30, డిసెంబర్ 2019, సోమవారం

ప్రేమించుకోవచ్చు!...(కథ)





                                              ప్రేమించుకోవచ్చు!...(కథ)


రెండక్షరాల చిన్న పదం ప్రేమ. రెండు హృదయాల మధ్య మొలకలా అంకురించి, వికసించి, వటవృక్షమై వ్యాప్తి చెంది, అంతా తానై ఉండే సమ్మొహనం. అది బౌతిక రూపం లేనిది, మనసులకు గోచరించది ప్రేమ!

మానవ జీవితంలో ప్రేమదే అగ్రస్థానం. ఆప్యాయంగా మాట్లాడుకోవటం, మనసులు పంచుకోవడం ----గొప్ప శకినిస్తాయి. తనకోసం ఆలొచించే ఒక వ్యక్తి ఉన్నారన్న భావన ప్రేమ వల్ల ఏర్పడుతుంది. ప్రేమను కొలిచే సాధనాలు లోకంలోనే లేవు.

యౌవనంలో ఇరు హృదయాల్లో పుట్టే ప్రేమకు విశిష్ట స్థానం ఉంది.

ఐతే చాలా మంది యువతలో అది ఎప్పుడూ తాత్కాలిక వ్యామోహంగానూ, ఆకర్షణగానూ మారి జీవితాల్ని చిద్రం చేస్తోంది. అందుకనే చాలామంది పెద్దలు ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఈ మధ్య యువత పెద్దలను బెదిరించి, వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో రకాలుగా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. దీనివలన ఆ యువత కుటుంబాలలోని మిగిలిన వ్యక్తులకు ఎన్నో సమస్యలు, అవమానాలు తలెత్తి ప్రశాంతతను కోల్పోయేటట్టు చేస్తోంది.

కాబట్టి ఎవరూ పెళ్ళికి ముందు ప్రేమించకూడదు.

కానీ, ప్రేమించుకోవచ్చు!

ఎప్పుడు? ….పెళ్ళి అయిన తరువాత.

పెళ్ళి అయిన తరువాత భర్త భార్యను, భార్య భర్తను ప్రేమించుకోవచ్చు. కానీ పెళ్ళికి ముందు ఎవరూ ప్రేమించ కూడదు. ఎందుకంటే ప్రేమ చాలా వరకు ప్రేమికులను ఇబ్బందులలోకి తోసేస్తుంది. ప్రేమికులను మాత్రమే కాదు, వారి కుటుంబాలనూ, సన్నిహితులను, స్నేహితులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇది చాలామందికి పెద్దలకు తెలుసు. కానీ, యువతకు తెలియదు. ప్రేమ వలన జీవితాన్నే పారేసుకున్న వారిని చూసిన తరువాత కొంతమంది యువతకు ప్రేమ మీద వాళ్ళకున్న అభిప్రాయం మారింది. అలా ప్రేమ మీద అభిప్రాయాలు మార్చుకున్న చాలామందిలో రాజశేఖర్, కౌసల్య కూడా ఉన్నారు.

ప్రేమించి పెళ్ళిచేసుకుంటేనే జీవితం బాగుంటుందని రాజశేఖర్ కు అపారమైన నమ్మకం ఉండేది. కానీ తన కుటుంబంలో జరిగిన ఒక సంఘటన వలన అతనికి ప్రేమ మీద నమ్మకం పూర్తిగా అపనమ్మకంగా మారిపోయింది.

అదేలాగా కౌసల్యకు కూడా ప్రేమించి పెళ్ళిచేసుకోవటమే జీవితానికి మంచిది అనే అభిప్రాయం ఉండేది. కానీ తన స్నేహితురాలికి జరిగిన సంఘటన ఆమె అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఇద్దరూ అరేంజడ్ మ్యారేజ్ చేసుకోవటమే జీవితానికి మంచిది అని ప్రేమ పెళ్ళిల్ల మీద వారికున్న నమ్మకాన్నీ, ఇష్టాన్ని, అభిప్రాయాన్నీ మార్చుకున్నారు…… ఆ తరువాత

                                   ***********************************************

రోజంతా పనిచేసిన అలసటతో, ఆఫీసుల నుండి ఇంటికి తిరిగి వెళ్ళటానికి ఆ బస్ స్టాపింగ్ లో గుంపుగా నిలబడున్నారు కొందరు.

ఆ గుంపుకు ఎడమ పక్కగా స్వప్నతో కలిసి నిలబడున్న కౌసల్య తన చేతి గడియారం లో టైము చూసింది. 5.50. ఆమె ఇంటికి వెళ్ళాల్సిన బస్సు ఈ పాటికి వచ్చుండాలి. కానీ, ఎందుకో ఈ రోజు ఇంకా రాలేదు.

"ఏయ్... అటు చూశావా?" అంటూ కౌసల్య భుజాన్ని తట్టింది స్వప్న.

స్వప్న చూపిన వైపుగా చూసింది కౌసల్య. ఈ రోజు కూడా అతను వాళ్ళు నిలబడున్న వైపుకే వస్తున్నాడు.

"అతను మనల్ని వెంబడించి రావడం ఇది నాలుగో రోజు...రాస్కల్" అంటూ తిట్టింది కౌసల్య.

"మనల్ని కాదు... నిన్ను.నిన్నే వెంబడిస్తున్నాడు!" చెప్పింది స్వప్న.

"మొహం వాచేటట్లు నాలుగు మాటలు అడిగేయనా?"

"ఎలా అడుగుతావు? నిన్ను చూశానా? నిన్ను వెంబడిస్తున్నానా? …అంటూ అతను ఎదురుతిరిగితే?"

అంటూ స్వప్న ముగించేటప్పుడు అతను వాళ్ల దగ్గరగా వచ్చి, రోజూలాగానే ఆ రోజు కూడా వాళ్ళ వెనుకకు వెళ్ళి నిలబడ్డాడు.

కౌసల్య వెనక్కి తిరిగి కోపంగా అతని వైపు చూసింది. అదేమీ గమనించనట్లు అతను రోడ్డునే చూస్తూ నిలబడ్డాడు.

"చూడటానికి ఏదో పెద్ద ఉద్యోగమే చేస్తున్నట్లు డీసెంటుగా కనబడుతున్నాడు...ఎందుకో ఈ పిచ్చి వేషాలు…అడిగేయనా?" అని స్వప్న చెవిలో గుసగుసలాడింది కౌసల్య

"గొడవని కొని తెచ్చుకోకు" గొణిగింది స్వప్న.

ఈలోపు వాళ్ళు ఎక్కవలసిన బస్సు ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉసూరు మనుకుంటూ వచ్చి బస్ స్టాపింగులో ఆగింది. మెట్ల మీద నిలబడున్న నలుగురైదుగురు ప్రయాణీకులు క్రిందకు దిగి దొవ ఇవ్వటంతో లోపల ఉన్న ప్రయాణీకులలో కొంతమంది దిగుతూ ఉండగానే స్టాపింగులో ఉన్న కొందరు వేగంగా బస్సు ఎక్కి లోపలకి దూసుకు వెళ్ళారు. వారిలో స్వప్న కూడా ఉన్నది.

"ఒక వేల నేను ఈ బస్సులో ఎక్కకుండా ఉండిపోతే….అతను ఏం చేస్తాడు?" అనే ఆసక్తి తలకెక్కటంతో, బస్సు ఎక్కకుండా ఆగిపోయింది కౌసల్య.

బస్సు మెట్ల మీద నిలబడి ప్రయాణం చేయబోయిన అతను, కౌసల్య బస్సు ఎక్కకుండా క్రిందే నిలబడుంటం చూసి, బస్సు బయలుదేరుతున్నప్పుడు గబుక్కున క్రిందకు దిగిపోయాడు.

కౌసల్య బస్ స్టాపంగులోనే ఉండటం చూసిన స్వప్న, కిటికీలో నుండి తొంగి చూస్తూ "ఏయ్...నువ్వు రావట్లేదా?" అని చేతి వేళ్ళను ఉపుతూ అడిగింది. కౌసల్య నుండి జవాబు తెలుసుకునే లోపు ఆ బస్సు అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయింది.

"బస్సులో ముందు వైపు జనం ఎక్కువగా లేరు. మీరెందుకు బస్సు ఎక్కకుండా ఆగిపోయారు?" అని కౌసల్యను చూసి అడిగాడు అతను.

"హలో...నేను ఇంతకు ముందు మీకు పరిచయమున్నానా? మీకెందుకు ఈ అక్కర్లేని పని?"

"మేడం...నేనూ కూడా ఈ బస్సు స్టాపింగు లో నుండే బస్సు ఎక్కుతాను. మిమ్మల్ని ఇక్కడ చూశాను...ఆ పరిచయంతోనే అడిగాను"

"మిమ్మల్ని ఇంతకు ముందు నేను చూసిందే లేదే" అన్నది కౌసల్య.

"ఇప్పుడే ఉద్యోగంలో చేరాను. నాలుగు రోజులే అయ్యింది"

అతన్ని లోతుగా గమనించింది. అతను అబద్దం చెప్పే మనిషిగా అనిపించడం లేదు. అతను తనని వెంబడిస్తున్నాడని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు తనలోనే "సారీ" చెప్పుకుంది కౌసల్య.

“ఓ...అలాగా? ఎక్కడుంటున్నారు?" సహజంగా ఉండాలని అనుకుని అతన్ని అడిగింది.

"అమీర్ పేట...మీరు?"

"పంజా గుట్ట..." అని చెప్పిన కౌసల్య "మీ భార్య ఎక్కడ పనిచేస్తోంది?" అని అడిగింది.

కళ్ళార్పకుండా ఆమెనే చూశాడు అతను.

ఒక కంపనీ పేరు చెప్పి ,...అక్కడే తన భార్య అకౌంటంట్ గా ఉద్యోగం చేస్తోందని నవ్వుతూ చెప్పాడు!

ఒక్క క్షణం కలవరపడింది కౌసల్య.

"ఎంత ధైర్యం ఉంటే నువ్వు పనిచేస్తున్న ఆఫీసు పేరు చెబుతాడు...? నువ్వు ఏ ఆఫీసులో పనిచేస్తున్నావో తెలుసుకోవడానికి, ఆ ఆఫీసు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికీ ఎంత ప్రయత్నం చేసుంటాడు?....ఇతను మంచి వాడు కాదు కౌసల్యా" కౌసల్య మనసు కౌసల్యను హెచ్చరించింది.

"మిస్టర్...చూడటానికి మాత్రం డీసెంటు గా ఉన్నారు...కానీ నాగరీకంగా నడుచుకోవటం లేదు"

"సారీ మాడం...మీరు మాత్రం ఒక పెళ్ళి కాని అబ్బాయిని చూసి అలాంటి ప్రశ్న అడిగితే... నేను ఏం జవాబు చెప్పాలో మీరే చెప్పండి?" అన్నాడు.

తాను అడిగిన ప్రశ్న తప్పు అని తెలుసుకున్న కౌసల్య "సారి" అన్నది.

"పరవాలేదండి. …'బై ద బై'...మా ఇంట్లో వాళ్ళు నా పెళ్ళికి అమ్మాయిని వెతుకుతున్నారు. నాకు మీరు బాగా నచ్చారు. మీకు నేను నచ్చుంటే మనం ప్రేమించి పెళ్ళి చేసుకోవటంలో తప్పు లేదు."

కౌసల్య ముఖం కోపంతో ఎర్ర బడింది.

“మీకు పర్సనాలటి పెరిగినంతగా బుద్ది పెరగలేదు. ఈ వయసులో పోయి ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నారు. …ఏది మంచిది- ఏది చెడ్డది అనే వివరం కూడా తెలుసుకోలేని 'టీన్ ఏజ్' పిల్లలే 'లవ్' చేస్తారు. ….ఇది కరెక్టేనా...మనకి సెట్ అవుతుందా? అని ఆలోచించ గలిగే వయసులో ఉన్న మీరు ప్రేమ కోసం తహతహ లాడటం చాలా అసహ్యంగా ఉన్నది….ఇకపోతే, నాకు పెళ్ళైపోయింది. స్కూలుకు వెళ్ళే వయసులో ఇద్దరు పిల్లలు ఉన్నారు" అని ఆపకుండా మాట్లాడిన కౌసల్య అతన్ని చూసి...'నాగరీకం తెలియని మనిషి" అని గొణుక్కుంది.

అతను నవ్వుతూ "ప్రశాంతంగా ఉండండి మాడం. మీ తమ్ముడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఒక ఏడాది నుండి మీరు ఉద్యోగానికి వెడుతున్నారు. మీ అమ్మ-నాన్నా ఇద్దరూ బ్యాంకులో పనిచేస్తున్నారు. మీరు ఉద్యోగం చేయాలన్న అవసరం మీ కుటుంబానికి లేదు. కానీ మీ ఇష్టం కోసం ఉద్యోగానికి వెడుతున్నారు. ఇకపోతే...మీ రాసి కన్య రాసి. మీ నక్షత్రం ఉత్తర-నాలుగో పాదం. లగ్నం...." అని అతను చెపుతూ వెడుతూంటే, అతన్నే గమనిస్తున్న కౌసల్యకు కోపం ఏక్కువ అయ్యింది.

"ఆపండి...మీరు రాజశేఖరే కదూ?.. ‘జాబిల్లి ఇంజనీరింగ్' కంపనీ యొక్క ప్రొడక్షన్ మేనేజర్...కరక్టే కదా....?"

అతను తలూపి వొప్పుకున్నాడు.

"నా గురించి ఎంక్వయరీ చేస్తున్నారా?" కౌసల్య మాటల్లో తీవ్రమైన కోపం.

"నో...నో...అదేం లేదు" నవ్వుతూ చెప్పాడు.

“మరి!...అమ్మా, నాన్నా చూసిన అమ్మాయి మంచిదేనా? లేక ప్రేమ పేరుతో ఎవరితోనైనా అడ్డ దిడ్డంగా తిరుగుతోందా అని తెలుసుకోవటానికే కాదా నన్ను వెంబడిస్తూ వచ్చారు" అని కోపంగా అడిగింది.

అతను మౌనంగా...దూరంగా వస్తున్న బస్సును చూస్తూ నిలబడ్డాడు.

'పెళ్ళికి ముందే నా గుణాన్ని సందేహించే మనిషినా నేను భర్తగా పొందబోతున్నాను?.. ‘కాబోయే అల్లుడు బంగారం' అని సర్టిఫికేట్ ఇచ్చిన తండ్రిపైన కోపం తెచ్చుకుంది.

తల్లి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది కౌసల్య.

"నీ ఫోటో చూసిన వెంటనే నువ్వు అతనికి బాగా నచ్చేశావు. సిగిరెట్లు, మందు లాంటి ఎటువంటి చెడు అలవాట్లు లేవుట. పెళ్ళికొడుకు పని చేస్తున్న కంపెనీకి వెళ్ళి నాన్న గారు ఎంక్వయరీ చేసొచ్చారు. దేవుడు నీకని రాసిన సంబంధం ఇదే నని మేము నమ్ముతున్నాము"

"పెళ్ళి కొడుకు అత్యంత నీచమైన గుణం కలవాడు అని చెప్పి ఈ పెళ్ళికొడుకును వదిలించుకోవాలి" మనసులోనే తీర్మానించుకునంది కౌసల్య.

“కౌసల్య గారు, నేను మిమ్మల్ని అనుమానించో, మీకు పరీక్ష పెట్టాలనో మీ వెనుక రాలేదు...మీరు రోజూ పేపర్ చదువుతారా?"

కౌసల్య అతనికి జవాబు చెప్పలేదు.

“పెళ్ళి రోజున ప్రేమించిన వాడితో వెళ్ళిపోయిన ఆడపిల్లల గురించి ఎన్నో వార్తలు వచ్చుంటాయి. పోయిన సంవత్సరం జూన్ నెల నా చెళ్ళెలు గురించిన వార్త వచ్చింది"

కౌసల్యకు ఏమీ అర్ధం కాలేదు. అయినా మౌనంగా అతను చెప్పేది వింటోంది.

అతను చెప్పటం తిరిగి ప్రారంభించాడు.

"నా చెళ్ళెలు పరమేశ్వరి తన పెళ్ళి రొజున ఆమెకు ఇష్టమైన వాడితొ వెళ్ళిపోయింది. దాని వలన మాకు జరిగిన అవమానం చాలా ఎక్కువ. పెళ్ళికి వచ్చిన వందలాది జనం ముందు మేము తల వంచుకోవలసి వచ్చింది. ఆ అవమానం తట్టుకోలేక మా నాన్నా, అమ్మా చాలా కుంగిపోయారు. చచ్చి పోదామని ఆలోచించడం మొదలు పెట్టారు. ఏలాగో వాళ్ళకు నచ్చ చెప్పి శాంత పరిచాను”

“పెళ్ళి ఏర్పాట్లు జరగటానికి ముందైనా నా చెళ్ళెలు నా దగ్గర తన ప్రేమ గురించి చెప్పుండొచ్చు. ఊళ్ళో వాళ్ళ ముందు తల దించుకోవలసిన అవసరం వచ్చేది కాదు. ఒక వేళ నా చెళ్ళెలు తన ప్రేమ గురించి చెప్పున్నా అమ్మ గాని, నాన్నా గాని, నేను గాని ఆమె ప్రేమను ఎదిరించే వాళ్ళమే కానీ ఆమె ప్రేమను సమ్మతించే వాళ్లం కాదు. అది వేరే విషయం"

“మా ఇంట్లో జరిగిన ఆ సంఘటన తరువాత, నెనొక నిర్ణయానికి వచ్చాను. ఇలాంటి సంఘటన మీ ఇంట్లో జరగకూడదు. అందుకనే మీరు ఇంకెవరినైనా ప్రేముస్తున్నారని తెలిస్తే...మీ ఇద్దరినీ కలపటానికి నా వంతు సహాయం చేద్దామని మిమ్మల్ని వెంబడించాను. ఇప్పుడు బాగా తెలుసుకున్నాను "

"ఏం తెలుసుకున్నారు?"

"ఇంతవరుకు మీరు ఎవరినీ 'లవ్' చేయలేదు. ఇక మీదట చేద్దామనే ఉద్దేశమూ లేదు"

"ఇంకా"

"మీకు ‘ప్రేమ’ అనే పదమే నచ్చదు"

కౌసల్య ముఖం చిట్లించుకుంది.

"ప్రేమ అనే పదం నచ్చకపోవటానికి కారణం, నేను ప్రేమలో ఓడిపోయుంటాననే అనుమానం మీకు కలగలేదా?"

"కలగలేదు. దానికి కారణం, మీ స్నేహుతురాలు స్వప్న. ప్రేమ అనే పేరుతో ఒకడు అమెను మొసగించి, వదిలి వెళ్ళిపోయాడు. పుట్టింటికి తిరిగి వెళ్ల లేక, ఎవరి తోడూ లేకుండా, ఒక ఆడపిల్లకు తల్లిగా ఒంటరిగా నిలబడుంది"

"ఒక వేళ ఇప్పుడు నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్ళి చేసుకుంటాను అని చెబితే...మీ రియాక్షన్?"

"ఖచ్చితంగా మీకు సహాయపడతాను. అతను మంచివాడుగా ఉండే పక్షంలో, మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడతాను. మంచివాడు కాకపోతే మీకు మంచి సలహా ఇచ్చి మిమ్మల్ని మంచి దారిలో పెట్టటానికి ప్రయత్నిస్తాను"

"ఆ తరువాత తప్పించుకున్నామురా, బ్రతికిపోయామురా అనుకుంటూ వెళ్ళిపోతారు...అంతే కదా?"

"అలా ఎన్నడూ జరగదు...అప్పుడు కూడా మిమ్మల్నిపెళ్ళి చేసుకోవటానికి నేను రెడీ"

"ఎంతో మంది ఆడపిల్లలు ప్రేమ అనే పదంతో జీవితాన్నే పోగొట్టుకుని ఒంటరిగా నిలబడుండటం చూస్తుంటే, మగవాళ్లను, చీదరించుకోవాలని అనిపిస్తోంది" అన్నది కౌసల్య.

"అందరి మగాళ్లనూ తప్పుగా అంచనా వేయకండి..."

"అర్ధమయ్యింది" అంటూ చిన్నగా నవ్వింది.

అతని మీద మొదట్లో ఏర్పడ్డ కోపం ఇప్పుడు తగ్గింది.

“ఇతను అనుమానపు మనిషి కాదు. తన ఇంట్లో జరిగిన సంఘటన లాగా, ఇంకెవరి ఇంట్లోనూ జరగ కూడదు అనే మంచి ఆలొచన కలిగినవాడు, దాంతో పాటు ఆడపిల్లల మనోభావాలకు మర్యాద ఇచ్చేవాడు” మనసులోనే అనుకున్నది కౌసల్య.

"కౌసల్య గారూ...ఇప్పుడు ఏమనిపిస్తోంది?" ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ అడిగాడు.

"మొసగించ లేడు అనే పూచి దొరికితే, పెద్దల ఆసీస్సులతో ప్రేమించుకో వచ్చు..."

వెంటనే అతను కౌసల్య కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఆ క్షణం కౌసల్యకు తాను ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు అనిపించింది.

"కౌసల్య గారు...నిజంగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరూ నన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతున్నాను….మనం ప్రేమించుకుందామా?" అంటూ గొణిగాడు.

"ప్రేమ...ఇంత మధురమా" అన్న భావన కౌసల్యలో కలిగింది.

"ఇంకో కొన్ని రోజుల్లో పెద్దల అంగీకారంతో మన పెళ్ళి జరిగిన తరువాత మనం ప్రేమించుకొవచ్చు…ప్రేమించుకుందాం" అని అంటూ అతని చెతుల్లో ఉన్న తన చేతిని మెల్లగా అతని దగ్గర నుండి విడిపించుకుంది కౌసల్య.

“ష్యూర్” అంటూ అతను కన్ను గీటేడు.

ఆనందమయమైన వాళ్ళిద్దరి ప్రేమ కొసం భవిష్యత్ కాలం ఎదురుచూస్తోంది.

*********************************************సమాప్తం********************************************

28, డిసెంబర్ 2019, శనివారం

ఎవరా తొమ్మిదిమంది?...(మిస్టరీ)



                                                ఎవరా తొమ్మిదిమంది?


ఎవరా తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు...?


వీరు భారతదేశంలో నియమించబడిన రహస్య సంఘంలోని వ్యక్తులు అని మాత్రం తెలుసుకున్నారు. శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన ఈ రహస్య సంఘంలోని వారు మంచికి ప్రతినిధులు మరియు ఉన్నత వ్యక్తులే కాకుండా వీరు ప్రపంచవ్యాప్తంగా పంపబడ్డారని పశ్చిమ దేశాలు భావిస్తూ, వారెవరో తెలుసుకోవటానికి ఏన్నో పరిశోధనలు జరిపారు. ఎన్ని పరిశోధనలు జరిపినా వారెవరెవరో తెలుసుకోలేకపోవటం వలన ఆ విషయం ఇప్పటికీ ఒక అతి పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది.


ఈ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు గురించి మొదట ‘టాల్బట్ ముండి’ అనే ఒక రచయత 'తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు’ అనే పేరుతో రాసిన తన నవలలో (పేర్లు లేకుండా) పేర్కొన్నాడు. ఈ నవలలోని ఆ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు…సాంకేతిక సమాచారాన్ని అభివృద్ది చేస్తూ, అవి దుష్టుల చేతిలొకి వెళ్ళకుండా, అభివృద్ది చేసే సాంకేతిక సమాచారాన్ని పరిరక్షించే పనికి క్రీస్తు పూర్వం 273లో మౌర్య సామ్రాజ్యాధిపతి అశోకుడు తొమ్మిదిమంది వ్యక్తులను రహస్యంగా ఎన్నుకుని, అంతే రహస్యంతో రహస్య సంఘం స్థాపించాడని ఆ నవల రచయత రాసాడు.

                                                             ఆశోక చక్రవర్తి

పురాణం ప్రకారం మౌర్యసామ్రాజ్యాధిపతి అశోకుడు తన తాత, ముత్తాతల లాగే మౌర్య సామ్రాజ్య పొడిగింపునకు కలింగ సామ్రాజ్యంపై(అంటే అప్పటి కలకతా నుండి మద్రాసు వరకు) దండయాత్ర చేశాడు. కలింగ సామ్రాజ్య వీరుల ప్రతిఘటన ఎక్కువగా ఉండటంతో అశోక చక్రవర్తి ఆ యుద్దంలో లక్షమంది వీరులను కోల్పోయాడు. ఆ ఊచకోతను చూసి తట్టుకోలేక అశోక చక్రవర్తి అహింసా మార్గాన్ని ఎన్నుకొన్నాడు. ఆ ఊచకోత తరువాత అశొక చక్రవర్తి బౌద్దమతం పుచ్చుకున్నాడు.


ఆ తరువాతే యుద్దాలు జయించటానికి, సామ్రాజ్యాలను విస్తరింపచేసుకోవడానికి మనిషి తన తెలివిని, జ్ఞానాన్ని అరిష్టాలకు ఉపయోగిస్తున్నాడని, అందువలన తన పరిపాలనా కాలానికి గత చరిత్రలోనూ మరియు తన కాలంలోనూ అభివృద్ధి చేసిన/చెందిన సహజ శాస్త్రాన్ని గోప్యంగా ఉంచాలని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అంతే కాకుండా రాబోవు కాలంలో, అంటే రాబోవు 2000 సంవత్సరాలలో అన్ని రంగాలలో జరుపబోయే పరిశోధనలు, పరిశోధనల వివరాలూ అధ్యాత్మిక పారవశ్యంలోనూ, అతీంద్రియ విషయాలను నమ్ముతారో వారిచే గోప్యతగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు. అలాంటివారిని తొమ్మిది మందిని ఎన్నుకున్నాడు.

                                                          Pope Sylvester II

వారికోసం ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రహస్య సంఘమే భూమి మీద ఉన్న అత్యంత రహస్యమైన సంఘంగా చెప్పబడుతూ, ఆ సంఘంలోని వారినే తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులుగా గుర్తించారు. ఎవరైనా ఊహించుకోవచ్చు. 2000 సంవత్సరాల పరిశోధనలు, అధ్యయనాలు మరియు పత్రాలు ఆ తొమ్మిది మందికి మాత్రమే తెలిసున్నదంటే వారు ఎంత అసామాన్యమైన, ప్రాముఖ్యమైన మరియు జ్ఞానం కలిగిన వ్యక్తులో. వీరి లక్ష్యం ఏమై ఉంటుంది? మానవజాతి నాశనానికి అభివృద్ది చేయబడ్డ పద్దతులు అర్హత లేని వారి చేతుల్లోకి వెళ్ళకుండా చూడడం, మానవజాతి శాంతియుతంగా జీవించేందుకు కావలసిన జ్ఞానాన్ని అందివ్వడం. ఈ సంఘంలోని సభ్యుల సహ ఎంపిక ప్రాచీన పరిశోధనలనూ, అధ్యయనాలనూ మరియు పత్రాలను సంరక్షించేందుకు మాత్రమే.

                                                          జగదీష్ చంద్రబోస్

ఈ తొమ్మిదిమందికీ ఒక ప్రత్యేకతమైన బాధ్యత పుస్తక రూపంలో ఇవ్వబడింది. ఈ తొమ్మిదిమంది చేయవలసినదల్లా ఆ పుస్తకాలలో రాయబడ్డ ప్రమాదకర విషయాలు రక్షించబడుతూ మరియు వారు మానవజాతికి సహాయపడే పరిశోధనలను చేర్చుకుంటూ వెళ్ళాలి. ఈ తొమ్మిది పుస్తకాలూ 9 రంగాలకు చెందినవి.

                                                             విక్రం సారాభాయ్

ఆ పుస్తకాలు:

గ్లోబెల్స్ ప్రచారం: మనసులతో చేయు యుద్దాల గురించిన సమాచారం.

మనస్తత్వ శాస్త్రం: మరణ స్పర్శ్ తో కూడిన సమాచారం.

అతిసూక్ష్మ జీవశాస్త్ర సమాచారం.

రసవాదం.

సమాచారం: అంతరిక్ష శాస్త్రం, అనంతాకాశం మరియు కాలప్రయాణాలతో, అంతరిక్ష గ్రహవాసులతో కూడిన సమాచారం.

భూమ్యాకర్షణ మరియు అభూమ్యాకర్షణ సమాచారం.


యంత్రాలు, విమానాలతో కూడిన సమాచారం.

కాంతి, కాంతి వేగం మార్చే సాంకేతికంతో కలిసి కూడిన సమాచారం.

సమాజ శాస్త్రం, రాజ్యాల ఉత్తాన పతనాల సూత్రాలతో కూడిన సమాచారం.

1960లో లూయస్ పవెల్స్ మరియు జాకస్ బర్గర్ లు ఈ తొమ్మిది అపరిచిత వ్యక్తుల గురించి తమ మార్నింగ్ మెజీషియన్స్ అనే పుస్తకంలో వ్రాశారు. పవెల్స్ మరియు బర్గర్ లు ఈ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తుల విషయం మొదట 1860లో భారతదేశంలో మరియు తహిటిలో పనిచేసిన ఫ్రెంచ్ జడ్జి అయిన లూయస్ జాకొల్లియట్ చెప్పినట్టుగా వెళ్ళడించారు. వీరి రచనల్లో పవల్ మరియు బర్గర్ లు ఈ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు అప్పుడప్పుడు బాహ్య ప్రపంచంలోని మేధావులకు దర్శనం ఇస్తారని చెప్పారు. అలానే పోప్ రెండవ సిల్విస్టర్ కు కనిపించి అతీంద్రియ శక్తులు మరియు మాట్లాడే రోబోట్ ను బహుమతిగా ఇచ్చారని చెపుతారు.

భారత శాస్త్రవేత్తలు జగదీష్ చంద్రబోస్ మరియు విక్రం సారాభాయ్ ఈ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తుల వంశానికి చెందిన వారేనని చెబుతారు. కానీ దీనికి తగిన సాక్ష్యం పెద్దగా లేదు. కానీ మొదటి తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తుల గురించి పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయట.

Images Credit: To those who took the original photos. ***********************************************************************************************

25, డిసెంబర్ 2019, బుధవారం

శపించబడ్డ గ్రామం...(మిస్టరీ)



                                                     శపించబడ్డ గ్రామం

రాజస్తాన్ లోని జైసల్మేర్ జిల్లాలోని కుల్ధర. ఇది జైపూర్ పట్టణానికి పడమటి దిక్కులో సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని చుట్టుపక్కల మరో 83 గ్రామాలు ఉండేవిట. ఒకప్పటి సుభిక్షమైన, కళకళలాడే ఈ గ్రామం ఇప్పుడు పరిత్యజించిన ప్రదేశంగా, ఎడారిగా మారిందట.

ఒకప్పుడు, అంటే 1825 వరకు కుల్ధర గ్రామం అత్యంత సంపన్న గ్రామంగా ఉండేది. అక్కడ 1500 పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. ఎడారిగా ఉన్నా, తమ గ్రామంలోనూ కొత్త సాంకేతికంతో ఎక్కువ నీరు కావల్సిన గోధుమ పంటను పండించేవారు. ఎడారిలో, అందులోనూ నీరు ఎక్కువ కావలసిన పంటైన గోధుమను ఎలా పండిస్తున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. ఆ పంట వలనే వారంతా సంపన్నులయ్యేరట.

500 సంవత్సరాలుగా నివాసముంటున్న పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు 1825 వ సంవత్సరం ఒక రోజు రాత్రి నుండి కనిపించకుండా పోయారట. కుల్ధర గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా ఆ గ్రామానికి చుట్టూ ఉన్న 83 గ్రామ ప్రజలూ మాయమయ్యారట. వారు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏమైపోయారు అనేది ఈనాటికీ మిస్టరీగానే ఉన్నది. ఎందుకంటే అక్కడ ఎటువంటి భూకంపమూ రాలేదు. అగ్నిపర్వతమూ బద్దలవలేదు.

అక్కడి ప్రజలు మాయమవటానికి కారణాన్ని ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. కానీ వారు మాయమవటానికి కొన్ని కథలు చెప్పుకుంటారు. అందులో చాలామంది చెప్పేది ఒకే కథ. అప్పట్లో జైసల్మేర్ జిల్లాను పరిపాలిస్తున్న ప్రభుత్వ మంత్రి సలీం సింగ్ ఆ గ్రామానికి వచ్చినప్పుడు, ఆ గ్రామ పెద్ద యొక్క అందమైన కుమార్తెను చూసి ఆమెను పెళ్ళాడ దలచి, ఆ మాటను ఆమె తండ్రి, అప్పటి గ్రామ పెద్దకు చెప్పి, ఒకవేళ పెళ్ళికి అంగీకరించని పక్షంలో ఆ గ్రామ ప్రజలందరూ ప్రభుత్వానికి అత్యధిక పన్ను కట్టాలని ఆజ్ఞ వేసేడట. వారు అధిక పన్ను కట్టక, పెళ్ళికి అంగీకరించకపోవడంతో ఆ గ్రామ ప్రజలను కృరమైన పద్దతులతో బాధలు పెట్టాడట. అనైతికంగా ప్రవర్తించాడట. అందువలన అక్కడి ప్రజలు కోపంతో ఆ గ్రామాలు వదిలి వెళ్ళారట.


అసలు కథ.

గ్రామాన్ని విడిచి వెడుతున్న పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు శపించి వెళ్ళారట. 'మేము శుభిక్షం చేసిన ఈ గ్రామంలో మేము తప్ప ఇంకెవరూ నివశించకూడదు అని. ఈ శాపాన్ని ఖాతరుచేయని కొందరు ఆ గ్రామానికి వచ్చి పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు వదిలిపెట్టిన ఇళ్ళను స్వాధీనం చేసుకుని అక్కడ నివశించడానికి ప్రయత్నించారట. కానీ అలా చేసిన వారెవరూ కొన్ని రోజుల కంటే బ్రతకలేదట. కొద్ది సంవత్సరాల తరువాత ఈ శాపం గురించి తెలిసిన కొంతమంది ధైర్యం చేసి ఈ గ్రామానికి వచ్చారట. వారందరూ కూడా కొద్ది రోజులలోనే మరణించారట. అప్పటి నుండి ఈ గ్రామానికి రావడానికి అందరూ భయపడ్డారు. ఎవరూ ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. ఆ గ్రామంలో చనిపోయిన వారందరూ ఇంకా అక్కడే సంచరిస్తున్నారట.


ఆ గ్రామానికి వచ్చి నివసిద్దామనుకునే వారు కొన్ని రోజులకే చనిపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

విషయం తెలుసుకునేందుకు ప్రముఖ శాస్త్రవేత్తలు ఆ గ్రామానికి వచ్చి పరిశోధనలు నిర్వహించారు. అందరూ అక్కడ రకరకాల శబ్ధాలు వినబడుతున్నాయని, ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తుందని తెలిపారు గానీ అవేమిటో చెప్పలేకపోయారు. ఒక్క రాత్రి అక్కడ ఉండటం మంచిది కాదని, ప్రాణాంతకమని మాత్రం తెలిపారు. 2013లో ఢిల్లీకి చెందిన పారానార్మల్ సొసైటీ వారు ఆ గ్రామంలో ఏదో అసాధారణమైన శక్తి ఉన్నదని చెబుతూ అదేమిటో పూర్తిగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. గౌరవ్ తివారీ నాయకత్వంలో 18 మంది కలిగిన రీసెర్చ్ గ్రూప్, ధైర్యమున్న 12 మంది సాధారణ మనుషులను తీసుకుని కుల్ధర గ్రామానికి వెళ్ళి ఒక రాత్రంతా గడిపి నిజమేమిటో తెలుసుకురావాలని ఆ గ్రామానికి వెళ్ళారు.


ఆ రాత్రంతా వింత చర్యల అనుభవంతో భయానక గంటలు గడిపారు. అత్యంత ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలతో వెళ్ళిన వారికి ఆ గ్రామంలో ఏవో కదులుతున్న నీడలూ, మాటలూ, అరుపులు, నవ్వులూ, ఏడుపులూ వినిపించడమే కాకుండా వారి కార్ల మీద చేతి ముద్రలు కనిపించాయట. వెళ్ళిన కొంత మందికి తమల్ని ఎవరో తాకిన అనుభవం కలిగిందట. వారి దగ్గరున్న పరికరాలలోని కె-2 మీటర్ మూలం అక్కడి వాతావరణ ఉష్ణొగ్రతని రికార్డు చేశారు. కొన్నిచోట్ల 41-C గానూ, కొన్ని చోట్ల 31-C గానూ చూపించిందట. వాడిన లేజర్ పరికరంతో కదిలే నీడలను చూశారట. అక్కడ నుండి తిరిగి వచ్చిన రీసెర్చ్ గ్రూపులోని కొందరు "ఇంత భయానకమైన రాత్రిని మేము ఎప్పుడూ గడపలేదు" అని తెలిపారట.


1826 నుండి ఇప్పటి వరకూ ఆ 85 గ్రామాలూ ఖాళీగానే ఉన్నాయి. ఆనాతి ఇళ్లు శిధిలాలు తప్ప అక్కడ ఇంకేమీ లేవు. పల్వాలీ కుటుంబాలు రక్షాబంధన్ రోజున గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళినందువలన దేశంలో పలుచోట్ల నివశిస్తున్న కొన్ని పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు రక్షాబంధన్ పండుగను జరుపుకోరట.

Images Credit: To those who has taken the original photos. ***************************************************************************************************

23, డిసెంబర్ 2019, సోమవారం

చదివింపు...(కథ)




                                                       చదివింపు...(కథ)

అఫీసులోని స్నేహితులందరికీ పెళ్ళి పత్రిక ఇచ్చి ఆహ్వానించిన సురేందర్ కళ్ళు ఆఫీసు ప్యూన్ ఆంజినేయులు ని వెతుకుతున్నాయి.

"మీకు తెలియదా?...అతను ఆఫీసు స్నెహితుల ఇంటి ఫంక్షన్లకు, పెళ్ళిల్లకూ రాడు. ఎందుకు అనవసరంగా ఒక పత్రికను 'వేస్టు చేయాలి?" అన్నాడు కొలీగ్ గంగాధరం.

అప్పుడే ప్యూన్ ఆంజినేయులు అక్కడికి వచ్చి నిలబడ్డాడు.

సురేందర్ ఒక పెళ్ళి పత్రిక తీసి, దాని మీద అతని పేరు రాసి అతనికి ఇచ్చాడు.

"కచ్చితంగా ఫ్యామిలీతో రావాలి. నా పెళ్ళికి రాలేదంటే...తరువాత మీతో మాట్లాడటం మానేస్తా!"

"వద్దు సార్...మీ పెళ్ళికి కచ్చితంగా వస్తాను" చెప్పాడు ఆంజినేయులు. కానీ అతని మాటల్లో ఉత్సాహం లేదు.

కల్యాణ మండపం ముందు ….ఫ్లెక్సీ బ్యానర్ పై తలతల లాడుతున్నారు కొత్త దంపతులు.

వాళ్ళ కంపెనీ ఏం.డి, జి.ఏం., ప్రొద్దున్నే వచ్చి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపి వెళ్ళిపోయారు.

కల్యాణమండపం నిండిపోయింది. ఇంతమంది పెళ్ళికి వస్తారని సురేందర్ అనుకోలేదు. అంతమంది జనం ఉన్నా సురేందర్ కళ్ళు ప్యూన్ ఆంజినేయులు ని వెతుకుతున్నాయి.

అదిగో...అతను వచ్చాడు. అతన్ని చూసిన వెంటనే సురేందర్ కి సంతోషం కలిగింది. తిన్నగా సురేందర్ దగ్గరకు వచ్చిన ప్యూన్ ఆంజినేయులు, సురేందర్ కి ష్యేక్ హాండ్ ఇచ్చి,శుభాకాంక్షలు తెలిపి, చదివింపు కవరును జాపాడు.

“భోజనం చేసిన వెంటనే మీరు వెళ్ళిపోకూడదు. కొంచంసేపు ఉండండి..." అన్నాడు సురేందర్.

రెండు గంటల తరువాత సురేందర్ కి కొంచం రెస్టు దొరికింది. తిన్నగా ప్యూన్ ఆంజినేయులు ఉన్న చోటుకు వచ్చాడు.

"మీరు వచ్చినందకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ, మీ ముఖం వాడిపోయి ఉందేమిటి...ఎందుకు? ఎవరైనా ఏమైనా అన్నారా?" అడిగాడు.

"అయ్యయ్యో...అదంతా ఏమీ లేదు సార్. నేను ఆఫీసు స్నెహితుల ఇంటి ఫంక్షన్లకు, పెళ్ళిల్లకూ లేక ఇంకేదైనా పార్టీలకూ వెళ్లను. ‘ఎందుకని?’ అని చాలాసార్లు మీరు నన్ను అడిగారే...? ఇప్పుడు చెబుతాను. ఆఫీసులో పనిచేస్తున్న అందరూ నాకంటే జీతం ఎక్కువ తీసుకునే వారే. వాళ్ళ తాహతకు వాళ్లు పెద్ద పెద్ద చదివింపులు, ఖరీదైన బహుమతులు ఇస్తారు. నేను ఎక్కువగా ఇవ్వగలనా? మహా ఎక్కువగా ఇస్తే ఐదు వందలు. అంతకంటే ఎక్కువ ఇవ్వలేను.

అలా అంత తక్కువ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్లో నేను సహజంగా ఉండలేక పోతున్నాను. నేను పెద్ద బహుమతులు ఇవ్వలేకపోతున్నానే అన్న ఇన్ ఫీరియర్ కాంప్లెక్స్ నన్ను సిగ్గున పడేస్తోంది. నన్ను ఫంక్షన్ కు పిలిచిన వాళ్ళు అలా అనుకోరని నాకు తెలుసు. కానీ నాలో అలా ఒక మనోభావం. మిగిలిన వాళ్ళలాగా ఫ్రీగా ఉండలేకపోతున్నాను. అందుకనే ఎక్కడికీ వెళ్ళకుండా ఉండిపోతాను. ఈ పెళ్ళికి కూడా మీకొసమే వచ్చాను. మీ మనసు కష్టపడకూడదని వచ్చాను"

అతను చెప్పింది విని నవ్వాడు సురేందర్.

"ఇదే కారణమా? …..మీ ఆలొచన చాలా తప్పు. పెళ్ళికి స్నేహితులనూ, బంధువులనూ, తెలిసిన వాళ్లనూ ఎందుకు పిలుస్తున్నాం? అందరూ వచ్చి నోరారా- మనసారా దీవిస్తే మనం బాగుంటాం...మన జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతాం. కల్యాణ వేదిక అనేది అభిమానాన్ని, ప్రేమను బయటకు చూపాల్సిన చోటు. ఆస్తి, అంతస్తులను చూపించే చోటు కాదు"

అతను చెబుతుంటే అతన్నే చూశాడు ఆంజినేయులు.

"ఇదిగో నా పెళ్ళికి ఇంతమంది వచ్చారే, వాళ్ళందరూ నిజంగా నా కోసమే వచ్చారా? లేదు...నా పదవి చూసి వచ్చారు! కానీ నాకోసం వచ్చింది మీరు మాత్రమే...ఏదీ ఆశించకుండా...నేను బాగుండాలని, సంతోషంగా జీవించాలని ప్రేమతో ఆశీర్వదించటానికి వచ్చారు. ఈ విషష్, ఆశీర్వాదం డబ్బు కంటే చాలా గొప్పవి. వెలకట్టలేని బహుమతి, అతిపెద్ద చదివింపు. ఇదే నాకు కావాలి. నేను మాత్రం కాదు...ఇంటి విషేషాలకు పిలిచే అందరూ ఇలాగే ఆలొచిస్తారు.. ఇలాగే ఎదురు చూస్తారు...." ఆ మాటలు విన్న ప్యూన్ ఆంజినేయులు సిగ్గుతో తలవంచుకున్నాడు. అతన్ని గట్టిగా కౌగలించుకున్నాడు.

"మీరూ, మీ భార్య ఎటువంటి సమస్యలూ లేకుండా వందేళ్ళు సంతోషంగా జీవించాలి" ఎమోషనల్ అయిన ప్యూన్ ఆంజినేయులు రెండో మారు అతన్ని విష్ చేశాడు.

“వచ్చే వారం సేల్స్ డివిజన్లో పనిచేస్తున్న ప్రభాకర్ ఇంటి విషేషం ఉంది...దానికి వెళ్ళాలి" అనుకుంటూ అక్కడ్నుంచి బయలుదేరాడు ప్యూన్ ఆంజినేయులు.

*******************************************సమాప్తం**********************************************

21, డిసెంబర్ 2019, శనివారం

రాళ్ళే పుస్తకాలు...(ఆసక్తి)




                                                రాళ్ళే పుస్తకాలు...(ఆసక్తి)

శాసనం (Epigraphy లేదా Inscription) అంటే పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో కాగితంతో తయారుచేసిన గ్రంథాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు తమ రాజ్యపు అధికారిక శాసనాలను 'రాళ్ళ పై, రాతిబండలపై, రాగిరేకులపై చెక్కించి, బధ్రపరిచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటలనే శాసనం అనేవారు.


ఆ తరువాత శిలాశాసనాలు తగ్గిపోయి లోహ శాసనాలు ప్రాధాన్యత వహించాయి. సంఖ్యాపరంగా చూస్తే శిలాశాసనాలకన్నా ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ వీటికి చారిత్రిక ప్రాధాన్యత చాలా ఎక్కువ. పల్లవ, కదంబ, గాంగ, చాళుక్యాది వంశాల చరిత్ర ప్రధానంగా లోహ శాసనాలపై ఆధారపడి ఉన్నాయి. మంత్రతంత్రాలకు సంబంధించిన వివరాలేవో వాటిపై వ్రాసి ఉన్నాయని ప్రజలు భావించడంతో చాలా శాసనాలు వెలుగులోకి రాలేదు. వీటిలో నిధినిక్షేపాలున్న ప్రదేశాల దారిని చూపే రహస్యం ఉండవచ్చని పలువురు భావించి ప్రభుత్వానికి ఇవ్వక తమ వద్దే దాచుకోవడంతో ఎంతో చరిత్ర కాలగర్భంలోనే ఉండిపోయింది. కొందరు తామ్ర శాసనాలను కరిగించి ఇంటికి ఉపయోగించే చెంబులు, తపేలాలు, గుండిగలు వంటివి తయారుచేసుకున్నారు. వీటివల్ల ఎంతో విలువైన చారిత్రక సమాచారం నశించిపోయింది.


మాండలే ఒక బర్మా పట్టణం. ఇది రంగూన్ తర్వాత బర్మాలో రెండవ పెద్ద పట్టణం. మాండలే బర్మా దేశ ఈశాన్యదిశలొ 240 మీటర్ల వైశాల్యం కలిగిన పర్వతం అనేక ఆలయాలకు, మఠాలకు నిలయం. బర్మా దేశంలోని బౌద్దమతస్తులకు ఇది ఒక పుణ్యక్షేత్రం. పర్వత శిఖరంపైన ఉన్న ఆలయం 'కోరుకున్నేవన్నీ వరాలుగా ఇచ్చే ఆలయం' గా ప్రసిద్దిచెందింది. 1857లో బర్మాను పాలిస్తున్న రాజు మిన్ డాన్ మిన్ శాంతి కాముకుడు, అహింసావాది. బుద్దుని బోధనలు తరతరాలకూ నిలిచిపోవాలని, భావితరాలకోసం ఏదో ఒకటి చేయాలని సంకల్పించుకున్నాడు. బుద్దుని బోధనలను లోహ శాసనాలపై రాయించి భద్రపరిచినా అవి నశించిపోతాయని గ్రహించి, వాటిని భారీ రాతి దిమ్మలపై రాయించి, భద్రపరచాలని నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలోనే బర్మాపై బ్రిటీష్ సేనల దండయాత్ర మొదలయ్యింది. దండయాత్రలో తాను ఓడిపోయినా బుద్ధుని బోధనలతో ఉండే భారీ రాతి దిమ్మెలకు ఎటువంటి హానీ జరగకూడదనుకుని తన పని మొదలుపెట్టాడు.


ఒక మీటర్ పొడుగు, ఒకటిన్నర మీటర్ వెడల్పు, 13 సెంటీమీటర్ల మందం ఉన్న పాలరాయి దిమ్మెలను తెప్పించాడు. వాటిమీద బుద్ధుని బోధనలను చెక్కించాడు. మొత్తం 729 పాలరాతి దిమ్మెలపై చెక్కారు. ఒక పాలరాతి దిమ్మెపై మిగిలిన 729 రాళ్ళు ఎలా ఉనికిలోకి వచ్చాయన్న విషయాన్ని తెలియజేసే సమాచారాన్ని చెక్కించాడు. అలా మొత్తం 730 రాతి పుస్తకాలు తయారయ్యాయి.


1860 లో రాతి పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. దీనికొసం తన రాజభవనం దగ్గరే ఒక అతిపెద్ద షెడ్ వేయించాడు. అంతకుముందు తాళపత్రాలలో ఉన్నటువంటి బుద్ధుని బోధనల మూలమును సీనియర్ మఠాధిపతులు, అధికారులు శ్రద్ధగా, క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట ఒక లేఖరి జాగ్రత్తగా కాపీ చేసి ఒక శిల్పికి అందించాడు. ఆ శిల్పి బుద్ధుని బోధనలను పాలరాతి మీద చెక్కడం జరిగింది. ఒక్కొక్క రాతి మీద 80 నుండి 100 పంక్తుల చొప్పున రాతికి ఇరువైపులా బర్మా లిపితో చెక్కబడింది. పంక్తులను బంగారు రేకుతో నింపాడు.


ఒక్కొక్క పాలరాతి పుస్తక దిమ్మెకు ఒక గుడి కట్టించి, అందులో వాటిని ఉంచాడు. 1860లో ఈ గుడులను కట్టటం మొదలుపెట్టారు. గుడి గోపురాలను 1862లో ముగించారు. 1868 మే నెల నుండి పర్యాటకులను అనుమతించారు. ఈ గుడులను 3 వరుసలుగా కట్టారు. మొదటి వరుసలో 42 గుడులు, రెండవ వరుసలో 168 గుడులు, మూడవ వరుసలో 519 గుడులు నిర్మించారు. వీటికి దక్షిణ దిశలో ఒకటి కట్టి అందులో ఈ గుడి సమాచారమును చెక్కిన పాలరాతి దిమ్మెను ఉంచారు. దీనితో ఆ ఆలయంలో మొత్తం 730 గుడులయ్యాయి. ఒక్కొక్క గుడి మీద బంగారు, వెండి వజ్రాలు, వైఢూర్యాలు ఉంచారు.


1885లో బ్రిటీష్ సేనలు బర్మాపై దాడిచేసి ఈ చోటుని కూడా ఆక్రమించాయి. బౌద్ధమత మఠాదిపతులును కూడా అనుమతించలేదు. అప్పుడు బ్రిటీష్ ను పరిపాలిస్తున్న విక్టోరియా మహారాణి అన్ని మతాలను గౌరవించాలని, వారి ఆలయాలకు, మఠాలకు ఎటువంటి నష్టం జరగకూడదనే గట్టి శాసనం బ్రిటీష్ సేనాధికారులకు ఇచ్చిందని తెలుసుకున్న బర్మా బౌద్ధ మఠాధిపతులు, విక్టోరియా మహారాణికి ఈ ఆలయాన్ని వారి సేనలు ఆక్రమించాయని తెలియజేశారు. వెంటనే ఆ ఆలయం నుండి సేనలను తిరిగి రమ్మని ఆమె శాసించింది. కానీ అప్పటికే ఆలయంలోని గుడులమీద ఉన్న విలువైన వస్తువులను వారు అపహరించారు. పాలరాతి దిమ్మెలను పగులకొట్టలేకపొయారు. మహారాణి ఆజ్ఞమేరకు బ్రిటీష్ సేనలు ఆ ఆలయాన్ని వదిలిపెట్టి వచ్చారు. నాశనం చేయబడ్డ ఈ ఆలయాన్ని 1913లో సరిచేశారు. 2013లో యునెస్కోవారు ఈ ఆలయాన్నీ, ఆలయంలో ఉన్న పాలరాతి దిమ్మెలను ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తకాలుగా గుర్తించారు.

Images Credit: To those who took the original Photos.
************************************************************************************************

17, డిసెంబర్ 2019, మంగళవారం

అలల రహదారి...మిస్టరీ



                                                         అలల రహదారి

అలలు ఏర్పరచిన రహదారి - రోజుకు రెండుసార్లు, కేవలం ఒక గంట మాత్రమే తెరుచుకుంటుంది.

ఫ్రాన్స్ దేశంలో నాయర్మౌటియర్ అనే ద్వీపానికీ, వాండీ అనే నగరానికీ మధ్యవున్న రెండు సముద్ర తీరాలనూ కలుపుతూ సముద్రపు అలలు ఏర్పరచిన రహదారే 'పాసేజ్ డు గాయ్స్’ అనే రహదారి.


పూర్వం ఇటు నుండి అటు వెళ్ళటానికి పడవ మాత్రమే అధారం. కానీ 18 వ శతాబ్ధంలో ఒక రోజు సముద్రం విడిపోయి ఆ రెండు ఊర్లకూ ఒక రహదారి ఏర్పరచింది. అలా ఎందుకు ఏర్పడిందో తెలియని ప్రజలు మొదట ఆశ్చర్యపోయినా, క్రమేపీ ఆ రహదారిని వాడుకునే వారు. కానీ రెండుగా విడిపోయిన నీరు, ఒక గంట తరువాత ఆ రహదారిని మూసేస్తూ కలిసిపోయేది. అలా రోజుకు రెండుసార్లు మాత్రమే ఒక గంటో లేక రెండు గంటలో దారి వదిలేది. ఈ విషయం తెలియక అప్పట్లో చాలామంది ప్రజలు ఆ రహదారి గుండా వెళుతుంటే, ఆకస్మికంగా సముద్రపు అలలు ఒకటైపోయి, ఆ దారిని మూసేసేవి. అదే సమయాన ఆ రహదారిలో వెళుతున్న ప్రజలు ఆ అలలలో కొట్టుకుపోయేవారు.


నాగరికత పెరుగుతున్నకొద్దీ ఈ రహదారి ఏర్పడటం, మూసుకుపోవడంతో పాటూ అది ఎంత సమయంలో జరుగుతోంది అనేది కూడా లెక్కలు కట్టి, ప్రమాదం లేని సమయాలలో మాత్రమే ఈ రహదారి వాడేవారు. ఒక్కోసారి వారి లెక్కలు తప్పి మనుష్యులు కొట్టుకెళ్ళటం జరిగేది.

ఇలా సముద్రంలో రహదారి ఏర్పడుతోందని 1701 లో మొదటిసారిగా చిత్రపటాలలో చూపించారు. 1840 లో శాస్త్రవేత్తల లెక్కలతో ప్రభుత్వం అక్కడ తారుతో రహదారి ఏర్పరిచింది. కానీ ఆ రహదారి మూసుకుపోవటాన్నీ, రోజుకు రెండుసార్లు మాత్రమే ఆ రహదారి తెరుచుకోవటాన్ని మాత్రం వారు ఆపలేకపోయారు. అందువలన 1971లో ఆ రహదారికి కొన్ని మైళ్ళ దూరంలో ఓ వంతెన నిర్మించారు. కానీ ప్రజలు అలలు ఏర్పరచిన రహదారినే ఉపయోగిస్తూ వచ్చారు.


ప్రపంచంలోని మరికొన్ని ప్రదేశాలలో ఇలాంటి రహదారులున్నా, ఈ రహదారి మాత్రం ప్రాముఖ్యత తెచ్చుకుంది. కారణం, దీని పొడవు--రెండు ఊర్లకూ మధ్య 4.5 కిలోమీటర్ల దూరం ఉండడమే! అంత దూరానికి రహదారి ఏర్పడుతుంది. అలాగే రహదారి మూసుకుపోయినప్పుడు అక్కడ నీరు 1.3 మీటర్ల ఎత్తు నుండి 4 మీటర్ల దాకా ఉంటుంది.


ప్రకృతి అలల మూలంగా ఏర్పరచిన ఈ రహదారిని దాటటమే మన మనసులను కదిలిస్తుందని ప్రజలు ఈ రహదారినే వాడుతున్నారు. అందువలన ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని ఆ రహదారికి ఇరువైపులా అలల కోసం హెచ్చరికగా ఉండమని ప్రకటన పలకలు ఉంచింది. అయినా అప్పుడప్పుడు బాధాకరమైన సంఘటనలూ జరుగుతూనే ఉన్నాయి.


ప్రభుత్వం అలలు వచ్చేటప్పుడు తప్పించుకోవటానికి ఎత్తైన రక్షణ టవర్లు నిర్మించారు. ఆ టవర్లలో ఎక్కి తప్పించుకున్న వారిని ప్రభుత్వం రక్షక దళాలను పంపి రక్షిస్తుంది. ఈ రహదారిని చూడటానికీ, అందులో నుండి నడవటానికి పలుదేశాల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు.

Images Credit: To those who took the original Photos.

*******************************************************************************************

15, డిసెంబర్ 2019, ఆదివారం

వాతావరణ నియంత్రణ జరుగుతొందా?(మిస్టరీ)



                                      వాతావరణ నియంత్రణ జరుగుతొందా?

వెదర్ వార్ ఫేర్---ఈ మధ్య ఈ మాట తరచుగా వినబడుతోంది. శక్తివంతమైన వాతావరణ నియంత్రణ పరికరాలు ఉపయోగించి అగ్రరాజ్యాలు ఇతరు (తమకు ఎదురు చెప్పే) దేశాల వాతావరణంలో మార్పిడి తీసుకు వచ్చి ఆ దేశాలలో కరువు, వరదలు, తుపానలు, భూకంపాలు సృష్టిస్తున్నాయని చెబుతున్నారు. కానీ ఆ సంగతిని ఎవరూ నిరూపించలేకపోతున్నారు.

వాతావరణ మార్పిడికి అవసరమైన టెక్నాలజీ అగ్రరాజ్యాల దగ్గర ఉన్నదని అందరికీ తెలుసు. అయితే ఈ టెక్నాలజీని యుద్ధాలలో వాడకూడదని 1978 జెనీవా సమావేశంలో అగ్రదేశాలు ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కానీ రహస్యంగా శక్తివంతమైన వాతావరణ నియంత్రణ పరికరాలతో పరిశోధనలు జరుగుతున్నాయని, జరిగాయని, ఈ పరిశోధనలను ఇతర దేశాల వాతావరణంపై వాడుతున్నారని/వాడారని అగ్రరాజ్యాలపై ఒక నింద ఉంది. దీనికి కారణాలేమిటో తెలుసుకుందాం.


1967-1968లో 'ఆపరేషన్ పాప్ ఐ' అనే పెరుతో అమెరికా, వియత్నాంలో వాతావరణ మార్పిడి ఏర్పరచి అక్కడ వరదలు సృష్టించి శత్రుసేనలను బలహీనం చేసింది. యుద్దంలో శత్రుసేనలు నష్టపోలేదు గానీ, సాధారణ పౌరులు తీవ్రంగా నష్టపోయారు. అందువలనే వాతావరణ మార్పిడి పద్దతిని యుద్ధాలలో వాడకూడదని జెనీవా ఒప్పందం జరిగింది. ఆ తరువాత వాతావరణ వార్ఫేర్ గురించి అందరూ మరిచిపోయారు.


వాతావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ లాంటి పరిస్థితులు నెలకొనడంతో, వాటి నుండి బయటపడటానికి వాతావరణ మార్పిడి అనే మాట మళ్ళీ తలెత్తింది. మానవులవల్ల ఏర్పడిన వాతావరణ కాలుష్యం, అదే మానవులచేత శుద్ధిపరచాలని అంతర్జాతీయ సదస్సులు జరిపి వాతావరణ కాలుష్యానికి ముఖ్యకారణమైన కార్బన్ డై ఆక్సైడ్ ను ప్రతి దేశమూ తగ్గించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ ఏ దేశం ఎంత తగ్గించాలి. ఎంత శాంతం తగ్గించాలి అనే విషయంపై చర్చ జరుగుతోంది. కానీ ఏ దేశమూ కచ్చితమైన లెక్కలకు రాలేకపోతోంది. దీనిని కారణంగా తీసుకుని అగ్రరాజ్యాలు వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కృతిమ పద్దతులను (రసాయనాలు వాడి) ఉపయోగించి గ్లోబల్ వార్మింగ్ ని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చునని, దానికి కావలసిన టెక్నాలజీ తమ దగ్గర ఉన్నదని చెప్పడంతో శాస్త్రవేత్తలలోనూ, ప్రజలలోనూ మళ్ళీ ఆందోళన చెలరేగింది.


అగ్రరాజ్యాలు ఇప్పటికే ఆ టెక్నాలజీ వాడుతున్నారని, అలాంటి పరిశోధనా కేంద్రాలలో ముఖ్యమైనది, అత్యంత శక్తివంతమైంది అమెరికాలోని 'హార్ప్'(HAARP...High Frequency Active Auroral Research Program) పరిశోధనా కేంద్రమని, అక్కడి నుండి రహస్యంగా వాతావరణ మార్పిడి జరుగుతోందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం వీరి మాటలను ఖండిస్తున్నది. మరైతే 'హార్ప్'(HAARP) లో మీరు చేస్తున్న పరిశోధనలు ఏమిటని ప్రశ్నించినప్పుడు "మా దేశ రక్షణ కోసం మేము ఏర్పరుచుకున్న పరిశోధనా కేంద్రం" అని చెబుతున్నారు.

"ప్రకృతి వైపరీత్యాల వెనుక వున్నది ఏమిటి?...అనంతమైన శక్తి. ఈ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే ఆ ప్రకృతి వైపరీత్యం అంత శక్తివంతంగా ఉంటుంది. వాతావరణంలోని పై పొరైన అణుశకలావరణం (Lonosphere) లోకి HAARP 1.17 జిగా వాట్స్ వికిరణ శక్తిని బీమ్ చేస్తోందట. ఆ వికిరణ శక్తి, అత్యంత వేగంతో తిరిగి భూమిపైకి తోయబడుతుంది. అలా తోయబడిన వికిరణ శక్తే తుపాను, భూకంపం, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలను సృష్టిస్తుంది" అని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ఇవి ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. నవంబర్-13, 1997 లో వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ఒక వార్త ప్రచురించింది. మలేషియా తమ దేశంలో ఏర్పడిన పొగమంచును మానవ నిర్మిత తుఫాన్ తో ఎదుర్కోవటానికి, రష్యా దేశానికి చెందిన ఒక వాతావరణ మార్పిడి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నదని ఆ వార్త. ఒప్పందం ప్రకారం ఆ సంస్థ మలేషియాలో హరికేన్ సృష్టించింది. ఆ హరికేన్ వలన మలేషియాలో పొగమంచుపోయి స్పష్టమైన వాతావరణం నెలకొన్నదని ఆ వార్తలో రాశారు.

"హరికేన్ కత్రీనా న్యూ ఓర్లియన్స్ ను తాకటానికి రష్యా గూఢచార సంస్థే కారణం. 1976 నుండి అమెరికాదేశ వాతావరణాన్ని వారే నియంత్రిస్తున్నారు" అని రిటైర్డ్ అమెరికన్ Lieutenant Colonel Thomas Bearden ఆరోపిస్తున్నారు.

1952 లో ఇంగ్లాండు దేశంలోని లిన్ మౌత్ గ్రామంలో ఇంగ్లాడ్ దేశ రాయల్ ఏర్ ఫోర్స్ నిర్వహించిన 'వర్షం కోసం వాతావరణ మార్పిడి పరిశోధన వలన అక్కడ 20 నిమిషాల సమయంలో అత్యంత అధిక వర్షపాతం కురిసి, వరదలు ఏర్పడి ఆ గ్రామానికి తీవ్ర నష్టం జరిగింది. గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి మాత్రమే సోలార్ రేడియేషన్ మేనేజ్ మెంట్ పద్దతి వాడుతున్నామని Intergovernment Panel on Climate Change(IPCC) తమ నివేదికలో తెలిపినా, 'గ్లోబల్ వార్మింగును తగ్గించడానికి ఆ పద్దతి ఉపయోగపడదు. కాబట్టి దీనిని చెడు ప్రయోజనాల కోసమే వాడుతున్నారు అని కొంతమంది శాస్త్రవేత్తలు వాపోతున్నారు.


ప్రాజెక్ట్ స్టామ్ ఫ్యూరీ(Project Stormfury) పేరుతో తుఫాన్ల వుద్రిక్తతను తగ్గించడానికి అమెరికా చేపట్టిన పరిశోధన ఇది. విమానం ద్వారా సముద్రంలోని సుడిగుండంలో సిల్వర్ ఐయొడైడ్ చల్లితే తుపాన్ బలహీనం చెందుతుంది. 1962 నుండి 1983 వరకు అమెరికా ఈ పరిశోధన చెపట్టింది. ఈ పరిశోధనల వలన 4 తుఫానల తీవ్రతను 30 శాతం తగ్గించగలిగారట.


కెమ్ ట్రయల్స్(Chemtrails): విమానాలలో నుండి వస్తున్న పొగను కెమ్ ట్రయల్స్ అంటున్నారు. విమానాలలో నుండి వస్తున్నది హానికరం కాని పొగ కాదు. అది అగ్ర రాజ్యాలు వాతావరణ మార్పిడికోసం రసాయనాలు వెదజల్లడమే అని ఒక వాదన బలపడుతోంది. 19990లో చైనా రాజధాని బీజింగ్ నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్ ఆటలలో పాల్గొన్నవారు, కలుషితమైన గాలిని పీల్చకుండా ఉండేందుకు బీజింగ్ నగర వాతావరణంలో మార్పిడి తేవటానికి అమెరికా ఈ పద్ధతి వాడింది.

'వాతావరణ ఇంజనీరింగ్' ఉన్నదనటానికి కావలసిన జవాబులు ఉన్నాయి కనుక, వాతావరణ నియంత్రణ జరుగుతోందంటున్నారు. ఎవరో ఒకరు దీనిని శాస్త్రీయంగా నిరూపించేంతవరకు ఇది మిస్టరీగానే ఉంటుంది.

Image Credits: to those who took the original photos.
*************************************************************************************************

13, డిసెంబర్ 2019, శుక్రవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్-చివరిపార్టు)...PART-15



                               ప్రేమ సుడిగుండం (సీరియల్-చివరిపార్టు)
                                                             (PART-15)


వరుణ్ నల్గొండ దగ్గరకు జేరుకున్నాడు. స్కూటర్ అపాడు.

'ఇక ఏం చెయ్య బోతాము?' అక్కడున్న ఒక బండరాయి మీద కూర్చుని ఆలొచించాడు.

చిన్న వయసు నుండే అతను బిడియస్తుడు. అమ్మా, నాన్న, తమ్ముడితో తప్ప వేరే ఎవరి దగ్గర గబుక్కున మాట్లాడడు. ప్రతిమ వాళ్ళింటికి రావటంతో అతని బిడియం ఇంకా ఎక్కువ అయ్యింది!

ఆమే అతన్ని అపి కూర్చోబెట్టి మాట్లాడుతుంది. అలా మాట్లాడి మాట్లాడి అతని బిడియాన్ని కొంచంగా తగ్గించింది. కొన్ని రోజుల తరువాత ఆమెతో కొంచం సహజంగా మాట్లాడాడు.

ఒకసారి...ప్రతిమకు బాగుంటుందని 'స్టికర్ బొట్లు’ కవర్ ఒకటి ఎక్కడో దారిలో అమ్ముతుంటే కొనుక్కుని వచ్చాడు. ఆ రోజే అమ్మ అడిగింది.

"ప్రతిమను నీకు నచ్చుతుందా?"

"ఎందుకు అడుగుతున్నావ్?"

"లేదు...బొట్టు బిల్లల్లు కొనొకొచ్చావే?"

"దారిలో చూశాను. బాగున్నాయి! అందుకే కొనుకొచ్చాను. ఇందులో తప్పేముంది?"

"తప్పు లేదు..." ముసిముసి నవ్వు నవ్వింది.

"దాన్ని నీకు పెళ్ళి చేసిస్తే?" అన్నది.

అతను వెంటనే సిగ్గు పడ్డాడు. ముఖంలో మార్పు కనబడకూడదని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత అమ్మ దాని గురించి మాట్లాడకపోయినా అమె చెప్పిన మాటలూ, ప్రతిమ యొక్క అందమూ అతని మనసులో నిద్రపోతున్న ఏదో ఒక భావాన్ని తట్టిలేపింది.

పెళ్ళి చేసుకున్న తరువాత, మొదటి రాత్రి రోజున తన ప్రేమను ఆమెకు పెళ్ళి కానుకగా ఇవ్వాలని అనుకున్నాడు.

అమ్మ వాళ్ల పెళ్ళిని నిర్ణయించిన రోజు లోలోపల ఒక పిల్లాడిలాగా మారిపోయి ఎగిరి గంతులేశాడు. కానీ, అన్నీ పొంగుతున్న పాలు లాగా అనిగిపోయింది.

తనది అని అనుకుంటున్న దానిని...అతనికే తెలియకుండా కలలాగా అయిపోయింది. తనది 'ఒన్ సైడ్ లవ్' అని తెలిసిన నిమిషం...లోలోపల కుమిలిపోయాడు. అదే సమయం కిరణ్ ని ఆమె ప్రేమించింది అని ఆవేశపడలేదు. 'ఇది దేవుడి యొక్క ఇష్టం!' అనే తీసుకున్నాడు.

తల్లి యొక్క పథకాలను స్వయంగా ఆపలేమని అర్ధంచేసుకున్న పరిస్థితులలో...ఆమె దారిలోనే వెళ్ళి ప్రేమికులను ఒకటి చేర్చాలని నిర్ణయించుకున్నాడు. అతని పథకం ప్రకారమే ఇంతవరకు జరిగింది. రేపటి ముహూర్తంలో కిరణ్ ప్రతిమ మెడలో తాలి కడతాడు.

'ఇక ప్రతిమ తమ్ముడి భార్య. ఆమెను మనసులో తలుచుకోవటం కూడా మహాపాపం. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే...తాను అక్కడికి వెళ్ళనే కూడదు. అదే సమయం ఇంకొక అమ్మాయితో కూడా జీవితాన్ని పంచుకోవటానికి తయారుగా లేను. ఎప్పుడైతే మనసు ఒకదాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించిందో...అప్పుడే మనసు అన్నీటినీ విడిచిపెడుతున్నట్టు అర్ధం’

'ఎందుకు ‘ప్రేమ-అభిమానాలు’ అనే వలలో చిక్కుకుని గిలగిలా కొట్టుకోవటం? అన్ని బంధాలూ తెంపుకుని ఒక జ్ఞాని జీవితానికి తనని తయారుచేసుకోవటం కష్టమా ఏమిటి? అవును...అదే సరి! అన్నిటినీ తెంపుకోవాలి. ఇక్కడ ఏదీ శాస్వతం కాదు. బంధుత్వాలను వదిలి కొత్త జన్మ ఎత్తాలి.

స్కూటర్ ను అక్కడ వదిలేసి నడవటం మొదలు పెట్టాడు. బస్ స్టేషన్ చేరుకున్నాడు. అక్కడ బస్సు ఎక్కి రైలు స్టేషన్ కి వెళ్ళాడు. ఎర్ణాకులం రైలు ఎక్కాడు. ఖలీగా ఉన్న బెర్త్ లో పడుకున్నాడు.

వరుణ్ ఎక్కడికి వెళ్లాడు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు...ఎవరికీ తెలియదు.

******************************************సమాప్తం***************************************

11, డిసెంబర్ 2019, బుధవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-14



                                              ప్రేమ సుడిగుండం (సీరియల్)  
                                                               (PART-14)                                                           


మంచి టైము చూసి అందరూ మండపానికి బయలుదేరారు. ప్రతిమ పూర్తి పెళ్ళి కూతురు అలంకారంతో కారులోకి ఎక్కింది. అత్తయ్య...మరో ఇద్దరు బంధువులు పక్కన కూర్చోగా...బయలుదేరటానికి రెడీ అయ్యింది కారు.

మరో కారులు మగవాళ్ళందరూ ఎక్కారు. అరటి చెట్లు, పందిరి, సీరియల్ బల్బుల అలంకరణతో ఇళ్ళు కలకలలాడుతోంది.

"ఇల్లు తాళం పెట్టాలా? ఎవరైనా ఒకరు ఇంట్లో ఉంటే మంచిది కదా?" -వరుణ్ అడిగాడు.

"పనమ్మాయి రావాలి...అది ఇంకా రాలేదు?"

"ఒక పని చెయ్యండి...మీరంతా బయలుదేరండి. పనమ్మాయి వచ్చిన వెంటనే చెప్పేసి వస్తాను" అన్నాడు వరుణ్.

"ఏమిట్రా ఇది...పెళ్ళికొడుకును నిన్ను వదిలిపెట్టి మేము ఎలా వెళ్ళగలం? రేయ్ కిరణ్...నువ్వు కావాలంటే ఉండేసి తరువాత వస్తావా?" అడిగింది తల్లి.

"వాడ్ని మీతో రానీయమ్మా. అక్కడ చాలా పనులున్నాయి! పెళ్ళికొడుకైతే ఏమిటిట...నాకేమన్నా కొమ్ములు మొలిచాయా! మంచి రోజు కదా, ఇల్లు తాళం వేయకూడదని అలొచిస్తున్నా. మీరు బయలుదేరండి. పనమ్మాయి వచ్చిన వెంటనే చెప్పేసి, ఒక ఆటో పట్టుకుని వచ్చేస్తాను"

"ఆటో ఎందుకు? నీ 'స్కూటర్’ ఉందిగా! దాంట్లోనే రా. అక్కడేమైనా అర్జెంటు పనులుంటే ఎవరికైనా పనికొస్తుంది"

వరుణ్ వాళ్ళను పంపించి ఇంటి లోపలకు వచ్చాడు. అర గంట తరువాత పనమ్మాయి వచ్చింది. దాని చేతికి ఇంటి తాళాలు ఇచ్చి వరుణ్ బయలుదేరాడు.

"ఏదైనా 'ఫోన్’ వస్తే, ఎవరూ...ఏమిటీ? అని అడిగుంచు. కల్యాణ మండపం 'అడ్రస్సు’ అడిగి ఎవరైనా మాట్లాడితే...పక్కనే పత్రిక పెట్టాను చూడు. అది చూసి ‘అడ్రస్సు’ చెప్పు. లెటర్ ఏదైనా వస్తే తీసి ఉంచుకో. నువ్వొకదానివే నా పెళ్ళి చూడకుండా ఉంటావు. పరవలేదు....తరువాత నీకు మాత్రం స్పెషల్ గా ... 'వీడియో’ వేసి చూపిస్తాను"

వరుణ్ స్కూటర్ స్టార్ట్ చేశాడు. మనసు ఎలా వెళ్ళమంటే స్కూటర్ను అలా నడిపాడు. సిటీ దాటి హైవేలోకి ప్రవేసించి నిదానంగా వెడుతోంది అతని స్కూటర్.

కల్యాణ మండపంలో అతనికోసం అందరూ కాచుకోనున్నారు. 'ఇదిగో వచ్చేస్తాడు....' అని నమ్ముతుంటారు. సమయం అవుతున్న కొద్ది ఆందోళన చెందుతారు. మండపం లోపలకూ, బయటకూ తిరుగుతుంది తల్లి...అల్లల్లాడిపోతుంది.

నాన్న ఇంటికి 'ఫోన్ చేస్తారు. 'అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయారే...!'అని పనమ్మాయి చెబుతుంది.

మనిషి కొక దిక్కుగా వెతుకుతారు. అతను దొరకడు. అమ్మ ఏడుస్తుంది. 'ఎక్కడికెల్లి చచ్చాడు ఈ దరిద్రుడు అని తిట్టుకుంటుంది. రాత్రంతా రాక పోవటంతో...'ఇక ఏం చేయాలి?' అని ఒక అర్జెంట్ మీటింగు జరుగుతుంది.

“పెళ్ళి ఆగటం అపశకునం. మంచి కార్యం ఆగిపోకూడదు. ఒకవేల అతనికి ఈ పెళ్ళి ఇష్టం లేదో ఏమో? అందుకే రాకుండా ఎక్కడికో పోయాడు! అందుకని పెళ్ళి ఆగిపోవాలా? పెద్ద కొడుకు లేకపోతే ఏమిటి? చిన్న కొడుకు ఉన్నాడే! వాడిని పెళ్ళికొడుకు చేయండి!” చెప్పాడు వరుణ్ మామయ్య. అక్కడున్న అందరూ వంతు పాడారు.

“ప్రతిమ, మీరు కన్న బిడ్డ కాదు. అయినాకానీ ప్రేమంతా వొలకబోసి పెంచారు. ఆమె పెళ్ళి ఆగిపోతే...అందులోనూ మీ కొడొకు రాకుండా పోయినందువలన ఆగిపోయిందని తెలిస్తే, ఆమె భవిష్యత్తు చీకటైపోతుంది. ఆమెను పెళ్ళిచేసుకోవటానికి ఎవరూ ముందుకు రారు!”

వరుణ్ కి నమ్మకమైన ఒకే ఒక మనిషైన అతని మామయ్య, వరుణ్ చెప్పిచ్చిన డైలాగులను 'అక్షరం’ మార్చకుండా చెప్పాడు.

అయన దగ్గర మాత్రమే నిజం చెప్పి సహాయం అడిగాడు. ఆ విషయాన్ని ఎవరి దగ్గరా చెప్పకూడదని చేతిలో చెయ్యి వేయించుకున్నాడు.

ప్రతిమకు, కిరణ్ కి ఆయనే పెళ్ళి చేయాలని, ఆ బాధ్యతను ఆయనకు అప్పగించాడు.

****************************************************************************************************                                    ఇంకా ఉంది.....Continued in చివరి PART-15.

9, డిసెంబర్ 2019, సోమవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-13




                                      ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                         (PART-13)


పెళ్ళి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. వరుణ్, పజిల్ యొక్క మరో ముఖంలా తిరుగుతున్నాడు.

ప్రతిమకు ఒకొక్కసారి అతన్ని చూడటానికే భయం వేస్తోంది. ఒకొక్కసారి అతన్ని చూస్తే 'కచ్చితంగా ఇతను ఏదో మంచే చేయబోతాడు’ అనే నమ్మకం ఏర్పడుతోంది. మొత్తానికి ఏం జరుగుతోందో మాత్రం అర్ధం కావటంలేదు. ఏదో నదిలో కొట్టుకు వెడుతున్నట్టు ఉన్నది. అది ప్రతిమను తీరానికి తీసుకు వెడుతుందా లేక ముంచుతుందా?

కిరణ్ దగ్గర నుండి ఎటువంటి సమాచారమూ లేదు. అతను వస్తాడా...రాడా అనేదే తెలియలేదు. తన పెళ్ళి ఎవరితో జరగబోతోందో తెలియక పెళ్ళికి రెడీ అవుతున్న అమ్మాయి ఈ ప్రపంచంలో తాను ఒకత్తినే అని అనిపించింది ప్రతిమకు. పెళ్ళి రోజు దగ్గర పడుతుంటే ప్రతిమ గుండేలో దఢ పెరుగుతోంది. గడియారంలోని ముళ్ళును చూస్తేనే వణుకు పుడుతోంది.

పెళ్ళికి రెండు రోజుల ముందు అమెరికా నుండి వచ్చాడు కిరణ్. వాడిపోయిన మొహంతో...మనసు నిండా కోపంతో! ఎవరి దగ్గర మాట్లాడకుండా మేడ మీదకు వెళ్ళిపోయాడు. మాట్లాడకపోయినా అతను రావటమే సంతోషం అని అనుకుంటోంది అత్తయ్య.

వరుణ్ మాత్రం మేడ మీదకు వెళ్ళి కిరణ్ తో మాట్లాడి వచ్చాడు.

"ఏమిట్రా వాడికి ఇంకా కోపం ఎందుకట? వాడి పెళ్ళి ఆపేశాము కదా? మరి ఇంకా ఎందుకు కోపం?"- ఏమీ తెలియనట్లు అత్తయ్య అడగటంతో...వరుణ్ ఆమెను కోపంగా చూశాడు.

'అమ్మకు నిజంగానే ఏమీ తెలియదా? లేక, తెలియనట్లు నటిస్తోందా?'...అనే ఆలొచనతో వరుణ్ ఏమీ మాట్లాడలేదు.

"ఏరా...నీ ‘డ్రస్సు’ వచ్చిందా? వాటిని తీసుకు రావద్దా? ఎం టైలర్ రా వాడు? పెళ్ళి బట్టలను సరైన సమయానికి కుట్టివ్వాలని తెలియదా వాడికి?"...వరుణ్ ఆలొచనలను పెళ్ళి వైపుకు మళ్ళించాలని వరుణ్ని అడిగింది తల్లి.

"తీసుకు వస్తాను. ‘డ్రస్సు’ ఎక్కడికి పోతుంది?"

ఆ రోజు సాయంత్రమే వెళ్ళి వరుణ్ తన పెళ్ళి ‘డ్రస్స్’ తీసుకు వచ్చాడు.

ఆడ పెళ్ళి వారు, మగ పెళ్ళి వారూ అందరూ వాల్లే కాబట్టి ఇల్లే పండుగ వాతావరణంతో వెలిగిపోయింది. పెళ్ళి మండపానికి సామాన్లను చేర వేస్తున్నారు.

“ప్రొద్దున అనంగా వచ్చాడు. ఇంతవరకు ఏమీ తినలేదు. క్రిందకు రానే లేదు. వాడికి ఏమిట్రా కావాలి?"

తల్లి చెప్పిన వెంటనే....వరుణ్ మేడపైకి వెళ్ళాడు.

"ఏమిట్రా కిరణ్...ఎందుకు ఏమీ తినలేదు?"

ఎర్ర బడ్డ కళ్లతో అన్నయ్యను చూశాడు తమ్ముడు.

"నీ పెళ్ళిలో భోజనం ఒక పట్టు పడదామని కడుపును ఖాలీగా ఉంచుకున్నా?"

వరుణ్, నవ్వుతూ తమ్ముడ్ని చూశాడు. "నా మీద నీకు కోపం పోదని నాకు తెలుసురా కిరణ్. ప్రతిమ నా దగ్గర మీ ఇద్దరి ప్రేమ గురించిన అన్ని విషయాలూ చెప్పినా నేను కొంచం కూడా మనస్సాక్షి లేకుండా....ఆమె మెడలో తాలి కట్టబోతున్నానే అనే కోపమే నీకు. అంతే కదా...?"

సమాధానం చెప్పకుండా కిరణ్ తల తిప్పుకున్నాడు.

"నేను ఏం చెయ్యనురా? ‘తోడ పుట్టిన తమ్ముడా?...పది నెలలు మోసిన తల్లా?'అని ఆలొచిస్తే...అమ్మే ముఖ్యంగా కనబడుతోంది. ఆమె సంతోషమే నాకు ముఖ్యం. కన్న తల్లి ఒక కన్నీటి బొట్టు కార్చినా మన పడవ మునిగిపోతుంది. నా కోసరం కాకపోయినా, ఆమె కోసం నేను ప్రతిమతో జీవించే కావాలి. వేరే దారి లేదు. కానీ, నేను నీకు ఒకే ఒక నమ్మకాన్ని ఇవ్వగలను. 'అమ్మ వేసిన ముడికి బలం ఎక్కువా? లేక దానికంటే బలంగా దేవుడు వేరే ముడి వేసున్నాడా?' అనేది రేపుగాని తెలియదు.

నీకూ, ప్రతిమకు దేవుడు ముడి వేసుంటే అమె నీకే దొరుకుతుంది! లేదు...నాకు వేసుంటే....నాకు దొరుకుతుంది. అలా గనుక అమె నా భార్య అయితే...ఆమె యొక్క పాత ప్రేమను మరిచిపోవటానికి నేను తయారుగా ఉన్నాను. నువ్వూ మర్చిపోవటం మంచిది" - వరుణ్,తమ్ముడి వీపు మీద సమాధానంగా తట్టి లేచి బయటకు వచ్చాడు.

అంతవరకు బయట నిలబడి వాళ్ల మాటలను దొంగతనంగా వింటున్న తల్లి గబుక్కున పక్కకు జరిగి తనని దాచుకుంది.

ఆమె ముఖంలో ప్రశాంతత, అనందమూ నిండుకుంది. పాతవన్నీ తల్లికొసం మరిచిపోయి జీవించటానికి తయారుగా ఉన్న వరుణ్ గుణం ఆమెను ఆశ్చర్యపరిచింది. తనని ఇంత గొప్పగా గౌరవిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఆమెకు గర్వంగా ఉన్నది.

'కచ్చితంగా దేవుడు నా లెక్కను తప్పుగా మార్చడు. నా ఇష్టప్రకారమే ఎటువంటి ఆటంకమూ లేకుండా వరుణ్-ప్రతిమల పెళ్ళి జరిగిపోతుంది. కొన్ని రోజులైతే అన్నీ సర్ధుకుంటాయి. మంగళసూత్ర తాడుకు శక్తి ఎక్కువ. అది వీళ్ళను బాగానే జీవింప చేస్తుంది. కిరణ్ కూడా మారుతాడు. 'వదిన’ అనే మనిషి మరొక తల్లి అనే భావం అతనిలో ఏర్పడుతుంది. రోజులు గడుస్తున్న కొద్ది వాడు, వాడి పెళ్ళికి అంగీకరిస్తాడు. తనకు తగిన అమ్మాయిని వెతికే బాధ్యత నాకు అప్పగిస్తాడు. వాడికి తగిన అమ్మాయిని వెతికి పెళ్ళికూడా చేసి ముగిస్తాను. ఇద్దరు పిల్లలూ సంతోషంగా జీవిస్తారు. ఇంతకంటే ఒక తల్లికి ఇంకేం కావాలి?'....అనే ఆలోచనలతో సంతోషంగా కిందకు వెళ్ళింది తల్లి.

తన గదిలోకి దూరిన వరుణ్ కి నవ్వొచ్చింది. తన వెనుకే మేడపైకి వచ్చి తమ మాటలను దొంగతనంగా విన్న తల్లిని గుర్తుకు తెచ్చుకున్నందుకే ఆ నవ్వు!

****************************************************************************************************                                  ఇంకా ఉంది.....Continued in: PART-14

4, డిసెంబర్ 2019, బుధవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-12




                                          ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                              (PART-12)


ఆ రోజు అర్ధ రాత్రి టెలిఫోను లో కిరణ్ ని పట్టుకో గలిగాడు వరుణ్. మొదట అతనే తమ్ముడితో మాట్లాడాడు. తరువాతే అమ్మను లేపి ఆమె దగ్గర రీజీవర్ ఇచ్చి మాట్లాడమన్నాడు.

"ఎలా ఉన్నావు కిరణ్?" తల్లి గొంతు బొంగురుపోయింది.

"నువ్వెలా ఉన్నావు?" అడిగాడు కిరణ్

"నాకేమిటి...ఇంక సమయం రాకుండా బ్రతికే ఉన్నాను. వెళ్ళిపోయుంటే బాగుండేది. అందరూ సంతోషంగా ఉండుంటారు"

"దీనికొసమా నీకు ఫోను ఇచ్చింది?" వరుణ్ గట్టిగా అరిచాడు.

“నువ్వొస్తేనే మీ అన్నయ్య పెళ్ళి చేసుకుంటాడట. నిన్ను పెళ్ళి చేసుకోమని ఇకమీదట బలవంతం చేయను. ఈ పెళ్ళికి వచ్చి చేరు"

"చూస్తాను"

తల్లి దగర నుంచి కార్డ్ లెస్ ఫోనును తీసుకుని బయటకు వచ్చాడు. కిరణ్ తో మళ్ళీ కొన్ని నిమిషాలు మాట్లాడి, ఫోన్ కట్ చేసి వెళ్ళి పడుకున్నాడు వరుణ్.

రాత్రంతా అతనూ నిద్ర పోలేదు....ప్రతిమ కూడ నిద్రపోలేదు.

"ఏం చెప్పాడు నీ రెండో కొడుకు? వస్తాడటనా?"...భార్యను అడిగాడు మామయ్య.

"చూస్తానన్నాడు"

"దానికేమిటి అర్ధం?"

"ఎవరికి తెలుసు!"

"ఒకవేల వాడు అక్కడే ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో...అందుకనే ఇక్కడ చూసిన అమ్మాయిని వద్దని చెప్పి వెళ్ళిపోయాడేమో?"

"అది సరే...మనం ఇష్టపడేవన్నీ జరగొద్దా? ఇష్టపడుతున్నవన్నీ జరుగుతున్నాయా ఏమిటి?"

"ఇది ఎవరికి చెబుతున్నావు? వాడు ఇష్టపడేది జరగదు అంటున్నావా? లేదు...నువ్వు ఇష్టపడేలాగా జరుగుతుందా అని అడుగుతున్నావా?"

"ఏమిటి...ఒక లాగా సందేహంగా మాట్లాడుతున్నారు?"....అత్తయ్య ఆయన్ని కళ్ళార్పకుండా చూసింది.

"ఈ కాలంలో 'అరేంజడ్ మ్యారేజ్' లు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ పెళ్ళిల్లే ఎక్కువ. వాటినే కన్నవాళ్ళు గౌరవంగా జరుపుతున్నారు. నీ కొడుకు ప్రేమించేడు అంటే తప్పు లేదు రామలక్ష్మీ. వాడు వస్తే, వాడితో నిదానంగా, చక్కగా మాట్లాడి మనమే వాడికి మంచిగా పెళ్ళిచేసేద్దాం"

రామలక్ష్మి సమాధానం చెప్పకుండా పక్కకు తిరిగి పడుకుంది. మొదటి నుంచి ఆమె వేస్తున్న లెక్కలు ఎక్కడో ఒక చోట తప్పు అవుతోంది. అలా ఎందుకు జరుగుతోందో తెలియటంలేదు! చిన్న వయసులో పెద్ద కొడుకు వరుణ్ నవ్వునూ, గబగబా తడుముకోకుండా మాట్లాడటాన్నీ చూసి వాడు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగంలో ఉంటాడని అనుకున్నది. రెండో కొడుకు కిరణ్ కి మూడో ఏడు వచ్చేంతవరకూ మాటలు రాలేదు! అన్ని విషయాలలోనూ మందంగా ఉండేవాడు. 'వీడు ఏం చదివి పాసయ్యి ఏం ఉద్యోగం చేస్తాడో?' అనుకుని నిట్టూర్పు విడిచేది.

అప్పుడంతా అన్నదమ్ములిద్దరూ చదువులో సాధారణ రకాలే! మూడేళ్ళ తరువాత పెద్ద కొడుకు వరుణ్ దగ్గర హఠాత్తుగా ఒక రకమైన నిదానమూ, బిడియమూ చోటుచేసుకుంది. అదే సమయం రెండో కొడుకు కిరణ్ దగ్గర చురుకుదనం, చలాకీ చోటు చేసుకుంది. అన్ని సబ్ జెక్ట్ లలోనూ మొదటి ర్యాంకు వాడిదే. మొదట్లో కిరణ్ గురించి బాధపడిన రామలక్ష్మి...తరువాత వరుణ్ గురించి బాధపడింది. బంధువులు నవ్వారు.

వరుణ్ గురించిన ఆందోళన ఎక్కువ అయ్యింది. ఎత్తు, రంగు, అందం, చదువు, సామర్ధ్యం, తెలివితేటలూ అన్నిట్లోనూ తక్కువగానే ఉండేవాడు. వీడికి అమ్మాయిని ఎవరిస్తారు? అనే భయం మనసులో కలవరం రేపుతుంటే మొట్టమొదటి సారిగా 'ప్రతిమా ఉన్నదే...'అనే అలొచన ఏర్పడింది.

ప్రతిమకూ ఎవరూ లేరు. ప్రతిమను బయటవాళ్ళకు ఇచ్చి పెళ్ళిచేయాలంటే కనీసం ఏడెనిమిది లక్షలన్నా కావాలి. అంత డబ్బు బయటకు పోకుండా, వరుణ్ కే ఇచ్చి పెళ్ళి చేసేస్తే డబ్బులూ పోవు, వరుణ్ కి అమ్మాయి దొరుకుతుంది అని చాకచక్యంగా లెక్క వేసింది. ఆ లెక్కలోనూ ఒకరోజు మట్టి పడింది.

కిరణ్-ప్రతిమ ల ప్రేమ కలాపాలను అనుకోకుండా చూసినప్పుడు బలంగా అదిరిపడ్డది. ప్రతిమను కిరణ్ ఇష్టపడితే, వరుణ్ కి అమ్మాయిని వెతకటంలో మళ్ళీ శ్రమ పడాల్సి వస్తుందే? అని మనసులో బాధ మొదలయ్యింది.

కిరణ్ కి అమ్మాయిని ఇవ్వటానికి క్యూ లో నిలబడుతారు అనే పరిస్థితిలో, ‘పెద్ద కొడుకు వరుణ్ కోసం మనసులో తాను నిర్ణయించుకున్న అమ్మాయిని చిన్న కొడుకు ఇష్టపడటమా?' అనే కోపం వచ్చింది. అదే సమయం కిరణ్ ని ప్రతిమ ఇష్టపడటం కూడా ఆమెకు నచ్చలేదు. తన లెక్కను వాళ్ళు తప్పుగా మారుస్తున్నారే అనే షాక్, లోపల నుండి అహంబావాన్ని కెలికింది.

ప్రతిమ తనను మాత్రమే కాకుండా...వరుణ్ ని కూడా కలిపి మోసం చేసిందని కుమిలిపోయింది. అభిమానం, ప్రేమ చూపి పెంచింది ఇందుకేనా? నా ఇష్ట ప్రకారమే అమె నడుచుకోవలి గానీ ఆమె ఇష్టానికి నేను నన్ను మార్చుకోవాలనే అవసరం నాకు లేదు అనుకున్నది.

ఎటువంటి గొడవ...చర్చ లేకుండా ఏమీ తెలియనట్లు వాళ్ళు వేసుకున్న ప్రేమ లెక్కను తప్పుగా చిత్రించి, తాను విజయం సాధించాలని అనుకునే కిరణ్ కి అమ్మాయిని చూసి అతనితో ఏమీ చెప్ప కుండా అందరినీ కన్ ఫ్యూజ్ చేసి పెళ్ళి చూపుల కార్యక్రమం జరిపింది.

ఆ అమ్మాయి అందం, అంతస్తు, చదువు కిరణ్ మనసును మారుస్తుందని ఆమె వేసుకున్న లెక్కను అతను చెడగొట్టాడు. తన ప్రేమ విషయంలో మొండిగా ఉండి...'ఇప్పటికి పెళ్ళి వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు’

అలా వెళ్ళేంతవరకు కూడా...ప్రతిమను ఇష్ట పడుతున్నది నోరు విప్పి చెప్పలేదనేదే ఆశ్చర్యకరమైన విషయం!

ఏ ధైర్యంతో అతను వెళ్ళాడు? ప్రతిమ తనను తాను కాపాడుకోగలదు అనే నమ్మకంతోనా? ఈ పరిస్థితులలోనే 'హార్ట్ అటాక్' రూపంలో దేవుడు అత్తయ్య సహాయానికి వచ్చాడు. దానినే సాకుగా పెట్టుకుని ప్రతిమను వరుణ్ తో పెళ్ళికి ఒప్పించింది అత్తయ్య.

'ఈ పెళ్ళికి కిరణ్ రాకుండా ఉంటేనే మంచిది!' అని ఆమె అనుకున్నప్పుడు...వరుణే, 'తమ్ముడు వస్తేనే పెళ్ళి జరుగుతుంది’ అన్నాడు. 'ఇది ఎందులోకి వెళ్ళి ముగిస్తుందో అనేది తెలియలేదు. మంచిగా ముగిస్తుందా? లేక, ఇంకా సమస్య పెద్దదవుతుందా?'- రామలక్ష్మి మెదడు గజిబిజి అయ్యింది.

ఇలాగంతా అత్తయ్య జరుపుతోంది కాబట్టి అత్తయ్య ప్రతిమను ను పారపక్ష్యంగా చూస్తోందనేది నిజం కాదు! తన కడుపున పుట్టిన పిల్లల కంటే ప్రతిమ మీద అధిక ప్రేమ ఉంచిందనేది అబద్ధం కాదు!!. కానీ, దానికోసం ప్రతిమ దగ్గర ఓడిపోవటం అత్తయ్యకు ఇష్టంలేదు. తాను వేసిన లెక్కే కరెక్టుగా ఉండాలి అని మాత్రమే అనుకుంది. అలా అనుకోబట్టే ప్రేమకు విరోధి అయిపోయింది.

తెల్లవారేంతవరకు ఆమె కూడా నిద్ర పోలేదు!

****************************************************************************************************                                       ఇంకా ఉంది.....Continued in: PART-13

2, డిసెంబర్ 2019, సోమవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-11




                                          ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                           (PART-11)


ఆ రోజు ఆదివారం. షాపుకు సెలవు కనుక వరుణ్ ఇంట్లోనే ఉన్నాడు. అత్తయ్య, మామయ్యా విజయవాడకు వెళ్ళారు...కనక దుర్గ అమ్మవారికి చీర ఇవ్వాలని!

‘వరుణ్ తో మాట్లాడటానికి ఇదే మంచి సంధర్భం!’… అతను ఎప్పుడు భొజనం చేయటానికి వస్తాడో నని కాచుకోనుంది ప్రతిమ. ఆమె సహనాన్ని చాలా వరకు పరీక్షించి రెండు గంటలకు తన గది నుండి బయటకు వచ్చాడు వరుణ్.

అతనికి మంచి నీళ్ళూ, కంచం పెట్టింది. పెళ్ళి మాట ఎత్తిన తరువాత ప్రతిమతో మాట్లాడటానికే సిగ్గు పడి ఆమెకు దూర దూరంగా వెళ్ళాడు వరుణ్. ఇప్పుడు కూడా ఏదో ఒక బిడియంతో కంచం ముందు కూర్చున్నాడు వరుణ్. వరుణ్ భోజనం చేసి ముగించేంత వరకు ప్రతిమ ఏమీ మాట్లాడ లేదు.

అతను చేయి కడుక్కుని వెడుతున్నప్పుడు "ఒక్క నిమిషం" అన్నది ప్రతిమ.

"ఏమిటి ప్రతిమా...ఏదైనా చెప్పావా?"

"నీ దగ్గర కొంచం మాట్లాడాలి"

"నా దగ్గర ఏం మాట్లాడాలి...?"

"చాలా ముఖ్యమైన విషయం. నేను చెప్పింది విని, మీరు తీసుకోబోయే నిర్ణయంలో ముగ్గురి జీవితాలు అధారపడి ఉన్నాయి"

'ఇదేమిటి చిక్కు ముడి మాటలు’ అనే లాగా ఆమెను చూశాడు వరుణ్.

"నేను నీతో పెళ్ళికి సంతోషంగా అంగీకరించలేదు వరుణ్. అత్తయ్యకోసమే అంగీకరించాను...వేరే దారి లేక!"

వరుణ్ దిగ్భ్రాంతితో ఆమెను చూశాడు. ప్రతిమ తనకూ-కిరణ్ కు ఉన్న ప్రేమ గురించి...ఆ తరువాత వరుసగా జరిగిన విషయాల గురించీ సంగ్రహంగా చెప్పి ముగించింది.

"నేను చేసేదంతా తప్పా...రైటా నాకే తెలియటం లేదు! పెళ్ళి ఆపాలని ఇది చెప్పటం లేదు. మనకు పెళ్ళి జరగాలని ఆ దేవుడు నిర్ణయించి ఉంటే...ఆ పెళ్ళి జరగటానికి ముందు ఈ నిజాన్ని చెప్పేస్తే ఒక భారం తగ్గించినట్లు అవుతుందని అనుకున్నాను...చెప్పేశాను. ఇక మీరు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉండటానికి రెడీగా ఉన్నాను"

చెప్పటం ఆపిన ప్రతిమ వరుణ్ ని చూసింది.

వరుణ్ కదలక మెదలక కళ్ళు మూసుకుని కూర్చున్నాడు.

కొద్ది సమయం తరువాత కళ్ళు తెరిచి ఆమెను సుదీర్ఘంగా చూసి సన్నని కంఠముతో మాట్లాడటం మొదలు పెట్టాడు.

"నీ మనసు విప్పి ముందుగానే అన్ని నిజాలూ చెప్పినందుకు చాల ‘ధ్యాంక్స్’ ప్రతిమా. నువ్వు చెప్పినట్లు ఇది నిజంగానే పెద్ద చిక్కు సమస్యే! నేను ఎలాంటి నిర్ణయానికి రావాలో ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. చాలా ఆలొచించాలి. నాకు రెండు రోజులైనా అవకాశం ఇవ్వు.

'ఈ పెళ్ళి జరిగితే మంచిదేనా?' అని ఆలొచించి నా నిర్ణయం చెప్తాను. అంతవరకు పెళ్ళి ఏర్పాట్లు జరుగుతూ ఉండనీ. దేనినీ ఆపటానికి ప్రయత్నం చేయొద్దు. అమ్మ ఆరొగ్యం గురించి కూడా మనం ఆలొచించాలి. ముళ్ళ పొదల మీద పడ్డ పూలమాలను తీయాలంటే అవసరపడకూడదు. జీవితం కూడా పూలమాల లాంటిదే..."

వరుణ్ ఆలొచించి మాట్లాడుతుంటే ...ప్రతిమ అతన్నే చూస్తూ నిలబడింది.

అత్తయ్యా, మామయ్యా తిరిగి రావటానికి రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది.

"అక్కడే పెళ్ళి బట్టలు కూడా కొనేశాము. అంత దూరం వెళ్ళి పట్టు చీరలు కొనుక్కు రాకుండా ఉండటానికి మనస్కరించలేదు...చీరలన్నిటినీ చూడు ప్రతిమా".

అత్తయ్య అట్ట పెట్టెలను తీసి సోఫాలో ఉంచింది. ప్రతిమ ఏ విధమైన చలనం లేకుండా యంత్రంలాగా పెట్టెలను తెరిచింది. చీరల రంగులు, రకాలు ప్రతిమ కళ్ళను జిగేలు మనిపించింది. అత్యంత ఉన్నత, నాణ్యత, అధిక ఖరీదు! పెళ్ళి కొడుకు కిరణ్ అయ్యుంటే ఇదే చీరలను సంతోషంగా చూసుండేది.

"బాగున్నాయి అత్తయ్యా" ఒక్క మాటతో చెప్పి చీరలను మళ్ళీ పెట్టెల్లో పెట్టి మూసింది.

"నువ్వెప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెల్తావు?" ప్రతిమను అడిగింది అత్తయ్య.

"రెండు సార్లు 'ఫోన్ చేశాను అత్తయ్యా. రింగ్ అవుతూనే ఉంది. ఎవరూ తీయటం లేదు. ఇంట్లో ఎవరూ లేరనుకుంటా. వాళ్ళకు వస్తున్నట్టు తెలియచేయకుండా ఎలా వెళ్ళను?"

"ఇప్పుడు ఫోన్ చేసి చూడు. ఉంటే గనుక...రేపొచ్చి మాట్లాడతానని చెప్పు"

ప్రతిమ టెలిఫోన్ తీసింది. అదే సమయం వరుణ్ తన గదిలో నుండి ఎక్స్ టెన్షన్ ఫోన్ లో నుండి ప్రతిమతో మాట్లాడాడు.

"ఆ అమ్మాయికి ఫోన్ చేయొద్దు ప్రతిమా. ఇప్పుడు కూడా రింగ్ అవుతూనే ఉన్నది, ఎవరూ తీయటం లేదని అమ్మకు సర్ధి చెప్పేయి. ఇంకో రెండు రోజులు అమ్మని ఎలాగో అలా నమ్మించు"

ప్రతిమ ఫోన్ పెట్టేసింది.

"ఏమిటో అర్ధం కావటం లేదు అత్తయ్యా... ఫోన్ తీయటమే లేదు"

"ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డరో ఎమో? ఒక సారి నేరుగా వాళ్ళింటికే వెళ్ళు. చెప్పకుండా వచ్చావేమిటని గొంతు మీద చెయ్యి వేసి తరిమేయరు కదా?"

వరుణ్ తన గదిలో నుండి వచ్చాడు.

"ఎందుకమ్మా ప్రతిమను పంపుతున్నావు? నేనే వెళ్ళొస్తాను"

"నీకు మాట్లాడటం చేతకాదురా?"

"నాకూ మాట్లాడటం వచ్చు! రేపు నేనే వెళ్లొస్తాను "- వరుణ్ కచ్చితంగా చెప్పి వెళ్ళిపోయేటప్పటికి...వాడ్ని విచిత్రంగా చూసింది అత్తయ్య.

చెప్పినట్లే మరుసటి రోజు ప్రొద్దున్నే బయలుదేరి ఆ అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళిన వరుణ్, అటు నుంచి తిన్నగా షాపుకు వెళ్ళి మద్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు.

"ఏరా...వాళ్ళున్నారా? ఫోన్ రిపేరంటనా? ఏం చెప్పారు?" అత్తయ్యా ఆశగా అడిగింది.

"అందరూ ఉన్నారు...ఆ అమ్మాయి కూడా ఉన్నది!"

"నువ్వు విషయం చెప్పావా? ఆరు నెలల తరువాత పెళ్ళి పెట్టుకుందామని నువ్వు చెప్పావా...?"

"అది చెప్పాల్సిన అవసరం ఏర్పడలేదు"

"నువ్వు చెబుతున్నదేదీ అర్ధం కావటం లేదు?"

"వచ్చే వారం ఆ అమ్మాయికి నిశ్చయ తాంబూలాలుట. పెళ్ళి కొడుకు ఎం.బి.ఏ...లండన్లో ఉద్యోగమట"

వరుణ్ ను ఆశ్చర్యంగా చూసింది అత్తయ్య.

“మనం ఆ అమ్మాయిని వద్దని చెప్పనే లేదే! మరి మళ్ళీ ఎలా తాంబూలాలు?"

"నువ్వు చెప్పలేదు! కిరణ్ అమెరికా నుంచి ఫోన్ చేసి 'వద్దు’ అని చెప్పాడట. వాడు అలా చెప్పటంతో రోషం పెరిగి వెంటనే ఇంకో పెళ్ళికొడుకును చూసి సంబంధం ఖాయం చేసుకున్నారట"

మోసమూ, అవమానమూ 'కిరణ్ ఇలా చేశాడే?' అనే బాధ ఒకటిగా చేరటంతో...శిలలాగా కూర్చుండిపోయింది అత్తయ్య.

"నువ్వు చేసింది తప్పమ్మా! వాడికి ఇష్టం లేని అమ్మాయిని ఎందుకు నిశ్చయం చేయటానికి తొందర పడుతున్నావు?"

"కన్న తల్లికి ఆ అధికారం కూడా లేదంటావా? నేను చెబితే నువ్వు వినటం లేదా? అదే లాగా వాడూ నేను చెప్పేది వింటాడు అనుకున్నాను"

"ఐదు వేళ్ళూ ఒకేలాగ ఉన్నాయా? అయ్యిందేదో అయ్యింది...వదిలేయ్. నేను ఫోన్ చేస్తాను. సమాధానంగా మాట్లాడి వాడ్ని పెళ్ళికి పిలుస్తాను. 'నీకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు పెళ్ళి చేసుకో. అది నీ ఇష్టం' అని చెప్పు. వాడు రాకుండా నాకు పెళ్ళి వద్దు. ఉన్నది ఒక తమ్ముడు. వాడు లేకుండా ఎలా? వాడు పెళ్ళికి రావాలమ్మా. నేను చెప్పేది ఒకటేనమ్మా , ఒకటి వాడు పెళ్ళికి రావాలి. లేకపోతే...వాడు ఎప్పుడొస్తాడో అప్పుడే నా పెళ్ళి"

వరుణ్ ఇంత ఉద్రేకంగా, గట్టిగా, నిర్ణయం తీసుకుని మాట్లాడటం ఇంతవరకు ఎవరూ చూడలేదు! ఇల్లే అతన్ని ఆశ్చర్యంగా చూసింది. 'మాట్లాడేది వరుణేనా?' అనే భ్రమలో పడిపోయింది ప్రతిమ. అదే సమయం కిరణ్ వస్తేనే నా పెళ్ళి జరుగుతుంది అని అతను చెప్పటానికి అర్ధమేమిటో అర్ధంకాక తికమకపడింది ప్రతిమ.

****************************************************************************************************                                    ఇంకా ఉంది.....Continued in: PART-12