30, జనవరి 2020, గురువారం

'కరోనా' వైరస్ వ్యాప్తికి కారణం?!...(న్యూస్ /ఆసక్తి/మిస్టరీ)



                                       'కరోనా' వైరస్ వ్యాప్తికి కారణం?!


ప్రపంచాన్ని భయపెడుతున్న 'కరోనా' వైరస్ వ్యాప్తికి కారణం ఎవరు?...నిజం ఏమిటి?

ప్రమాదకరమైన కరోనావైరస్ వ్యాప్తి వాస్తవానికి మానవ నిర్మిత కిల్లర్ వ్యాధిగా ఉంటుందా!?


చైనా ప్రభుత్వం చెప్పినట్టు వుహాన్ కరోనావైరస్ చేపల మార్కెట్లో ఉద్భవించలేదని ఆధారాలు చెబుతున్నాయి. వుహాన్ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ వైపు వేళ్లు చూపుతున్నాయి.

 చైనాలోని వుహాన్ నగరంలో 50 మిలియన్లకు పైగా ప్రజల అసాధారణమైన ‘లాక్ డౌన్’ వెనుక ‘nCoV-2019’ అని పిలువబడే కరోనావైరస్ ఉంది - మరియు మానవ కార్యకలాపాలు ఆ వైరస్ ను వదిలుంటాయ్ అని నమ్ముతున్నారు.

1) వుహాన్ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ కనీసం 2016 నుండి కరోనావైరస్ ను అధ్యయనం చేస్తోంది.


2) వూహాన్ కరోనావైరస్ ఆ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ నుండి లీక్ అయి ఉండవచ్చని పెరుగుతున్న ఆధారాలు సూచిస్తున్నాయి.

3) అదే నిజమైతే, చైనా పరిశోధనా సంస్థ నుండి అ ప్రమాదకరమైన వైరస్ లీక్ అవ్వడం ఇది మొదటిసారి కాదు.

వుహాన్ కరోనావైరస్ వ్యాప్తితో సంబంధం ఉన్నట్లు ఎక్కువగా అనుమానిస్తున్న వుహాన్ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ వైరస్ గురించి అధ్యయనం చేస్తున్నట్లు 2016 పత్రాలు చూపిస్తున్నాయి. ఈ వ్యాధి చెపల మార్కెట్లో ఉద్భవించలేదని పెరుగుతున్న సాక్ష్యాలు సూచిస్తున్నాయని చైనా ప్రభుత్వం పేర్కొంటోంది.

ధృవీకరించని నివేదికలు నిజమైతే, చైనా వైరాలజీ పరిశోధనా కేంద్రం నుండి  ప్రమాదకరమైన  వైరస్ తప్పించుకోవడం ఇది మొదటిసారి కాదు. మార్చి 2004 లో, చైనాలోని బీజింగ్‌లోని నేషనల్ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ నుండి ఘోరమైన SARS వైరస్ తప్పించుకున్నది. దానివలన 9 మంది వ్యాధిగ్రస్తులయ్యారు. అందులో ఒకరు మరణానికి గురయ్యారు. ప్రస్తుత ప్రమాదకరమైన కరోనావైరస్ వ్యాప్తికి మూలం ఇలాంటిదే అయ్యుండొచ్చు.

ఈ వ్యాది సోకినది ప్రభుత్వ అధికారిక సంఖ్యల కంటే చాలా ఎక్కువ.



పై ఫోటోలో మీరు చూస్తున్నదే 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ, వుహాన్(ఇక్కడి నుండే కరోనా వైరస్ లీక్ అయ్యుండొచ్చని భావిస్తున్నారు)

హాంగ్ కాంగ్ యొక్క వార్తాపత్రిక అయిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, వుహాన్ కరోనావైరస్ వ్యాప్తి చైనా ప్రభుత్వం అంగీకరించిన దానికంటే తీవ్రంగా ఉండవచ్చు. హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయం (HKU) నుండి వచ్చిన విద్యావేత్తలు ఇప్పుడు వుహాన్‌లో సోకిన వారి సంఖ్య(వారం క్రిందటి లెక్కలు) 43,590 కు చేరుకుందని అంచనా వేశారు - ఇది చైనా ప్రభుత్వ అధికారిక సంఖ్య కంటే 1456% ఎక్కువ.

HKU విద్యావేత్తల నుండి వచ్చిన డేటా-ఆధారిత గణిత నమూనా అంచనా ప్రకారం, వుహాన్ కరోనావైరస్ యొక్క అంటువ్యాధుల సంఖ్య ప్రతిరోజూ 1,50,000 కొత్త కేసులను సూచిస్తోంది.

చైనా ప్రభుత్వం కేవలం 2,800 మందికి మాత్రమే ఈ వ్యాధి సోకిందని పేర్కొన్నారు. కానీ వారి చర్యలను చూస్తుంటే వారే ఈ సంఖ్యను నమ్మవద్దని కూడా సూచిస్తున్నట్లు కనబడుతోంది.

కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి చైనా ప్రభుత్వ అధికారులు రికార్డు స్థాయిలో తొమ్మిది బిలియన్ల డాలర్ల నిధులను కేటాయించారు. (ఎందువల్ల ఇంత ఖర్చు?)

మొత్తం జనాభా 60 మిలియన్లకు పైగా ఉన్న అన్ని నగరాలను సంసర్గ నిషేధంలో(క్వారంటైన్‌) లో నిర్బంధించారు. లెజెండ్ సినిమా చాలా మంది చూసే ఉంటారు. అందులో లాగానే వుహాన్ నగరం కూడా ఉన్నది. ఎప్పుడూ అత్యధిక జన సమూహంతో ఉండే అ నగరం ఒక మన్యుష్యులే లేని అడవి ప్రాంతంలా ఉన్నది. ఈ క్రింది వీడియోలో అది మీరు చూడవచ్చు. ప్రజలందరినీ ఇళ్ళ నిర్భందలో ఉంచారు.


అతి తక్కువ కాలంలో రెండు సరికొత్త 1,000 పడకల ఆసుపత్రులను నిర్మించటం మొదలుపెట్టారు.( ఎందుకా తొందర?)

వుహాన్ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ నుండి కరోనా వైరస్ లీక్ అయ్యిందా?.

ధృవీకరించని నివేదికలు ఈ ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తికి వుహాన్ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ మూలం కావచ్చు.'ఇన్స్ టి ట్యూట్' నుండి వుహాన్ కరోనావైరస్ లీక్ అయినట్లయితే, చైనాలో ఇటువంటి ఉల్లంఘన జరగడం ఇదే మొదటిసారి కాదు.

2004 లో, చైనీస్ 'సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' నుండి ఐదుగురు ఉన్నతాధికారులకు, వారి సదుపాయంలో లీక్ కారణంగా సంభవించిన SARS వ్యాప్తికి...శిక్ష విధించారు. బీజింగ్ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీలో ఈ లీక్ సంభవించింది, ఇక్కడ పరిశోధకులు ప్రత్యక్ష మరియు క్రియారహిత SARS కరోనావైరస్ ప్రయోగాలు చేస్తున్నారు. ఇద్దరు కార్మికులు SARS బారిన పడ్డారు మరియు తరువాత ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించింది.

అతి తక్కువ కాలంలో ప్రపంచవ్యాప్తం వ్యాపించే వేగం కలిగిన ఈ కరోనా వైరస్ ను ప్రపంచంలోని అగ్ర రాజ్యాలు ఎలా నియంత్రిస్తుంది?....వేచి చూడాలి!

Image credit: to those who took the original photo.

28, జనవరి 2020, మంగళవారం

ఆలయం(సీరియల్)...PART-11



                                                   ఆలయం(సీరియల్)
                                                            (PART-11)


"లేకపోతే ఏమిటమ్మా... నేను వచ్చి ఎంతసేపైందో తెలుసా?"

"అలాగా...'టీ.వీ.' లో సీరియల్ చూస్తూ ఉండటంతో నువ్వు వచ్చింది గమనించలేదు"

"నువ్వు ఎలా గమనిస్తావమ్మా! నేను టీ.వీ. లో కనబడి 'అమ్మా...ఆకలేస్తోంది’ అని అడిగితేనే, నా మీద నీ దృష్టి పడుతుందని చెప్పు"

"ఛఛ...మీ నాన్న రానీ, ఇద్దరికీ ఒకేసారి భోజనం పెడతాను"

"అమ్మా...నాన్న ఎప్పుడో వచ్చాశారు. అక్కడ చూడండి మంచం మీద"

---శంకరయ్య తల్లికి చూపగా, మాలతీ బెడ్ రూమువైపు చూసింది.

వెంకట్ ప్రసాద్ చెవులకు వాళ్ళ సంభాషణ వినబడింది.

"నాన్నా లేచిరా...నాకు బాగా ఆకలిగా ఉంది"

----శంకరయ్య పిలిచాడు. ప్రసాద్ లేచి కట్టుకున్న లింగీని బాగా సర్ధుకుని హాలులోకి వచ్చాడు. మొహంలో డల్ నెస్.

"ఏం నాన్నా డల్ గా ఉన్నారు?"

"అరే నువ్వొకడివిరా...మీ నాన్న అలా ఉంటే 'కంపనీ' లో ఏదో సమస్య అని అర్ధం".

"అవునా నాన్నా?"

"ఆయన్ని ఎందుకు అడుగుతావు...నన్ను అడుగు. నేను చెబుతాను. నీకు ఏది జరిగినా...నాకు ఏది జరిగినా ఆయన బాధపడరు. ఆయన బాధపడుతున్నారు అంటే 'కంపనీ' లో ఏదో సమస్యే నని అర్ధం"

"ఏమిటి నాన్నా...అమ్మ చెప్పేది నిజమా?"

"అవును రా..."

"నువ్వు బాధ పడేటంత సమస్య ఏమిటి నాన్నా? నీ పనిలో నువ్వు ఏమన్నా తప్పు చేశావా?"

"పిచ్చొడా...నా 'కంపనీ' లో ఇప్పుడు తప్పు చేస్తేనే అక్కడ ఉద్యోగం చేయగలం"

"ఏమిటి నాన్న చెబుతున్నారు?" --- కొడుకు శంకరయ్య అర్ధంకాక ఆశ్చర్యంగా అడిగాడు.

మాలతీ మళ్ళీ తండ్రీ-కొడుకుల సంబాషణ మధ్యలో తలదూర్చింది.

“శంకరయ్యా...ఎప్పుడూ ఊరంతా ఒక దారిలో నడిస్తే....మీ నాన్న మాత్రం వేరే దారిలో నడుస్తారు"

"అరే ఏంటమ్మా నువ్వు...నాన్నతో చెప్పి ఆయన చేస్తున్న 'కంపనీ' లో ఒక ఆరు నెలలో, ఒక సంవత్సరమో 'మేనేజ్ మెంట్ ట్రైనీగా' అవలాని అనుకుంటున్నాను. ఇప్పుడు పోయి ఈయన దారి వేరే దారి అంటున్నావు..."

"అవునురా...ఐదు వేళ్ళూ ఒకే లాగానా ఉన్నాయి? చేతి వేళ్ళే ఎచ్చుతగ్గులుగా ఉన్నప్పుడు...మనుషులందరూ మనం ఎదురుచూస్తున్నట్టు ఉండాలనుకుంటే ఏలా?"

"నువ్వు చాలా కన్ ఫ్యూజ్ చేస్తున్నవమ్మా..."

"నేనేమీ కన్ ఫ్యూజ్ చేయటం లేదు. నిజం చెబుతున్నా! మీ నాన్నకు తానేమిటో; తన పనేమిటో చూసుకోవటం తెలియదు. ఈయన పని చేస్తున్న కంపనీకి ఈయనే యజమాని అనుకుంటారు. నన్ను అడిగితే ఈయన యజమాని కూడా అంత బాధ పడరని గట్టిగా చెప్పగలను. ఎవరు ఎలా ఉంటే మన కెందుకురా? మన పని ఏమిటో అది మాత్రం చూసుకుంటే ఏ సమస్యా ఉండదు"

----- మాలతీ మాటలతో సాధించింది. ప్రసాద్ కు కోపం ముక్కు మీదకు వచ్చింది. కోపంగా భార్యను చూశాడు.

"వూరికే అలా చూడకండి...మీరేమీ మహాత్మా గాంధీ కాదు. అందరినీ మార్చటానికి"

"తరువాత...?"

"తరువాత ఏమిటి తరువాత...కంపనీలో జరిగే తప్పుల కోసం మీరు ఎందుకండీ ఇలా బాధ పడుతూ ఆరోగ్యం పాడుచేసుకుంటారు? ఇప్పుడు మీ కంపనీ ఏమన్నా మూసేస్తున్నారా ఏమిటి?"

"అంటే...కంపనీ నష్టపోయి మూసేసిన తరువాతే ఒకరు బాధపడాలి అంటావా?"

"అలాగంతా జరగదండి... కోట్లలో పెట్టుబడి పెట్టి కంపనీ నడుపుతున్నవారికి తెలియదా...ఎవరు ఏం చేస్తున్నారు? ఏది, ఎప్పుడు, ఎలా జరపాలోనని?"

"తెలియదు మాలతీ...ఏమీ తెలియదు. అదే ఇప్పుడు నా బాధ!"

"ఏం చూసి చెబుతున్నారు...'తెలియదు’ అని?"

“కంపనీ లోనే మధ్యం సేవిస్తున్నాడు ఒక అధికారి. ఎప్పుడు చూడు పేపరూ, పత్రికలు చదువుతూ ఆఫీసు 'ఫైల్స్’ చూశానని అబద్దం చెబుతున్నాడు ఇంకొక అధికారి. లేని సమస్యను ఉందని చెప్పి దానికి లంచం అడుగుతున్నాడు ఒకడు. దాన్ని ఇంకొకడు తీసుకుని వీడికి ఇస్తున్నాడు.

ఎనిమిది గంటలు పని. దాంట్లో కనీసం మూడు గంటలు కూడా ఎవరూ పనిచేయటం లేదు. మిగితా సమయమంతా సినిమాల గురించి, రాజకీయాల గురించి కబుర్లే. క్యాంటీన్లో వర్కర్లకు ఒక 'మెనూ'... పై అధికారులకు ఒక 'మెనూ'! క్యాంటీన్లో ఏదైనా సరిలేదు అని ఎవరైనా చెబితే వినిపించుకునే వారే లేరు. వర్కర్స్ ను కలుసుకోవటమే అతిపెద్ద గౌరవ సమస్యగా అనుకునే సర్వాధికార మనసున్న వ్యక్తికి 'పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పదవి"

------ 'ఏమీ చేయలేం' అని కన్నీళ్లు పెట్టుకుంటూ తన నిస్సహాయాన్ని, నిస్పృహను వ్యక్తం చేయలేక కుములిపోయాడు వెంకట్ ప్రసాద్. అలా తండ్రి కుమిలిపోవటం కొడుకు శంకరయ్యా ఇంత వరకు చూడలేదు. కానీ ఇదంతా మాలతీని ఏమీ చేయలేదు.

"హూ...ఇలాగే కదా భారతదేశంలో ఉన్న ఎనబై శాతం కంపనీలూ నడుస్తున్నాయి. ఏదో మీ ఒక్క కంపెనీ మాత్రమే ఇలా ఉన్నట్టు బాధపడుతున్నారు?"

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-12 ****************************************************************************************************

26, జనవరి 2020, ఆదివారం

ఆలయం(సీరియల్)...PART-10



                                                    ఆలయం(సీరియల్)
                                                             (PART-10)


"నేను ఇప్పట్నుంచే జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. అందుకే అడుగుతున్నాను"

"ఎక్కువ భయపడకండి. నేను మళ్ళీ చెబుతున్నాను. ఇక్కడ భయపడటానికి...పెద్దగా ఎవరూ లేరు. వెంకట్ ప్రసాద్ అని ఒకడున్నాడు. వాడికి దేవుడు మన ‘చైర్మనే.' నిజంగానే చాలా మంచివాడు. మన ‘చైర్మన్’ కి కూడా వెంకట్ ప్రసాద్ అంటే ఒక మర్యాద. అతని దగ్గర మాత్రం మీరు జాగ్రత్తగా ఉంటే చాలు"

"అంటే ఇంకెవరితోనూ మనకు సమస్య లేదు...అంతే కదా?"

"నమ్మండి...ఇక్కడున్న వారందరికీ ఒక వెల ఉన్నది. అందరి దగ్గరా తప్పులూ ఉన్నాయి. అది తాకితే చాలు. పరిగెత్తుకుని పారిపోతారు. మనం జాగ్రత్తగా ఉండవలసింది ఒకే ఒక మనిషి దగ్గరే. వెంకట్ ప్రసాద్ అనే ప్రసాద్..."

ఇక చెప్పటానికీ, మాట్లాడటానికి ఏమీ లేదన్నట్టు 'అకౌంట్స్ మేనేజర్’ వెళ్ళటానికి లేచాడు.

విఠల్ రావ్ మన్సులో...'ఏవరీ వెంకట్ ప్రసాద్?' అనే ప్రశ్న!

'క్యాంటీన్లో' వేడి వేడిగా పునుగులు, మెరపకాయ బజ్జీలు వేస్తున్నవి వేస్తున్నటు అయిపోతున్నాయి. మనిషికొక 'కూపన్’ ఇచ్చి వాటిని కొనుక్కుని తింటున్నారు.

బయట ఒక ప్లేటు పునుగులు పది రూపాయలైతే, క్యాంటీన్లో రెండు రూపాయలు. వెంకట్ ప్రసాద్ కూడా అప్పుడప్పుడు అక్కడకొచ్చి ఒక కాఫీ తాగి వెళ్ళిపోతాడు.

ఆ రోజు ప్రసాద్ క్యాంటీన్ కు వచ్చినప్పుడు 'రచ్చ' చేసే పార్టీ రాజేష్ కుమార్ కాఫీకంటే వేడిగా ఆర్భాటం చేస్తున్నాడు.

"ఆ రాష్ట్ర రాజకీయ నాయకుడికి మంచి వేట. ఐదు లక్షలతో వెళ్ళిన ఆ మనిషి అందులో సగం నొక్కేసి, కంపనీ రెండు లక్షలే ఇచ్చిందని ఆఫీసులో చెప్పాడు. ఇక్కడ మన వాళ్ళు...పార్టీకి కోటి రూపాయలు డొనేషన్ గా ఇచ్చినట్టు 'వౌచర్’ తయారు చేసారు"

ఎక్కడ, ఎలా పసిగట్టాడో తెలియదు. విషయాన్ని పెద్దది, చిన్నది చేసి పునుగులు, బజ్జీల కంటే కమ్మగా చెబుతున్నాడు.

"ఏరా...ఏమిటో పక్కనే ఉండి చూసిన వాడివిలాగా మాట్లాడుతున్నావు...?"

"అలాగే ఉంచుకో..."

"అయినా ఇలా నోటికొచ్చినట్టు అబద్దం చెప్పకూడదురా,ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీకి....ఇలాంటి ఒక 'కంపెనీ’ కోటి రూపాయలు ఇస్తుందారా?"

"ఎక్కడరా ఇచ్చారు! ఇచ్చింది ఐదు లక్షలే. రాసుకున్నది కోటి..."

"తొంబై ఐదు శాతమా మోసంచేస్తారు?"

"అది కరెక్టే...ఆ రాజకీయ నాయకుడు గనుక సమస్య చేయటం మొదలుపెట్టాడంటే 'కంపనీ’ జరుపగలరా? 'డిల్లీ' నుండి రైడ్ వస్తుంది"

"రానివ్వురా...మనం 'రూల్స్’ ప్రకారం నడుచుకోవాలని మన ‘చైర్మన్' నే కదా చెబుతున్నారు!"

"చెబుతున్నారు...కానీ ఇక్కడ ఎక్కడున్నాయ్'రూల్స్’ ?నువ్వొక తెల్ల కాగితం కొని 'రూలు’ కర్ర తో దానిపై గీతలు గీతలుగా గీసుకో. అదే 'రూల్స్’."

"అయితే 'కంపనీ' ఎలా రన్ అవుతోంది?"

"వీడొకడురా... ఊరంతా కలిసి రథం లాగటం మొదలుపెడతారు. రథం కదులుతుంది. అక్కడక్కడ కొంతమంది చేతులు నొప్పి పుడుతున్నాయని లాగటం ఆపినా రథం జరగటంలేదా ఏమిటి? లేక...ఆ రథం ఎవరివలన జరుగుతున్నదని చెప్పగలమా? అలాగే మన 'కంపనీ' కూడా నడుస్తోంది"

-----రాజేష్ కుమార్ చెప్పిన ఉదాహరణలో నిజం లేకపోలేదు. కాఫీ తాగుతూ నడుచుకుంటూ తన ఆఫీసు గదిలోకి వచ్చి తన కుర్చీలో కూర్చున వెంకట్ ప్రసాద్ మనసులోనూ అతని చెప్పిన సమాధానం ఎన్నో ఆలొచనలను రేకెత్తింది. మౌనంగా భారమైన మనసుతో పనిలో శ్రద్ద చూపటానికి ప్రయత్నించాడు. కానీ పనిలో మనసు పెట్టలేకపోయాడు.

అతని కుర్చీకి ఎదురుకుండా రెండక్షరాల కొటేషన్:

'అమ్మాయికి కన్యాత్వము….వస్తువుకు నాణ్యత' - అని రెండే లైన్లు!

దానిని చూసిన వెంటనే, విరక్తి కలిసిన నవ్వు వచ్చింది ప్రసాద్ కు. ‘ఇక్కడ అన్నీ లిఖిత రూపం. నిజానికి రెండిటికీ చాలా దూరం. కారణం...? స్నేహితులు మాట్లాడుకున్నట్టే ఇన్వాల్వ్ మెంట్ లేని పని. ఎప్పుడూ మనో భారం. కొంచం కూడా శ్రద్దలేని...కూలీకి చేసే పనిలాగా’

అలా ఆలొచించుకుంటూ పోయిన ప్రసాద్, చివరగా...ఇది 'చైర్మాన్’ కు తెలుసా? అని ప్రశ్నించుకున్నాడు. దానికి మాత్రం అతనికి గబుక్కున సరైన సమాధానం దొరకలేదు.

వెంకట్ ప్రసాద్ ఇల్లు!

ప్రసాద్ భార్య మాలతీ 'టీ.వీ.' చూస్తూ కూర్చోనుంది. ఈనాటి మనిషి జీవితంలో తినడం-నిద్రపోవడం-స్నానం చేయడం లాంటి విడిచిపెట్టలేని రోజువారి పనులలో 'టీ.వీ.' కూడా చేరిపోయింది.

కాలేజీ చివరి సంవత్సరం పరీక్షలు ముగించుకుని 'గెట్ టు గెదర్’ పార్టీలో కూడా పాల్గొని అప్పుడే తిరిగి వచ్చాడు ప్రసాద్ కొడుకు శంకరయ్య... ప్రసాద్ వరకు ‘చైర్మాన్'!

కొడుకు లోపలకు వెళ్ళి డ్రస్సు చేంజ్ చేసుకుని 'డైనింగ్ టేబుల్’ దగ్గరకు వెళ్ళి కూర్చున్నది కూడా గమనించలేదు మాలతీ. కారణం....టీ.వీ! అందులో ఒక సీరియల్లో హీరోయిన్ జైలులో 'వార్డన్’ చేతిలో చిత్రవధ అనుభవిస్తోంది. మాలతీకి ఆ చిత్రవధలను తానే అనుభవిస్తున్నట్టు ఒక ఫీలింగ్. ప్రసాద్ మంచం మీద బోర్లా పడుకుని ఆలొచిస్తున్నాడు. మనసు నిండా 'కంపనీ’ గురించిన ఆలొచనే. శంకరయ్య తల్లిని-తండ్రిని చూసిన తరువాత వొళ్ళుమండి 'టీ.వీ' కి వెడుతున్న కరెంటు స్విచ్ ను ఆపాడు. 'టీ.వీ.' స్క్రీన్ తెల్లగా రావటంతో "అరే...కరెంటు పోయిందా...తలనొప్పిగా ఉంది ఈ ‘ఈ.బి.’ వాళ్ళతో! అంటూ తల బాదుకుంటూ వెనక్కు తిరిగిన మాలతీ... శంకరయ్యను చూసి, "నీ పనేనా?" అంటూ విసుక్కుంది.

                                                                            ఇంకా ఉంది.....Continued in PART-11 ****************************************************************************************************

24, జనవరి 2020, శుక్రవారం

ఆలయం(సీరియల్)...PART-9




                                               ఆలయం(సీరియల్)
                                                          (PART-9)


"ఏమిటండి ఇది...ఐదు బదులు యాబై అని వేసుంది"

"నాకు తెలియదండి...పై అధికారుల ఆర్డర్. నేను వేశాను"

"అయితే మిగతా 45 ఎక్కడ?"

"ఏం ప్రశ్నండి ఇది...మీకు ఒక ఐదు, నాకు ఒక ఐదు. ఇలాగే మిగిలిన 35 కు మనుష్యులు ఉన్నారు కదా...”

"సంతకం పెట్టే నాకు కేవలం ఐదు లక్షలేనా?"

"మీరు కంపెనీలోకి వచ్చేటప్పడు 'జి.ఎం.' అన్ని విషయాలూ చెప్పుంటారే?"

"చెప్పారు...కానీ ఇంత పెద్దదిగా ఉంటుందని నేను అనుకోలేదు"

"ఇప్పుడేమైంది...ఐదు అనే చోట ఏడో...ఎనిమిదో తీసుకోండి. మిగతాది నేను చూసుకుంటాను"

"అది సరే...తరువాత సమస్యేమీ రాదే?"

"రాకూడదనే దేని దేనికి ఎంతెంత లెక్క చూపించాలో అలా చూపించటానికి రెడీగా ఉన్నాను"

"దానికోసం కాదు...ఆ రాజకీయ నాయకుడ్ని సమాధానపరచి పంపించింది నేను. దాన్ని అకౌంట్స్ లో సరి చేసేది మీరు...మనకు పైన ఒకరు, దీనికి దారి చూపించేవారు. మొత్తం ముగ్గురే కదా. మిగతా వాళ్ళకు ఎందుకు భాగం పోవాలి?"

"ఇలాగా వొలిచి మాట్లాడుతారు. మిగతా వాళ్ళ నొరు మూయొద్దా...దానికోసమే?"

"ఇది వాళ్ళకు తెలిస్తేనే కదా?"

"అది సరే...'టాప్' లో ఉన్న చాలామంది గురించి మీకు ఏమీ తెలియదనుకుంటా. పోను పోనూ అన్ని విషయాలనూ తెలుసుకుంటారు"

"నా ప్రశ్నకు ఇప్పుడు ఇదేనా సమాధానం?"

"అవును సార్...కొంచం ఓపికగా 'అడ్జస్ట్' చేసుకుని వెళ్ళండి. ఇలా అప్పుడప్పుడు ఐదు,ఆరు తీసుకుంటూ 'టాప్' కు వెళ్ళిపొవచ్చు. ఒక సంవత్సరం ఈ సీటులో ఉంటే చాలు...జీవితంలో 'సెటిల్’ అయిపోవచ్చు"

----ఆ అకౌంట్స్ మేనేజర్, విఠల్ రావ్ కు బాగానే ఆశ చూపాడు.

అతని కళ్ళల్లోనూ...ఒక విశాలమైన పండ్ల తోటలోకి పెద్ద బుట్టతో వెళ్ళినంత కుషీ.

"అవును...మీ దగ్గర ఒక విషయం అడగాలి.'ఈ కంపెనీ చైర్మాన్' శంకరయ్య గురించి చాలా విన్నాను. ఆయన రాసిన పలు వ్యాసాలు చదివాను. అవి చదివిన తరువాత ఆయన ఒక మేధావి అనేది సందేహం లేకుండా తెలుస్తోంది"

"దానికేమిటిప్పుడు?"

"అది కాదు...'ఈ ఎక్స్ ట్రా' సమాచారం ఆయన వరకు వెల్తే?"

"వెల్తేనే కదా?"

"అంటే వెళ్ళదా?"

"అరే మీరొకరు...ఆయన దగ్గరకు వెళ్లటం అంత సులభం కాదు. అంతే కాదు...ఆయనకు ఎవరిమీదైనా చాడీలు చెబితే నచ్చదు"

“అంటే...ఎంత తప్పు జరిగినా ఆయన చెవులదాక వెళ్ళదని చెబుతున్నారు"

"అవును...అలా ఒకవేల వెళ్ళినా 'టాప్' లో కొంతమంది ఉన్నారు. వాళ్ళకు ఆయన్ని ఎలా సమాధాన పరచాలో తెలుసు"

"ఇది పెద్ద గొప్ప సమాధానం లాగా కనబడటం లేదు"

"సారీ....తెలిసింది చెప్పాను. నాకూ మీలాగానే సందేహాలు ఉన్నాయి. నేను వేగంగా 'సెటిల్’ అవటానికి ఆశపడటం నా భార్యకే నచ్చలేదు. 'పలు రోజుల దొంగ ఒక రోజు చిక్కుకుంటాడు’...తరువాత పరువే పోతుంది. మర్యాద పోతుంది అని అప్పుడప్పుడు బుద్ది చెబుతుంది. కానీ, ఇలాంటి సంధర్భాలు అన్ని చోట్లా దొరకవు.

'చైర్మాన్’ మంచాయనే. అందుకని కంపనీ లాభాలలో భాగం అడిగితే ఇస్తారా? అందుకని మనమే తీసుకోవటం ఒకే దారి. దీని వలన ఆయనేమీ తరిగిపోడు. సంవత్సరానికి వెయ్యి కోట్లు సంపాదిస్తున్నాడు. అందులో మనం ఐదారు కోట్లు కొట్టేయ గలిగితే అదే చాలా పెద్దది కదా?”

'అకౌంట్స్ మేనేజర్ చెప్పిన 'న్యాయం' విఠల్ రావ్ కే ఆశ్చర్యం తెప్పించింది.'ఇలాంటి మనిషి సెంట్రల్ మినిస్టర్ గా ఉండి--అందులోనూ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యుంటే భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని ఏ దేశానికి అమ్ముతాడో తెలియదు!" అనే అనిపించింది.

అయినా ఒక హెచ్చరిక భావం మనసులో ఏర్పడింది.

"బాగా మాట్లాడుతున్నారు...అయినా మనం జాగ్రత్తగా ఉండాలి. అవును....ఇక్కడ ఈ విషయాల్లన్నిటినీ గమనించే వ్యక్తి ఎవుడూ లేడా?"

"ఎందుకు అడుగుతున్నారు?"

"ఒక హెచ్చరిక కోసమే..."

"ఉన్నారు. 'కంపనీ' అన్న తరువాత ఇలా ఒక నలుగురు, అలా ఒక నలుగురూ లేకుండానా పోతారు? రామక్రిష్ణ అనే ఒకతను ఉన్నాడు.'హిందీ డౌన్ డౌన్, తెలుగు జై జై' అనే ముఠా. సాధారణ మనిషే. కానీ పనిచేయటానికి వొళ్ళు వొంగదు. అతనికి కూడా మనలాంటి ఆలొచనే.'కమీషన్’ ఎక్కడ దొరుకుతుందో ఆ సీటులోకి వెళ్ళి కూర్చోవాలని ఆశ. ఎవరి దగ్గరన్నా మంచి ఉంటే అతనికి తెలియదు. కానీ, చెడు మాత్రం ఏలాగైనా తెలుసుకుంటాడు. మీరు 'ప్యాంటు’ బటన్ సరిగ్గా వేసుకోలేదనుకోండి...దాన్ని కూడా 'నోట్' చేసి నలుగురు దగ్గర మాట్లాడతాడు. అతనికి ఒకే పాలసీ:

'అధికారి గాడిదైనా సరే కాళ్ళు పుచ్చుకో, కార్మికుడు ఆ దేవుడైనా సరే ఎగిరి తన్ను!' అనేదే.

అతనికి మన విషయాలు కొన్ని తెలుసు. దానికి ప్రతిగా అతను పనిచేయకుండా అటూఇటూ తిరుగుతూ ఉండటాన్ని పట్టించుకోము. మాటి మాటికీ లీవు పెడతాడు. దాన్ని కూడా పట్టించుకోము"

"అంటే ఈ పరిశ్రమలో ఏ ఒక్కడూ కూడా న్యాయంగా లేడా?"

"మీరు అడిగేది చూస్తే...?"

నో...నో, ఈ ప్రశ్నకు మీరు ఊహించుకునే సమాధానం తప్పు...నేనెందుకు అలా అడిగానంటే...

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-10 ****************************************************************************************************

21, జనవరి 2020, మంగళవారం

ఆలయం(సీరియల్)...PART-8




                                                ఆలయం(సీరియల్)
                                                           (PART-8)


మరుసటి రోజు!

ఆ జిల్లా రాజకీయ పార్టీ ఆర్గనైజర్, పార్టీ రంగుతో మెరిసిపోతున్న పంచ కట్టుకుని ఆఫీసులోకి దూరాడు. అతనికి కోలాహలమైన స్వాగతం. విఠల్ రావ్ కూడా ఒక పెద్ద పూలమాలను కొని ఉంచాడు. ఆ మాల వేసి అతన్ని తన గదికి తీసుకు వెళ్ళి, కూర్చోబెట్టి కుషీ చేయటం మొదలుపెట్టాడు.

"మీరేనా కొత్తగా వచ్చిన ఆఫీసరో?"

“అవునండి...ఇక నేనే ఇక్కడ ‘ఆఫీసర్- ఇన్ చార్జ్’ ని"

"ఇంతకు ముందు ఎక్కడ ఉండే వాళ్ళు?"

"విశాకపట్నంలో ఉన్న ‘ఎఫ్.జే.ఎస్ పైప్స్’ అనే కంపెనీలో..."

"ఓ...అది చాలా పెద్ద కంపెనీ కదా?"

"అవును...నెలకు వంద కోట్ల బిజినస్ ఉన్న కంపెనీ"

"ఈ కంపెనీలో బిజినస్ ఎంత ఉంటుంది"

"ఇక్కడ కూడా సుమారుగా అంతే బిజినస్ ఉంటుంది"

"విశాకపట్నంలో క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా! అది వదిలేసి ఎండిపోయిన ఈ ఊరుకు వచ్చారు?"

“ఏప్పుడూ 'మేనేజ్ మెంట్ టాప్స్’ ఒకే చోటే ఉండకూడదు. ‘ఎక్స్ పీరియన్స్’ రాను రాను 'జంప్' అవుతూనే ఉండాలి. పాత కంపెనీ కంటే ఇక్కడ సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తామని చెబుతుంటే చల్లని క్లైమేట్టు...విశాకపట్నం, ఇవన్నీ దేనికి చెప్పండి"

"అదీ నిజమే...ఇంట్లో ఒక 'ఏ.సి’ మిషన్ కొని తగిలిస్తే చల్లటి క్లైమేట్ వస్తుంది. దానికోసం విశాకపట్నం వెళ్ళాలా ఏమిటి?"

---వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి సంభాషణే జరుగుతోంది. మధ్యలో అందులో ఒక చిన్న మార్పు. విఠల్ రావ్ తన కుర్చీ పక్కన పెట్టుకున్న బ్రీఫ్ కేసును ఆ రాజకీయ నాయకుడికి అందించాడు.

“ఈ ఐదు లక్షలు మీ 'కంపనీ’ కి చిల్లర డబ్బులు. మేము 50 లక్షలు వరకు ఎదురు చూశాము"

"అరే మీరొకరు. మా 'కంపనీ’ ‘చైర్మాన్’ పెద్ద పిసినారి అనేది తెలుసుకునే నేను ఈ కంపనీలో చేరాను. మీరు పెద్దగా బాధ పడకండి. అప్పుడప్పుడు భయపెడుతూ ఉండండి. నేను డైరక్టర్లతో మాట్లాడి మీకు 'సెటిల్’ చేస్తూ ఉంటాను"

"అరె...మీరు మా సైడా? ఇంతకు ముందు మీ 'సీటు’లో ఉన్న మనిషి పెద్ద పొగురుబోతు. నేను గాంధీ గారికి మనవుడ్ని, నెహ్రూ గారికి మేన మామను అంటూ డబ్బులే ఇవ్వనని చెప్పాడు. నేను కూడా...చుట్టు పక్కలున్న వారితో గొడవ పెట్టుకోకండని ఎంతో చెప్పి చూశాను. వినలేదు. కరక్టుగా అప్పుడే మీ కంపనీలో పని చేస్తున్న ఒకతను పనిచేస్తున్నప్పుడే 'హార్ట్ అటాక్' వచ్చి చనిపోయాడు. ఎవరో ఒక ఆఫీసర్ ఎక్కువగా శ్రమ పెట్టినందువలనే 'హార్ట్ అటక్' వచ్చిందనే విషయం నా చెవికి చేరింది. అది చాలదా నాకు? పిడి దొరికింది కదా. మీ 'చైర్మాన్' కి ఒక లెటర్ పంపించాను. ఆయన ఇంకొక ఆయనకు లెటర్ పంపించాడు. ఇప్పుడు ఐదు లక్షలు వచ్చింది. ఇదే మీ 'కంపనీ లక్షణం”

---ఆ రాజకీయ నాయకుడు బాగానే మంట వెలిగించాడు. విఠల్ రావ్ కూడా అలాగే 'ఇదే మనకు ఒక మంచి సంచీ' అని ఆ బంధుత్వాన్ని గట్టిగా బిగించుకున్నాడు.

"వదిలేయండి సార్...పాత చెత్తను ఎందుకు కెలకటం? మీరు నాకు మద్దత్తుగా నిలబడండి. మిగితాది నేను చూసుకుంటాను"

"అరె ఏమిటండి మీరు...ఇంత ఒపన్ గా మీరు మాట్లాడిన తరువాత నేను చెప్పటానికి ఏముంది? లోపల హత్యే జరిగినా మీరు భయపడ అక్కర్లేదు. అన్నీ నేను చూసుకుంటాను"

----మొత్తానికి ఆ రాజకీయ నాయకుడు, తను ఎలాంటి మనిషి...తన గుణం ఎలాంటిదీ అనే విషయాలన్నీ చెప్పి ముగించి ఆ బ్రీఫ్ కేసు తీసుకుని వెళ్ళిపోయాడు.

విఠల్ రావ్ ముఖంలో విజయం సాధించిన నవ్వు. దానికి ఎన్నో అర్ధాలు. రాజకీయ నాయకుడు వెళ్ళిన వెంటనే...'అకౌంట్స్ మేనేజర్’ లోపలకు వచ్చాడు.

"నమస్తే సార్...ఒకలాగా రాజకీయ నాయకుడ్ని సమాధానపరచి పంపించారు లాగుందే?"

"అవును...ఇక మన దగ్గర తోక ఆడించడు. అంతలా బెదిరించి పంపాను"

"గొప్ప మనిషి సార్ మీరు....మీ సీటులో ఇంతకు ముందు ఉన్న ఆఫీసర్ ఆయన్ని లోపలకు రానిచ్చేవాడే కాదు"

"అందుకే ఇక్కడ పనిచేయలేకపోయాడు. నాకు....ఎలాంటి వాళ్లతో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. సరే...మీరు ఎందుకు వచ్చారు?"

"సార్...వౌచర్ లో సంతకం తీసుకు వెల్దామని వచ్చాను"

"అవును...ఇలాంటి హెడ్దింగ్గులే లేని ఖర్చులను ఏ లెక్కలో రాస్తారు?"

"అదెందుకు సార్ అడుగుతారు...'మెషనరీ బ్రేక్ డౌన్, కంపనీ మెత్తం పైంటింగ్ వేయించాము...అని ఏదో ఒక లెక్కలో రాయాల్సిందే..."

--అకౌంట్స్ మెనేజర్ మాట్లాడుతూనే వౌచర్ జాపాడు. అందులో సంతకం పెట్టటానికి పెన్ను తెరిచిన విఠల్ రావ్ గుండె గుబేలు మన్నది. కారణం, ఐదు లక్షల రూపాయలకు బదులు 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు అందులో రాసుంది.

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-9 ****************************************************************************************************

19, జనవరి 2020, ఆదివారం

ఆలయం(సీరియల్)...PART-7



                                                  ఆలయం(సీరియల్)
                                                             (PART-7)


"అలా కాదురా...మనల్ని మన తల్లి తండ్రులు పదినెలలు తరువాతే కన్నారు. వాళ్ళనూ వాళ్ళ తల్లితండ్రులు పదినెలల తరువాతే కన్నారు. వాళ్ళకు మాత్రం 'ఏ.సీ.' గదులు, కార్లూ అంటూ చాలా వసతులు. కానీ, మనం కుర్చీలో కూడా కూర్చోకూడదు. నిలబడే పని చేస్తూ చచ్చిపోవాలి"

"దానికేం చేయగలం...వాళ్ళు స్కూల్లో బాగా చదువుకుని మంచి 'మార్కులు’ తెచ్చుకున్నారు. అందువలన 'బి.ఈ', 'ఎం.ఈ' అని సీటు తెచ్చుకుని ఆ చదువులను కూడా విజయవంతంగా పూర్తిచేశారు. మీరు 'సినిమా' కోసం స్కూల్ కట్ చేసి వెళ్ళినందుకు 'ప్లస్ టూ' కూడా పాస్ అవలేదు. అక్టోబర్ లో పరీక్షలు రాసి ఎలాగో 'పాస్’ అయ్యి బ్రతికిపోయారు. మనిషి యొక్క జీవిత పర్వాలలోనే ముఖ్యమైనది విధ్యార్ధి పర్వం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే జీవితం తప్పుగానే స్థిరపడుతుంది. ఏదో ఈ చదువుకు ఈ మాత్రమైనా మంచి కంపెనీలో ఉద్యోగం దొరికి నెల జీతం తీసుకుంటున్నది తలచుకుని సంతోష పడండిరా"

-- ప్రసాద్ ఇలాగే సమాధానం చెబుతాడు. అతనితో మాట్లాడిన వాళ్ళకు 'ఎందుకురా మాట్లాడాము?' అని అనిపిస్తుంది. అందువలన వాళ్ళ వరకు ఇతనొక ప్రత్యేక వ్యక్తి.

ఈ వ్యక్తి ఆరోజు కూడా వీళ్ళ మాటలను పట్టించుకోకుండా, వాళ్ళతో కలవక, విడిగా ఉండి తన పని తాను చేసుకుంటూ వెడుతున్నాడు. అందరి జీవితమూ ఎప్పుడూ ఒకే లాగానే పయనిస్తుందా? అందులో ఎన్నో భయం పుట్టించే మార్పులు, వంకర్లు వస్తూనే ఉంటాయి కదా!

ప్రసాద్ వరకు అలాంటి ఒక మార్పు వచ్చింది.

అతనికి 'పర్సనల్ డిపార్ట్ మెంటు’ నుండి పిలుపు వచ్చింది.

"మిస్టర్ వెంకట్ ప్రసాద్...మీరు కొత్త ‘పి.ఆర్.ఓ.’ సారును చూడాలని చెప్పుంచారా?"

"అవును..."

“ఆయన డ్యూటీలో జాయిన్ అయ్యి ఈ రోజు రెండో రోజు. నిన్న మీరు ఆయన్ని కలవటానికి వచ్చి అలాగే తిరిగి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వెళ్ళండి. సారు మీకోసం కాచుకోనున్నారు"

ప్రసాద్ ను పిలిచినతను తప్పుకున్నాడు. కానీ ‘పి.ఆర్.ఓ.’ ను వెతుక్కుంటూ వెళ్ళి 'విష్' చేయటానికి ప్రసాదుకు బిడియంగా ఉంది. ఎందుకంటే ముందు రోజు ఆయన్ని కలవడానికి వచ్చినప్పుడు అతను చూసిన ఆ దృశ్యం అతని మనసులో కదలాడుతోంది.

'ఒక తాగుబోతు--అందులోనూ పని చేసే సమయంలోనే తాగుతున్న మహా తాగుబోతుగా మనసులో పదిలమైపోయిన ఆయన్ని ఏమని చెప్పి విష్ చేయాలి?’

"ఇంకా ఎక్కువగా తాగి ఆనందంగా జీవించండి!" అని విష్ చేయాలా? -- గందరగోళంతో 'కంప్యూటర్ మానీటర్ నే' చూస్తూ కూర్చున్న అతను, చివరగా ఆ ‘పి.ఆర్.ఓ’ ను కలిసి విష్ చేయాలనే ఐడియానే మార్చుకున్నాడు.

అప్పుడు రాజేష్ కుమార్ వచ్చాడు.

“ప్రసాద్...ఇంకా వెళ్లలేదా?"

"లేదు రాజేష్... అభినందనలు అనేది మంచి మనుషులకు మాత్రమే"

"వచ్చిన 'పార్టీ' ఒక వేస్టు వ్యక్తి అనేది మొదటి రోజే తెలిసిపోయిందా?"

ప్రసాద్ మౌనంగానే దాన్ని ఆమోదించాడు.

రాజేష్ కుమార్ కు కుషీగా ఉన్నది.

"పెద్ద అధికారంలో ఉండే ఆఫీసర్లు అందరూ ఎప్పుడూ దేవాది దేవతలు అని అనుకుంటావే. వాళ్ల గురించి నీదగ్గర ఇప్పుడొక మార్పు...మంచిది" అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళాడు.

అదే సమయం 'డిపార్ట్ మెంటులో' ఆ 'పి.ఆర్.ఓ.' రహస్యంగా బాటిల్ తెరిచి గ్లాసులో పోసుకుని తాగటం మొదలుపెట్టాడు. ఎక్కువగా వాసన రాని విదేశీ మధ్యం. అయినా కానీ, ఒక జాగ్రత్తకోసం వక్కపొడి పొట్లం కట్ చేసి నోట్లో పోసుకున్నాడు. అద్దాల అడ్డు దగ్గరకు వెళ్ళి కర్టన్ను పక్కకు జరిపి ఎవరైనా గమనిస్తున్నారా? అని ఒక చూపు వేశాడు.

టెలిఫోన్ మోగింది. రిజీవర్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతలవైపు ఆ పరిశ్రమకు చెందిన అతిపెద్ద పోస్టులో ఉన్న మరో అధికారి ఒకరు మాట్లాడారు.

"మిస్టర్. విఠల్ రావ్!"

"ఎస్ సార్..."

"పనిలో చేరి ‘సెటిల్’ అయ్యారా?"

"ఎస్ సార్..."

"సరే...నేను చెప్పినదంతా జ్ఞాపకం ఉంచుకున్నారు కదా?"

"ఉంది సార్"

"రేపు ఆ ప్రాంతం వ్యక్తి, రాజకీయ పార్టీ జిల్లా ఆర్గనైజర్ వస్తారు. ఆయనకు ఐదు లక్షలు 'బ్రీఫ్ కేసు’ లో ఉంచి ఇవ్వండి. సస్ పెన్స్ అకౌంటులో డబ్బులు తీసుకోండి. అలాగే 'వౌచర్’ లో సంతకం అడిగితే వేసి ఇవ్వండి. ఈ డబ్బు ఇచ్చే విషయాన్ని రహస్యంగా ఉంచండి...అది వాళ్ళ ఎలక్షన్ ఫండ్"

"ఓ.కే. సార్...నేను చూసుకుంటాను"

--- విఠల్ రావ్ అంటూ 'టాప్ లెవల్లో' పిలవబడ్డ ఆ 'పి.ఆర్.ఓ.'...వెంటనే ఫోను పెట్టేసి, వచ్చి కూర్చున్నాడు. అతని కడుపు రగిలిపోతోంది. ‘ఏ పనీ చేయని రాజకీయ నాయకులకు నా చేతులతో లంచం ఇవ్వాల్సి వస్తోంది. హు...మనం కూడా ఒక రాజకీయ నాయకుడై ఉండాల్సింది, ఏ పనీ చేయకుండా డబ్బు సంపాదించుకోవచ్చు’ అని గొణుక్కోవడం మొదలుపెట్టాడు.

                                                                      ఇంకా ఉంది.....Continued in PART-8 ****************************************************************************************************

17, జనవరి 2020, శుక్రవారం

ఆలయం(సీరియల్)...PART-6



                                                  ఆలయం(సీరియల్)
                                                             (PART-6)



అతనికి జీతం నెలకు పదిహేనువేలు. అందులో డిడెక్షన్స్ పోను చేతికి వచ్చేది పన్నెండు వేలు. పోయిన ఏడాది వరకు నాలుగు వేల రూపాయల ఇంట్లోనే అద్దెకు ఉండేవాడు. ఈ రోజు అతను ఉంటున్న ఇంటి అద్దే పదివేలు. అంతే కాదు ఆఫీసుకు రావాటానికి ఒక 'బుల్లెట్' మోటర్ బైకు. చల్లగా పడుకోటానికి ఇంటి బెడ్ రూము గదిలో ఒక ‘స్పిట్ ఏ.సీ.’ అని...'జెనెరల్ మేనేజర్’ రేంజ్ లో ఉన్నాడు. అతను తీసుకుంటున్న జీతంలో ఇవన్నీ ఎలా సాధ్యం?"

-- రాజేష్ కుమార్ అలా చెప్పేసరికి ప్రసాద్ ఇబ్బంది పడ్డాడు.

"చాలు...ఇలాంటి విషయాలు నా చెవిలో పడుతున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతోంది. 'కంపనీ' భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆలొచనతో నాకు తల తిరుగుతోంది" చెప్పాడు ప్రసాద్.

"దానికేం చేయగలం...టాప్ లో ఉన్న తలలు సరిగ్గా ఉంటే, క్రింద ఉండే వీడిలాంటి వాళ్ళు సరిగ్గా ఉంటారు. కానీ,పెద్ద తలలు వేరే విధంగా నడుచుకుంటున్నారే?

"వేరే విధంగా అంటే?"

"నీకేమీ తెలియదన్నట్టు మొహం పెడతావేం...వీడిక్కడ టీ పొడి, ఆహార సామగ్రి లో దొచుకుంటుంటే...అక్కడ వాళ్ళు, 'సబ్-కాంట్రాక్ట్', 'మెటీరియల్ పర్చేస్’ అని చెప్పి దోచుకుంటున్నారు"

"చాలు...ఇంతకంటే ఇంకేమీ మాట్లాడొద్దు! మంచిది ఏదైనా ఉంటే మాట్లాడు"--- అని చెప్పి ప్రసాద్ తాత్కాలికంగా రాజేష్ కుమార్ ను తప్పించుకుని వెళ్ళిపోయాడు.

డిపార్ట్ మెంటులో కి దూరేటప్పుడు ఎప్పటిలాగానే ప్రసాదే మొదటి వ్యక్తి. సమయం 8.50. తొమ్మిదింటికి షిఫ్ట్ మొదలు. అతనితో పాటు మరో ఏడుగురు ఆ డిపార్ట్ మెంటులో పనిచేస్తున్నారు. అందరూ మిలటరీ వాళ్ళలాగా కరెక్టుగా ఫ్యాక్టరీ బెల్లు తొమ్మిదింటికి మోగంగానే లోపలకు వచ్చారు. కానీ, పది నిమిషాల ముందే వచ్చి, కంప్యూటర్ ఆన్ చేసి పని మొదలుపెట్టిన ప్రసాద్ ను చూసి ఒక నవ్వు నవ్వారు. దాన్ని ప్రసాదూ గమనించాడు.

ఇదంతా అక్కడ రోజూ జరిగే తంతే. 'కంపెని’ లో ప్రసాద్ లాంటి నిజాయితీ అయిన ఉద్యోగులు ఉండటమే కష్టం. మిగిలిన అందరికీ ప్రసాద్ లాంటి వారు 'పాఠాలు నేర్పుతారు’. అందులో కనకారావ్ అనే ఒకతను ఉన్నాడు. అతనికి వెంకట్ ప్రసాద్ అంటే వొళ్ళుమంట. వెక్కిరిస్తూ మాట్లాడతాడు. ఎందుకంటే ప్రసాద్ ఖాళీ సమయంలో కూడా 'ఉద్యోగం చేసే చోటు ఆలయంలాంటిది. దాంట్లో ఉద్యోగం దేవుడు లాంటిది’ అని చెబుతూ ఎప్పుడూ పని పని అంటూ కళ్ళార్పకుండా పనిచేశేవాడు.

"రేయ్ కేశవ్, నువ్వూ ఉన్నావే...నీకు శ్రమ అంటే ఏమిటో తెలుసారా? మన ప్రసాద్ ను చూడు...శ్రమకు ప్రసాదే ఒక ఉదాహరణ" అని వేలాకోళంగా మొదలెడతాడు.

అందరూ అతనితో వంతుపాడుతారు. కొంతమంది ప్రసాద్ దగ్గరకు వెళ్ళి అతన్ని కెలుకుతారు.

"రేయ్ ప్రసాద్...నేను తెలియక అడుగుతున్నాను. ఇంతగా కష్టపడి పనిచేస్తున్నావే! నీకేమన్నా 'కంపనీ’ లో గోల్డు మెడల్ ఇస్తారా?"

"అంటే...కష్టపడి పనిచేస్తే బంగారు పతకం ఇవ్వాలి అంటావా?..."

"నేను అలా చెప్పటంలేదు! నువ్వెందుకు అంత కష్టపడాతవు...మనం కొండనే పగలుగొట్టినా మనం 'లేబర్’ గుంపే. కావాలంటే ఐదొందలో, వెయ్యో జీతం ఎక్కువ ఇస్తారు. నువ్వొక మేనేజర్ గానో....ఆఫీసర్ గానో అవలేవురా!"

"నేను మేనేజర్ అవటంకోసం ఇక్కడ పనిచేయటంలేదు. తీసుకునే జీతానికి న్యాయం చేయాలి. అందుకోసమే పనిచేస్తున్నాను. నేను ఈ కంపనీలో పనిచేయటానికి నాకు ఒక అవకాశం దొరికింది. అప్పుడు జీతం కూడా వద్దు 'ఉద్యోగం దొరికితే చాలు’...పని నేర్చుకోవచ్చు. అదే చాలు అనుకున్నాను. కానీ, జీతంతో ఉద్యోగం దొరికింది. అలాగే అప్పుడప్పుడు జీతం పెరుగుతూ ఇప్పుడు నెలకు ముప్పైవేల రూపాయలు వస్తోంది. ఇంత పెద్ద జీతం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఇది నిలకడగా ఉండాలి. ఇలాగే కొనసాగాలి. దానికోసం ఈ కంపనీ ఇప్పటి లాగానే ఎప్పుడూ ఉండాలి. దానికోసమే నా పనిని నేను బాధ్యతగా చేస్తున్నాను. నేను ఇలా పనిచేయడంలో నాకు ఒక ఆనందం ఉందిరా. దయ చేసి మీ వ్యాఖ్యానాలతో నా బుర్రను మార్చటానికి ట్రై చేయకండి. ప్లీజ్..."

"ఇలా చూడరా...మేము నీమీద ఏమీ రుద్దటం లేదు. యధార్ధాన్ని మాట్లాడుతున్నాము. ఇక్కడ మనం చెమటోడ్చి పనిచేస్తున్నాము. దానికి తగిన జీతాలు ఇవ్వటం లేదు. కానీ, 'ఆఫీసర్’ అనే ముసుగులో 'ఏ.సీ.' గదులలో వార్తా పత్రికలు చదువుతూ డెబ్బైవేలు, ఎనభైవేలు జీతాలు తీసుకుంటున్నారు...దీని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలొచించావా?"

"చాలురా...నువ్వేదో వాళ్ల పక్కనే ఉండి చూసినట్టు మాట్లాడకురా! ఎవరో ఒకలిద్దరు కథల పుస్తకాలు చదువుతూ ఉండి ఉండొచ్చు. వెంటనే అందర్నీ అలాంటి వారనే చెప్పాలా?...వెళ్ళరా. వెళ్ళి పనిచూసుకో"

నేను చెప్పేది కొంచం విను.

చెప్పు...వింటూనే ఉన్నాగా...చెప్పు.

                                                                           ఇంకా ఉంది.....Continued in PART-7 **************************************************************************************************

15, జనవరి 2020, బుధవారం

ఆలయం(సీరియల్)...PART-5



                                              ఆలయం(సీరియల్)
                                                         (PART-5)


"పరవాలేదే...సరిగ్గా అర్ధం చేసుకున్నారే!"

"నువ్వు చెప్పేది వాస్తవమే మాలతీ. ఒక విధంగా ఇది అనవసరమైన పనే. అనవసరమైన బాధ కూడా....!. 'మనం మన పనిని కరెక్టుగా చేసుకుంటూ వెళదాం. తప్పు చేసిన వాళ్లను ఆ దేవుడే ఒకరోజు ధండిస్తాడు అనుకుంటూ మామూలుగా వెళ్ళటం నా వల్ల కాదు. ఒక రచయతగా - కళ్ల ఎదురుకుండా జరుగుతున్న అన్యాయాన్ని,అవినీతిని చూస్తుంటే నా రక్తం ఉడికిపోతోంది"

"తెలుసు...చివరగా 'నేను జస్ట్ ఒక స్టోర్ కీపర్ మాత్రమే కాదు...సమాజ సంరక్షణ కలిగిన రచయతను అనే కదా చెప్పబోతారు...అందులోనూ మీ యజమానిని దేవుడు కంటే ఎక్కువగా చూస్తున్నారు కాబట్టే ఇలాంటి విషయాలను మీరు మామూలుగా తీసుకోలేరని నాకు తెలుసు. సరే...మిమ్మల్ని ఒకటడుగుతా కోపగించుకోకూడదు..."

"ఏమిటది మాలతీ?"

"ఈ అవినీతిని ఎదిరించి పోరాడబోతారా?"

"ఎదిరించక...?"

"ఎలా ఎదిరిస్తారు?"

"దాని గురించే ఆలొచిస్తున్నాను. అది మాత్రమే కాదు మాలతీ. ఇలాంటి అవినీతిని జరగకుండా ఆపి ఒక మంచి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచాల్సిన 'పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్’ రే ఒక పెద్ద తాగుబోతుగా ఉన్నాడే. ఆయన మధ్యం తాగటం నా కళ్ళార చూశానే"

"మీరే ఒక కథలో...మధ్యం తాగటం ఒక బలహీనం. అదేమంత పెద్ద నేరం కాదు! అని రాసారు. మీకే తెలుసు...మామూలు 'హై స్కూలు’ పిల్లలు కూడా ఇప్పుడు సర్వ సాధారణంగా మధ్యం తాగుతున్నారు. మధ్యం తాగటాన్ని ఎందుకు ఒక పెద్ద విషయంగా మాట్లాడుతున్నారు?"

"ఏది చెప్పినా నా కథను చూపి సమాధానం చెబుతున్నావే మాలతీ. నేను చెప్పేది పూర్తిగా విని మట్లాడు. మురికి కాలువ నీళ్ళను పరిశుభ్రం చేసే వాళ్ళూ, శ్మశానంలో పీనుగులను తగలబెట్టే వాళ్ళూ, మార్చూరీలో శవాల మధ్య తిరిగే వాళ్ళు...వీళ్లంతా కష్టపడటానికి మధ్యమే ఒక సరైన విరుగుడు మందు అనుకుంటున్నారు. అది లేకపోతే మా కర్తవ్యం నెరవేర్చడం కష్టం అని వాళ్ళు అనుకోవడం కూడా నాకు తెలుసు. కానీ, ఒక భాద్యత గల అధికారి తాను భాద్యత తీసుకున్న మొదటి రోజే ---తన ఆఫీసులోనే మధ్యం తాగటం ఎంత పెద్ద తప్పో తెలుసా?"

-- వెంకట్ ప్రసాద్ "తెలుసా?" అని ఆవేశంగా అడిగి ముగించినప్పుడు గోడ గడియారం పదకొండు గంటలు కొట్టింది. అది కొట్టి ముగించనీ అని మౌనంగా కాచుకున్న మాలతీ ఆ తరువాత,

“మీరు అనవసరంగా బయటకు వెడుతున్న పామును అడ్డగించి ఇంట్లోకి పోనిస్తున్నారు..." అన్నది.

"నువ్వేం చెబుతున్నావు మాలతీ...?"

"మాట్లాడకుండా పడుకోండి! ఇలాంటి అనవసరమైన బాధలను మూటకట్టి కిటికీలో నుంచి పారేయండి. మన అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. వాడికి 'ఫీజు’ కట్టాలి. 'ఎల్.ఐ.సీ’డ్యూ, ‘టెలిఫోన్ బిల్లు’ చాలా అవసరాలు ఉన్నాయి. పత్రిక వాళ్ళు కథ పంపంచమని అడిగారు. వాళ్ళకు కథ రాసి ఇవ్వండి. నాలుగు డబ్బులైనా వస్తాయి. ఇవన్నీ వదిలేసి ఇలా మీరు బాధ పడుతుంటే...వ్యాధులే వస్తాయి" -- కాళ్ళ క్రింద ఉన్న తన దుప్పటి తీసుకుని కప్పుకుని...తాను చెప్ప దలుచుకున్నది చెప్పేసి పడుకుంది మాలతీ.

ప్రసాద్ కు వొళ్ళు మండింది.

పెళ్ళికాక ముందు 'నీకెందుకురా ఊళ్ళో వాళ్ల గొడవలన్నీ?' అని ప్రసాద్ వాళ్ళ అమ్మ అడిగేది. ఇప్పుడు ఆ చోట భార్య!

వ్యక్తులు మాత్రం మారారు.

కానీ రాగం మారనేలేదు.

అతనిలో కడుపు మంటతో పాటూ ఆవేశమూ చోటు చేసుకుంది.

మరుసటి రోజు!

'ఆఫీసు క్యాంటీన్లో' ప్రొద్దున టిఫిన్ తింటున్నప్పుడే ప్రసాద్ చెవులు కొరకటం మొదలుపెట్టాడు ట్రబుల్ కింగ్ రాజేష్ కుమార్.

"మావా...ఏమిట్రా డల్ గా ఉన్నావు?"

"........."

"నిన్ను నవ్విస్తాను చూస్తావా?"

".........”

"రేయ్...ఇది క్రికెట్ 'సీసన్’. ఒక 'ఎస్.ఎం.ఎస్’ వచ్చింది…… చెప్పనా?"

"..........."

"రేయ్...నోరు తెరవకపోయినా ఒక 'ఊ' అనొచ్చు కదా?"

"సారీ రాజేష్ కుమార్. నేను నీ దగ్గర నుండి ఎటువంటి మాట వినే మనో స్థితిలో లేను. 'ప్లీజ్' నన్ను విడిచిపెట్టు"

"అదెలా...నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తాను. నువ్వు వింటే విను,లేకపోతే మానేయి. అది నీ ఇష్టం. మన 'క్యాంటీన్’ కొసం కొన్న 'టీ' పొడి పర్చేస్ లో మాత్రం క్యాంటీన్ మేనేజర్ డేవిడ్ యాభై వెల రూపాయలు నొక్కేశాడు. తెలుసా నీకు?"

"అవును...అతను ఒక ఫూల్ చూడు. నీ లాంటి వ్యక్తిని ఎదురుకుండా పెట్టుకుని...'చూసారా యాభై వేలు’ నొక్కేస్తున్నను చూడండి. అన్నాడా?..."

"పోరా ఇడియట్…….. నాకు ఎలా తెలుసో చెబుతా విను....

                                                                       ఇంకా ఉంది.....Continued in PART-6 ***************************************************************************************************

13, జనవరి 2020, సోమవారం

ఆలయం(సీరియల్)...PART-4



                                        
                                                 ఆలయం(సీరియల్)
                                                           (PART-4)


రాత్రి సమయం!

నిద్ర పోవటానికి ముందు ఏదైనా ఒక పుస్తకంలో పది పేజీలన్నా చదివి, దాని గురించి ఆలొచించుకుంటూ నిద్రపోవటం ప్రసాద్ కు అలవాటు.

"లైటు ఆపండి...వెలుతురు ఉంటే నేను ఎలా నిద్రపోవాలట?"--అని పది నిమిషాలకు ఒకసారి ప్రసాద్ భార్య గొణుగుతూ ఉంటుంది. ఆ రోజు అతను పుస్తకం చదవలేదు. నిద్రా రాలేదు. చేతులు కట్టుకుని, కాళ్ళు జాపుకుని అలాగే కూర్చున్నాడు.

రోజూ నిద్ర పోయేముందు ఒక గ్లాసు పాలు తాగుతాడు ప్రసాద్. ప్రసాద్ భార్య పాల గ్లాసుతో వచ్చింది. భర్త తీవ్రమైన ఆలొచనలో ఉండటం గమనించింది. ఇరవై సంవత్సరాల దాంపత్యం...'అతను ఎలాంటివాడు?' అనేది అమెకు ఎప్పుడో నేర్పింది.

ఇలా ఉన్నాడూ అంటే అతని మనసులో ఏదో ఒక నవలకు కావలసిన వృత్తాంతము తిరుగుతూ ఉండాలి. లేకపోతే సమాజ తాకిడి ఏదైనా ఏర్పడుండొచ్చు అనేది ఆమెకు తెలుసు.

భార్య అందించిన పాల గ్లాసును తీసుకుని తాగకుండా అలాగే చేతిలోనే ఉంచుకున్నాడు ప్రసాద్. ఆమె అతన్ని కెలకటం మొదలుపెట్టింది.

"ఏమండీ...?"

"హూ..."

"పాలు తాగండి..."

"ఓ...పాలుందా నా చేతిలో"

"సరిపోయింది...చేతిలో పాల గ్లాసు ఉన్నది కూడా తెలియనంత మాయలో పడేసిన ఆ ఆలొచన ఏమిటో?"

"ఏమీలేదు మాలతీ..."

"మీరే ఇంతకు ముందు అన్నారు...'ఏమీలేదని ఎవరైనా అన్నారంటే అందులో ఎన్నో విషయాలున్నాయని అర్ధం!' అని"

"నాలోనూ చాలా విషయాలు ఉన్నాయి! వాటి భారాన్ని ఎంతవరకు నేను తట్టుకోగలనన్నదే తెలియటంలేదు"

"ఏ విషయాన్నైనా మనసువిప్పి చెప్పుకుంటే...దానికొక దారి దొరుకుతుందని మీరే ఒక కథలో రాశారు"

"ఇది 'కంపనీ' విషయం మాలతీ...నీతో మాట్లాడినందు వలన ఒక్క ప్రయోజనమూ ఉండదు"

"అదెలా మీకు తెలుసు?"

"ఏమిటి మాలతీ నువ్వు...నేను చెప్పే సమస్యలను మొదట నువ్వు సరిగ్గా అర్ధం చేసుకోగలవో లేదో అనేదే నాకు సందేహం. ఆ తరువాత...నేను మాట్లాడిన తరువాత నా ఆందోళన నీకూ అంటుకుంటే. ఇది అవసరమా నీకు?"

"ఏమండి...'బెటర్ హాఫ్' అని నాకు ఇంకో పేరు ఉంది. సంతోషాన్ని మాత్రమే పంచుకునే మనిషిని నేను కాదు. ఏదైనా సరే సరదాగా నాతో చెప్పండి..."

---- మాలతీ అతన్ని వదిలేలా లేదు. అతను కూడా ఆమెతో అంతకంటే వాదించకుండా ఆమెదగ్గర తన మనో భారాన్ని పంచుకోవటం ప్రారంభించాడు.

"'కంపనీ'! ముందు లాగా లేదు. ఇప్పుడు కంపనీలో అవినీతి ఎక్కువగా ఉన్నది!"

"ఏమిటీ? అవినీతా?...అంటే కంపెనీ ఇప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ది చెందుతోంది అని అర్ధం"

"నేనొకటి చెబితే, నువ్వొకటి చెబుతున్నావే మాలతీ..."

“ఛ ఛ...నేను నిజమైన కారణాన్నే చెప్పేను. 'నువ్వు ఏలా ఉండాలని అనుకుంటావో...అలాగే మారుతావు!' అనే సామెతకూడా ఉన్నదండి. మనం ఇప్పుడు ఎక్కడండీ మంచిగా ఆలొచిస్తున్నాము? మనం వింటున్న విషయాలు కూడా తప్పుతప్పుగానే కదా ఉంటున్నాయి? ఇప్పుడంతా సాధనల గురించి మాట్లాడటంకంటే వేధనలు, అవినీతి, హత్య, మానభంగాలు, దొంగతనాలు....వీటి గురించే కదా ఎక్కువ మాట్లాడుతున్నాం. ఏదైతే మనల్ని ఎక్కువగా భాదిస్తుందో...అలాగే కదా మనం మారుతాం"

--- మాలతీ చాలా సహజంగా....అదే సమయం బాగా నొక్కి చెబుతూ ఒక కొత్త కోణంలో మాట్లాడింది.

"చాలు మాలతీ...నీ ఇష్టం వచ్చినట్టు వాగకు! 'మనం' అని నిన్నూ, నన్నూ ఎందుకు చేరుస్తావు? ఎటువంటి అవినీతి ఇంతకు ముందు నేను ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడూ చెయ్యలేదు, రేపూ చెయ్యను, ఎప్పుడూ చెయ్యను”

----అతను కోపగించుకోవటం మొదలుపెట్టాడు.

"అరే ఏమిటండీ మీరు...కోపగించుకున్నారా? నేను మిమ్మల్ని చెప్పలేదు. ఈ సమాజాన్ని చెప్పాను"

"అది నేను అసలు ఒప్పుకోను. తప్పుకు ఇలా కారణం కనిపెట్టి తప్పించుకోవటం తప్పుల్లోనే పెద్ద తప్పు"

"అది నాకూ తెలుసు. కానీ, నేను చెప్పిందే నిజం. దీన్ని ఎలా మార్చగలమో మనం ఆలొచించాలి. అది సరే...అసలు అవినీతికి పాల్పడింది ఎవరు?...అందులోనూ 'మిస్టర్ క్లీన్’ అయిన మీకు తెలిసేటట్టు"

"నువ్వు ఏం చెప్ప దలచుకున్నావు?"

"అదేమిటంటే...ఈరోజుల్లో దొరికిపోయేంత తేలికగా ఎవరూ తప్పు చేయటంలేదు. ఇది 'కంప్యూటర్’ యుగం. రుజువు వదిలిపెట్టకుండా ఎలా తప్పు చేయాలో 'కంప్యూటర్’ ఎక్కువగానే చెప్పిచ్చింది. అందుకే అలా అడిగాను"

"నువ్వు చెప్పేది నిజమే. నేను తెలుసుకున్న ఏ విషయానికీ ఒక్క 'రుజువు' కూడా లేదు. నా బాధకు అదీ ఒక కారణమే....”

“అవును నేను తెలియక అడుగుతున్నాను. మీరు మీ 'కంపనీ'లో ఒక 'స్టోర్ కీపరా?' లేక...మీరే 'చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టరా'?"

"తరువాత నువ్వు ఏం చెప్పబోతావో నాకు తెలుసు.'మీ పనిని మీరు కరెక్టుగా చెయ్యండి...అవినీతి గురించి బాధ పడాల్సింది యజమాని. మీకు ఎందుకు ఈ అక్కర్లేని పని!' అని అడగబోతావు?..........అవునా? "

                                                                      ఇంకా ఉంది.....Continued in PART-5 **************************************************************************************************

11, జనవరి 2020, శనివారం

ఆలయం(సీరియల్)...PART-3



                                                ఆలయం(సీరియల్)
                                                           (PART-3)


క్రిష్ణా నది ఒడ్డున కూర్చున్న ప్రసాద్ కు, ఆఫీసు రూములోనే మద్యం తాగుతున్న ఆ అధికారి యొక్క మొహం కళ్ళ ముందుకు వస్తూ, పోతూ ఉన్నది.

"ఇలాంటి ఒక చెడు అలవాటున్న ఒక వ్యక్తి ఎలా ఒక అధికారిగా నడుచుకోగలడు?" అనే ప్రశ్న ప్రసాద్ మనసును వెధిస్తున్నది.

ప్రసాద్ దేవుడుగా తలచుకుంటున్న 'చైర్మన్’ శంకరయ్య గారు, తాగుడుకు మాత్రమే కాదు...అన్ని చెడు అలవాట్లకూ దూరంగా ఉండటమే కాకుండా, ఆ అలవాట్లన్నీ తప్పు అని గట్టిగా చెబుతారు. 'శరీరాన్ని ఆరొగ్యంగా ఉంచుకోవాలంటే క్రమశిక్షణ అవసరం!' అని చెబుతారు. దాన్ని తన జీవితంలోనూ ఆచరణలో పెడుతూ వచ్చారు.

చూడటానికి యాభై ఏళ్ళ వ్యక్తి లాగానే ఉంటారు. కానీ, ఆ యౌవన రూపానికీ, శరీర దారుఢ్యానికీ కారణం ఆయన చేపట్టిన క్రమశిక్షణే. కానీ, ప్రసాద్ స్నేహితులు'నా దగ్గర కూడా కోట్ల కోట్ల డబ్బుంటే నేను కూడా తలతలమని మెరిసిపోతాను...'అని ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతారు.

డబ్బుగల వారు మెరిసిపోవటానికీ, క్రమశిక్షణతో ఆరొగ్యంగా ఉన్నవారు మెరిసిపోవటానికీ గల తేడా ప్రసాద్ కు బాగానే తెలుసు. ప్రసాద్ భార్య కూడా శంకరయ్య గారి ఫోటో చూసి...మీ 'చైర్మన్’ మంచి శరీర దారుఢ్యం గలవారూ అంటూ సరైన మాటలతో సూచిస్తుంది.

క్రమశిక్షణతో ఉంటే శరీర దారుఢ్యం ఏమిటి....అన్నీ వెతుక్కుంటూ వస్తాయి అనడానికి శంకరయ్య గారు ఒక ఉదాహరణ. అలాంటి మనిషి యొక్క సంస్థలో...మధ్యం అలవాటున్నఒక అధికారి!

ప్రసాద్ కు ఆఫీసులోనే మధ్యం తాగుతున్న ఆ అధికారి మొహం మాటి మాటికీ గుర్తుకు వస్తూ క్షోభ పెడుతోంది. గుడికి వచ్చిన చోట కూడా కనకదుర్గ అమ్మవారిపైన మనసును కేంద్రీకరించలేకపోయాడు. ఒక వార పత్రిక యాజమాన్యం దగ్గర నుండి చిన్న కథ ఒకటి పంపించమని ఫోన్ కూడా వచ్చింది.

మామూలుగా క్రిష్ణా నది ఒడ్డున కూర్చుంటే ప్రసాద్ కు కథలకు కావలసిన ఐడియాలు దొరుకుతాయి. ఒకసారి ఒక పెద్దాయన క్రిష్ణా నది ఒడ్డున కూర్చున్న ప్రసాద్ దగ్గరకు వచ్చి, కన్న బిడ్డలు అతన్ని కొట్టి బయటకు పంపించేసేరని చెప్పి ఏడుస్తూ చెయ్యి జాపాడు. పది రూపాయలు తీసుకున్న తరువాతే ప్రాసాద్ ను వదిలిపెట్టాడు. గంట తరువాత ఇంటికి తిరిగి వెడుతున్నప్పుడు ఆ పెద్దాయన ప్లాట్ ఫారం మీద మధ్యం మత్తులో తూలుకుంటూ నడిచి వెళ్లటం ప్రసాద్ కళ్ళకు కనబడింది. తాగటం కోసమే ఆయన అలాంటి అబద్దం చెప్పాడు అనేది ఆ క్షణమే ప్రసాద్ కు అర్ధమయ్యింది.

ప్రసాద్ వరకు మొసం పోవటమూ నచ్చదు; మోసగించటమూ నచ్చదు. ఆ క్షణం అతనికి వచ్చిన కోపానికి కొలతే లేదు. మరుసటి రోజు ప్రసాద్ క్రిష్ణా నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు ఆ పెద్దాయనను చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. గబుక్కున ఆయన చేయి పుచ్చుకుని సరసరమని ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ ప్రసాద్ పెద్దాయన గురించి చెప్పింది ఎవరూ పట్టించుకోలేదు.

“మీరే సార్ జాగ్రత్తతో వ్యవహరించాలి! దీని కోసం అతన్ని పట్టుకుని జైల్లో పెడితే...జైల్లోనే బిచ్చం అడుక్కుంటాడు. ఇది అవసరమా? వదిలేయండి సార్. ఒక రోజు కాకపోతే...మరొక రోజు తాగేసి క్రిందపడిపోయి...ఏ లారీ క్రిందనో, బస్సు క్రిందనో పడి చస్తాడు. అదే వీళ్లకంతా ఒక ముగింపు" అన్నాడు, కానిస్టేబుల్.

చక్కటి బాధ్యత గల సమాధానం!?. ప్రసాద్ కు పోలీసుల నిజమైన మొహం తెలియటం అలాంటి సందర్భాలతొనే ప్రారంభమైంది!

ఆ తరువాత పోలీసులు చెప్పినట్లు జరగటమే ఘోరం!

ఆ తాగుబోతు పెద్దాయన సిటీ బస్సు చక్రాల క్రింద రక్తపు ముద్దలా పడున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రసాద్ కు గుండే గుభేలు మన్నది. ‘కానిస్టేబుల్ చెప్పింది ఫలించిందా? లేక తన వల్ల ఆ తాగుబోతు పెద్దాయన్ని కాపాడటం కుదరలేదా? ఎందువల్ల ఇలా జరిగింది?’ అనే ప్రశ్నలు, వాటి తాకిడి కలిపి ప్రసాద్ దగ్గర ఒక చిన్న కథగా తయారయ్యింది.

కానీ, కథలో ప్రసాద్ మంచి మార్పు చేశాడు. తాగుబోతు పెద్దాయనను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి అప్పగించలేదు. దానికి మారుగా ఆయన్ని తీసుకువెళ్ళి తన ఇంటి తోటమాలిగా పెట్టుకున్నాడు.

పెద్దాయన కూడా తనకొక కొత్త జీవితం దొరికిందన్న ఆనందంతో...తోటమాలి పనిని ఒక పరిహారంగా తీసుకున్నాడు.

ఆ కథకు ఐదువేల రూపాయలు బహుమతిగా లభించింది. జీవితంలో అతను చూసే సంఘటనలతో ఇలాంటి పలు మంచి కథలు రూపొందాయి. ఆఫీసులోని తాగుబోతు అధికారి కూడా ప్రసాద్ కు, ఒక కథకు కథాంశం అవబోతాడా? లేక...'కంపెనీ' కి ఒక ఎరువుగా ఉపయోగపడతాడా అనేది మాత్రం కన్ ఫ్యూజన్ గానే ఉన్నది.

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-4

****************************************************************************************************

9, జనవరి 2020, గురువారం

ఆలయం(సీరియల్)...PART-2




                                                ఆలయం(సీరియల్)
                                                           (PART-2)


ప్రసాద్ తన కుర్చీలో కూర్చుని 'కంప్యూటర్లో' తన చూపులను కేంద్రీకరించాడు. అతని యొక్క అకౌంట్స్ ను...కావలసినంత వరకు 'రిపోర్టు’ తయారు చేసి 'ప్రింట్' తీయాలి. ప్రసాద్ ఆ పనిమీద ఉన్నప్పుడు తలుపు తెరుచుకుని అతని 'ఏ.సీ’ గదిలోకి వచ్చాడు రాజేష్ కుమార్.

రాజేష్ కుమార్, ప్రసాద్ యొక్క సహ ఉద్యోగి. వచ్చినతను వూరికే కూర్చోలేదు. ఫ్యాక్టరీలో జరుగుతున్న తప్పు ఒప్పులను చర్చించడం మొదలుపెట్టాడు.

"ప్రసాద్!"

"ఊ"

"కొంచం ఇటు చూడు ప్రసాద్ "

"నేను ఇప్పుడు 'బిజీ' గా ఉన్నాను. ఏదున్నా సరే లంచ్ టైములో మాట్లాడుకుందాం"

“అప్పుడూ మాట్లాడుకుందాం సరే. కానీ, ఇప్పుడు నేను మాట్లాడ దలచుకున్నది మాట్లాడి వెళ్ళిపోతాను"

"నేను ప్రశాంతంగా పని చేయడం నీకు ఎప్పుడూ నచ్చదే..."

"అదెలా? మనకి మన చుట్టూతా అందరూ మనలాగానే ఉండాలే!"

"ఈ సిగ్గులేని విషయాన్ని బహిరంగంగా ఒప్పుకుంటున్నావా?"

"ఇది సిగ్గులేని విషయం కాదు ప్రసాద్. ఇదే యథార్థం. ఏ ఫ్యాక్టరీలోనైనా నీలాగా ఉండే వ్యక్తులు ఒకరో...ఇద్దరో నే ఉంటారు...కానీ నూటికి తొంబై మంది నాలాంటి వ్యక్తులే ఉంటారు"

"అదేమో నిజమే. సరే...ఏమిటి విషయం? త్వరగా చెప్పి ఇక్కడ్నుంచి వెళ్ళు...నాకు చాలా పనుంది"

"సరేరా. అయ్యగారు నీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పబోతారు. బాగా విను!"

"నువ్వు నోరు తెరుస్తే అన్నీ ఆశ్చర్యమే. ఇందులో వేరుగా ఒక ఆశ్చర్యమా?"

“అవన్నీ మామూలైనవి. కానీ, ఇది స్పెషల్ ఆశ్చర్యం..."

"సరేరా... త్వరగా చెప్పి తగలడు"

"చెప్పేస్తాను…మన 'కంపనీ'కి కొత్తగా ఒక 'పి.ఆర్.ఓ' వచ్చారు."

"అంటే...'పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్’?"

"'పి.ఆర్.ఓ'కి ప్రపంచమంతా అదే అర్ధం అనుకుంటా"

"కొత్త 'పి.ఆర్.ఓ' వస్తారని తెలుసు. కానీ, వచ్చి జాయిన్ అయ్యారని తెలియదు. సరే...ఇప్పుడు దానికేమిటిట?"

"దానికేమిటనా అడుగుతున్నావు? మనిషిని చూశావా...చూసి వచ్చిన తరువాత ఆ మనిషి గురించి చెప్పు. ఇంతటితో ఆఫీసు వార్తలు సమాప్తం. ఆశ్చర్యకరమైన మరికొన్ని వార్తలతో మిమ్మల్ని మళ్ళీ అలరించటానికి లంచ్ టైములో క్యాంటీన్లో కలుస్తాను....టొంటడైన్..."

---- రాజేష్ కుమార్, ప్రసాద్ గదిలో నుండి బయటకు వెళ్లాడు.

వెంటనే కొత్త 'పి.ఆర్.ఓ' ను కలిసి విష్ చేయాలని, తనని పరిచయం చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రసాద్ ఆయన్ని కలవటానికి ఆయన రూముకు వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఒక ఆశ్చర్యం ఎదురైయ్యింది.

రాజేష్ కుమార్ చెప్పినట్లే ఆ 'పి.ఆర్.ఓ' ఉండటం దారుణం. షాక్. స్పెషల్ ఆశ్చర్యం.

చిన్నగా తెరిచున్న ఆఫీసు రూము అవతల వైపు ఉన్న ఆ మనిషి, ఆఫీసు రూములోనే ఒక చిన్న మద్యం బాటిల్ తీసి మూత తెరిచి ఏదో 'టానిక్' తాగుతున్నట్టు తాగుతున్నాడు.

ప్రసాద్ కు గుండె గుభేలుమంది!

ఆలయం లాంటి 'కంపెనీ' లోపల ఆఫీసు టైములో మద్యం!

అందులోనూ భాద్యత గల ఒక అధికారి!!!!

                                                                          ఇంకా ఉంది.....Continued in PART-3.

****************************************************************************************************

7, జనవరి 2020, మంగళవారం

ఆలయం(సీరియల్)...PART-1




                                                ఆలయం(సీరియల్)
                                                          (PART-1)


విజయవాడ నగరములోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ ఆలయం భక్తులుతో కిట కిట లాడుతోంది. ఆ రోజు అమ్మవారి దర్శనం కోసం కనకదుర్గ గుడికి వెళ్ళాడు ప్రసాద్. వెంకట్ ప్రసాద్ అని వాళ్ళ నాన్న పేరు పెట్టారు. అది ఎందుకో తెలియదు గానీ రెండు మాటలున్న పేర్లు గలవారిని చాలామంది ఆ రెండు మాటలతో పిలవరు. సురేష్ కుమార్ ను సురేష్, రామ మూర్తిని రామూ, క్రిష్ణ కుమార్ ను క్రిష్ణా అని పేరును కుదించి పిలవటమే అందరి నాలుకలకు అలవాటైపోయింది. ఆ కారణం కొసమే వెంకట్ ప్రసాద్, ప్రసాద్ అయిపోయింది.

మనం కూడా ప్రసాద్ అనే పిలుద్దాం...!

ప్రసాద్ ఒక కనకదుర్గ భక్తుడు. కనకదుర్గ గుడికి వెళ్ళే ముందు క్రిష్ణా నదిలో స్నానం చేసి వెళ్ళేటం అలవాటు. ఒక్కోసారి స్నానం చేసిన తరువాత అక్కడ మెట్ల మీద కూర్చుని ఊహల్లోకి వెళ్ళిపోతాడు.

అతను అలా ఊహల్లోకి వెళ్ళటానికి ముఖ్య కారణం అతనొక రచయత. అందులోనూ బాగా పేరుపొందిన రచయత. అతనికని విజయవాడ నగరంలో ఒక చిరునామా ఉన్నది. దాంతో పాటు అతను ఒక ఫ్యాక్టరీలో సీనియర్ ఉద్యోగస్తుడు.

అతనికని మూలాధార శక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఇంద్రకీలాద్రి పైన కొలువున్న కనకదుర్గ అమ్మవారు, రెండు అతను పనిచేస్తున్న ఫ్యాక్టరీ యజమాని శంకరయ్య! కనకదుర్గ అమ్మవారిని అందరికీ తెలిసుంటుంది. ఈ శంకరయ్య నే అందరికీ పరిచయం చేయాల్సి ఉంది.

శంకరయ్య, ప్రసాద్ పనిచేస్తున్న ఫ్యాక్టరీ యొక్క యజమాని!

యజమాని అని పిలిస్తే సామాన్యంగా ఉంది కదా? అందంగా 'చైర్మన్’ అని చెప్పటంలోనే ప్రసాద్ కూ ఇష్టం. ఆయన వలనే అతను రచయతగా అవగలిగాడు. గుడిలో అమ్మవారి ముందు ‘చైర్మన్’ కోసం కూడా ప్రార్ధన చేసుకుంటాడు ప్రసాద్. శంకరయ్య గారు ఒక 'మల్టీ మిల్లియనర్’ . ఎటు చూసినా ఆయనకు ఫ్యాక్టరీలున్నాయి. ప్రపంచం మొత్తాన్ని చుట్టి చుట్టి వస్తారు. వంశ పారంపర్యంగా ఆస్తిపరుడు. కానీ, ఎక్కువమంది డబ్బుగలవారిలో అతుక్కోనుండే ఎటువంటి అహంభావమూ లేని అద్భుత ఆత్మ.

ఈ ప్రపంచంలో అన్ని రంగాలలోనూ అద్భుతమైన మనుష్యులు ఉంటారు. అందులో ఒకరిగా శంకరయ్య గారిని చెప్పొచ్చు. ప్రసాద్ కు ఆయన ఒక అతిపెద్ద ఉదాహరణ మనిషి కూడా! అందుకనే నేమో ప్రసాద్ తన కొడుక్కి ఆయన పేరు పెట్టుకున్నాడు.

ఒక వేడుక ఏమిటంటే...కొడుక్కి ఆయన పేరు పెట్టి, 'రేయ్ శంకరయ్య ' అని ప్రేమతో పిలవటానికి ఇష్టపడడు. తన కొడుకును 'చైర్మన్’ అనే పిలుస్తాడు.

ప్రసాద్ భార్య మాలతి...మంచి హౌస్ వైఫ్. ఆమె కూడా భర్తతో కలిసి తన కొడుకును 'చైర్మన్’ అనో, ‘ఎం.డి’ అనో పిలవటం ఒక వెడుక గా మొదలయ్యి, తరువాత అలవాటుగా మరిపోయింది.

ప్రసాద్ కొడుకు శంకరయ్య, ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో 'బి.ఇ.' చదువుతున్నాడు. వాడి స్నేహితులు కూడా....'రేయ్ చైర్మన్’ అని అతన్ని పిలవటం, వింటున్న మనకే వింతగా ఉంటుంది.

ప్రసాద్ అవన్నీ పట్టించుకోడు. అతని వరకు కొడుకు, యజమాని శంకరయ్యలా విజయం పైన విజయం సాధించాలి. ఆయన లాగానే వేలాది మందికి ఉద్యోగం ఇచ్చి ఆదుకొవాలి. తెలుగు భాష మీద ప్రేమ, తెలుగు సంస్కృతి, నాగరికత--ఇవన్నీ అతనిలో ఉండాలి. ఇదే ప్రసాద్ కోరిక. దీనికొసమే రోజూ కనకదుర్గ అమ్మవారిని వెడుకుంటూ ఉంటాడు.

ఇంకో కొన్ని సంవత్సరాలలో ప్రసాద్ కొడుకు డిగ్రీ పూర్తిచేసి, ప్రసాద్ ఆశలను పూర్తిచేస్తాడు. కానీ, అంత వరకు అతను అతని గౌరవనీయ యజమాని అయిన శంకరయ్య ఫ్యాక్టరీలో పనిచేయగలడా, లేదో అనేదే అతనిలో పెద్ద ప్రశ్నార్ధంకంగా ఉంటోంది.

దానికి కారణం అతనిలో ఈ మధ్య ఏర్పడిన భయం!

ఊహల్లో సులభంగా సంచరించ గలిగిన అతను ఈ మధ్య స్వయంగా కొన్ని యధార్ధాల తాకిడికి లోనైయ్యాడు.

క్రిష్ణా నది ఒడ్డున కుర్చున్నప్పుడు అతని మనసులో దాని గురించే ఆలొచన వచ్చింది.

ఆరోజు ప్రొద్దున....ఆఫీసులో జరిగిన ఒక సంభవం అతన్ని కలవరపెడుతోంది.

                                                                  ఇంకా ఉంది.....Continued in PART-2.

********************************************************************************************


4, జనవరి 2020, శనివారం

లక్కీ క్యాట్ గుడి…(ఆసక్తి)



                                                     లక్కీ క్యాట్ గుడి


మనం ఏదైనా గుడికివెళ్తే ఇంటికి ప్రసాదం పట్టుకుపోయినట్లే, ఈ లక్కీ క్యాట్ ఆలయానికి వచ్చిన వారందరూ అక్కడుండే పిల్లి బొమ్మను కొనుక్కుపోతారు. ఎందుకంటే అదో అదృష్టచిహ్నంగా భావిస్తారు. దేవతగా నమ్ముతారు. ఇవన్నీ టోక్యోలోని 'గొటుకూ-జీ గుడి విశేషాలు. ఇక్కడుండే పిల్లి బొమ్మను 'లక్కీ క్యాట్' గా భావిస్తారు. కారణం తెలుసుకోవాలంటే దీని కథ తెలుసుకోవల్సిందే.


శకునం (Omen) అనగా జరగబోవు పని గురించిన సంజ్ఞ. కొన్నిటిని కొందరు వ్యక్తులు శుభ శకునాలుగానూ, కొన్నిటిని అశుభ శకునాలుగానూ భావిస్తారు. శకునాల శాస్త్రీయత ప్రశ్నార్ధకమైనందువల్ల హేతువాదులు శకునాలను పట్టించుకోవటాన్ని మూఢ నమ్మకంగా చెప్తారు. అయితే మానవ చరిత్రలో మరియు జానపద వాజ్మయంలో(Index) శకునాలకు చాలా ప్రధానపాత్ర ఉన్నది.


జానపదులు అనేక రకాల శకునాలను చూసుకుంటారు. అందులో ముఖ్యంగా కాకి శకునం వివరంగా చూసుకుంటారు. కాకి అరుస్తూ ఉంటే చుట్టాలొస్తారని ఎదురు చూస్తూ ఉంటారు.

శకునాలు తెచ్చే ఫలితాలను బట్టి వాటిని శుభశకునాలు మరియు అశుభ శకునాలుగా వర్గీకరిస్తారు. శకునాలు ఆ యా దేశాల సంస్కృతిని బట్టి మారుతూ ఉంటాయి. ఒక సంస్కృతిలో శుభ శకునంగా పరిగిణించిన దాన్ని వేరొక సంస్కృతిలో అశుభ శకునంగా పరిగణించే అవకాశం ఉంది. ఉదాహరణకు అమెరికాలో నల్లపిల్లిని అశుభ సూచకముగా భావిస్తే, ఇంగ్లాండులో అదే నల్లపిల్లిని శుభ సూచకముగా భావిస్తారు.


శకునాలను, వాటి ఫలితాలను భారతీయులు ఎంతగానో విశ్వసిస్తుంటారు. శుభకార్యాల నిమిత్తం బయలుదేరుతున్నప్పుడు, శుభకార్యాలకి సంబంధించిన పనులను ప్రారంభిస్తూ వున్నప్పుడు సహజంగానే శకునం చూసుకుంటూ ఉంటారు. శకునం మంచిగా అనిపించకపోతే శుభకార్యాలను వాయిదా వేయడమే కాదు, రద్దు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది.


ఈ శకునాల్లో పిల్లి శకునం మరింత ప్రభావం చూపుతుందని భావిస్తూ వుంటారు. పెంపుడు పిల్లికి తప్పులేదనే విశ్వాసం వుండటం వలన, తమ పిల్లి కాకుండా మరో పిల్లి ఎదురుపడితే దానిని శకునంగానే భావిస్తుంటారు. అంతేకాదు పెంపుడు పిల్లి ఇల్లు వదిలిపోతే ఇంటిలోని అదృష్టం కూడా దానితోనే పోతుందంటారు పెద్దలు. శకునాలలో ప్రపంచవ్యాప్తంగా పిల్లి శకునాన్నే ఎక్కువమంది పట్టించుకుంటున్నారు. పిల్లి ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తు గురించి పలు జోస్యాలు చెబుతుంటారు. పిల్లి కదలికల్లో ఏదో ఒక సూచనను చూసేవారు కోకొల్లలుగా ఉన్నారు.


వెన్నెలలో నల్లపిల్లిని చూడడం ఆ ప్రాంతంలో ఏదో ఒక అంటు వ్యాధి ప్రబలనున్నదనడానికి సూచనట(ఇది ఐరిష్ ప్రజల భయం). ఉద్దేశపూర్వకంగా పిల్లిని చంపితే మీరు మీ ఆత్మను దయ్యానికి కోల్పోయినట్టే(ఇది బ్రిటన్ వాసుల నమ్మకం). ఒక పిల్లి తన తోకను మంటవైపు ఉంచి, తన చెవుల పై భాగాన్ని నాకుతూ ఉంటే వాతావరణ పరిస్థితులు విషమిస్తాయి. వివాహవేదిక వద్ద పిల్లి ఉండడం మంచి అదృష్టం. ఒక మృతుడి శవపేటికపైనుంచి పిల్లి దూకితే శాశ్వత నిద్రపోతున్న ఆ మహానుభావుడు స్వర్గానికి చేరే ప్రసక్తే లేదు.(ఇది ఆస్ట్రేలియన్ల మాట). ఒక పిల్లి కిటికీలో నుంచి అదే పనిగా బయటకు చూస్తుంటే వర్షం ఖాయంగా రాబోతోందనడానికి సూచన.కలలో పిల్లి దర్శనమిస్తే ధన లాభం. వ్యాపారంలో కలిసొస్తుంది. నల్ల, తెల్ల పిల్లులు స్వప్నంలో కనిపిస్తే మీ సంతానం విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. చారలపిల్లి కలలో కనిపిస్తే మీ ఇంటిలో అదృష్టం వర్షిస్తుంది. నల్ల పిల్లులు గుప్త నిధులను కనిపెట్టగలుగుతాయి. ఐదురోడ్ల కూడలివద్దకు పిల్లిని తీసుకువెళ్ళి వదిలేయండి. ఆ తరువాత దానిని అనుసరించండి. మీకు గుప్తనిధులు దొరుకుతాయి( ఇది ఫ్రెంచ్ వారి ఆశాభావం).


జపాన్ దేశంలో సైగచేసే పిల్లి అదృష్టం, ఐశ్వర్యం తీసుకువస్తుందని గట్టి నమ్మకం. పిల్లులు సైగలు చేస్తాయా? వాటి ప్రవర్తనల బట్టి వాటికి శకునాలు నిర్ణయించుకున్నారు. పూర్వం ఒక రాజు సెటగయా నగరంలో నుండి వెడుతూ, అలసిపోయి ఉండటంతో సేద తీర్చుకోవడానికి ఒక చెట్టు దగ్గర ఆగాడు. ఇది గమనించిన ఒక పిల్లి ఆ రాజుకు సైగ చేసి వేరే చోటుకు తీసుకు వెళ్ళింది. కొద్దిక్షణాలలో గాలివానతో కూడిన వర్షం రావడం, అప్పుడు ఒక పిడుగు, అంతకు ముందు రాజు నిలబడ్డ చోట పడటం జరిగింది. అది చూసిన రాజు, ఆ పిల్లిని తన అదృష్ట దేవతగా భావించి, కోట్లకొలది డబ్బుతో అక్కడ ఆ పిల్లికి ఒక గుడి కట్టించాడట. అప్పటి నుండి ఆ గుడి, సైగచేసే ఆ పిల్లి, జపాన్ ప్రజలకు ప్రియమైనదిగా మారింది.


'మనేకి నెకో’ లేక 'సైగ చేయు పిల్లి’ ...ఇది జపాన్ దేశంలో అత్యంత పేరుపొందిన బొమ్మ (విగ్రహం). అదృష్టం, ఐశ్వర్యం తీసుకువస్తుందని గట్టి నమ్మకంతో జపాన్ దేశ ప్రజలు తమ ఇళ్ళల్లో, షాపులలో, వ్యాపార కేంద్రాలలో, ఆఫీసులలో ఈ పిల్లి బొమ్మను తప్పక ఉంచుకుంటారు. సెటగయా నగర సరిహద్దులలో 'గొటుకూ-జి’ అనే పేరుతో ఈ పిల్లి విగ్రహంతో ఒక గుడి ఉన్నది.

సైగ చేసే పిల్లుల బొమ్మలను బ్యాటరీలతో తయారు చేసి అమ్ముతున్నారు. ఈ బొమ్మ, బ్యాటరీ పవర్ తో, చేతితో సైగ చేస్తుంది. ఈ బొమ్మను అందరూ కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. ఈ బొమ్మ శక్తి ఇప్పుడు ఆసియా దేశాలలో కూడా వ్యాపించింది.

Images Credit: To those who took the original Photo. ****************************************************************************************************

2, జనవరి 2020, గురువారం

ముత్యాల వంతెన......(ఆసక్తి)



                                                    ముత్యాల వంతెన

జపాన్ దేశంలోని అకాసీ కైకో వంతెన ప్రపంచంలోని పొడవైన వేలాడే వంతెనలలో ఒకటి. ఈ బ్రహ్మాండమైన వంతెనకు ముత్యాల వంతెన అనే మరో పేరు కూడా ఉన్నది. జపాన్ దేశంలోని ముఖ్యమైన నగరాలలో ఒకటైన అకాసి నగరాన్ని, అవాజీ దీవిని కలపటానికి అకాసి సముద్ర నీటి జలాలపై ఈ వంతెనను నిర్మించారు.


కొన్ని సంవత్సరాల ప్రణాళిక తరువాత 1986, మే నెలలో నిర్మాణం మొదలుపెట్టి పన్నెండు సంవత్సరాల తరువాత ఏప్రిల్-5,1998లో వంతెన పూర్తి చేశారు. మొదట రైల్వే లైను కుడా అమర్చాలనుకున్నారు. కానీ, ఆ తరువాత ఆ ఉద్దేశం మానుకుని కార్లూ, బస్సులూ, లారీలూ వెళ్ళడానికి మాత్రం ఆరు రోడ్లు (వెళ్ళడానికి మూడు, రావడానికి మూడు) ఉండేటట్లు వంతెనను నిర్మించారు. పెను తుఫానలనూ, పెద్ద భూకంపాలనూ ( రిక్టర్ స్కేల్లో 8.5 వరకు నమోదయ్యే భూమి అధుర్లను) తట్టుకోగలిగే అతి గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీతో అకాసీ కైకో వంతెనను కట్టారు.


1986 వ సంవత్సరం అకాసీ కైకో వంతెనను నిర్మిస్తున్నప్పుడు జనవరి-17, 1995లో రిక్టర్ స్కేల్లో 7.2 గా నమోదైన భూకంపం ఏర్పడింది. ఆ భూకంప తాకిడిలో వంతెన నిర్మాణం ఎటువంటి నష్టానికీ గురికాకపోయినా వంతెన నిర్మాణ పొడవు ఒక మీటరుగా పెరగటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే మొదట్లో 1990 మీటర్ల సరిపడ వేసిన 2 వంతెన పిల్లర్లు ఆ భూకంపం తరువాత 1991 మీటర్లుగా జరిగాయి.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వేలాడే వంతెన (అకాసీ కైకో/ముత్యాల వంతెన) గురించిన మిగిలిన ఆశ్చర్య పరిచే అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాం.

1)వంతెన మొత్తం పొడవు 3,911 మీటర్లు( 12,831 అడుగులు) వంతెనకు ఊపిరిగా ఉండే రెండు పిల్లర్ల దూరం 1,991 మీటర్లు (అంటే 1,24 మైళ్ళు).

2)వంతెన మధ్య వేయబడిన ఊపిరి పిల్లర్ల దూరంలో ఎక్కువ దూరం ఉన్న వంతెన ప్రపంచంలోనే ఇదొక్కటే.


3) 100 కు పైన వంతెనలు నిర్మాణ కంపెనీలు కలిసి పనిచేసిన మొదటి వంతెన. 20 లక్షల మంది కార్మీకులు కలిసికట్టుగా పనిచేసిన వంతెన.

4) 286 కిలోమీటర్ల వేగమైన గాలినీ, రిక్టర్ స్కేల్లో 8.5 బలమైన భూకంపాన్ని తట్టుకునే శక్తి కలిగింది.

5) మొత్తం వంతెనకు ఉపయోగించిన ఇనుము 1,81,000 టన్నులు. పిల్లర్లకు వాడబడిన సిమెంట్ కాంక్రీట్ 14 లక్షల క్యూబిక్ అడుగులుగా ఉంటుంది.


6) అత్యంత ఉష్ణోగ్రతలలొ వంతెన 2 మీటర్లకు సాగుతుంది.

7) వంతెన సముద్రమట్టానికి 65 కిలోమీటర్ల ఎత్తులో కట్టబడ్డది కాబట్టి పెద్ద ఓడలు కూడా వంతెన కింద నుండి వెళ్ళవచ్చు.

8) వంతెన మొత్తం పొడవుకు ఉపయోగించబడ్డ మొత్తం ఐరన్ కేబుల్స్ పొడవు 3,00,000 కిలోమీటర్లు (అంటే 1, 90,000 మైళ్ళు). ఇందులోని ఒక్కొక్క కేబుల్ 44 ఇంచుల లావుగా ఉంటుంది.

9) పిల్లర్లలో వేసిన ఇనుప చట్రాలు, ఇనుప పైపులను చుట్టడానికి 36,880 ఇనుప కేబుల్స్ ఉపయోగించారు.

10) ఈ వంతెన మొత్తానికి ఉపయోగించిన ఇనుప కేబుల్స్ ను లెక్క వేస్తే అది ప్రపంచ మొత్తాన్నీ 7 సార్లు చుట్ట వచ్చుట.

11) అంతర్జాతీయ నౌకా రవాణా దారి అయిన ఈ సముద్ర నీటి జలపాత దారిలో రోజుకు 1000 నౌకలు ప్రయాణం చేస్తాయట.

12) రోజుకు సరాసరి 23,000 వాహనాలు వెళ్ళే ఈ వంతెనకు రాత్రిపూట వెలుతురు కోసం 1,737 లైట్లు అమర్చారు.

13) ఈ వంతెన కట్టటానికి అయిన మొత్తం ఖర్చు 500 బిల్లియన్ అమెరికన్ డాలర్లు.

Images Credit: To those who took the original Photo. **************************************************************************************************