాటలతో ఆకర్షించి, లేపుకు పోయి...వ్యామోహము, వాంఛ తీర్చుకున్నాక డబ్బునూ, నగలనూ అపహరించి, రోడ్డు మధ్యలో నిలబెట్టి వెళ్ళే విపరీతాలు జరుగుతున్నాయే!'

డబ్బు, నగలు అని జ్ఞాపకం వచ్చిన వెంటనే పరిగెత్తుకు వెళ్ళి బీరువాను తెరిచి చూశాడు. బీరువాలో ఉండాల్సిన యాభై వేల రూపాయలు, ముప్పై సవర్ల నగలు లేవు.

"అయ్యో...!" అంటూ నోరు తెరిచి తలబాదుకున్నాడు. ఎవరో తనని బోర్లా పడుకోబెట్టి గుండెల మీద తొక్కుతున్నట్టు అనిపించింది.

'ఇవన్నీ పోతే పోనీ. కానీ, మేనక...ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ!

ఇప్పుడు ఏం చేయను? ఎవరి దగ్గర చెప్పను? ఎవరి దగ్గరైనా చెప్పదగిన విషయమా ఇది? అయినా కానీ, చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారే...! ఏం సమాధానం చెప్పను?

"డబ్బు...డబ్బూ" అని తిరిగేనే! పార్టీ ఇచ్చి, నేనూ తాగి...ఇంటిని మరిచిపోయానే. ఆమె ఫీలింగ్స్ ను ఉదాసిన పరచి, ఉన్నతమైన జీవితాన్ని నాశనం చేసుకున్నానే.

మేనక కోసం కొంచం సమయం వెచ్చించి ఉండాల్సింది. మనసు విప్పి ఆమెతో మాట్లాడి ఉండాలి!'

"ఏంటయ్యా...ప్రొద్దుట్నించి ఇళ్ళు తాళం పెట్టే ఉంది. మేనక ఎక్కడ?"

కలత చెంది, గిల గిలా కొట్టుకుంటూ బయటకు వచ్చిన జగపతిని, పక్కింటి జానకి అక్క అడిగిన ప్రశ్న అతనికి చెంపమీద కొట్టినట్టు అనిపించింది.

గబుక్కున జవాబు చెప్పలేకపోయాడు. తరువాత తమాయించుకుని "వాళ్ళ అమ్మను చూడటానికి ఊరికి వెళ్ళింది..." అని చెప్పేసి, ఎటు వెళ్ళాలో తెలియక కాళ్ళు ఎటువెడితే అటు వెళ్ళాడు.

ఆకలి వేయలేదు. తాగాలనిపించలేదు. రాత్రి చాలాసేపు అయిన తరువాత ఇంటికి వచ్చాడు.

'ఇప్పుడా వచ్చేది? ఎక్కడికి వెళ్లారు? మీకొసం ఎంతసేపు వెయిట్ చెయ్యను?'

వాకిట్లో నిలబడి మేనక ప్రశ్నలు అడుగుతుందని ఒక చిన్న ఆశ మదిలో మెదిలింది జగపతికి.

ఇంటికి తాళం వేసుంది.

ఆ రోజు రాత్రి నరకంగా గడిచింది.

ఆ రోజు మాత్రమే కాదు...మూడు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయాడు జగపతి.

తలుపు తడుతున్న శబ్ధం విన్నప్పుడల్లా మేనకానే అయ్యుంటుందని పరిగెత్తుకు వెళ్ళి తలుపు తెరిచాడు.

పాలవాడో, కేబుల్ టీవీ అతనో....అని ఎవరో ఉంటారు. ఆమె రాలేదు!

ఆఫీసుకు వెళ్ళకుండా, పిచ్చిపట్టిన వాడిలాగా అలమటించాడు.

'పోలీసులకు వెళదామా? మేనక అమ్మ, నాన్నలకు విషయం చెప్పొద్దా?' అని ఆలొచించాడు.

మళ్ళీ తలుపు కొట్టే శబ్ధం వినబడింది. గబ గబా వెళ్ళి తలుపు తెరిచాడు. ఆశ్చర్యపోయాడు.

చేతిలో సూట్ కేసు సమేతంగా భార్య మేనక. వాకిట్లో నిలబడిపోయిన జగపతిని తోసుకుంటూ లోపలకు వెల్లింది. సూట్ కేసు లో ఉన్న, నగలు, డబ్బు తీసి బయటపెట్టి చెప్పింది: "ఏమిటీ...లేచిపోయాను అనుకున్నారా? అలా గంతా వెళ్ళను! వెడితే ఏమవుతుందో అన్నది మీరు గ్రహించాలి...అందుకే లెటర్ రాసి పెట్టి, మూడు రోజులుగా నా స్నేహితురాలి ఇంట్లో ఉండి వస్తున్నాను"

కలలోంచి బయట పడ్డట్టు తల విదిలించాడు జగపతి.

మూడు రోజులుగా పడ్డ ఆందోళన, నొప్పి, వేదన, నిస్సహాయత, కన్నీళ్ళూ అన్నీ కరిగిపోయినై. ఆ రోజు రాత్రి...ఆకాశంలోనూ, ఇంట్లోనూ, జగపతి మనసులోనూ వెన్నెల విరబూసింది! *******************************************సమాప్తం*******************************************

28, మార్చి 2020, శనివారం

చంద్రుని మీద అన్యులున్నారా?... (మిస్టరీ)



                                           చంద్రుని మీద అన్యులున్నారా?
                                                                (మిస్టరీ)


పురాతన రహస్య ఏలియన్ స్థావరం చంద్రునిపై కనుగొనబడింది.

చంద్ర గ్రహానికి మనుషులను పంపే మిషన్ ను విజయవంతం చేయడానికి చైనా చేసే ప్రయత్నాలలో చైనా అంతరిక్ష సంస్థతో కలిసి పనిచేస్తున్న డాక్టర్ మైఖేల్ సల్లా 'చంద్రునిపై అన్య గ్రహ స్థావరం ఎప్పటి నుంచో ఉన్నది’ అనే వాదనను ప్రపంచం ముందు ఉంచారు. చంద్ర గ్రహానికి మనుషులను పంపే చైనా వారి మిషన్/ప్రాజక్ట్ విజయవంతమైతే, 1972 లో నాసా యొక్క అపోలో 17 తరువాత, ఇదే మనుషులు కలిగిన మొదటి ల్యాండింగ్ అవుతుంది.


'ఈ స్థావరం అన్య గ్రహ వాసుల సైనిక పారిశ్రామిక సముదాయం' అని సల్లా చెప్పారు. అటువంటి వాటి ఉనికిని కప్పిపుచ్చడానికి, అటువంటి స్థావరాలతో పాటు "పురాతన కళాఖండాలు మరియు సౌకర్యాలు" పై నాసా బాంబు దాడి చేస్తున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత విపరీతమైనవి.

అంతేకాకుండా, చంద్ర గ్రహంపై రహస్య మైనింగ్ మిషన్లను "రహస్య ప్రపంచ ప్రభుత్వం" నిర్వహిస్తోందని, దీనికొసం అక్కడున్న గుర్తు తెలియని గ్రహాంతర జాతితో రహస్య ఒప్పందం కుదుర్చుకుంది అని కూడా ఆయన చెప్పారు.

లూనా 13 ఛాయాచిత్రాలు

పైన చూస్తున్న అద్భుతమైన ఛాయాచిత్రంలో, చంద్రుని ఉపరితలంపై వదిలివేయబడిన ఒక ఇరుసు మరియు చక్రాలను చూపించేలా కనిపిస్తుంది. 1966 డిసెంబర్ 24 న సోవియట్ యూనియన్ యొక్క లూనా 13 అంతరిక్ష నౌక విజయవంతంగా చంద్రుడుపై దిగిన తరువాత లూనా 13 అంతరిక్ష నౌక తీసిన ఛాయాచిత్రం ఇది.

ఇది సోవియట్ యూనియన్ సాధించిన రెండవ ‘సాఫ్ట్ ల్యాండింగ్’, కానీ ఈ ఫోటో సముద్రంలా మేఘాలు కమ్ముకున్నప్పుడు తీసిన మొదటిది. కాబట్టి చంద్రుని ఉపరితలంపై వదిలివేయబడిన వింత వస్తువు ఏమిటి? అది ఎక్కడ నుండి వచ్చింది? ఎవరు అక్కడ వదిలిపెట్టారు?

లూనా 13 ల్యాండింగ్‌కు ముందు మరో రెండు సోవియట్ వ్యోమనౌకలు, లూనా 2 మరియు లూనా 5, చంద్రునిపై మేఘాల సముద్రం వలన క్రాష్ అయినై. లూనా 13 తీసిన పై చిత్రంలో ఉన్న‘ఇరుసు మరియు చక్రాలు’ ఈ క్రాఫ్ట్‌లలో ఒకదానికి చెందినవని ఊహాగానాలు . కానీ ఈ ఊహాగానాలతో సమస్య ఉంది.

లూనా 2 చంద్రునిపై క్రాష్ అయిన చోటు వేరు. లూనా 5 యొక్క క్రాష్ సైట్ యొక్క ఖచ్చితమైన వివరాలు తెలియవు.

మూన్‌బేస్: చంద్రుడిపై గ్రహాంతరవాసులు ఉన్నారా?


చంద్రునిపై నడిచిన మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రకారం, జూలై 1969 లో అతను మరియు అపోలో 11 లూనార్ మాడ్యూల్ చంద్రుని ఉపరితలంపై దిగినప్పుడు అతనిని పలకరించడానికి రెండు భారీ గ్రహాంతర వ్యోమనౌకలు అక్కడ వేచి ఉన్నాయి.

ఆర్మ్‌స్ట్రాంగ్, భూమి పై ఉన్న మిషన్ కంట్రోల్ మరియు పేరు తెలుపని ప్రొఫెసర్‌ల మధ్య జరిగిన సంభాషణలు... 1973 లో అపోలో మూన్ ల్యాండింగ్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న యుఎస్ ప్రభుత్వం షాక్ నిర్ణయం వెనుక గల కారణాలను కూడా వెల్లడిస్తున్నాయి.

ఇది గ్రహాంతర వ్యోమనౌకలలో ఉన్నవారు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కు చేసిన హెచ్చరికకు ప్రతిస్పందనగా ఉంది అని అనుకుంటున్నారు.

గత 45 సంవత్సరాలకు పైన ఈ పుకారు చక్రంలా తిరుగుతోంది. దేని గురించి? నీల్ ఆర్మ స్ట్రాంగ్ వాస్తవానికి చెప్పిన దాని గురించి కాదు. ‘మనిషికి ఒక చిన్న అడుగు, మానవాళికి ఒక పెద్ద ఎత్తు’ అనే మాటలే నీల్ ఆర్మ స్ట్రాంగ్ చంద్రునిపై కాలు మోపిన వెంటనే నాసా ఆఫీసు కెంద్రంలో ఉన్న మిషన్ కంట్రోల్ తో మాట్లాడిన మొదటి మాట. ఆ తరువాత నీల్ ఆర్మ స్ట్రాంగ్ మిషన్ కంట్రోల్ తో మాట్లాడిన మాటలే అత్యంత ముఖ్యమైనవి. అయితే ఆ మాటలు సరిగ్గా వినబడలేదని మిషన్ కంట్రోల్ అధికారులు చెప్పటమే వాస్తవానికీ, పుకారుకూ కారణం అయ్యింది.

కానీ, అపొలో 11 తో కలిసి రేడియో ట్రాన్స్ మిషన్ లో పనిచేసిన ఓటో బిండర్ నీల్ ఆర్మ స్ట్రాంగ్ మిషన్ కంట్రోల్ తో మాట్లాడిన ఇతర మాటలలో 'చంద్రునిపై రెండు అతిపెద్ద వ్యోమ నౌకలతో గ్రహాంతర వాసులు మనల్ని చూస్తున్నారూ అని చెప్పినట్లు తెలిపారు.

మాజీ నాసా ఉద్యోగి,సాంకేతికనిపుణుడు మౌరైస్ చటేలియన్ కూడా దీని దృవీకరిస్తూ '1979 లో నాసాలో అందరూ మాట్లాడుకున్నది ఇదే విషయం' అని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు దాని గురించి ఎవరూ నోరు తెరవలేదు. అదే సమయం 1972 తరువాత నాసా చంద్ర గ్రహానికి వ్యొమనౌకలను పంపటం ఎందుకు ఆపేసింది అనేదానికి సరైన జవాబు లేదని చెబుతున్నారు.

ఏది నిజం, ఏది పుకారు...మిస్టరీగానే మిగిలిపోయింది.

Images Credit: To those who took the original photo
*************************************************************************************************

26, మార్చి 2020, గురువారం

ఆర్గానిక్…(కథ)



                                                           ప్రకృతి
                                                              (కథ)


"ఇవి 'ఆర్గానిక్' పండ్లే కదా?"

ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళిన శేఖర్, తన చేతిలో ఉన్న సంచీని భార్య సరోజకు అందించిన వెంటనే అడిగింది. అవి ద్రాక్ష పండ్లు.

ఆమె వేడిగా వేడిగా కాఫీ తీసుకు వచ్చి ఇచ్చింది. కాళ్ళూ-చేతులూ-మొహమూ కడుక్కుని...ఆమె అందించిన కాఫీ తాగుతూ చెప్పాడు........

"అవును...ఫోనులోనే పదిసార్లు చెప్పాను. ఇప్పుడు పూర్తిగా ఇంట్లోకి రాక ముందే అడుగుతున్నావు. ఇవి 'ఆర్గానిక్' పండ్లే! కానీ నువ్వు ఇంత పెద్ద 'ఆర్గానిక్' పిచ్చిదానివిగా ఉండకూడదు సరోజా" అన్నాడు.

"ఆర్గానిక్ కే నండి శరీరానికి మంచిది. కృతిమంగా తయారు చేసింది ఏదైనా సరే ఆరోగ్యానికి హాని చేస్తుందండి. అందులోనూ ఇప్పుడు పంటలకు వేస్తున్న రసాయన ఎరువులు, రసాయన పురుగుల మందూ వేసి పండించేది ఏదీ మంచిది కాదు. మన శరీరానికి చాలా ప్రమాదకరం.

ఆ కాలంలో మన తాతా-అమ్మమ్మలు తొంబై ఏళ్ళకు పైన ఆరొగ్యంగానే ఉన్నారే...ఎలా? ప్రకృతి రీతిగా పండించిన పంటలను తినటం వలనే. ప్రకృతితో ఒకటిగా జీవించారు. మన తరం వాళ్ళో ఏది పడితే అది తిని, ముప్పై - నలభై ఏళ్ళకే బి.పి., సుగర్ అంటూ వ్యాధిగ్రస్తులవుతున్నారు”

ఆమె చెప్పింది విని, శేఖర్ భార్యకు చేతులెత్తి నమస్కరించాడు.

"ఒసేయ్ అమ్మడూ...చాలు నీ ఉపన్యాసాలు! నన్ను వదిలి పెట్టు" ---భర్త శేఖర్ అలా చెప్పేటప్పటికి నవ్వుకుంటూ లోపలకు వెళ్ళింది సరోజ.

సరోజకు ఏదైనా సరే 'ఆర్గానిక్' గానే ఉండి తీరాలి. హోటల్లో తినడానికి వెళ్ళినా 'ఆర్గానిక్' హోటల్ కే వెళ్ళాలి అని చెప్తుంది. 'గ్రామంలో పెరిగింది. అది ప్రకృతే కదా?' అని శేఖర్ తనని తాను సమాధాన పరుచుకుంటాడు.

తినే ఆహారంలోనే మాత్రం కాదు...అన్నీ ప్రకృతిగా ఉంటేనే ఆమెకు నచ్చుతుంది. ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ ఆకులు, ప్లాస్టిక్ బొమ్మలూ, పూసలు...ఏదీ పక్కకు రాకుడదు.

"సృష్టి యొక్క మొత్త అందాన్నీ, సంతోషాన్నీ ప్రకృతిలోనే చూడగలం, అనుభవించగలం. కృతిమంలో ఏముంది? ఒక పువ్వు యొక్క వాసన, అందం ప్లాస్టిక్ పువ్వులో ఉన్నదా?" అంటుంది.

ఆమె చెప్పేది నిజమే కనుక, ఆహారానికి సంబంధించిన వస్తువుల ఖర్చు ఎక్కువైనా, ఆరొగ్యం విషయం కాబట్టి పెద్దగా పట్టించుకునేవాడు కాదు శేఖర్.

వంట గదిలోకి వెళ్ళిన సరోజ పండ్లను కడిగి తీసుకు వచ్చింది.

"రేపు హాస్పిటల్ కు వెళ్ళాలి...మీకు గుర్తుందా?" కడిగిన ఆ పండ్లను భర్త శేఖర్ పక్కన పెడుతూ అన్నది.

పెళ్ళై ఐదు సంవత్సరాలు పూర్తి అయినా ఇంకా వాళ్ళకు సంతాన భాగ్యం లేదు. అన్ని పరీక్షలూ చేయించుకుని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు!

“జ్ఞాపకం ఉంది విమలా. ప్రొద్దున పదింటికి రమ్మన్నారు"

"నాకు ఇప్పుడే దఢ దఢగానూ...ఆందోళనగానూ ఉన్నదండి. డాక్టర్ ఏం చెప్పబోతారో అన్న భయం ఎక్కువగా ఉన్నది"

"నాకు కూడా అలాగే ఉన్నది! కానీ, మన చేతుల్లో ఏముంది చెప్పు? సంతాన భాగ్యం, దేవుడిచ్చేది. ధైర్యంగా ఉండు. మనం ఎవరికీ ఏ చెడూ చేయలేదు. దేవుడు మనల్ని పరీక్షించడు"--ఆమెకు ధైర్యం చెప్పినా, అతని మనసులోనూ భయం ఎక్కువగానే ఉన్నది!

వాళ్ళకు పెళ్ళి జరిగి ఇదిగో...ఇన్ని సంవత్సరాలు అయ్యింది. అతనికీ సరే, ఆమెకూ సరే...త్వరగా పిల్లల్ను కనాలని ఆశ. మొదటి ఆరు నెలలు గడిచినప్పుడు ఇద్దరూ పెద్దగా బాధ పడలేదు. కొన్ని రోజులే కదా అయ్యింది. కొందరికి రెండు, మూడు సంవత్సరాలు అయిన తరువాత పుడుతున్నారే!'అని సమాధనమై ఉన్నారు.

కానీ, అతని అమ్మగారు, చుట్టాలు మాత్రం వాళ్ళను చూసినప్పుడల్లా చాటుమాటుగా అడుగుతారు. అయినా కానీ, ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే వారు.

ఒక సంవత్సరం తరువాత అతని తల్లి ఓపన్ గానే గొణగటం మొదలు పెట్టింది. "మాకు పెళ్ళైన ఒక సంవత్సరంలోనే నువ్వు పుట్టావు. మన వంశంలో అందరూ అంతే! సరోజ కడుపులో ఒక జన్యువు కూడా ఉండలేక పోతోందే? నా మనవుడ్నో—మనవరాలునో నేను ఎప్పుడు బుజ్జగిస్తానో?" అన్నది.

"మీ కాలం వేరు...మా కాలం వేరు. ఇప్పుడేమయ్యింది...ఒక సంవత్సరమేగా అయ్యింది! అంతలో ఏమిటి అవసరం? ఓర్పుగా ఉండు. కొన్ని రోజులు సంతోషంగా ఉండి, ఆ తరువాత కంటాము" అని చెప్పి వాళ్ళమ్మ గొణిగినప్పుడల్లా ఆమె నోరు నొక్కేస్తాడు శేఖర్.

మూడు సంవత్సరాలు పూర్తవబోతున్నాయి. వాళ్ళకే ఒక భయం వచ్చింది. గుడికి వెళ్ళటం, పరిహారాలు చేయటం అని ప్రారంభించారు. ఫలితం దక్కలేదు.

ఆ ఊరిలోనే, ఆ ఊరికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకు శేఖర్ ని మార్చటంతో, అతనూ, సరోజ మాత్రం ఇళ్ళు చూసికుని వచ్చేశారు. అందువల్ల భందువుల విచారింపుల నుండి తప్పించుకున్నారు.

ఎన్ని పరిహారులు చేసినా ఫలితం దక్కకపోవటంతో, చివరి ప్రయత్నంగా డాక్టర్ను కలవాలని ఇదిగో...చెకప్ చేయించుకున్నారు. దాని రిజల్ట్స్ రేపు రాబోతోంది.

శేఖర్ కి రాత్రంతా నిద్రలేదు. సరోజ యొక్క పరిస్థితి గురించి చెప్పనే అక్కర్లేదు. ఆమెకు ఓదార్పుగా మాట్లాడుతూ ఉన్నాడు శేఖర్.

మరుసటిరోజు ప్రొద్దున కరెక్టుగా పది గంటలు. డాక్టర్ ముందు ఉన్నారు. వాళ్ళ ఇద్దరిలోనూ గుండె దఢ ఎక్కువయ్యింది.

'డాక్టర్ ఏం చెప్పబోతారో?' అని ఆయన ముఖంవైపు చూస్తూ కూర్చున్నారు. 'దేవుడా...ఏదైనా సరే మంచి వార్తగా చెప్పాలి -- మనసులోనే వేడుకున్నారు.

అన్ని టెస్టుల రిజల్ట్స్ చూసిన డాక్టర్ ముఖం కొంచం ముడుచుకుని చిన్నదయ్యింది. "మిస్టర్ శేఖర్...ఐయామ్ సారీ టు సే దిస్! మీ భార్యకు పిల్లలు పుట్టే చాన్స్ 99 శాతం లేదు"

డాక్టర్ చెప్పింది విన్నవెంటనే నెత్తి మీద పిడిగు పడినట్టు అయ్యింది. శేఖర్ భార్య సరోజను చూశాడు. ఆమె పరిస్థితి గురించి చెప్పాలా? స్థానువైపోయింది.

"కష్టంగానే ఉంటుంది. నేను చెప్పింది మీరు అంగీకరించే కావాలి. ఈయన ఇలా చెప్పేడే ఇంకో డాక్టర్ దగ్గరకు వెల్దాము అని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకండి. మీ రిజల్ట్స్ ను ముగ్గురు స్పేషలిస్టులకు పంపి ఏదైనా చేయగలరేమో నని ట్రై చేశాను. అందరూ ఒకే మాట." డాక్టర్ క్లియర్ గా, ఓపన్ గా చెప్పాడు.

కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న వాళ్ళిద్దరూ మనసుకు బలం తెచ్చుకున్నారు.

"ఇంకేమీ చేయలేమా డాక్టర్?" ఆవేదనతోనూ, బాధతోనూ అడిగారు.

"ఎందుకు చేయలేము? మీలాంటి వాళ్ళ కోసమే వరప్రసాదంలాగా ఉన్నదే 'టెస్ట్ ట్యూబ్ బేబీ'. అదే...కృతిమ గర్భం. ఆ విధానంలో ఖచ్చితంగా పిల్లలు కనొచ్చు" అన్నారు.

జాలిగా చూశారు.

"థాంక్యూ డాక్టర్. దీని గురించి ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఆలొచించి మిమ్మల్ని కలుస్తాను" --- చెప్పేసి ఇద్దరూ లేచారు. నిదానంగా కారు ఉంచిన చోటువైపుకు నడిచారు. సరోజ కళ్ళల్లో నీళ్ళు.

"డాక్టర్ చెప్పింది విన్నావుగా సరోజా! ఏం చేద్దాం? కృతిమ పద్దతిలో బిడ్డను కందామా?"

ఇంటికి వచ్చిన వెంటనే సరోజను అడిగాడు శేఖర్.

భర్తను ఒక్క నిమిషం అదొలా చూసిన సరోజ చెప్పింది: "ఖచ్చితంగా కృతిమ పద్దతి వద్దండి. ఎంతో మంది పిల్లలు అనాధ ఆశ్రమాలలో ఉన్నారు. ప్రకృతి పద్దతిలో పుట్టిన ఆ పిల్లలలో ఒకర్ని దత్తతు తీసుకుని పెంచుకుందాం. సొంత వాళ్ళు గానీ, చుట్టాలుగానీ లేని ఒక బిడ్డకు జీవితం ఇచ్చినట్టూ అవుతుంది. మనకీ సంతోషంగా ఉంటుంది"

అలా చెప్పిన భార్య సరోజను చూసి గర్వ పడ్డాడు శేఖర్.

ఎందుకంటే: అప్పుడు కూడా ‘ఆర్గానిక్’ ఆనే లక్ష్యాణ్ని ఆమె వదిలిపెట్ట దలచుకోలేదే?

********************************************సమాప్తం*********************************************

24, మార్చి 2020, మంగళవారం

శాశ్వత మెరుపులు....(ఆసక్తి & మిస్టరీ)



                                                       శాశ్వత మెరుపులు
                                                         (ఆసక్తి & మిస్టరీ)


శాశ్వత మెరుపులు: వెనిజులా దేశంలోలోని కాటటుంబో నది ప్రాంతంలో జరుగుతున్న ప్రత్యేకమైన దృగ్విషయం ఇది. ఇలా వేలాది సంవత్సరాలుగా దాదాపు రోజు విడిచి రోజు రాత్రిపూట మెరుపుల తుఫాన, రోజుకు కనీసం 10 గంటలు సేపు ఉంటుందట. కొన్ని సమయాలలో సంవత్సరం అంతా కూడా ఉంటుంది.


వెనిజులా దేశంలో వున్న ఒక ప్రాంతం… ఒక వింతైన, ఉగ్రమైన తుఫానుకు నిలయం. రాత్రి ఆకాశంలో కాంతి వంపుల యొక్క మరొక అద్భుతమైన పేలుడు, దిగువ కాటటుంబో నదిని నాటకీయంగా ప్రకాశింపచేస్తుంది.


ఇది వాయువ్య వెనిజులా యొక్క ఒక మూలలో ఉన్నది. దీనిని 'రెలాంపాగో డెల్ కాటటంబో' (నిత్య తుఫాను) అని పిలుస్తారు. ప్రత్యేకమైన ఈ వాతావరణ దృగ్విషయం సంవత్సరానికి 1.2 మిల్లియన్ల మెరుపు దాడులను ఉత్పత్తి చేస్తుంది. ఈ మెరుపులు దాదాపు 250 మైళ్ళ దూరం నుండి కనిపపిస్తాయి.

ఈ నిత్య తుఫాను మేఘాలు ప్రతిసారి ఒకే చోట, మారకైబో సరస్సు పైన ఐదు మైళ్ళ ఎత్తులో సంవత్సరానికి కనీసం 160 రాత్రులు గుమికూడి రోజుకు 10 గంటలసేపు మేరుపుల కళను ప్రదర్సిస్తుంది.


ఈ నిరంతర తుఫానులను వివరించడానికి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అత్యధిక వేగమైన గాలులు సరస్సు మీదగా వీస్తూ మేఘాలను తోసుకువెళ్ళి ఆండియన్ పర్వతాలను ఢీ కొనడం వలన అక్కడ మేఘాలు గుముకూడుతాయి. మరికొందరు, అక్కడున్న చిత్తడి బురద నేల వలన మీథేన్ వాయువు విడుదల అవుతుంది. ఆ వాయువే ఈ మేఘాలు గుమికూడటానికి కారణం అంటున్నారు.


ఎలా చూసినా ఇది వెనిజులా ప్రజలకు గర్వించదగిన చిహ్నంగా మారింది. లోప్ డి వేగా రాసిన 'లా డ్రాగోంటియా' అనే పురాణ కవితలో ఈ మెరుపుల ప్రదర్సన గురించి ప్రస్తావించబడింది. ఇంకొకటి, 1595 లో మారకైబో నగరంపై ఫ్రాన్సిస్ డ్రేక్ ప్రయత్నించిన దాడి ఈ మెరుపుల వలన ఆగిపోయింది. అలా ఆ మెరుపులు వెనుజూలా దేశానికి సహాయపడ్డాయి.


ఈ మెరుపుల తుఫాను స్థానిక మత్స్యకారులకు సహజ లైట్ హౌస్ గా పనిచేస్తుంది, వారు ఎటువంటి సమస్య లేకుండా రాత్రి సమయంలో నావిగేట్ చేయగలరు. కొన్ని సందర్భాల్లో ఈ దృగ్విషయం కొన్ని వారాలకు ఆగిపోయింది. ఇటీవల 2010 లో అలా జరిగింది. ఇది తీవ్ర కరువు ఫలితంగా ఉంటుందని స్థానికులు ఆందోళన చెందారు, జలవిద్యుత్‌పై ఎక్కువగా ఆధారపడే దేశంలో అది విద్యుత్ కొరతకు దారితీసింది.


కానీ ఐదు వారాల నిశ్శబ్దం తరువాత కాకోఫోనీ (మెరుపుల తుఫాను) తిరిగి ప్రారంభమైంది.

1906 లో కొలంబియా మరియు ఈక్వెడార్ తీరంలో భారీ భూకంపం సంభవించిన తరువాత సునామీ సంభవించింది. అప్పుడు కూడా ఈ దృగ్విషయం కొన్ని వారాలకు ఆగిపోయింది.


కొంతమంది శాస్త్రవేత్తలు ఈ నిత్య తుఫాను కారణం భూగ్రహం పైన ట్రోపోస్పిరిక్ (Tropospheric) ఓజోన్ యొక్క అతిపెద్ద జనరేటర్ గా భావిస్తారు.




ఈ తుఫాను నిమిషానికి సగటున 28 మెరుపులను ఉత్పత్తి చేస్తుంది. అలా వదలకుండా కనీసం 10 గంటల వరకు ఉత్పత్తి చేస్తుంది. కొన్నిసార్లు గంటకు 3,600 మెరుపులను విడుదల చేస్తుంది. కొన్ని సమయాలలో అత్యంత ఉగ్రంగా రోజుకు 40,000 మెరుపులను ఉత్పత్తి చేస్తుంది.

Images Credit: To those who took the original photos. ************************************************************************************************

22, మార్చి 2020, ఆదివారం

నవ్విన వారే అనుసరణ: కరోనా తెచ్చిన మార్పు...(ఆసక్తి)




                                నవ్విన వారే అనుసరణ: కరోనా తెచ్చిన మార్పు
                                                                   (ఆసక్తి)


హిందువులు నమస్తేతో ఒకరినొకరు పలకరించుకున్నప్పుడు - వాళ్ళు నవ్వారు.

ఇంట్లోకి ప్రవేశించే ముందు హిందువులు కాళ్ళు,చేతులు కడుక్కోవడం చూసి - వాళ్ళు నవ్వారు.

హిందువులు జంతువులను ఆరాధించేటప్పుడు - వాళ్ళు నవ్వారు.

హిందువులు మొక్కలు, చెట్లు, అడవులను ఆరాధించేటప్పుడు - వాళ్ళు నవ్వారు.

హిందువులు ప్రధానంగా వెజ్ డైట్(వెజ్ ఆహారంగా) కలిగి ఉన్నప్పుడు - వాళ్ళు నవ్వారు.

హిందువులు యోగా చేస్తున్నప్పుడు - వాళ్ళు నవ్వారు.

హిందువులు దేవుళ్ళను, దేవతలనూ ఆరాధిస్తున్నప్పుడు - వాళ్ళు నవ్వారు.

హిందువులు చనిపోయినవారిని తగలబెట్టినప్పుడు - వాళ్ళు నవ్వారు.

అంత్యక్రియలకు హాజరైన తరువాత హిందువులు స్నానం చేసినప్పుడు - వాళ్ళు నవ్వారు.

ఇప్పుడు ఏం జరుగుతోంది??

ఇప్పుడు: అలా...నవ్విన వారే అనుసరిస్తున్నారు.

కాబట్టి కరెక్టుగానే చెప్పారు--"హిందూ మతం ఒక మతం కాదు, అది జీవిత మార్గం"

***********************************************************************************************

20, మార్చి 2020, శుక్రవారం

దేవుని హస్తం?...మిస్టరీ




                                                         దేవుని హస్తం?
                                                              (మిస్టరీ)

                                             అంతరిక్షంలో దేవుని హస్తం!?

మనం ఇదివరకే దేవుని కంటి చిత్రాలను చూశాము...ఇప్పుడు మనకు దేవుని హస్తం యొక్క మొదటి చిత్రం చూస్తున్నాము.

దేవుని హస్తం: అంతరిక్షంలోని లోతైన ప్రదేశంలో సూపర్నోవా యొక్క అద్భుతమైన ఎక్స్-రే చిత్రాన్ని నాసా శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

మతం మరియు ఖగోళ శాస్త్రం తరచూ ఒకదానికొకటి ఒకే విషయాన్ని అంగీకరించక పోవచ్చు, కాని కొత్త నాసా ఎక్స్-రే చిత్రం "దేవుని హస్తం" ను పోలి ఉండే ఒక ఖగోళ వస్తువును కనుగొన్నది.

విశ్వంలో ఒక నక్షత్రం పేలినప్పుడు, ఆ పేలుడులో నుండి అపారమైన మేఘంలాంటి పదార్థం బయటకు వచ్చినప్పుడు విశ్వంలో "హ్యాండ్ ఆఫ్ గాడ్" ఫోటో ఉత్పత్తి చేయబడింది. ఇది నాసా యొక్క న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ అర్రే, లేదా న్యూస్టార్ అనే అధిక శక్తి గల ఎక్స్-కిరణాలలో మెరుస్తూ, ఫోటోలో నీలం రంగులో కనబడింది. గతంలో నాసా యొక్క చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ తక్కువ-శక్తి ఎక్స్ రే -కిరణాలను ఉపయోగించి చిత్రించినప్పుడు ఆకుపచ్చ మరియు ఎరుపు భాగాలుగా కనబడింది.

దేవుని హస్తం: 12 మైళ్ల వ్యాసం కలిగిన చిన్న, దట్టమైన వస్తువు, 150 కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉన్నది.

"న్యూస్టార్ టెలెస్కోప్ తన యొక్క ప్రత్యేక దృక్పథంతో, అత్యధిక శక్తి గల ఎక్స్ రే-కిరణాలతో పేలిన నక్షత్రం నుండి వెలువడిన అపారమైన మేఘంలాంటి పదార్థంను బాగా అధ్యయనం చేసి ఆ పధార్ధ ప్రాంతాలను సరికొత్త వెలుగులో చూపిస్తోంది " అని పసాదేనాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన న్యూస్టార్ టెలిస్కోప్ యొక్క ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఫియోనా హారిసన్ ఒక ప్రకటనలో చెప్పారు.

నాసా యొక్క స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ నుండి వచ్చిన ఈ పరారుణ చిత్రం హెలిక్స్ నెబ్యులాను చూపిస్తోంది. ఇది కాస్మిక్ నక్షత్రం. ఖగోళ శాస్త్రవేత్తలు దాని స్పష్టమైన రంగులు మరియు ఒక పెద్ద కంటికి విలక్షణమైన పోలికల ఆకారం కలిగియుండతంతో దాన్ని కన్నుతో పోల్చారు. కుంభం రాశిలో 700 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నిహారిక, గ్రహాల నిహారిక అనే వస్తువుల వర్గానికి చెందినది ఇది. 18 వ శతాబ్దంలోనే కనుగొనబడిన ఈ రంగురంగుల అందాలకు వారి పెట్టిన పేరు దేవుని కన్ను.

ఈ కొత్త చిత్రం, ఒక సూపర్నోవాలో పేలిన ఒక నక్షత్రం యొక్క దట్టమైన అవశేషాలచే ఉత్పత్తి చేయబడిన, తిరుగుతున్న వాయువు(పల్సర్ విండ్). దీనిని PSR B1509-58 (సంక్షిప్తంగా B1509) అని పిలుస్తారు, ఇది సెకనుకు 7 సార్లు తిరుగుతుంది, ఇది నక్షత్రాల పేలుడు సమయంలో బయటకు వచ్చే పదార్థాలు కలిగినది. ఈ కణాలు సమీపంలోని అయస్కాంత క్షేత్రాలతో సంకర్షణ చెందుతున్నప్పుడు, అవి చేతి ఆకారంలో ఎక్స్-రే వెలుగును ఉత్పత్తి చేస్తాయి. (తిరుగుతున్న వాయువు ప్రకాశవంతమైన తెల్లని ప్రదేశానికి సమీపంలో ఉంది, కానీ దానిని చూడలేము, నాసా అధికారులు తెలిపారు).

విసర్జించిన పదార్థం వాస్తవానికి హస్తం ఆకారాన్ని చూపిస్తోందా లేదా పల్సర్ యొక్క కణాలతో దాని పరస్పర చర్య ఆ విధంగా కనిపించేలా చేస్తుందో లేదో శాస్త్రవేత్తలకు తెలియటం లేదు.

"హస్తం ఆకారం దృష్టి భ్రమా, కాదా, అని మాకు తెలియదు" అని మాంట్రియల్‌ లోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాత్రవేత్త హాంగ్‌జున్ అన్ ఒక ప్రకటనలో తెలిపారు. "న్యూ స్టార్ టెలెస్కోప్ మూలంగా చూస్తే, హస్తం పిడికిలిలా కనిపిస్తోంది. ఇది మాకు కొన్ని ఆధారాలు ఇస్తోంది."

ఈ ఆశ్చర్యకరమైన చిత్రాన్ని నాసా యొక్క చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ తీసింది, ఇది భూమి యొక్క ఉపరితలం నుండి 360 మైళ్ళ చుట్టూ ఉన్న కక్ష్యలో ఉంది. ఇక్కడ చిత్రీకరించిన పేలుడు వాస్తవానికి 17,000 సంవత్సరాల క్రితం జరిగిందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Image Credit: To those who took the original photos.
***************************************************************************************************

18, మార్చి 2020, బుధవారం

కరోనా వైరస కు వ్యతిరేకంగా పెద్ద-స్థాయి క్రిమిసంహారక ప్రయత్నాలు...చిత్రాలు



         కరోనా వైరస కు వ్యతిరేకంగా పెద్ద-స్థాయి క్రిమిసంహారక ప్రయత్నాలు
                                                             (చిత్రాలు)

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలు మరియు ప్రభుత్వాలు COVID-19 యొక్క వ్యాప్తిని మందగించడానికి కృషి చేస్తున్నారు. కరోనావైరస్ వలన కలిగే వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి, పెద్ద ఎత్తున క్రిమిసంహారక మందును వెదజల్లి నగరాలను, సిటీలనూ, గ్రామాలను పారిశుద్ధ్యం చేసే ప్రయత్నాలు అన్ని దేశాలలో యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి.

చేతితో తుడిచివేయడం నుండి మొబైల్ స్ప్రే, ఫిరంగులు వరకు ఉన్న పద్ధతులను ఉపయోగించి, కార్మికులు మరియు వాలంటీర్లు స్పర్శ ద్వారా వైరస్ బదిలీని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. విస్తృత స్ప్రేయింగ్ వ్యూహాలు, తరచుగా తాకిన ఉపరితలాలను క్రిమిసంహారక చేయడం వైరస్ వ్యాప్తిని ఆపడానికి సహాయపడుతుంది.

ఇరాన్, చైనా, ఇటలీ, దక్షిణ కొరియా మరియు మరెన్నో ప్రదేశాలలో ఇటీవలి ప్రయత్నాల చేస్తున్న చిత్రాలు ఇక్కడ సేకరించబడ్డాయి.



















అమెరికా నగరమైన సియాటల్ లో కరొనా వైరస్ వాక్సిన్ పరిశోధనకు స్వచ్ఛందంగా హాజరైన మహిళ.

గ్రుహ నిర్భందంలో ఉండవలసిన వారు బయట తిరగకుండా ఉండటానికి చేతి పిడికిలి మీద భారత ప్రభుత్వం వేస్తున్న చెరిగిపోని ముద్ర.

Image Credit: To those who took the original photos.

16, మార్చి 2020, సోమవారం

కన్న రుణం...(కథ)



                                                        కన్న రుణం
                                                              (కథ)


"రేపు మీ అమ్మా, నాన్నలను చూసిన వెంటనే ప్రేమంతా ఒలకబోసి కరిగిపోయి సంబరపడిపోకండి. ఏదో చూశామా...పత్రిక ఇచ్చామా అనుకుని వెంటనే బయలుదేరాలి..." స్వర్ణ ఖచ్చితంగా ఉరమటంతో...సుందరం ఎప్పటిలాగా మౌనంగా ఆ రోజు దినపత్రికలో తల దూర్చాడు.

కొద్ది నిమిషాల తరువాత.......

"రండి...రండి..." అంటూ భార్య ఎవరినో ఆహ్వానిస్తున్న శబ్ధం విని తలెత్తి చూశాడు సుందరం.

అతని తమ్ముడు మోహన్, అతని భార్య వనజ ,కూతురు శ్రీదేవితో కలిసి లోపలకి వస్తూ కనిపించారు.

"రా రా... మోహన్" తమ్ముడ్ని, అతని ఫ్యామిలీనీ ఆహ్వానించాడు సుందరం.

"అన్నయ్యా...రేపు అమ్మా-నాన్నలను చూడటానికి వెడుతున్నట్టు వదిన నిన్న 'ఫోన్' చేసింది. మేమూ మీతో వస్తాం. నా కూతురు పెద్ద మనిషి అయిన విషయం వాళ్ళకు తెలియదు. శ్రీదేవిని నేరుగా తీసుకువెళ్ళి చూబిద్దామని అనుకుని చెప్పలేదు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ దగ్గరకు వెళ్ళటం కుదరలేదు" అని అన్నయ్య చూపించిన కుర్చీలో కూర్చుంటూ మోహన్ చెప్పగా....

'నేను మాత్రం చేసిందేమిటి...ఇళ్లు కట్టుకోవటానికి స్థలం కొన్న విషయం కూడా చెప్పకుండా గృహప్రవేశానికి ఆహ్వానపత్రిక ఇవ్వబోతున్నాను...' అని మనసులోనే గొణుకున్నాడు సుందరం.

“ఏంటన్నయ్యా...ఆలొచిస్తున్నావు? ‘కూతురు పెద్ద మనిషై ఒక సంవత్సరం అవబోతోంది...ఎందుకు ఇంతవరకు చెప్పలేదు?’అనే కదా ఆలొచిస్తున్నావు! వెంటనే చెప్పాలనే నాకు ఆశ. కానీ వనజే...'అది చిన్న పిల్ల. విషయం తెలిస్తే మీ అమ్మ వెంటనే సంబరాలు అంటూ సంప్రదాయాలు ప్రారంభిస్తుంది. నాకు అది ఇష్టం లేదు’ అని చెప్పి ఒక్కసారిగా నా నోరు నొక్కేసింది!”

‘ఇక్కడ మాత్రం జరిగిందేమిటి? స్థలం కొన్న వెంటనే చెప్పాలనే అనుకున్నాను. దాని గురించి మాట్లాడిన వెంటనే మీ వదిన దయ్యంలాగా ఉగిపోయింది. 'చెప్పిన వెంటనే 'మా నాన్నలాగా మీ నాన్న పది లక్షల రూపాయలు తీసిచ్చి ఉంచుకోబ్బాయ్!' అని చెబుతారా ఏమిటి?' - అంటూ ఎన్నో మాటలు మాట్లాడింది. అన్నీ విని ఇలా ఏమీ చేయలేని దద్దమ్మగా ఉన్నాను...'అని మళ్ళీ గొణుక్కున్నాడు సుందరం.

‘ప్రేమ చూపించటానికి కూడా డబ్బులు కావాలనే వలయంలోకి తోయబడ్డట్టుగా ఇద్దరం మారిపోయామే? డబ్బు ముందు ప్రేమ, అభిమానం అన్నీ ఓడిపోతున్నాయే!'

వీళ్ళిద్దరూ భార్యల దగ్గర చేతకాని వాళ్ళులాగా ఉండటానికి వాళ్ళ అమ్మ ఒక కారణమో?

వాళ్ళమ్మ అమ్మ చాలా మమకారం గలది. చిన్న వయసులో పిల్లలు చేసే తప్పులకు దండన అని ఏమీ ఇవ్వక ప్రేమ మాటలతో కొట్టి...అభిమానంతో భయపెట్టేది. ఆడవాళ్ళను ఎలా గౌరవించాలో నేర్పించింది.

"నాన్నా...వ్యాసం రాసిస్తానని చెప్పారే! 'రెడీ' చేశేశారా?"--రెండో కొడుకు గోపాల్ వచ్చి అడిగేటప్పటికి, అంతవరకు తల్లి ఆలొచనలో ఉన్న సుందరం ఈ లోకంలోకి వచ్చాడు.

"అన్నయ్యా...నీకు వ్యాసాలు రాయడం కూడా వచ్చా?" అని అడిగాడు మోహన్ ఆశ్చర్యంగా! అతని జ్ఞాపకాలు కూడా కొంచం వెనక్కి వెళ్ళినై.

వాళ్ళిద్దరూ పిల్లలుగా ఉన్నప్పుడు...అమ్మే ప్రసంగాల పోటీలకు, వ్యాసాల పోటీలకూ పోటీ పడమని, అందమైన ముద్రించిన అక్షరాలలాగా రాసే చేతిరాతతో వ్యాసాలు రాసిచ్చేది. ఆమె రాసిచ్చిన వ్యాసాలతో గెలుచుకున్న ఎన్నో బహుమతులు, మెడల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి.

నాన్న కష్టపడి సంపాదించుకుని వచ్చిన సంపాదనను అద్భుతంగా-పొదుపుగా ఖర్చుపెడుతూ ఆదా చేస్తుంది అమ్మ. తక్కువ సంపాదనలో నలుగురూ సంతోషంగా జీవిస్తున్నారంటే అది అమ్మ యొక్క ఉత్తమ నిర్వాహ ప్రతిభే!

సహోదరులిద్దరూ ఏరోజూ దేనికీ కష్టపడిందే లేదు. కానీ ఇప్పుడు...అన్ని వసతులూ ఉన్నా కూడా వాళ్ళిద్దరి మనసులో ప్రశాంతత లేదు.

"సరే... మోహన్. రేపు ఇక్కడికి వచ్చేయండి. అందరం కలిసి నా కారులోనే వెల్దాం" అంటూ పాత జ్ఞాపకాలలో నుండి తమ్ముడ్ని లేపాడు సుందరం. వాకిలి వరకు వెళ్ళి వాల్లను సాగనంపాడు.

ఆ పెద్ద పోర్టికోను పూర్తిగా ఆక్రమించి నిలబడుంది సుందరం కారు. అందులో విలాసవంతంగా ఆరుగురు ప్రయాణం చేయవచ్చు. ఈ బంగళా, కారు, పదవి అన్నీ తండ్రి ఇచ్చిన ఆస్తి అని భార్యలతో చెబితే వాళ్ళు అంగీకరించరు. కేవలం పన్నెండు వేలు 'పెన్ షన్’ తీసుకునే అత్యంత సాధారణ మనిషి అనే భావన. తమ ఇంటి కారు డ్రైవర్ కు కూడా నెలకు పదిహేను వేలు జీతం అంటారు!

తండ్రి, ఆస్తి ఏమీ కూడబెట్టలేకపోయినా...తనకున్న ఒకే ఒక ఆస్తి అయిన పొలాన్ని అమ్మి కొడుకులను పెద్ద చదువులు చదివించాడు. పెద్ద చదువుల వలన వాళ్ళ జీవిత ఘనత మారిపోయింది.

జీవితంలో అన్నిటినీ నిజాయతితో, క్రమశిక్షణతో అనుసరించి శ్రమించి జీవితం గడిపారు నాన్న...'మనం అనుకున్నట్టు జీవితం గడపగలమా ఏమిటి? కుటుంభంలో సమస్యలు మొదలై...అవి భూతాకారం ఎత్తక ముందే' ధైర్యంగా అమ్మను తీసుకుని బయటకు వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

కోడళ్ళిద్దరూ గొప్పింటి వారు! కొంత కాలం వరకే గౌరవంగానూ, మర్యాదగానూ నడుచుకున్నారు. 'ఆస్తి-పాస్తులు లేని ఈ మామగారు-అత్తగార్లతో మనమెందుకు సొంతమనిషిలాగా ప్రవర్తించాలి?' అని అనుకున్నారు. వాళ్ళ వాళ్ళ స్వార్ధం - గౌరవానికి చోటిచ్చి సమస్యలను ఉత్పాదన చేసేరు.

కన్నవాళ్ళు కేవలం రెండువందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా కొడుకులు వెళ్ళి చూడలేదు. పని ఒత్తిడి, టైము దొరక్కపోవటం అంటూ ఏదేదో సాకులు చెప్పి వాళ్ళను వాళ్ళే మోసపుచ్చుకున్నారు.

అమ్మా, నాన్నల దగ్గర 'సెల్’ ఫోన్ లేదు అనేది ఒక సాకు...కుశలం విచారించ లేకపోతున్నాం అనేదానికి అదొక ఒక కుంటి సాకు అయ్యింది.

మరుసటి రోజు ప్రయాణంలో, కారు నడుపుతున్న సుందరం, పక్కనే కూర్చున్న మోహన్ ఇద్దరి మనసుల్లోనూ వాళ్ళ కన్నవాళ్ళ గురించిన ఆలొచనలే!

‘మనల్ని చూసిన వెంటనే అమ్మా-నాన్నా చాలా సంతోష పడతారు. వంట చేయడానికి అమ్మ హడావిడి పడుతుంది. ఆమె చేతి వంట తిని ఎన్ని రోజులయ్యంది...? వంటలు చేయటంలో అమ్మ అరితేరిన మనిషి.

వాళ్ళల్లో ఒక్కొక్కరికీ ఏమిష్టమో చూసి చూసి వంట చేసి తృప్తి పడుతుంది. ఇదిగో ఇప్పుడు కూడా.... సుందరానికి కాకరకాయ పులుసు కూర, మోహన్ కి గుత్తి వంకాయ కూర చేయటానికి కావలసినవి రెడీ చేస్తుంది. నాన్న, సంచీ తీసుకుని కొట్టుకు వెడతారు.

తాము చెప్పబోయే సంతోషమైన వార్తలను విని ఆనందంతో ఉప్పొంగిపోతారు. "ముందే ఎందుకు చెప్పలేదు?" అని అమ్మ ఏనాడూ అడిగిందే లేదు.

మనవరాలు వయసుకు వచ్చిందనేది విని సంతోషపడుతుందే తప్ప ఆచారం, సంప్రదాయం అంటూ ఒత్తిడి చేయదు. అవతలి వాళ్ళ ఇష్టాలు కాదని అమ్మ ఎప్పుడూ ఏపనీ చెయ్యలేదు. కానీ, వసతి లేని వాళ్ళను చూసి ఏదైనా మాటలనడం కొడళ్ళకు అలవాటు’

చిన్నగా ఉన్న వీధిలోని ఆ ఇంటిముందుకు వెళ్ళి ఆగింది ఆ బ్రహ్మాండమైన కారు. ఆ ఇంట్లోని ఒక పక్క పోర్షన్ లోనే అమ్మా-నాన్నలు ఉన్నారు.

వయసైన -- గడ్డమూ, కళ్ళజోడు ఉన్న ఒక మనిషి తలుపు తెరిచాడు.

"ఇక్కడ సుబ్బారావ్ గారు అని..."

"ఓ...వాళ్ళా? వాళ్ళు ఇళ్లు ఖాలీ చేసి వెళ్ళిపోయారే! మీరు వాళ్ళకు బంధువులా?"

'కొడుకులం' అని చెప్పటానికి గబుక్కున వాళ్ళకు నోరు రాలేదు.

"అవునండి! వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారో మీకు తెలుసా?"

ఆయన కొంచం వెనుకాడాడు. "చెబుదామా...వద్దా?" అని ఆలొచిస్తున్నట్టు అన్నదమ్ములకు అర్ధమయ్యింది.

"సార్...తెలిసుంటే దయచేసి చెప్పండి" అని ఒత్తిడిచేసేరు.

"వాళ్ళు...నా దగ్గర కూడా ఏమీ చెప్పలేదు. నేను తాసీల్ధార్ గా ఉండటం వలన ఒకసారి తన భార్యకు అరవై ఏళ్ళు పూర్తి అయినై అని చెప్పి 'సర్టిఫికేట్' అడిగారు. ఈ రోజు ప్రొద్దున వాకింగ్ వెళ్ళినప్పుడు రెండిళ్ళ తరువాత ఉంటున్న ఒక రైల్వే ఉద్యోగి మాటల్లో...ఇద్దరికీ పోయిన నెల కాశీ వెళ్ళటానికి ' సీనియర్ సిటిజన్ కోటా' లో టికెట్టు కొని ఇచ్చినట్టు చెప్పారు...అంతే తెలుసు" అన్న ఆయన లోపలకు వెళ్లటానికి వెనుతిరిగాడు.

ఆయన అలా వెనుతిరగడం 'నాకు తెలిసింది చెప్పను. మీరు వెళ్ళొచ్చు’ అని చెప్పకనే చెప్పింది.

కొడుకులిద్దరూ నేరం చేసేమనే భావం తో కృంగి కృశించి పోయారు. 'కన్నవారికి దేశం చూపించే మర్యాద కూడా, వాళ్ళ రక్తం పంచుకుని పుట్టిన మనం చూపించలేకపోయామే...?' అనుకుంటూ అవమానపడి నిలబడ్డారు.

"సరే...సరే... వెల్దాం" అంటూ తరుముతున్న భార్యలను గబుక్కున తిరిగి చూసిన అన్నదమ్ములిద్దరి కళ్ళళ్ళోనూ ఎర్రటి మంటలు చెలరేగినై.

*****************************************సమాప్తం*****************************************

14, మార్చి 2020, శనివారం

అంతరిక్షంలో బెర్ముడా ట్రయాంగిల్?... (ఆసక్తి)



                                   అంతరిక్షంలో బెర్ముడా ట్రయాంగిల్?
                                                             (ఆసక్తి)                 


                        అంతరిక్షంలో కూడా బెర్ముడా ట్రయాంగిల్ ఉన్నదా?

భూమిపై ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ గురించి మనమందరం విన్నాము, కాని అంతరిక్షంలో ఉన్నదాని గురించి మీరు విన్నారా?

భూమిపై ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రం లోని ఒక ప్రాంతం. దీనినే "డెవిల్స్ ట్రయాంగిల్" అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచీ ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కథలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి.

Satellites - and even the ISS - have to spend as little time as possible in this disruptive zone.

సామాన్యమైన మానవ తప్పిదాలు లేదా ప్రకృతి సహజమైన భౌతిక విషయాలు ఇక్కడి ఘటనలకు సంతృప్తికరమైన కారణాలను చెప్పలేకపోతున్నాయని పలువురి భావన. కనుక గ్రహాంతర వాసులు, అసాధారణమైన ప్రాకృతిక నియమాలు ఇక్కడ పనిచేస్తున్నాయని విస్తృతమైన అభిప్రాయాలున్నాయి. ఇక్కడి ఘటనలపై విస్తారంగా పరిశోధనలు జరిగినాయి. చాలా ఘటనల గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయాలు అపోహలని, వాటిని రిపోర్టు చేయడంలో అసత్యాలు కలగలిసి పోయాయని తెలుస్తున్నది. అయినాగాని, ఇతర ప్రాంతాలలో జరిగే ఇటువంటి ప్రమాదాలు లేదా ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి కొంత భిన్నంగా ఉన్నాయని, వీటికి సరైన వివరణలు లభించడం లేదని వివిధ నివేదికలలో పేర్కొనబడింది.

అంతరిక్షంలో ఒక స్థలం ఉంది, ఇక్కడ అనేక సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. బెర్ముడా ట్రయాంగిల్ మాదిరిగా కాకుండా, ఇక్కడ జరిగిన సంఘటనలు వాస్తవమైనవి మరియు చక్కగా నమోదు చేయబడ్డాయి. కొంతమంది అంతరిక్షంలోని ఆ స్థలాన్ని "బెర్ముడా ట్రయాంగిల్ ఆఫ్ స్పేస్" గా పిలుస్తారు. ఈ స్థలం యొక్క అంచు బెర్ముడాకు దక్షిణాన 1,860 మైళ్ళు (3,000 కిమీ) దగ్గర మొదలవుతుంది, కాబట్టి దీనిని "సౌత్ అట్లాంటిక్ అనోమలీ" అని పిలుస్తారు.


మొట్టమొదటిసారిగా 1958 లో కనుగొనబడిన ఈ'దక్షిణ అట్లాంటిక్ అనోమలీ' అదే సంవత్సరం అంతరిక్షంలో కనుగొనబడిన 'వాన్ అలెన్ రేడియేషన్' బెల్ట్‌ల ఉనికితో ముడిపడి ఉంది. ఇందులోని రింగ్ ఆకారపు ప్రాంతాలు, విద్యుదావిష్ట అవ్యయములు(చార్జెడ్ కణాలు). ఇవి సౌర గాలి నుండి వెలువడి మాగ్నెటోస్పియర్లో చిక్కుకున్నవి. రింగ్ ఆకారానికి బయట ఉన్న కణాలు అధిక శక్తి కలిగిన ఎలక్ట్రాన్లు. రింగ్ ఆకారానికి లోపల ఉన్న కణాలు అధిక శక్తి కలిగిన ఎలక్ట్రాన్లు మరియు అధిక శక్తి కలిగిన ప్రోటాన్లు. ఈ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లను తీసివేస్తాయి కాబట్టి అవి అధిక మోతాదులో మానవులకు హానికరం. ఇవి, అంటే ఈ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు...ఎలక్ట్రానిక్స్‌ పరికరాలకు కూడా హానికరమే. ముఖ్యంగా ఎక్కువగా రక్షణ లేని ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు బూడిదైపోతాయి.


అదృష్టవశాత్తూ రింగు లోపలి అణువులు సాధారణంగా భూమికి 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ లోపలి రింగు యొక్క అంచులు బ్రెజిల్ మీదుగా భూమికి 125 మైళ్ళ (200 కి.మీ) ఎత్తు దూరంలో ఉంటుంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS-International Space Station) మరియు ఉపగ్రహాలు దాని గుండా ఎగురుతాయి కనుక చార్జెడ్ కణాలకు గురవుతాయి. ఉపగ్రహ సాంకేతికత చిన్నదిగా మరియు మరింత అభివృద్ధి చెందినవిగా ఉంటుంది కనుక 'సౌత్ అట్లాంటిక్ అనోమలీ' ప్రభావానికి లోనవుతుంది. అప్పుడు అటుగుండా వెడుతున్న ఉపగ్రహాలలో ఉన్న ల్యాప్ టాప్ లాంటి ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు పనిచేయవు. ఉదాహరణకు, హబుల్ స్పేస్ టెలిస్కోప్ దానిలోని అత్యంత సున్నితమైన సెన్సార్లు దెబ్బతినకుండా ఉండటానికి ఆ చోటికి వచ్చినప్పుడు తన పరిశోధనలు ఆపేస్తుంది.



అంతరిక్షం లో ఉన్న ఈ "బెర్ముడా ట్రయాంగిల్" సుమారు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం కలిగినది. ఇక్కడ అంతరిక్ష కేంద్రం కంప్యూటర్లు అకస్మాత్తుగా క్రాష్ అవుతాయి, అంతరిక్ష టెలిస్కోపులు పనిచేయవు మరియు ఉపగ్రహాలు షట్ డౌన్ అవుతాయి. అంతరిక్షంలో వింత ఫ్లాషింగ్ లైట్లకు కూడా ఇదే కారణం. ఈ "బెర్ముడా ట్రయాంగిల్" ప్రాంతం ఇప్పుడు అంతరిక్షంలో కదులుతున్నట్లు కనుగొనబడింది.

అంతరిక్షం లో ఉన్న ఈ "బెర్ముడా ట్రయాంగిల్' గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాత ఉపగ్రహాలను ఆ ప్రాంత నుండి వెళ్ళకుండా చూసుకుంటున్నారు. అలాగే ISS ఆ ప్రాంతాన్ని దాటుతున్నప్పుడు దానిలో ఉన్న ఎలెక్ట్రానిక్స్ పరికరాలు ఆ ప్రాంతాన్ని దాటేటప్పుడు పనిచేయటం ఆపేస్తాయి.

Images Credit: To those who took the original photo. *****************************************************************************************************

12, మార్చి 2020, గురువారం

పువ్వులో ఒక తుఫాన...(కథ)




                                                పువ్వులో ఒక తుఫాన
                                                               (కథ)


ఇందూజాకి పెళ్ళి నిశ్చయించారని తెలుసుకున్న వెంటనే, ఆమె ప్రేమికుడు కిరణ్ విల విల లాడిపోయాడు.

'నాకు దొరకని ఇందూజా ఇంకెవరికీ దొరక కూడదు’ అని గోల పెట్టాడు. అతని స్నేహితుడు రవి కి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి.

స్నేహితులిద్దరూ ఇందూజాను చంపటానికి రెడీ అయ్యారు.

అదే సమయంలో కిరణ్ ఇంటికి వచ్చింది ఇందూజా.

"కూర్చో ఇందూజా "

"పరవాలేదు...మీరు బాగున్నారా?"

"ఎలా బాగుండ గలను?"

"నా పరిస్థితి మీ దగ్గర ఇదివరకే చెప్పాను, అయినా మీరు ఇంకా పాతవి మరిచిపోలేదా?"

"క్షమించాలి ఇందూజా...నిన్ను మరిచిపోయే శక్తిని నాకు ఆ దేవుడు వల్ల కూడా ఇవ్వటం కుదరదు"

"ఇవి పిచ్చి మాటలు"

"నిజమే ఇందూజా...నువ్వు నాకు దొరకలేదనే విషయం నాకు తెలిసిన రోజే, నేను పిచ్చివాడ్ని అయిపోయాను. నాకు దొరకని నువ్వు ఇంకెవరికీ దొరకకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల..."

"నన్ను చంపబోతావా?"

"అవును. అదే చెయ్యబోతాను. కానీ, నిన్ను నేను చంపను. వీడు చంపుతాడు. ఎందుకంటే నిన్ను చంపగలిగే శక్తి, మనసు నాకు లేదు... రవీ...ఊ...ఈమె కథను త్వరగా ముగించరా..." కిరణ్ అరిచాడు.

రవీ ఆమెను పొడవటానికి కత్తి తీసి, ఆమె దగ్గరకు వస్తున్నప్పుడు, ఆమె చేతుల్లో విరిగిన సీసా.

ఎదురుగా ఉన్న ఇద్దరూ షాకై నిలబడగా, ఇందూజా మాట్లాడింది.

"నన్ను ప్రేమించింది నువ్వు...ఓటమిలో గాయపడ్డది నువ్వు...కానీ, నన్ను చంపేది మాత్రం ఇంకొకడా? తనని ప్రేమించిన అమ్మాయిని ఇంకొకడు కన్నెత్తి చూస్తేనే, వాడ్ని కాల్చి బూడిద చేయాలనే తపన కలిగిన వాడే నిజమైన మగాడు, ప్రేమికుడు.

ప్రేమించిన అమ్మాయి ప్రాణం తీయటానికి ఇంకో మనిషిని పెట్టే నువ్వు...రేపు నీ వొంటికి వైకల్యం వచ్చిందంటే, నా మంచానికి ఇంకొకడ్ని ఏర్పాటు చేస్తావు. అంతే కదా?" ఆవేశపడింది.

"ఇందూజా...ఏదో తొందరలో..." తడబడ్డాడు కిరణ్.

"తొందర పడింది నువ్వు మాత్రమే కాదు...నేను కూడా. నీ యొక్క పరిస్థితి తెలుసుకుని, మనసు మార్చుకుని, పెళ్ళి పత్రిక ప్రింట్ అయిన తరువాత కూడా, ధైర్యంగా నిన్ను పెళ్ళి చేసుకుని హాయిగా జీవితం గడుపుదామని వచ్చాను చూడు...నా తొందరపాటుకు నన్ను నేను..."

సుడిగాలి లాగా మాట్లాడిన ఇందూజా, చేతిలో ఉన్న సీసాను వేగంగా గోడపైకి విసిరేసి వేగంగా బయటకు వెళ్ళిపోయింది.

ఆమెను ఆ ఇద్దరూ అడ్డగించలేకపోయారు.

********************************************సమాప్తం*********************************************

10, మార్చి 2020, మంగళవారం

"మీలా లేడండి...!"....(కథ)




                                                     "మీలా లేడండి...!"
                                                                (కథ)


"ఏమండీ...మీ అబ్బాయ్, మీ లాగా లేడండి!" -- అని చెప్పిన తన భార్య విమలను ఆశ్చర్యంగా చూసాడు సత్యమూర్తి. కొంచం దిగ్భ్రాంతి కూడా చెందాడు.

ఇలాంటి ఒక నిరుత్సాహం, ఆమె దగ్గర నుండి వస్తుందని ఏమాత్రం అతను అనుకోలేదు.

'ఎందుకలా చెబుతోంది?' -- ఎరుపెక్కిన కళ్ళతో మంచంలో కూర్చోనున్న తన భార్యను చూశాడు.

ఈ ముప్పై ఏళ్ళల్లో ఆమె అంతలా మనసు విరిగి పోవటం తను చూడలేదు.

పాపం అనిపించింది. ఆమె చేతులు గట్టిగా పుచ్చుకున్నాడు.

"ఎందుకు విమలా అలా మాట్లాడుతున్నావు?" -- మాటల్లో ఓదార్పు పూసి అడిగారు.

సమాధానం చెప్పటానికి నోటి నుండి ఏమీ రాలేదు! విమల కూడా భర్త చేతులు గట్టిగా పుచ్చుకుంది.

భర్త రెండు చేతులూ పుచ్చుకుని, తన మొహానికి అడ్డుపెట్టుకుని వెక్కి, వెక్కి ఏడ్చింది.

ఆమెకు ఓదార్పు కావాలి. ఆమె తల మీద చేయి పెట్టి తన గుండెలకు హత్తుకున్నాడు సత్యమూర్తి..

విమల కళ్ళ ముందు పాత జ్ఞాపకాలు నీడలాగా పరిగెత్తినై. అప్పుడు ఆమె గర్భంతో ఉన్నది.

"ఏమండీ...మీ అబ్బాయి మీలాగానే ఉన్నాడండి..."

"ఎందుకలా చెబుతున్నావు?"

"ఎంతలా తోసుకుంటూ కాలుతో తంతున్నాడండీ..." అని భార్య చెప్పిన వెంటనే పగలబడి నవ్వాడు.

అర్జున్ పుట్టినప్పుడు "ఏమండీ, అబ్బాయి ముక్కూ , మొహమూ, నుదురూ చూడండి. అచ్చం మీలాగే ఉంది. మీ పోలికలే ఉన్నాయి. గిరజాల జుట్టు కూడా అదేలాగనే ఉంది"

నడవటం మొదలు పెట్టిన ప్రారంభంలో "నడిచే అందంలోనూ వీడు మిమ్మల్ని వొలిచి పెట్టినట్టు ఉన్నాడు చూడండి" అన్నది.

స్కూలుకు వెళ్ళే వయసు వచ్చినప్పుడు "ఏమండీ వీడు అచ్చం మీలాగానే...'నేను చెప్పేది అర్ధమవుతోందా?' అని అడుగుతున్నాడండీ”

ఇలా రోజుకు ఒకసారైనా కొడుకును భర్తతో పోల్చి చెప్పని రోజే లేదు.

విమల అలా చెప్పినప్పుడల్లా... సత్యమూర్తి మొహంలో గర్వం, గొప్పతనం కనబడుతుంది. సత్యమూర్తికి ఆమె వర్ణనను పోల్చి చేసి చూడాలనే ఉంటుంది.

కొన్ని సమయాలలో సంతోషంలో ఆమెకు వొళ్ళు జలదరిస్తుంది. అదే విమల ఈ రోజు. "ఏమండీ...మీ అబ్బాయి మీలాగా లేడు" అని చెప్పినప్పుడు ఏర్పడ్డ ఆశ్చర్యం, షాక్ నుండి సత్యమూర్తి ఈ నిమిషం వరకూ తేరుకోలేదు.

వెక్కి వెక్కి ఏడుస్తున్న విమల గడ్డం పుచ్చుకుని, మొహాన్ని పైకెత్తాడు. చెమర్చిన, ఎరుపెక్కిన ఆమె కళ్ళను చూసి మళ్ళీ అడిగాడు.......

"ఎందుకలా చెబుతున్నావు?"

"అవునండీ...మీ దగ్గర ఈ ముప్పై సంవత్సరాల జీవితంలో, 'నా మాట వినండి...నేను చెప్పేది చేయండి అని ఎన్ని సార్లు చెప్పానో మీకు గుర్తుందా"

"నేను చెప్పింది చెయ్యలేదని మీ దగ్గర ఎన్నిసార్లు, ఎంత గొడవ చేసుంటాను? అన్నిటినీ సహిస్తూ, ఓపికగా ఉంటూ, మీ అమ్మా-నాన్నలను మనతోనే ఉంచుకుని కాపాడారు. కానీ, ఈ విషయంలో వాడు అలాగే మీకు ఆపోజిట్ గా ఉన్నాడు. మారిపోయాడు..." ఏడుస్తూ చెప్పింది!

"డబ్బులు కట్టేశాను...అప్పుడప్పుడు వచ్చి చూస్తాను...చూసి జాగ్రత్తగా ఉండండి!" అని చెప్పేసి వృద్దాశ్రమంలో నుండి బయటకు వెడుతున్న తన కొడుకు చెవులకు వినబడేలాగా మళ్ళీ ఒకసారి చెప్పింది విమల.

"ఏమండీ...మీ అబ్బాయి మీ లాగా లేడండి!" **************************************************సమాప్తం**************************************

8, మార్చి 2020, ఆదివారం

అంతరిక్షంలోనూ కాలుష్యం...!!!(ఆసక్తి)




                                      అంతరిక్షంలోనూ కాలుష్యం...!!!
                                                          (ఆసక్తి)


కాలుష్యం: కాలుష్యం అంటే అర్ధం తెలియని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఎక్కడ చూసినా కాలుష్యమే. ఏ మాట ఎత్తినా అందులో కాలుష్యం ఉంటుంది. ఉదాహరణకు: పర్యావరణ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, మట్టి కాలుష్యం…ఇలా ఎన్నో కాలుష్యాలు. కానీ ఒక్కరు కూడా అంతరిక్షం కూడా కాలుష్యానికి గురై ఉంటుందని ఊహించుడరు....నిజమే. కానీ అంతరిక్షం కూడా పూర్తిగా చెత్తతో కాలుష్యం అయిపోయింది. అదికూడా మానవుల వలనే.

ప్రకృతి మానవులకు పరిశుభ్రమైన జీవనార్ధాలను ఇచ్చింది. కానీ, మనిషి వాటినన్నింటినీ రకరకాల చెత్తతో కాలుష్యం చేసేరు.

మనుషులు ఉన్నంత కాలం చెత్త ఉంటుంది. మనుషులు ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు చెత్తను వదిలేస్తారు - 1950 ల చివరి నుండి, ఇందులో అంతరిక్షం కూడా ఉంది. అంటే అంతరిక్షాన్ని కూడా మనిషి వదిలిపెట్టలేదు. చెత్తని వదిలిపెట్టటం మానవ స్వభావమా? ఖచ్చితంగా అవుననే అనిపిస్తోంది. చెత్త కుప్పలాగా పెరిగి, దాన్ని తొలగించే ఖర్చు అధికం అయ్యేంతవరకూ దాన్ని పట్టించుకోకుండా ఉండటం కూడా మానవ స్వభావం లాగే కనిపిస్తోంది!

భూ ఉచ్ఛ కక్ష్య (HEO) నుండి అంతరిక్ష శిథిలాల(చెత్త) దృశ్యం. ప్రధానమైన శిథిలాల సమూహాలు రెండు: భూస్థిర కక్ష్యలో ఉన్న వలయం, భూ నిమ్న కక్ష్యలో (LEO). ఉన్న శిథిలాల మేఘం.

అంతరిక్ష వ్యర్థాల యొక్క పర్యవసానంను ‘కెస్లర్ సిండ్రోమ్’ అంటారు.(1978 లో నాసా శాస్త్రవేత్త డోనాల్డ్ జె.కెస్లర్ అంతరిక్ష వ్యర్థాల వలన ఏర్పడే ఘటన ఎలా ఉంటుందో వివరించాడు. అందువలన దానికి కెస్లర్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు). భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఉన్న అంతరిక్ష చెత్త లో ఉన్న ఒక్క వస్తువుగాని, ఇంకొక వస్తువతో ఢీ కొంటే అంతరిక్షమే ప్రమాదకరమైన ప్రదేశంగా మారుతుంది. ఉపగ్రహాలకు, రాకెట్లకు మరియు మానవ అంతరిక్ష ప్రయాణికులకు అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాల చెత్తా చెదారం విషయంలో 'చికిత్స కన్నా నివారించడమే’ మేలు అనే సూత్రాన్ని పాటించడం మంచిదని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. అందువల్ల వారు ఉపగ్రహ ప్రయోగంలోనే దాని వల్ల ఏర్పడే అనవసర పధార్ధాల్ని (జంక్) తొలగించే ఏర్పాటు చేస్తారు. ఒక ఉపగ్రహం జీవితకాలం ముగియగానే అది తన కక్ష్య నుంచి తప్పుకుని భూమివైపు పయనించే ఏర్పాటు చేస్తారు. అలా కాలం చెల్లిన ఉపగ్రహం భూవాతావరణంలోకి ప్రవేశించి అక్కడి వాయువులతో ఘర్షణ ఏర్పడి మాడి మసైపోతుంది.

అంతరిక్షంలో ఉపగ్రహాల వల్ల ఏర్పడిన 'జంక్' ను తొలగించాడానికి భూస్థావరంగా అమర్చిన లేజర్ కిరణాలను కాలం చెల్లిన ఉపగ్రహాల వల్ల ఏర్పడిన 'జంక్' పై కేంద్రీకరిస్తే అవిభూమిపై పడకుండా ఆవిరైపోతాయి.

కానీ ఇది వరకే పేరుకుపోయిన చెత్త, ఇప్పుడు కొత్తగా చేరుతున్న చెత్త కలిపి అంతరిక్షం ప్రమాదకరమైనదిగా మారుతోంది. రెండేళ్ళ క్రితం నుండే ఈ అంతరిక్ష చెత్తను శుభ్రం చేయాలని అగ్ర రాజ్యాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. కానీ, దానికి ఖర్చు భరించలేనంతగా ఉండటంతో కొత్తరకం మార్గాలను పరిశోధిస్తున్నారు.


అంతరిక్షంలోకి ప్రయోగించే ఉపగ్రహాలు, వ్యోమనౌకలు, రాకెట్లకు సంబంధించిన పనికిరాని వస్తువులు, రాకెట్లు వదిలిపెట్టే విడిభాగాలు, కాలం చెల్లిన ఉపగ్రహాలు, నట్లు, బోల్టులు ఇవన్నీ అంతరిక్షంలో పేరుకుపోయి అంతరిక్ష చెత్తగా మిగిలిపోతాయి. వీటిలో కొన్ని చిన్నవిగా ఉండొచ్చు మరికొన్ని పెద్దవిగా ఉండొచ్చు. ఇవి అంతరిక్షంలో చాలా వేగంగా ప్రయాణిస్తుంటాయి. వీటి వేగం గంటకు 28వేల కిలోమీటర్లకు పైనే ఉంటుంది అంటే ఈ వేగం ధ్వని వేగం కన్నా 23 రెట్లు ఎక్కువ. 10 సెంటీమీటర్ల అల్యూమినియం ముక్క సెకనుకు 7.7 కిలోమీటర్ల వేగంతో ఢీకొంటే, 300 కిలోల టీఎన్‌టీ పేలుడు పదార్థం పేలినంత శక్తి వెలువడుతుంది. మరికొన్ని ఉపగ్రహాలైతే తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించే ప్రమాదం కూడా ఉంటుంది.


అక్టోబర్ 4, 1957 న అంతరిక్షంలోకి పంపిన మొదటి ఉపగ్రహం 'స్పుట్నిక్-1' భూమ్యాకర్షణ శక్తి దాటి వెళ్ళటంతో మొదలైంది మానవుని అంతరిక్ష అన్వేషణ. అన్వేషణ మొదలై, ఇప్పటి వరకు సుమారు 5000 ఉపగ్రహాలు పంపబడ్డాయి. ఇందులో 2000 ఉపయోగంలో ఉండగా, మిగిలిన 3000 చనిపోయిన ఉపగ్రహాలు. ఇవి మాత్రమే కాకుండా సుమారు 34,000 ఉపగ్రహ ముక్కలు 10 సెంటీ మీటర్ల కొలతతోనూ, ఒక మిల్లీ మీటర్ తక్కువ కొలతతో 128 మిల్లియన్ల చిన్న ముక్కలు ఉన్నాయి. ఇందులో 10,000 ఒకటి ఢీ కొనే పోజిషన్ లో ఉన్నది. 25 ముక్కలను అంతర్జాతీయ అంతరిక్ష నౌక (ISS) రోజూ తప్పించుకు తిరుగుతోంది.

అంతరిక్ష చెత్తను తొలగించే, తీసిపారేసే పరిశోధనలు త్వరగా పూర్తి అయ్యి అంతరిక్షం పరిశుభ్రం ఎప్పుడు అవుతుందో నని ఎదురుచూస్తున్నాయి అగ్ర రాజ్యాలు. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. మనంకూడా వేచి చూద్దాం.

Image Credit: To those who took the original photograph. **********************************************************************************************

6, మార్చి 2020, శుక్రవారం

భూమిపై అన్యగ్రహ రహస్య స్థావరం?....(మిస్టరీ)



                                       భూమిపై అన్యగ్రహ రహస్య స్థావరం?
                                                                (మిస్టరీ)

                          హిమాలయా పర్వతాలలో అన్యగ్రహ రహస్య స్థావరం?

'కొంగ్కా లా' అనేది హిమాలయాలలో దిగువ పర్వతశ్రేణి ప్రాంతం. ఇది లడఖ్‌ లోని వివాదాస్పద భారత-చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంది. చైనీయుల ఆధీనంలో ఉన్న ఈశాన్య భాగాన్ని అక్సాయ్ చిన్ అని, ఇండియాలో ఉన్న సౌత్ వెస్ట్‌ ప్రదేశాన్ని లడఖ్ అని పిలుస్తారు. 1962 లో భారత మరియు చైనా సైన్యాలు పెద్ద యుద్ధం చేసిన ప్రాంతం ఇది.

ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతి తక్కువ ప్రవేశ సౌలభ్యం ఉన్న ప్రాంతాలలో ఒకటి. ఇరుదేశాల ఒప్పందం ప్రకారం రెండు దేశాలూ,సరిహద్దులోని ఈ భాగంలో (కొంగ్కా లా ప్రాంతం)పెట్రోలింగ్ చేయవు. చాలా మంది పర్యాటకుల,బౌద్ధ సన్యాసుల,లడఖ్ స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం, భారత సైన్యం మరియు చైనీస్ మిలటరీ ఆ ప్రాంతం (కొంగ్కా లా ప్రాంతం) చుట్టూ నియంత్రణ రేఖను కలిసి నిర్వహిస్తున్నట్టు చెబుతారు. కానీ ఈ ప్రాంతంలో ఇంకేదో చాలా తీవ్రమైన విషయం జరుగుతోంది.

భారత మరియు చైనా కంట్రోల్లో ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న స్థానికుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాంతంలోని భూమి క్రింద నుండి క్రమం తప్పకుండా యు.ఎఫ్.ఓ (గుర్తు తెలియని ఎగిరే పళ్లాలు) లు రోజూ బయటకు వస్తాయి. ఈ ప్రాంతంలో యు.ఎఫ్.ఓ ల భూగర్భ స్థావరాలు ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు. ఈ విషయం భారత మరియు చైనా ప్రభుత్వానికి బాగా తెలుసు.

హిమాలయా పర్వతాలపై ఎగురుతున్న యు.ఎఫ్.ఓ క్లోస్ ఆప్ ఫోటో

ఇటీవల, కొంతమంది హిందూ యాత్రికులు వెస్ట్రన్ పాస్ నుండి కైలాష్ పర్వతానికి వెళుతుండగా, ఆకాశంలో వింత లైట్లు కనిపించాయి. చైనా స్థానిక గైడ్‌లు ఇది కొత్తేమీ కాదని, కొంగ్కా పాస్ ప్రాంతం నుండి ఎప్పుడూ జరిగే సాధారణ విషయం. – అని చెబుతారట.

ఈ వింత వెలుగు, త్రిభుజాకార పళ్ళెం ఆకారంలో భూగర్భం నుండి నిలువుగా, వేగంగా పైకి కదులుతాయి. సాహసోపేత యాత్రికులు కొందరు ఆ ప్రాంతమ్ను పరిశీలించాలనుకున్నారు. చైనా వైపు నుండి వారికిప్రవేశం నిరాకరించడంతో వారు భారత దేశ సరిహద్దు వైపు నుండి వెళ్లటానికి ప్రయత్నించారు. కానీ, భారతదేశ సరిహద్దు సైనికదళం కూడా వాళ్ళకు అనుమతి ఇవ్వలేదు.

'కొంగ్కా లా' పర్వతశ్రేణి ప్రాంతం ఒక పెద్ద రంద్రంలో నుండి బయటకు వస్తున్న యు.ఎఫ్.ఓ.

సరిహద్దు యొక్క రెండు వైపులా ఉన్న స్థానికులు ఈ ప్రాంతంలో భూగర్భ UFO స్థావరం ఉందని నమ్ముతారు. స్థానిక గైడ్‌లు ఇది కొత్త విషయం కాదని, కొంగ్కా లా పాస్‌లో ఇది చాలా సాధారణ దృశ్యం అని చెబుతారు.

ఈ సిద్ధాంతానికి విశ్వసనీయత ఇచ్చేటట్టు, జూన్ 2006 లో, గూగుల్ ఎర్త్‌లోని ఉపగ్రహ చిత్రాలు సరిహద్దు యొక్క చైనా వైపున ఉన్న ప్రశ్నార్థకం అయిన ప్రాంతం యొక్క 1: 500 స్కేల్ వివరణాత్మక భూభాగ నమూనాను వెల్లడించాయి.

గూగుల్ ఎర్త్ ఫోటో...హిమాలయా పర్వతాలపై అన్యగ్రహ రహస్య స్థావరం అని చెబుతున్న ప్రాంతం.

ఈ నమూనా చుట్టూ సైనిక సౌకర్యాన్ని పోలిన భవనాలు ఉన్నాయి.

అక్సాయ్ చిన్ అనే ఈ ప్రదేశం, యురేషియా మరియు భారతీయ ప్లేట్లు కలిసే సరిహద్దు. ఇక్కడ ఒక ప్లేట్ మరొకదాని క్రింద మునిగిపోతుంది. అందువల్ల ప్రపంచంలోని అత్యంత లోతైన భూ ఉపరితలం కలిగిన కొన్ని ప్రాంతాలలో ఇది ఒకటి, ఇక్కడ భూ ఉపరితలం యొక్క లోతు ఇతర ప్రదేశాల కంటే రెండు రెట్లు ఎక్కువ.

హిమాలయా పర్వతాలపై ఉన్నదని చెబుతున్న అన్యగ్రహ రహస్య స్థావరం.

సరిహద్దులో నివసిస్తున్న స్థానికుల ప్రకారం, భారతీయ మరియూ చైనా అధికారులకు అక్కడ భూమి క్రింద గ్రహాంతర వాసుల ఉనికి ఉన్నదని బాగా తెలుసు. కొన్ని కారణాల వల్ల భారత మరియు చైనా ప్రభుత్వాలు వాస్తవాన్ని బహిర్గతం చేయడానికి ఇష్టపడటం లేదని వారు నమ్ముతారు. స్థానికులు ఈ విషయాన్ని ప్రభుత్వాల ముందు ఉంచినప్పుడు. స్థానికులు నిశ్శబ్దంగా ఉండాలని మరియు ఈ విషయాన్ని మరచిపోవాలని చెబుతున్నారట.

అన్యగ్రహ రహస్య స్థావరం అని చెబుతున్న ప్రాంతం నుండి వస్తున్న యు.ఎఫ్.ఓ లు.

కొన్నేళ్ల క్రితం హిమాలయ పర్వత శిఖరం కొనలో ఉన్న మంచు గడ్డల క్రింద నుంచి కూరుకుపోయి,పాడైపోయిన ఆరు గ్రహాంతరవాసుల యు.ఎఫ్.ఓ లను, అందులో నుండి ఆరు గ్రహాంతరవాసుల శరీరాలను అమెరికా మరియు నేపాల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారట.

గ్రహాంతరవాసుల గురించి పరిశోధనలు జరపటానికి యునైటడ్ నేషన్స్(UNO)ఏర్పాటుచేసిన సభ్యమండలి లోని UFO నిపుణుడు డాక్టర్ జాన్ మాల్లీ (Dr. John Malley ) ఈ ఆవిష్కరణ చేశారు. అన్ని వాస్తవాలను బహిరంగపరిస్తే ప్రపంచం భయాందోళనలకు గురవుతుందనే భయంతో ఇరు దేశాల ప్రభుత్వాలు ఈ ఆవిష్కరణను రహస్యంగా ఉంచడానికి కుట్ర చేస్తున్నాయని డాక్టర్ మాల్లీ ఆరోపించారు.

అవశేషాలు మంచుతో కప్పబడి ఉన్నాయి, కాబట్టి అవి కుళ్ళిపోయుండవు. మృతదేహాలకు 10,000 సంవత్సరాల వయస్సు ఉండవచ్చు.

ఇటీవల ఒక భారతీయ పురావస్తు శాస్త్రవేత్త 10000 సంవత్సరాల పురాతన గ్రహాంతర చిత్రలేఖనాన్ని భారతీయ నగరం ఛత్తీస్‌గఢ్ సమీపంలో ఉన్న ఒక గుహలో కనుగొన్నారు. ఇది ఆధునిక గ్రహాంతర నాగరికత ఒకసారి భూమిని సందర్శించి ఉంటుందనడానికి రుజువుగా ఉపయోగపడుతుంది.

మానవుల సంక్షేమం గురించి గ్రహాంతరవాసులు తనిఖీ చేస్తున్నారా?

మరో సందర్భంలో, ఈశాన్య భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో వరదలు సంభవించిన విభాగాలపై డిస్క్ ఆకారంలో ఉన్న వస్తువు ఎగురుతూ ఉండటాం ఫోటో తీయబడింది. బాధిత మానవుల సంక్షేమం కోసం గ్రహాంతరవాసులు తమ UFO లలో వచ్చి తనిఖీ చేస్తున్నారా? భారతదేశంలో యు.ఎఫ్.ఓ స్థావరం సాధ్యమే అనడానికి ఇది మరో రుజువా? పై విషయాన్ని ‘ది నార్త్ఈస్ట్ టుడే’ అనే దినపత్రిక ప్రచురించింది. ఎగురుతున్న యు.ఎఫ్.ఓ యొక్క చిత్రాన్ని సెప్టెంబర్ 4-2015 న ఫోటోగ్రాఫర్ మోమినా వాసిమ్ తీశారు, అతను ఆ సమయంలో ఎడ్యుకేటెడ్ నిరుద్యోగ సంక్షేమ సంఘం (Educated Unemployed Welfare Society...EUWS) కోసం పనిచేస్తున్నాడు. అస్సాంలోని దిబ్రుగార్ జిల్లాలోని మైజాన్ సమీపంలోని మోథోలా టీ ఎస్టేట్‌లో మోమినా, బ్రహ్మపుత్ర నది వరదలలో నష్టపడ్డ బాధితులకు ఆహారం మరియు సామాగ్రి పంపిణీని అందిస్తున్నారు.

క్లోస్ ఆప్ ఫోటోలు.

తన ప్రొఫెషనల్ మోడల్ కెమెరాతో ఛాయాచిత్రాలను తీస్తున్నప్పుడు మోమినా ఒక ఫ్రేమ్‌లో తన తలపై ఎగురుతున్న ఎర్రటి గోధుమ రంగు రిమ్ ఓవర్‌హెడ్‌తో మెరిసే వైట్ డిస్క్‌ను కూడా ఫోటో తీసింది. ఆ తరువాత తాను తీసిన ఫోటోలను పరిశీలిస్తున్నప్పుడు ఆమె ఆకాశంలో ఎగురుతున్న UFO ని గమనించింది. అది వేగంగానూ, నిశ్శబ్దంగానూ కదులుతున్నట్లు గ్రహించింది.

ఆ సంవత్సరం అది భారతదేశంలో తీసిన రెండవ స్పష్టమైన UFO ఛాయాచిత్రం అది. జూన్ 2015 లో,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ మీదుగా సాసర్ ఆకారంలో వెడుతున్న UFO ను ఒక యువకుడు ఫోటో తీశాడు.

2014, 2013 మరియు 2007 సంవత్సరాలలో కూడా UFO లు చూశామని చెప్పిన వాళ్ళూ చాలామంది ఉన్నారు. అంటే UFO లు భూగ్రహాన్ని చుట్టి రావడానికి విపత్తులలో మానవుల సంక్షేమం గురించి తెలుసుకోవటానికి మాత్రమే కాదు...మరింకేదో కారణం ఉంది అని UFO లను చూసిన ప్రజలు అనుకుంటున్నారు.

మన భూమి అన్యగ్రహ వాసులకు కేంద్రంగా ఉంటోందా?!....ఇదే మిస్టరీ

****************************************************************************************************