31, జులై 2021, శనివారం

ప్రేమ కలలు...(సీరియల్-PART-8)

 

                                                                            ప్రేమ కలలు                                                                                                                                                                        (సీరియల్-PART-8)

ఆ గదే సైలెంటుగా అయిపోయింది. అంజలి మాత్రం వెక్కి వెక్కి ఏడ్చే శబ్ధం మాత్రం వినబడింది.

"ఛీ...పిచ్చిపిల్లా...ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా జరిగి ముగిసి చాలా సంవత్సరాలు అయ్యింది...ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు?"

"లేదమ్మా. నువ్వు నాకోసం ఎన్ని  కష్టాలు అనుభవించేవు? అది తలుచుకుంటే..." మళ్ళీ కన్నీరు పొంగి పొర్లింది.

"సరే రోహినీ...తరువాత ఏమయ్యింది?".

"ఆ రోజు వెళ్ళినతనే. ఆ తరువాత మేమున్నామా, చచ్చిపోయామా అని తెలుసుకోవటానికి కూడా రాలేదు. ఎలాగో కష్టపడి దీన్ని పెంచి పెద్ద చేశాను. అప్పుడు మనసులోనూ, శరీరంలోనూ ఓపిక ఉండేది. దెబ్బతిని దెబ్బతిని ఉన్న హృదయం ఇప్పుడు ట్రబుల్ ఇస్తోంది"అన్నది.

రోహినీ నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకూడదు. దీనికీ, అంజలి ప్రేమను నువ్వు అంగీకరించక పోవటానికీ ఏమిటి సంబంధం! నాకు అర్ధం కాలేదు"

"అయ్యో ఆంటీ...ఇంకా అర్ధం కాలేదా? సుధీర్, అంజలిని ప్రేమించటం లేదు. నటిస్తున్నాడు. దాన్ని పెళ్ళిచేసుకుని చిత్రవధ పెడతాడు. నాకు జరిగింది దానికి జరగకూడదు కదా? అదైనా బాగా బ్రతకనీ!"

"ఏమిటే... సుధీర్ ఎంత మంచి పిల్లాడో  తెలుసా? అతనికి ఎంత పెద్ద మనసుంటే ఈ వృద్దాశ్రమం జరుపుతాడు? అతనికి డబ్బు ఆశ ఉండుంటే పెద్ద డబ్బుగల అమ్మాయిని చూసుకోనుంటాడు గానీ అంజలిని ఎందుకు చూడటం?”

ఆంటీ...మీరు అతనికి సపోర్టు చేసి మాట్లాడేటట్టైతే ఇక ఇక్కడికి రాకండి. నా కూతురుకు ఎవరు భర్తగా రావాలో నేను తీర్మానం చేసుకుంటాను. పెద్దవాళ్ళు మంచి మనసుతో ఏది చేసినా తప్పుగా అవదు. నేను గనుక మా నాన్న మాట వినుంటే నాకు ఈ గతి పట్టేదా?"

"అమ్మా...నువ్వు నా గురించి ఆలొచించకు. నీ విషయానికి రా. నాన్న ఇప్పుడొచ్చి మనల్ని పిలుస్తున్నారు. మనం వెళ్ళాలా...వద్దా? ఏం నిర్ణయించుకున్నావు?"

"నేను ఇంత చెప్పినా నీకు అర్ధం కాలేదా? వాడికి నా మీద ప్రేమ ఏమీలేదు. ఏదో మనసులో పెట్టుకునే పిలుస్తున్నాడు. ఒకసారి నేను వాడ్ని నమ్మి మోసపోయింది చాలదా? మళ్ళీ మళ్ళీ అవమానపడాలా?"

"అలా అనుకోవటం తప్పు రోహినీ. పలు సంవత్సరాలకు ముందు నువ్వొక తప్పు చేశావు. కానీ, ఈ రోజు వరకు దాన్ని తలచుకుని బాధ పడుతూనే ఉన్నావే? అలాగే అతను కూడా మారి ఉండొచ్చు కదా? ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు"

వాడు ఖచ్చితంగా మారడు ఆంటీ...ఇప్పుడు నాకేంటి తక్కువ? మీరున్నారు... అంజలి ఉంది. ఇంకేం కావాలి? నేను ప్రశాంతంగా ఉండిపోతాను" 

"అమ్మా అంజలీ...వెళ్ళి కొంచం కాఫీ కలుపుకు వస్తావా. నేను మీ అమ్మ దగ్గర మాట్లాడుతూ ఉంటాను" అన్న వెంటనే అంజలి లేచి లోపలకు వెళ్ళింది. ఆమె వెళ్ళిన  వెంటనే కుర్చీని ఎత్తి మంచం పక్కగా వేసుకుంది ఆంటీ.

"రోహినీ...నేను చెబుతున్నానని తప్పుగా అనుకోకూడదు. నిన్ను నా సొంత చెల్లిగా భావించి చెబుతున్నాను" అంటూ దేనికో పిడి వేసింది.

"ఏమిటి విషయం ఆంటీ? సుధీర్ విషయమైతే నేను వినటానికి రెడీగా లేను"

"లేదు...ఇది వేరు. నేనడిగే ప్రశ్నలకు జవాబు చెబుతావా?"

"అడగండి"

"ఈ రోజు కాకపోతే ఏదో ఒకరోజు అంజలికి పెళ్ళి చెయ్యాలి కదా?"

"అవును...అది 'బి.ఎడ్' చదువు పూర్తి చేసిన వెంటనే, సంబంధాలు చూడటం మొదలుపెడతాను"

"చాలా కరెక్ట్. సంబంధాలు ఎలా వెతుకుతావు? ప్రకటన ఇస్తావా...లేదు టీ.వీ లో ఎక్జిబిషన్ లో నిలబెట్టినట్టు నిలబెడతావా?"

"లేదు...లేదు. నేను మంచి పెళ్ళిళ్ళ పేరయ్యను పట్టుకుని అతనితో చెప్పి అంజలికి తగిన వరుడ్ని చూడమంటాను"

అది...ఇప్పుడు నువ్వు 'పాయింట్' కు వచ్చావు. మంచి పెళ్ళిళ్ళ పేరయ్య మూలంగా అయితే మంచి కుటుంబం దొరుకుతుంది. అందులో సందేహమేమీ లేదు. కానీ వరుడి ఇంటి వాళ్ళు...పిల్ల తండ్రి ఎవరు -- ఎక్కడున్నారు అని అడుగుతారే! అప్పుడెలా సమాధానం చెబుతావు? అందరి దగ్గర నువ్వు మోసపోయిన కథ చెబుతావా? వాళ్ళు అది నమ్మాలిగా?"

రోహిని సమాధానం చెప్పలేకపోయింది. ఆంటీ మళ్ళీ మొదలు పెట్టింది.

"నీకు భర్త వద్దు. అంజలికి నాన్న కావాలే? నువ్వు చిన్న వయసులో అన్ని సుఖాలను అనుభవించి, ప్రేమ కోసం అవన్నీ అవతలపారేసి వచ్చావు. కానీ, అంజలి పాపం...పుట్టిన దగ్గర నుండి పేదరికం తప్ప ఇంకేం చూసింది? ఇప్పుడు వాళ్ళ నాన్న బాగా డబ్బుతో ఉన్నప్పుడు అది ఎందుకు కష్టపడాలి?"

ఆలొచించటం మొదలు పెట్టింది రోహిని.

"బాగా ఆలొచించి చూడు. ఈ రోజు నీ దగ్గర పెద్దగా డబ్బులేదు. అలాంటప్పుడు అతను నిన్ను వెతుక్కుంటూ ఎందుకు రావడం? చెప్పు! అతను అనుకోనుంటే ఇంకో పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండి ఉండొచ్చు కదా?"

"ఆంటీ...కావాలంటే ఒక పని చేయనా? అంజలిని మాత్రం వాళ్ళ నాన్నతో పంపుతాను. నేను ఒంటరిగా ఉండిపోతాను?"

"చాలా బాగుందే...నువ్వు చెప్పేది చాలా బాగుంది. దీనికి అంజలి ఒప్పుకుంటుందా? ఎందుకింత స్వార్ధ పరురాలుగా ఉన్నావు రోహినీ?"

"ఎవరు...నేను స్వార్ధంగా ఉన్నానా? అంజలి కోసమే నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నాను. దానికి పెళ్ళి చేస్తేనే నేను హాయిగా కళ్ళు మూస్తాను"

పెద్ద వయసు మీరిన దానిలాగా మాట్లాడొద్దు. అలా నీకేమంత వయసైపోయింది. ఇక మీదట మనవుడు -- మనవరాలునో ఎత్తుకుని ముద్దాడాలి. ఇంతలో ఎందుకంత తొందర?"

ఒక మాటకు అన్నాను ఆంటీ...అంతే"

"ఇలా చూడు రోహినీ...జీవితంలో తప్పు చేయని వారు ఎవరు? అందరం ఏదో ఒక తప్పు చేసి దాన్ని సరిదిద్దుకోలేక కొట్టుకుంటున్నాం. పాపం మీ ఇంటాయన...ఆయన మారి వచ్చారు. ఇప్పుడు అతన్ని క్షమించి అంజలికి మంచి జీవితం ఏర్పాటు చేసివ్వు"

"ఆయన మంచివారు కాదు. ఇదే మా నాన్న చూసిన వరుడైతే నన్ను అనాధగా వదిలేసి వెళ్ళుంటారా? చెప్పండి"

నవ్వింది ఆంటీ.

"మంచి కథ...నీకు లోకజ్ఞానమే తెలియదు. ఏం చదివేవో...ఏం ఉద్యోగం చేశావో పో"

"ఏమిటి ఆంటీ చెబుతున్నారు?"

"చూడు...నా గురించి నీకేం తెలుసు?"

"మీరు నిర్మలా ఆంటీ...మీ ఆయన చనిపోయారు. మీకు పిల్లలు లేకపోవటం వలన ఇక్కడ చేరేరు...అంతే కదా?"

అది లోకానికి నేను చెప్పింది. నీ కథ లాగానే నా కథ కూడా. ఏమిటొక తేడా అంటే...నువ్వు ప్రేమించావు! నేను మా నాన్న చూసిన వరుడ్ని పెళ్ళి చేసుకున్నాను"

"తరువాత ఏమైంది?"

"తరువాత ఏమైందా? అంతా విధి. మొదట నాకు కొడుకు పుట్టాడు. ఆశగా శంకర్ అని పేరు పెట్టి పెంచాము. తరువాత మూడు సంవత్సరాలకు పిల్ల పుట్టింది. అప్పుడే విధి నన్ను చూసి నవ్వటం మొదలుపెట్టింది"

"మీరేం చెబుతున్నారు?"

"నాకు పుట్టిన ఆడపిల్లకు మెదడు వ్యాప్తి లేదు అని ఆరో నెలే తెలిసిపోయింది. దానికి ఏమీ తెలియదు. పిచ్చిదానిలాగా ఉంటుంది అని డాక్టరమ్మ చెప్పింది. వైద్యం చేసినా ఎటువంటి ప్రయోజనమూ ఉండదు అని చెప్పింది"

"అయ్యో పాపం?"

"పాపమే! కానీ ఏం చేయను...కన్నాను -- నా బిడ్డ అయ్యిందే...వదిలి పెట్టగలనా? ఇంటికి పిలుచుకు వచ్చి దాన్ని కంటికి రెప్పలాగా చూసుకున్నాను. కానీ మా ఆయన భయపడిపోయాడు. ఆయనకు జీతం తక్కువే. ఎక్కడ తన సంపాదనంతా ఆ పిల్ల బాగోగులకే సరిపోతుందేమో నని బాధపడటం మొదలుపెట్టారు. ఆ పిల్లను అనాధ ఆశ్రమంలో వదిలిపెట్టమన్నారు" -- చెప్పటం ఆపి కళ్ళు తుడుచుకుంది ఆంటీ.

"ఛ. ఇంత రాతి మనసు కలిగిన వాళ్ళు కూడా ఉంటారా?"

"ఉన్నారే!  నన్ను బాగా బలవంతం చేశారు...ఏది ఏమైనా సరే నేను నా పిల్లను అనాధ ఆశ్రమంలో విడిచి పెట్టను అని చెప్పాను"

"అదే కరెక్ట్"

"ఏం కరక్టు. నేను నా నిర్ణయం చెప్పిన  తరువాత రెండు రోజులు కూడా ఇంట్లో లేరు. చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంటికే రాలేదు. వివరాలేమీ తెలియనందువలన ఆయన ఆఫీసుకే వెళ్ళాను. ఆయన ఎక్కడో నార్త్ సైడుకు ట్రాన్స్ ఫర్ చేయించుకుని వెళ్ళారని చెప్పారు. ఇరవై ఏడేళ్ళ వయసులో ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఎవరి ఆదరణ లేక నిలబడ్డాను"

"మీ అమ్మా--నాన్నా?"

"అమ్మ చనిపోయింది. నాన్న అన్నయ్యతో ఉన్నారు. ఎక్కడ నేను భారంగా అయిపోతానేమోనని మా వదిన నన్ను దగ్గరకే చేర్చలేదు. ఇంకెవరున్నారు? ఏం చేయను నేను? అమ్మవారి మీద భారం మోపి వంట పనులకు వెళ్ళటం మొదలుపెట్టాను. ఈ మధ్యలో ఆ పిల్లకు ఫిట్స్ వచ్చి పదో ఏట చనిపోయింది. మనసు రాయి చేసుకుని క్యాంటీన్ మొదలుపెట్టాను. అందులో వచ్చిన సంపాదనతోనే కొడుకును సి. ఏ వరకు చదివించాను

"అబ్బో...మీ అబ్బాయి సి.ఏ. చదివాడా?"

అవును...చదివించటంలో నేను ఏమీ తక్కువ చేయకపోయినా...వాడే నా మీద ప్రేమను తక్కువ చేసుకున్నాడు"

"ఏమిటి ఆంటీ అలా చెబుతున్నారు"

"వాడికి మంచి సంబంధం కుదిరింది. వాడి చదువు చూసే ఒక గొప్ప ఆస్తిపరుడు అమ్మాయిని ఇచ్చాడు. నేనూ సంతోషంగా పెళ్ళి చేశాను. తరువాతే తెలిసింది. వచ్చింది నాకు కోడలు కాదు...యముడు అని"

"ఆమె మిమ్మల్ని చాలా బాధ పెట్టిందా?"

"అంతా ఇంతా కాదు? నన్ను చూస్తేనే దానికి ఇష్టముండదు. వంట మనిషి అని దానికి నిర్లక్ష్యం. నన్ను గౌరవించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. 

"ఒకరోజు మా కోడలు బంధువులు ఎవరో వచ్చారు. నేను వాళ్ళింటికి వంట చేయటానికి వెళ్ళున్నాను. అది ఆయన జ్ఞాపకముంచుకుని నన్ను విచారించారు. అంతే ఏదో పరువే పోయినట్టు అరిచింది నా కోడలు"

"దేనికి?"

ఆమె భర్త పెద్ద ఉద్యోగంలో ఉన్నాడట. అది కూడా గొప్ప కుటుంబంలో చేరిందట. ఆమె బంధువు దగ్గర నేనే కావాలని వెళ్ళి ఆమెను అవమాన పరిచేనని, ఇంకా ఏదేదో చెప్పింది..."

"మీరు ఏం సమాధానం చెప్పారు?"

"నేనేం చెబుతాను రోహినీ. పెద్దవాళ్ళ మాటలు నిచ్చన ఎక్కుతుందా? కొన్ని రోజులు గొణుగుతూ గడిపిన ఆమె...ఏం చెప్పిందో, ఎంత చెప్పిందో తెలియదు...వాడు. అదే నా కొడుకు నన్ను ఈ వృద్దాశ్రమంలో చేర్చేస్తాను. నెల నెల డబ్బులు కడతాను. నువ్వు వసతిగా ఉండొచ్చు అని చెప్పి ఇక్కడికి తీసుకు వచ్చి చేర్చి వెళ్ళిపోయాడు. ఇదంతా బయటకు తెలిస్తే అవమానం అనుకుని...భర్త చనిపోయాడు...పిల్లలు లేరు అని అబద్ధం చెప్పి ఉంచాను"

చాలాసేపు మౌనంగానే సాగింది.

"నాకు జరిగింది పెద్దలు చేసిన పెళ్లే,  ఏం జీవించాను గొప్పగా? కన్న కొడుకే నన్ను ఇక్కడ చేర్చేసి వెళ్ళిపోయాడు. దీన్నే విధి అంటారు"

"పాపం ఆంటీ మీరు. ఇంత సోకాన్ని మనసులో పెట్టుకుని తాళం వేసుకుని నవ్వి నవ్వి మాట్లాడుతున్నారు? మీ మనసు ఎవరికీ రాదు"

"నువ్వు నన్ను పొగడాలని నేను నా విషయం నీకు చెప్పలేదు. జీవితంలో కష్టాలూ, సుఖాలూ సహజం. ఇలా ఉండుంటే కష్టాలే వచ్చేవే కావని చెప్పలేము. అంతా భగవంతుడి చేతిలో ఉంది. నీ దుఃఖమే పెద్దది అని అనుకుంటున్నావు. కొంచం మిగతావారిని చూడు. ఈ ఆశ్రమంలో ఒక్కొక్కరి దగ్గర దుఃఖ కథలు చాలా ఉంటాయి. నువ్వు జరిగిపోయిన కాలం గురించి ఆలొచించి -- జరుగుతున్న కాలాన్ని వృధా చేసుకోకు" అన్నది ఆంటీ.

రోహిని ఆలొచించింది.

'ఆంటీ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. తప్పు చేయని వాళ్ళు ఎవరు? కానీ, నా వల్ల హరికృష్ణను క్షమించటం కుదరదు

క్షమించకపోయినా పరవాలేదు. కూతురికోసం ఆయన్ని చేర్చుకోవాలి. ఆంటీ చెప్పినట్టు రేపు అంజలి నాన్న గారి మాట వచ్చినప్పుడు ఆమె వెడుక్కి తలవంచ కూడదు. తల ఎత్తుకుని నిలబడి 'ఈయనే నా తండ్రి అని చెప్పాలి. దానికి హరికృష్ణను నేను చేర్చుకోవాలి.

ఒక నిర్ణయానికి వచ్చింది రోహిని.

"ఆంటీ...మీరు చెప్పింది ఆలొచించి చూశాను. మీరు చెప్పేదే కరెక్ట్.  అంజలి కోసం నేను ఆయన్ని చేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అంజలీ...నువ్వెళ్ళి మీ నాన్నను పిలుచుకు రామ్మా" అన్నది.

ఆనందంతో తల్లిని  కౌగలించుకుంది కూతురు.

                                                                                                       Continued...PART-9

***********************************************************************************************

29, జులై 2021, గురువారం

ప్రేమ కలలు...(సీరియల్-PART-7)

 

                                                                                 ప్రేమ కలలు                                                                                                                                                                       (సీరియల్-PART-7)

పూలమాల, మంగళసూత్రంతో తనని చూసిన వెంటనే నాన్న, అన్నయ్యలు మొదట తిడతారు...కోపగించుకుంటారు. కానీ చివరకు తన పెళ్ళిని అంగీకరించి తనని చేర్చుకుంటారు అని నమ్మింది. అదే నమ్మకం హరికృష్ణకూ ఉన్నది. వీళ్ళను వాకిట్లో చూసిన వెంటనే అన్నయ్యలిద్దరూ పరిగెత్తుకు వచ్చారు.

"రోహినీ...ఏంటమ్మా...ఇలా చేశావు? ఈ సారి ఎంత మంచి పెళ్ళికొడుకును చూశామో తెలుసా? నీకెందుకంత తొందర...ఎందుకమ్మా ఇలా చేశావు?"

"క్షమించండి అన్నయ్యా... ఇది తప్పితే నాకు వేరే దారి తెలియలేదు? నేను ఈయన్ను ప్రేమిస్తున్నాను. ఈయన్ని మనసులో ఉంచుకుని ఇంకొకరితో కాపురం చేయటం నా వల్ల కాదన్నయ్యా"

"నరసింహం...దాని దగ్గర ఏమిటి మాటలు? ఏ రోజైతే మనల్ని కాదని అది పెళ్ళిచేసుకుందో...అప్పుడే అది మన చెల్లి కాదు. ఇక దీనికీ మనకూ ఎటువంటి సంబంధమూ లేదు అనుకుని తలకి స్నానం చేసిరా"

"ఏమిటి జగన్ చెబుతున్నావు? ఈ నిర్ణయం మనం ఎలా తీసుకోగలం? నాన్న ఏం చెబుతారో?" అని రెండో అన్నయ్య మాట్లాడుతున్నప్పుడే ఆయన లోపలి నుండి వచ్చారు. ఆయన మొహం చలనం లేకుండా ప్రశాంతంగా ఉంది.

"నాన్నా...మీ ముద్దుల కూతురు చేసిన ఘనకార్యం చూశారా?  మీరున్నారు... ఇద్దరు అన్నయ్యలం మేమున్నాము. అందరినీ వదిలేసి...నిన్న వచ్చిన వాడితో భార్యగా వచ్చి నిలబడింది"

"ఊ...నేనూ చూస్తున్నాగా. మీరెందుకు కంగారు పడి ఇలా అరుస్తున్నారు? ఆమె జీవితాన్ని ఆమే నిర్ణయించుకుంది. దీన్నెందుకు పెద్ద విషయంగా తీసుకుంటున్నారు" --- అనేటప్పటికి....షాక్ అయ్యారు అందరూ.

మనసంతా పువ్వులాగా వికసించింది రోహినికి.

"నాన్నా, మీరు నన్ను క్షమించారా! నేను చేసినదాంట్లో మీకేమీ కోపంలేదే? చాలా థ్యాంక్స్ నాన్నా. లోపలకు వెళ్ళి వివరాలు మాట్లాడుకుందాం" అంటూ హరికృష్ణను తీసుకుని లోపలకు వెళ్లటానికి రెడీ అయ్యింది.

"ఉండమ్మా" అన్నది నాన్న స్వరం.

"ఏ హక్కుతో మా ఇంటి లోపలకు వస్తున్నావు? నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నన్నూ, మీ అన్నయ్యలనూ ఎంత బాధకు గురిచేస్తుందో ఆలొచించటానికి కూడా నువ్వు సిద్దంగా లేవు. ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వే అమర్చుకున్నావో...అప్పుడే నువ్వు ఒంటరిదానివి అయ్యావు. ఇప్పుడు నువ్వు బయట మనిషివి. మావల్ల నీకో...నీ భర్తకో జరగాల్సింది ఏదైనా ఉంటే చెప్పేసి వెళ్ళిపో. మా వల్ల అయినది చేస్తాం" అన్నారు నిదానంగా.

హరికృష్ణ కొంచం ముందుకు వచ్చాడు.

"మీరు మమ్మల్ని క్షమించాలి. ఎక్కడ రోహిని నాకు కాకుండా పోతుందో అన్న భయంతో ఈ నిర్ణయానికి రావలసి వచ్చింది. ఇప్పటికీ ఏమీ పరవాలేదు సార్. రహస్యంగా జరిగిన ఈ పెళ్ళి...ఎవరికీ తెలియదు. ఊరంతా తెలిసేటట్టు ఏర్పాటు చేసి మీరు జరిపే పెళ్ళిలాగా చేసేయండి. అప్పుడు మీకు అవమానంగా ఉండదు"

నవ్వారు బాపిరాజు గారు.

మీ పెళ్ళిని ఊరంతా తెలుసుకునేటట్టు నేనెందుకయ్యా జరపాలి? ఒకమ్మాయి మెడలో ఎన్నిసార్లు తాళి కడతావు? అంతే కాకుండా నాకు అమ్మాయే లేదే. అలాంటప్పుడు పెళ్ళి కొడుకు ఎక్కడ్నుంచి వస్తాడు?"

"సార్...నా వల్ల మీ కుటుంబంలో గొడవలు వద్దు. నేను తప్పు కుంటాను. మీరు మీ అమ్మాయిని పిలుచుకుని లోపలకు వెళ్ళండీ అన్నాడు హరికృష్ణ.

"మీరెందుకండీ వీళ్ళను బ్రతిమిలాడతారు?  మనం ఏమంత చెయ్యకూడని తప్పును చేశేశాము? ప్రేమించి పెళ్ళి చేసుకోవటం అంత పెద్ద నేరమా? వీళ్ళ రక్తమే నా శరీరంలోనూ పారుతోంది. నాకూ అదే వైరాగ్యం ఉంది. రండి...మనం వెళ్దాం" అంటూ వెనక్కి నడిచింది రోహిని.

"ఉండు రోహినీ...నా గురించి బాధ పడకు. నేను ఎలాగైనా బ్రతికేస్తాను. కానీ నువ్వు...వసతిగా జీవించావు. నా వలన నువ్వు కష్టపడకూడదు. మనకి పెళ్ళే జరగలేదు అనుకో. తాళిని విప్పి నాకు ఇచ్చేసి వెళ్ళిపో. అప్పుడు వాళ్ళు నిన్ను మన్నించి చేర్చుకుంటారు"

"కేవలం...డబ్బుకోసం, వసతికోసం నేను తాళిని విప్పేస్తాననుకున్నారా? ఈ రోజు బూజును దులిపినట్లు, నన్ను దులిపేసి వదిలేసేరు కదా! వీళ్ళ ముందు మనం గొప్పగా బ్రతికి చూపిద్దాం. మన దగ్గర శ్రమ ఉంది. దాన్ని నమ్మితే చాలు. రండి..."

"చూడమ్మా...ఈ రోజుతో నీకూ, ఈ ఇంటికీ ఉన్న బంధం ముగిసిపోయింది. ఇక డబ్బో-నగలో అడుగుతూ ఈ గుమ్మం తొక్కకూడదు. అలా చేసే ధైర్యం నీకుందా?"

ఏదో చెప్పటానికి నోరు తెరిచిన హరికృష్ణను మాట్లాడనివ్వకుండా తానే మాట్లాడింది రోహిని.

"ఇలా చూడండి సార్, నేను ఇక ఈ ఇంటికి రానే రాను. ఇక నాకు అన్నీ ఈయనే. మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దు. మీ డబ్బు పెట్టుకుని మీరే ఏడవండి" అన్న రోహిని, హరికృష్ణను పిలుచుకుని వచ్చేసింది.

ఇక పాత ఉద్యోగం అతనికి ఉండదని తెలిసి, ఇద్దరూ విజయవాడకు దగ్గరలో ఉన్న గ్రామానికి వచ్చారు. అదే బాపిరాజు గారి పూర్వీకుల ఊరు అని రోహిని విని ఉంది. అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టాల్సి వచ్చింది. తల మీద చేతులు పెట్టుకుని ఒక మూలగా కూర్చున్నాడు హరికృష్ణ.

"మీరు బాధ పడకండి కృష్ణా --మీకు నేనున్నాను. ఇంకో ఉద్యోగం దొరక కుండానా పోతుంది"  అన్నది ఓదార్పుగా.

ఒక్కసారిగా బుసకొట్టాడు అతను "ఎంకమ్మా...నా ప్లానునే చెడగొట్టేసేవే! నల్ల పిల్లిలాగా ఉన్న నిన్ను ఎందుకు ప్రేమించానో? లేదు...లేదు...ప్రేమిస్తునట్టు నటించానో తెలుసా? నువ్వు బాపిరాజుకి ఒకే కూతురువి. నిన్ను పెళ్ళి చేసుకుంటే వసతిగా -- ఉద్యోగమే చేయకుండా ఇంటల్లుడుగా ఉండి పోదామనుకున్నాను. ఆస్తి బాగా వస్తుందని లెక్క వేసుకున్నాను. శనేశ్వరం...అంతా చెడ దొబ్బేవు కదే!"

మనసు మధ్య భాగంలో గట్టిగా దెబ్బతిన్నది రోహిని. తల తిప్పుతున్నట్టు అనిపించింది. నిలబడలేక కాళ్ళు వణికినై. ఒక్కసారిగా చెమటలు పట్టినై. షాక్ తో నాలిక పొడిబారింది.

అతను మాట్లాడుతూ వెడుతున్నాడు.

"వాళ్ళు మన పెళ్ళిని ఒప్పుకోరని తెలుసుకున్న తరువాత వెంటనే త్యాగం చేసేవాడిలాగా నటించి నిన్ను విడిచి పెట్టి, కనీసమైన డబ్బును గుంజుదామని చూశాను...పెద్ద పతివ్రతలాగా తాళిని విప్పను అని చెప్పి దాన్ని కూడా పాడుచేసావు"

హరికృష్ణ మాట్లాడుతూ పోతుంటే అతని అసలు రూపం ఆమెలో విచ్చు కుంటూ పోతోంది. 'వీడికి మనసే లేదు. వీడుత్త డబ్బు పిశాచి అనేది చాలా ఆలశ్యంగా అర్ధం చేసుకుంది ఆ అమాయకురాలు. హృదయం నొప్పి పుట్టింది. మెడడులో చాలా గందరగోళం.

"సరి...సరి...జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం చెయ్య గలిగింది ఒకటే ఒకటి. త్వరగా ఒక బిడ్డను కని, దాన్ని మీ నాన్న కాళ్ళ దగ్గర పడేసి బేరమాడితే, ఒక వేల మనల్ని క్షమించి కొంచమైనా ఆస్తి ఇస్తారు. ఇలా చూడమ్మా...'మనం వీడ్ని పెళ్ళి చేసుకున్నామే, ఇతను ఉద్యోగం చేసి మనల్ని కాపాడతాడు అని మాత్రం కలలు కనకు. ఇంటికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను" అంటూ బయటకు వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళిపోయిన తరువాతే కొంచం కొంచంగా స్వీయ భావ వలలోకి  వచ్చింది.

'భగవంతుడా...వీడ్ని నమ్మి ఎంత పెద్ద తప్పు చేశేను? నాన్న ఎంతగా చెప్పారో...ఎందుకు వినలేదు? ప్రేమ మోహం కళ్ళు కప్పేసింది. ఇక నేనేం చేయను?' వేదనతో ఆమె కళ్ళల్లో నీళ్ళు నదిలా ప్రవహించినై.  తన తలరాతను తలుచుకుని ఏడుస్తూనే ఉంది. సముదాయించే వాళ్ళు కూడా లేరు.

రెండు గంటలైనా వెళ్ళిన అతను తిరిగి రాలేదు. ఇప్పుడు ఆ భయం కూడా ఆమెను చేరుకుంది.

కళ్ళు తుడుచుకుంది. దేవుడి మీద భారం వేసింది. ఎప్పుడో చనిపోయిన తల్లి జ్ఞాపకానికి వచ్చింది. మళ్ళీ కన్నీరు మొదలయ్యింది. 'అమ్మా...నువ్వుంటే నాకు ఇలాగంతా జరిగేదా?' -- ఏడ్చింది.

'ఇంకా ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. నా జీవితం ఇంతే అనేది తెలిసిపోయింది. ఏ కారణం  చేత కూడా పుట్టింటికి మళ్ళీ వెళ్ళకూడదు. అది ఖచ్చితం. వీడ్ని నమ్ముకుని ప్రయోజనమూ లేదు. నా చేతులను నమ్ముకునే నేను బ్రతకాలి. చదువు సహాయం చేస్తుంది తనని తాను సముదాయించుకుంది!

సుమారుగా ఏడున్నర ప్రాంతంలో హరికృష్ణ వచ్చాడు. బాగా తాగున్నాడనేది అతను దగ్గరకు వస్తున్నప్పుడే అర్ధమయ్యింది.

"మీరు తాగుతారా?"

అవును...బాగా తాగుతాను. నీకేమొచ్చింది? నీ డబ్బుతోనా తాగాను? ఏమిటే ఆ చూపు? నేనేమీ భయపడను. ఈ రోజు మనకి 'ఫస్ట్ నైట్' త్వరగా బిడ్డ పుట్టాలని వేడుకో" అన్నాడు.

మరుసటి రోజు తెల్లవారుతుండగానే బయటకు వెళ్ళిపోయాడు.

ఇంట్లో ఒక జీవి ఉందే...భోజనానికి ఏం చేస్తుంది? అనే ఆలొచన కూడా లేకుండా...'నేను రాత్రికే వస్తాను అని వదిలేసి వెళ్ళిపోయాడు.

మళ్ళీ ఏడవటానికి ఓపిక లేదు...మనసూ రాలేదు రోహినికి. జరగవలసిన పనులు మొదలుపెట్టింది.

చేతులకూ, చెవులకూ వేసుకున్న స్వల్ప బంగారాన్ని అమ్మి ఇంటికి కావలసిన వస్తువులు కొన్నది. కొంచం డబ్బుతో రెండు చీరలు, జాకెట్టు గుడ్డలు అని కొనుక్కుంది.

పక్కన ప్రైవేట్ స్కూలు ఒకటుంది. అక్కడికి వెళ్ళి తన చదువు గురించి చెప్పి ఉద్యోగం అడిగింది. ఆమె ఎం.ఎస్.సి.మాత్స్ చేసినందువలన వెంటనే ఉద్యోగం దొరికింది. జీతం నెలకు ఐదువేలు. శనివారం కూడా స్కూలుకు రావాలి. అంటూ అన్ని షరతులకూ ఒప్పుకుంటూ ఉద్యోగంలో చేరింది.

ఆమెకు ఉద్యోగం దొరికిందని తెలుసుకున్న వెంటనే తాను ఉద్యోగం వెతుకుంటున్న పని ఆపాశాడు హరికృష్ణ.

ఎప్పుడు చూడూ భార్యను తిడుతూనే ఉంటాడు. తన పధకం ఓడిపోయింది. ఆస్తి, డబ్బూ దొరకలేదని గొణుగుతూ ఉండేవాడు. కొన్నిసార్లు దెబ్బలు కూడా తగిలినై. రోజులు గడుస్తున్న కొద్ది మూర్ఖత్వం పెరిగిందే తప్ప -- ఆమెపై జాలో-దయో చూపించనే లేదు.

అన్నిటినీ మౌనంగా సహించటం అలవాటు చేసుకుంది రోహిని. లోతైన మనసులో నుండి ఎంత అణుచుకున్నా దాన్ని దాటి తన జరిగిపోయిన కాలం జ్ఞాపకాలను ఆశపడుతుంది. 'ఎలాగో వసతులు -- విలాశవంతంగా ఉండవలసిన ఆమె ఇలా కష్టపడుతున్నామే?' అని ఆవేదన చెందుతుంది. ఆ టైములో మనసును రాయి చేసుకుంటుంది. స్కూల్ పిల్లల  నోటు పుస్తకాలనో, పరీక్ష పేపర్లనో తీసి పెట్టుకుని ఆ పనిలో ఐక్యమైపోతుంది.

ఒక్కొక్క రోజూ నరకంలా గడిచింది. అయినా కానీ పళ్ళు కొరుక్కుంటూ గడిపింది. ఇలాంటి టైములోనే ఆమె గర్భం దాల్చిందని కన్ ఫర్మ్ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే హరికృష్ణ పెద్దగా రియాక్ట్ అవలేదు.

"ఇది పుట్టిన తరువాతైనా మీ నాన్న నిన్ను చేర్చుకుంటాడా అని చూద్దాం?" అన్నాడు.

కానీ, రోహిని తన బిడ్డకొసం చాలా ఆశగా ఎదురుచూసింది. 'ఎండి పోయిన ఎడారిలో వర్షం కురిసినట్టు’… 'నాలిక మీద పడ్డ తేనె బొట్టులాగా '...తన జీవిత ఆనందమే ఈ బిడ్డే  కనుక రాధ చాలా దృఢంగా ఉంది.  బాగా తింటూ ఆరొగ్యాన్ని మెరుగుపరుచుకుంది. మర్చిపోకుండా వాక్సిన్లు వేసుకోవటానికి చాలా గమనికతో ఉండేది.

కాన్పు నొప్పులు వచ్చి చుట్టు పక్కలున్న వారి సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ప్రశవం జరగబోతోంది అన్న పరిస్థితిలోనూ అతను వచ్చి చూడలేదు.

బుధవారం సాయంత్రం అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చి తల్లి అయ్యింది రోహిని. మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉంది. అప్పుడు కూడా అతను రాలేదు. తానే రిక్షా చేసుకుని వచ్చి ఇంట్లో దిగింది.

బిడ్డ పుట్టిన శరీరం నీరసంగా ఉంది. అయినా ఆమె వలన ఒక్క క్షణం కూడా రిలాక్స్ గా కూర్చోలేకపోయింది. ఆమె లేని సమయంలో హరికృష్ణ ఇంటిని అశుభ్రం చేసేశాడు. అది శుభ్రం చేసి -- బిడ్డకు పాలిచ్చి--తనకు పత్యం భోజనం తయారుచేసుకోవటం అనే పనులు చేసి ముగించుకునేటప్పటికి తల తిరుగుతున్నట్టు అనిపించింది.

ఆమె పరిస్థితి చూసి పక్కింటి పనిమనిషి గౌరి, భోజనం చేసి పంపేటట్టు...దానికి తగిన డబ్బు తీసుకునేటట్టు ఒప్పుకుని భోజనం బాధ్యత ఆమె తీసుకుంది. అది రోహినికి చాలా ప్రశాంతతను ఇచ్చింది.

హరికృష్ణ కనిపించనే లేదు. దాని గురించి రోహిని బాధ పడనూ లేదు. ఐదు నెలలు గడిచినై. బిడ్డను గౌరి దగ్గర ఇచ్చేసి స్కూలుకు వెళ్ళటం మొదలుపెట్టింది. జీవితం సాఫీగా గడుస్తోంది.    

సడన్ గా ఒకరోజు వచ్చాడు భర్త.

"అరెరే...ఇదేనా నా బిడ్డ? ఆడపిల్లనా? అరే శనేశ్వరం...మగ బిడ్డగా పుట్టి ఉండకూడదా? నీకు టాలెంట్ చాలదు. అందుకనే ఆడపిల్లను కని తీసుకు వచ్చావు" అన్నాడు కఠినంగా.

మౌనంగా అతనికి కంచం పెట్టి భోజనం వడ్డించింది.

"మగ బిడ్డగా పుట్టుంటే తాతయ్య ఆస్తి, మనవడికే వస్తుందని చెప్పి కోర్టులో దావా వేసుండొచ్చు కదా? అందుకే చెప్పాను. సరి...సరి...ఇప్పుడు కూడా చెడిపోయింది ఏమీలేదు. బిడ్డను తీసుకుని బయలుదేరు"

"ఎక్కడికి?" అన్నది పులుసు పోస్తూ!

"ఇంకెక్కడికి...మీ ఇంటికే. మీ నాన్న కాళ్ళ దగ్గర ఈ బిడ్డని పడేయ్. దీన్ని పెంచటానికి మా వల్ల కావటం లేదు. 'డబ్బులేక అల్లాడిపోతున్నాము అని చెప్పి ఏడు. ఆయన నిన్ను మాత్రం చేర్చుకున్నా పరవాలేదు. నేను నిదానంగా వచ్చి కలిసిపోతాను. అంతవరకు నువ్వు నాకు కొంచం డబ్బులిచ్చి ఆదుకోవా ఏమిటి? "అన్న హరికృష్ణ, భోజనం పూర్తి చేసి లేచాడు.

ఉన్నదాంట్లోనే బాగా చినిగిపోయిన చీరను కట్టుకో. బిడ్డకు కూడా మామూలు గుడ్డలు వేయి. ఇలా పౌడర్ అంతా పూసి అందంగానూ, శుభ్రంగానూ తీసుకువెళ్ళకు. అలా ఉంటేనే నీ మీద జాలి కలుగుతుంది" అన్నాడు.

అంత వరకు మాట్లాడ కుండా ఓర్పుగా ఉన్న రోహిని పిల్లను గుడ్డ ఊయలలో వేసి నిద్ర పోనిచ్చి వచ్చింది. చిన్నగా చెప్పినా ఖచ్చితమైన స్వరంతో మట్లాడింది.

"చూడండి...మీరెంత ఒత్తిడి చేసినా మా నాన్న దగ్గరకు బిచ్చం ఎత్తుకుంటూ వెళ్ళను. ఆయనకున్న కఠిన మనసు, పరువు, రోషమూ నాకూ ఉండదా? నా పిల్లను బిచ్చగత్తెను చెయ్యలేను. మీరు నన్ను కొట్టి చంపినా పరవాలేదు...ఆ ఇంటి గడప తొక్కను..." అన్న  రోహిని ఊయలను ఊపటానికి వెళ్ళింది.

ఆమె చెప్పింది విన్న తరువాత హరికృష్ణ నోటి నుండి వచ్చిన మాటలు చెప్పటానికి పనికిరావు.  అంత అసహ్యంగా మాట్లాడాడు. ఒక సమయంలో చేతులు ఎత్తి కొట్టటానికి వచ్చినప్పుడు ఆపింది.

"నన్ను కొట్టటానికి చెయ్యి ఎత్తేరంటే...ఊరీకే  ఉండను. తిరిగి కొడతాను. ఆ అవమానం మీకు అవసరమా? మాట్లాడ కుండా, గొడవ పడకుండా ఉండేటట్టు అయితే భర్త అనే కారణంతో భోజనం పెడతాను. అది వదిలేసి 'మీ ఇంటికి వెళ్ళు -- డబ్బులు తీసుకురా' -- అలాఇలా అని మెదలుపెట్టేరా... ఊరికే ఉండను. పోలీసులకు చెప్పి లోపల  పెట్టిచేస్తాను. అప్పుడు జీవితాంతం చిప్ప కూడే" అన్నది.

ఆమెను కోపంతో, విసుగుతో చూసేసి, ఏమీ మాట్లాడకుండా కోపంతో తలుపులను గట్టిగా మూసి బయటకు వెళ్ళిపోయాడు. ఆ శబ్ధానికి పాపకు నిద్రా భంగం కలిగి ఏడుపు మొదలు పెట్టింది.

                                                                                                      Continued...PART-8

***********************************************************************************************

28, జులై 2021, బుధవారం

కోపంగా ఉన్న వాతావరణం మరియు మహమ్మారి మధ్య నలిగిపోతున్న ప్రపంచం...(సమాచారం)


                            కోపంగా ఉన్న వాతావరణం మరియు మహమ్మారి మధ్య నలిగిపోతున్న ప్రపంచం                                                                                                                         (సమాచారం) 

వరదలు, వేడి తరంగాలు, కృత్రిమ వర్షం(యాంగ్రీ వెదర్) ,మహమ్మారి మధ్య ప్రపంచం ఎలా స్పందిస్తోంది.

ఒక వైరస్ ప్రపంచాన్ని ముందుకు పోనివ్వకుండా నిలిపివేసింది.  ఇప్పుడు ప్రపంచ వాతావరణ మార్పు దాని చుట్టూ వల విసురుతోంది. ఘోరమైన జలప్రళయం చైనా, జర్మనీ, బెల్జియం, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు గ్రహం అంతటా వాతావరణ మార్పులను మరింత దిగజార్చింది.

                                                                           భారత దేశంలో వరదలు

కుండపోత వర్షం నగరాలను, గ్రామలనూ వరద నీటితో ముంచెత్తటమే కాకుండా వందాలది మంది ప్రాణాలను బలితీసుకుంది.

ఐరోపాలో, వాతావరణ మార్పు ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు పెద్ద మరియు నెమ్మదిగా కదిలే తుఫానుల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. దీని వలన జర్మనీ మరియు బెల్జియంలో కనిపించే రకమైన వరదలను అసి బట్వాడా చేస్తుందని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ పత్రికలో జూన్ 30 ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది.

                                                                              చైనాలో వరదలు

వాతావరణ మార్పులతో వాతావరణం వేడెక్కినప్పుడు, ఇది మరింత తేమను కలిగి ఉంటుంది, అంటే వర్షపు గడ్డలు విరిగినప్పుడు, ఎక్కువ వర్షం విడుదల అవుతుంది. శతాబ్దం చివరి నాటికి, ఇటువంటి తుఫానులు 14 రెట్లు ఎక్కువ కావచ్చు. పరిశోధకులు కంప్యూటర్ అనుకరణలను ఉపయోగించి అధ్యయనంలో కనుగొన్నారు.

పశ్చిమ మరియు దక్షిణ జర్మనీ యొక్క విస్తారమైన ప్రాంతాలను విధ్వంసం చేసిన వరదలు, చైనా దేశ నగరంలోని హేనాన్ సంఘటనల నుండి వేల కిలోమీటర్ల దూరంలో సంభవించినప్పటికీ, రెండు సందర్భాలలోనూ భారీ జనాభా ఉన్న ప్రాంతాలు విపత్తు వరదలు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే అవకాశం ఉంది అని చెప్పకనే చెబుతోంది.

                                                                      జర్మనీలో వరదలు

ఆనకట్టలను, కాలువలను బలోపేతం చేయడానికి, మరియు క్లైమేట్ ప్రూఫింగ్ హౌసింగ్, రోడ్లు మరియు పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి బిలియన్ల ఖర్చు అవుతుంది. కానీ జెంగ్జౌలో ఛాతీ లోతైన నీటిలో మునిగిపోయిన సబ్వేలలో ప్రాణంకొసం పోరాడుతున్న ప్రజల అరుపులు, లేదా మధ్యయుగ జర్మన్ పట్టణాల గుండా బురద మరియు శిధిలాలలో కొట్టుకుపోతున్న ప్రజలు భయంతో కేకలు వేయడాన్ని మొబైల్ ఫోన్ ఫుటేజ్ ద్వార చూసినప్పుడు పట్టణాలలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి చేసిన ఖర్చు ఎందుకూ ప్రయోజనం లేదని స్పష్టం చేసింది.

సాధారణంగా రెండు కారణాల వల్ల కలిపి  వరదలు సంభవిస్తాయి: ఒకటి, సాధారణ వర్షపాతం కంటే భారీగా వర్ష్పాతం పడటం వలన మరియు రెండు, సేకరించిన అదనపు వర్షపునీటిని విడుదల చేయడానికి నదులకు తగినంత సామర్థ్యం లేకపోవడం " సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్లో వాతావరణ మరియు వాతావరణ శాస్త్రవేత్త కోహ్ టిహ్-యోంగ్ చెప్పారు.

భవనాల స్థితిస్థాపకతను మెరుగుపరచడం, నదీ తీరాలను పెంచడంపారుదల మెరుగుపరచడం వంటి చర్యలు తీవ్రమైన వరద ప్రభావాలను నివారించడానికి అవకాశం లేదు.

                                                                    కెనడాలో వేడి తరంగాలకు

ఇంతలో, కెనడా యొక్క వాంకోవర్ ప్రాంతంలో గత నెలలో కనీసం 134 మంది మరణించారు, నగర పోలీసు విభాగం మరియు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం. వాంకోవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే 65 కి పైగా ఆకస్మిక మరణాలకు ప్రతిస్పందించింది, చాలావరకు "వేడికి సంబంధించినది".

                                              యునైటడ్ అరబ్ ఎమిరేట్స్ లో క్లౌడ్ సీడింగ్

దుబాయ్ లో వర్షపాతం గురించి ఆలోచించాల్సి వచ్చింది. క్లౌడ్ సీడింగ్ యొక్క కొత్త పద్ధతిని ఉపయోగించి, వారు విద్యుత్తుతో మేఘాలను సేకరించి వర్ష్పాతం పడేటట్టు చేసారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని నగరం 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో పోరాడిన తరువాత కొంత విరామం పొందింది. క్లౌడ్ సీడింగ్ కొంతకాలంగా జరిగింది.కరువును తగ్గించడానికి భారతదేశంలో అనేక సందర్భాల్లో ఉపయోగించబడుతోంది.

                                                                     దుబాయ్ లో క్రుతిమ వర్షం

వాతవారణ మార్పును వీలైనంత త్వరగా అరికట్టటం, వైరస్ పరిసోధనా ల్యాబులను మరింత బద్రతలోకి తేవడం చాలా అవసరమనేది ప్రపంచ రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు యుద్ద ప్రాతిపదికన పరిష్కారాలు కనుక్కొని అమలుపరచాలి

Images Credits: To those who took the original photos.

************************************************************************************************