15, జనవరి 2020, బుధవారం

ఆలయం(సీరియల్)...PART-5



                                              ఆలయం(సీరియల్)
                                                         (PART-5)


"పరవాలేదే...సరిగ్గా అర్ధం చేసుకున్నారే!"

"నువ్వు చెప్పేది వాస్తవమే మాలతీ. ఒక విధంగా ఇది అనవసరమైన పనే. అనవసరమైన బాధ కూడా....!. 'మనం మన పనిని కరెక్టుగా చేసుకుంటూ వెళదాం. తప్పు చేసిన వాళ్లను ఆ దేవుడే ఒకరోజు ధండిస్తాడు అనుకుంటూ మామూలుగా వెళ్ళటం నా వల్ల కాదు. ఒక రచయతగా - కళ్ల ఎదురుకుండా జరుగుతున్న అన్యాయాన్ని,అవినీతిని చూస్తుంటే నా రక్తం ఉడికిపోతోంది"

"తెలుసు...చివరగా 'నేను జస్ట్ ఒక స్టోర్ కీపర్ మాత్రమే కాదు...సమాజ సంరక్షణ కలిగిన రచయతను అనే కదా చెప్పబోతారు...అందులోనూ మీ యజమానిని దేవుడు కంటే ఎక్కువగా చూస్తున్నారు కాబట్టే ఇలాంటి విషయాలను మీరు మామూలుగా తీసుకోలేరని నాకు తెలుసు. సరే...మిమ్మల్ని ఒకటడుగుతా కోపగించుకోకూడదు..."

"ఏమిటది మాలతీ?"

"ఈ అవినీతిని ఎదిరించి పోరాడబోతారా?"

"ఎదిరించక...?"

"ఎలా ఎదిరిస్తారు?"

"దాని గురించే ఆలొచిస్తున్నాను. అది మాత్రమే కాదు మాలతీ. ఇలాంటి అవినీతిని జరగకుండా ఆపి ఒక మంచి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచాల్సిన 'పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్’ రే ఒక పెద్ద తాగుబోతుగా ఉన్నాడే. ఆయన మధ్యం తాగటం నా కళ్ళార చూశానే"

"మీరే ఒక కథలో...మధ్యం తాగటం ఒక బలహీనం. అదేమంత పెద్ద నేరం కాదు! అని రాసారు. మీకే తెలుసు...మామూలు 'హై స్కూలు’ పిల్లలు కూడా ఇప్పుడు సర్వ సాధారణంగా మధ్యం తాగుతున్నారు. మధ్యం తాగటాన్ని ఎందుకు ఒక పెద్ద విషయంగా మాట్లాడుతున్నారు?"

"ఏది చెప్పినా నా కథను చూపి సమాధానం చెబుతున్నావే మాలతీ. నేను చెప్పేది పూర్తిగా విని మట్లాడు. మురికి కాలువ నీళ్ళను పరిశుభ్రం చేసే వాళ్ళూ, శ్మశానంలో పీనుగులను తగలబెట్టే వాళ్ళూ, మార్చూరీలో శవాల మధ్య తిరిగే వాళ్ళు...వీళ్లంతా కష్టపడటానికి మధ్యమే ఒక సరైన విరుగుడు మందు అనుకుంటున్నారు. అది లేకపోతే మా కర్తవ్యం నెరవేర్చడం కష్టం అని వాళ్ళు అనుకోవడం కూడా నాకు తెలుసు. కానీ, ఒక భాద్యత గల అధికారి తాను భాద్యత తీసుకున్న మొదటి రోజే ---తన ఆఫీసులోనే మధ్యం తాగటం ఎంత పెద్ద తప్పో తెలుసా?"

-- వెంకట్ ప్రసాద్ "తెలుసా?" అని ఆవేశంగా అడిగి ముగించినప్పుడు గోడ గడియారం పదకొండు గంటలు కొట్టింది. అది కొట్టి ముగించనీ అని మౌనంగా కాచుకున్న మాలతీ ఆ తరువాత,

“మీరు అనవసరంగా బయటకు వెడుతున్న పామును అడ్డగించి ఇంట్లోకి పోనిస్తున్నారు..." అన్నది.

"నువ్వేం చెబుతున్నావు మాలతీ...?"

"మాట్లాడకుండా పడుకోండి! ఇలాంటి అనవసరమైన బాధలను మూటకట్టి కిటికీలో నుంచి పారేయండి. మన అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. వాడికి 'ఫీజు’ కట్టాలి. 'ఎల్.ఐ.సీ’డ్యూ, ‘టెలిఫోన్ బిల్లు’ చాలా అవసరాలు ఉన్నాయి. పత్రిక వాళ్ళు కథ పంపంచమని అడిగారు. వాళ్ళకు కథ రాసి ఇవ్వండి. నాలుగు డబ్బులైనా వస్తాయి. ఇవన్నీ వదిలేసి ఇలా మీరు బాధ పడుతుంటే...వ్యాధులే వస్తాయి" -- కాళ్ళ క్రింద ఉన్న తన దుప్పటి తీసుకుని కప్పుకుని...తాను చెప్ప దలుచుకున్నది చెప్పేసి పడుకుంది మాలతీ.

ప్రసాద్ కు వొళ్ళు మండింది.

పెళ్ళికాక ముందు 'నీకెందుకురా ఊళ్ళో వాళ్ల గొడవలన్నీ?' అని ప్రసాద్ వాళ్ళ అమ్మ అడిగేది. ఇప్పుడు ఆ చోట భార్య!

వ్యక్తులు మాత్రం మారారు.

కానీ రాగం మారనేలేదు.

అతనిలో కడుపు మంటతో పాటూ ఆవేశమూ చోటు చేసుకుంది.

మరుసటి రోజు!

'ఆఫీసు క్యాంటీన్లో' ప్రొద్దున టిఫిన్ తింటున్నప్పుడే ప్రసాద్ చెవులు కొరకటం మొదలుపెట్టాడు ట్రబుల్ కింగ్ రాజేష్ కుమార్.

"మావా...ఏమిట్రా డల్ గా ఉన్నావు?"

"........."

"నిన్ను నవ్విస్తాను చూస్తావా?"

".........”

"రేయ్...ఇది క్రికెట్ 'సీసన్’. ఒక 'ఎస్.ఎం.ఎస్’ వచ్చింది…… చెప్పనా?"

"..........."

"రేయ్...నోరు తెరవకపోయినా ఒక 'ఊ' అనొచ్చు కదా?"

"సారీ రాజేష్ కుమార్. నేను నీ దగ్గర నుండి ఎటువంటి మాట వినే మనో స్థితిలో లేను. 'ప్లీజ్' నన్ను విడిచిపెట్టు"

"అదెలా...నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తాను. నువ్వు వింటే విను,లేకపోతే మానేయి. అది నీ ఇష్టం. మన 'క్యాంటీన్’ కొసం కొన్న 'టీ' పొడి పర్చేస్ లో మాత్రం క్యాంటీన్ మేనేజర్ డేవిడ్ యాభై వెల రూపాయలు నొక్కేశాడు. తెలుసా నీకు?"

"అవును...అతను ఒక ఫూల్ చూడు. నీ లాంటి వ్యక్తిని ఎదురుకుండా పెట్టుకుని...'చూసారా యాభై వేలు’ నొక్కేస్తున్నను చూడండి. అన్నాడా?..."

"పోరా ఇడియట్…….. నాకు ఎలా తెలుసో చెబుతా విను....

                                                                       ఇంకా ఉంది.....Continued in PART-6 ***************************************************************************************************

13, జనవరి 2020, సోమవారం

ఆలయం(సీరియల్)...PART-4



                                        
                                                 ఆలయం(సీరియల్)
                                                           (PART-4)


రాత్రి సమయం!

నిద్ర పోవటానికి ముందు ఏదైనా ఒక పుస్తకంలో పది పేజీలన్నా చదివి, దాని గురించి ఆలొచించుకుంటూ నిద్రపోవటం ప్రసాద్ కు అలవాటు.

"లైటు ఆపండి...వెలుతురు ఉంటే నేను ఎలా నిద్రపోవాలట?"--అని పది నిమిషాలకు ఒకసారి ప్రసాద్ భార్య గొణుగుతూ ఉంటుంది. ఆ రోజు అతను పుస్తకం చదవలేదు. నిద్రా రాలేదు. చేతులు కట్టుకుని, కాళ్ళు జాపుకుని అలాగే కూర్చున్నాడు.

రోజూ నిద్ర పోయేముందు ఒక గ్లాసు పాలు తాగుతాడు ప్రసాద్. ప్రసాద్ భార్య పాల గ్లాసుతో వచ్చింది. భర్త తీవ్రమైన ఆలొచనలో ఉండటం గమనించింది. ఇరవై సంవత్సరాల దాంపత్యం...'అతను ఎలాంటివాడు?' అనేది అమెకు ఎప్పుడో నేర్పింది.

ఇలా ఉన్నాడూ అంటే అతని మనసులో ఏదో ఒక నవలకు కావలసిన వృత్తాంతము తిరుగుతూ ఉండాలి. లేకపోతే సమాజ తాకిడి ఏదైనా ఏర్పడుండొచ్చు అనేది ఆమెకు తెలుసు.

భార్య అందించిన పాల గ్లాసును తీసుకుని తాగకుండా అలాగే చేతిలోనే ఉంచుకున్నాడు ప్రసాద్. ఆమె అతన్ని కెలకటం మొదలుపెట్టింది.

"ఏమండీ...?"

"హూ..."

"పాలు తాగండి..."

"ఓ...పాలుందా నా చేతిలో"

"సరిపోయింది...చేతిలో పాల గ్లాసు ఉన్నది కూడా తెలియనంత మాయలో పడేసిన ఆ ఆలొచన ఏమిటో?"

"ఏమీలేదు మాలతీ..."

"మీరే ఇంతకు ముందు అన్నారు...'ఏమీలేదని ఎవరైనా అన్నారంటే అందులో ఎన్నో విషయాలున్నాయని అర్ధం!' అని"

"నాలోనూ చాలా విషయాలు ఉన్నాయి! వాటి భారాన్ని ఎంతవరకు నేను తట్టుకోగలనన్నదే తెలియటంలేదు"

"ఏ విషయాన్నైనా మనసువిప్పి చెప్పుకుంటే...దానికొక దారి దొరుకుతుందని మీరే ఒక కథలో రాశారు"

"ఇది 'కంపనీ' విషయం మాలతీ...నీతో మాట్లాడినందు వలన ఒక్క ప్రయోజనమూ ఉండదు"

"అదెలా మీకు తెలుసు?"

"ఏమిటి మాలతీ నువ్వు...నేను చెప్పే సమస్యలను మొదట నువ్వు సరిగ్గా అర్ధం చేసుకోగలవో లేదో అనేదే నాకు సందేహం. ఆ తరువాత...నేను మాట్లాడిన తరువాత నా ఆందోళన నీకూ అంటుకుంటే. ఇది అవసరమా నీకు?"

"ఏమండి...'బెటర్ హాఫ్' అని నాకు ఇంకో పేరు ఉంది. సంతోషాన్ని మాత్రమే పంచుకునే మనిషిని నేను కాదు. ఏదైనా సరే సరదాగా నాతో చెప్పండి..."

---- మాలతీ అతన్ని వదిలేలా లేదు. అతను కూడా ఆమెతో అంతకంటే వాదించకుండా ఆమెదగ్గర తన మనో భారాన్ని పంచుకోవటం ప్రారంభించాడు.

"'కంపనీ'! ముందు లాగా లేదు. ఇప్పుడు కంపనీలో అవినీతి ఎక్కువగా ఉన్నది!"

"ఏమిటీ? అవినీతా?...అంటే కంపెనీ ఇప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ది చెందుతోంది అని అర్ధం"

"నేనొకటి చెబితే, నువ్వొకటి చెబుతున్నావే మాలతీ..."

“ఛ ఛ...నేను నిజమైన కారణాన్నే చెప్పేను. 'నువ్వు ఏలా ఉండాలని అనుకుంటావో...అలాగే మారుతావు!' అనే సామెతకూడా ఉన్నదండి. మనం ఇప్పుడు ఎక్కడండీ మంచిగా ఆలొచిస్తున్నాము? మనం వింటున్న విషయాలు కూడా తప్పుతప్పుగానే కదా ఉంటున్నాయి? ఇప్పుడంతా సాధనల గురించి మాట్లాడటంకంటే వేధనలు, అవినీతి, హత్య, మానభంగాలు, దొంగతనాలు....వీటి గురించే కదా ఎక్కువ మాట్లాడుతున్నాం. ఏదైతే మనల్ని ఎక్కువగా భాదిస్తుందో...అలాగే కదా మనం మారుతాం"

--- మాలతీ చాలా సహజంగా....అదే సమయం బాగా నొక్కి చెబుతూ ఒక కొత్త కోణంలో మాట్లాడింది.

"చాలు మాలతీ...నీ ఇష్టం వచ్చినట్టు వాగకు! 'మనం' అని నిన్నూ, నన్నూ ఎందుకు చేరుస్తావు? ఎటువంటి అవినీతి ఇంతకు ముందు నేను ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడూ చెయ్యలేదు, రేపూ చెయ్యను, ఎప్పుడూ చెయ్యను”

----అతను కోపగించుకోవటం మొదలుపెట్టాడు.

"అరే ఏమిటండీ మీరు...కోపగించుకున్నారా? నేను మిమ్మల్ని చెప్పలేదు. ఈ సమాజాన్ని చెప్పాను"

"అది నేను అసలు ఒప్పుకోను. తప్పుకు ఇలా కారణం కనిపెట్టి తప్పించుకోవటం తప్పుల్లోనే పెద్ద తప్పు"

"అది నాకూ తెలుసు. కానీ, నేను చెప్పిందే నిజం. దీన్ని ఎలా మార్చగలమో మనం ఆలొచించాలి. అది సరే...అసలు అవినీతికి పాల్పడింది ఎవరు?...అందులోనూ 'మిస్టర్ క్లీన్’ అయిన మీకు తెలిసేటట్టు"

"నువ్వు ఏం చెప్ప దలచుకున్నావు?"

"అదేమిటంటే...ఈరోజుల్లో దొరికిపోయేంత తేలికగా ఎవరూ తప్పు చేయటంలేదు. ఇది 'కంప్యూటర్’ యుగం. రుజువు వదిలిపెట్టకుండా ఎలా తప్పు చేయాలో 'కంప్యూటర్’ ఎక్కువగానే చెప్పిచ్చింది. అందుకే అలా అడిగాను"

"నువ్వు చెప్పేది నిజమే. నేను తెలుసుకున్న ఏ విషయానికీ ఒక్క 'రుజువు' కూడా లేదు. నా బాధకు అదీ ఒక కారణమే....”

“అవును నేను తెలియక అడుగుతున్నాను. మీరు మీ 'కంపనీ'లో ఒక 'స్టోర్ కీపరా?' లేక...మీరే 'చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టరా'?"

"తరువాత నువ్వు ఏం చెప్పబోతావో నాకు తెలుసు.'మీ పనిని మీరు కరెక్టుగా చెయ్యండి...అవినీతి గురించి బాధ పడాల్సింది యజమాని. మీకు ఎందుకు ఈ అక్కర్లేని పని!' అని అడగబోతావు?..........అవునా? "

                                                                      ఇంకా ఉంది.....Continued in PART-5 **************************************************************************************************

11, జనవరి 2020, శనివారం

ఆలయం(సీరియల్)...PART-3



                                                ఆలయం(సీరియల్)
                                                           (PART-3)


క్రిష్ణా నది ఒడ్డున కూర్చున్న ప్రసాద్ కు, ఆఫీసు రూములోనే మద్యం తాగుతున్న ఆ అధికారి యొక్క మొహం కళ్ళ ముందుకు వస్తూ, పోతూ ఉన్నది.

"ఇలాంటి ఒక చెడు అలవాటున్న ఒక వ్యక్తి ఎలా ఒక అధికారిగా నడుచుకోగలడు?" అనే ప్రశ్న ప్రసాద్ మనసును వెధిస్తున్నది.

ప్రసాద్ దేవుడుగా తలచుకుంటున్న 'చైర్మన్’ శంకరయ్య గారు, తాగుడుకు మాత్రమే కాదు...అన్ని చెడు అలవాట్లకూ దూరంగా ఉండటమే కాకుండా, ఆ అలవాట్లన్నీ తప్పు అని గట్టిగా చెబుతారు. 'శరీరాన్ని ఆరొగ్యంగా ఉంచుకోవాలంటే క్రమశిక్షణ అవసరం!' అని చెబుతారు. దాన్ని తన జీవితంలోనూ ఆచరణలో పెడుతూ వచ్చారు.

చూడటానికి యాభై ఏళ్ళ వ్యక్తి లాగానే ఉంటారు. కానీ, ఆ యౌవన రూపానికీ, శరీర దారుఢ్యానికీ కారణం ఆయన చేపట్టిన క్రమశిక్షణే. కానీ, ప్రసాద్ స్నేహితులు'నా దగ్గర కూడా కోట్ల కోట్ల డబ్బుంటే నేను కూడా తలతలమని మెరిసిపోతాను...'అని ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతారు.

డబ్బుగల వారు మెరిసిపోవటానికీ, క్రమశిక్షణతో ఆరొగ్యంగా ఉన్నవారు మెరిసిపోవటానికీ గల తేడా ప్రసాద్ కు బాగానే తెలుసు. ప్రసాద్ భార్య కూడా శంకరయ్య గారి ఫోటో చూసి...మీ 'చైర్మన్’ మంచి శరీర దారుఢ్యం గలవారూ అంటూ సరైన మాటలతో సూచిస్తుంది.

క్రమశిక్షణతో ఉంటే శరీర దారుఢ్యం ఏమిటి....అన్నీ వెతుక్కుంటూ వస్తాయి అనడానికి శంకరయ్య గారు ఒక ఉదాహరణ. అలాంటి మనిషి యొక్క సంస్థలో...మధ్యం అలవాటున్నఒక అధికారి!

ప్రసాద్ కు ఆఫీసులోనే మధ్యం తాగుతున్న ఆ అధికారి మొహం మాటి మాటికీ గుర్తుకు వస్తూ క్షోభ పెడుతోంది. గుడికి వచ్చిన చోట కూడా కనకదుర్గ అమ్మవారిపైన మనసును కేంద్రీకరించలేకపోయాడు. ఒక వార పత్రిక యాజమాన్యం దగ్గర నుండి చిన్న కథ ఒకటి పంపించమని ఫోన్ కూడా వచ్చింది.

మామూలుగా క్రిష్ణా నది ఒడ్డున కూర్చుంటే ప్రసాద్ కు కథలకు కావలసిన ఐడియాలు దొరుకుతాయి. ఒకసారి ఒక పెద్దాయన క్రిష్ణా నది ఒడ్డున కూర్చున్న ప్రసాద్ దగ్గరకు వచ్చి, కన్న బిడ్డలు అతన్ని కొట్టి బయటకు పంపించేసేరని చెప్పి ఏడుస్తూ చెయ్యి జాపాడు. పది రూపాయలు తీసుకున్న తరువాతే ప్రాసాద్ ను వదిలిపెట్టాడు. గంట తరువాత ఇంటికి తిరిగి వెడుతున్నప్పుడు ఆ పెద్దాయన ప్లాట్ ఫారం మీద మధ్యం మత్తులో తూలుకుంటూ నడిచి వెళ్లటం ప్రసాద్ కళ్ళకు కనబడింది. తాగటం కోసమే ఆయన అలాంటి అబద్దం చెప్పాడు అనేది ఆ క్షణమే ప్రసాద్ కు అర్ధమయ్యింది.

ప్రసాద్ వరకు మొసం పోవటమూ నచ్చదు; మోసగించటమూ నచ్చదు. ఆ క్షణం అతనికి వచ్చిన కోపానికి కొలతే లేదు. మరుసటి రోజు ప్రసాద్ క్రిష్ణా నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు ఆ పెద్దాయనను చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. గబుక్కున ఆయన చేయి పుచ్చుకుని సరసరమని ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ ప్రసాద్ పెద్దాయన గురించి చెప్పింది ఎవరూ పట్టించుకోలేదు.

“మీరే సార్ జాగ్రత్తతో వ్యవహరించాలి! దీని కోసం అతన్ని పట్టుకుని జైల్లో పెడితే...జైల్లోనే బిచ్చం అడుక్కుంటాడు. ఇది అవసరమా? వదిలేయండి సార్. ఒక రోజు కాకపోతే...మరొక రోజు తాగేసి క్రిందపడిపోయి...ఏ లారీ క్రిందనో, బస్సు క్రిందనో పడి చస్తాడు. అదే వీళ్లకంతా ఒక ముగింపు" అన్నాడు, కానిస్టేబుల్.

చక్కటి బాధ్యత గల సమాధానం!?. ప్రసాద్ కు పోలీసుల నిజమైన మొహం తెలియటం అలాంటి సందర్భాలతొనే ప్రారంభమైంది!

ఆ తరువాత పోలీసులు చెప్పినట్లు జరగటమే ఘోరం!

ఆ తాగుబోతు పెద్దాయన సిటీ బస్సు చక్రాల క్రింద రక్తపు ముద్దలా పడున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రసాద్ కు గుండే గుభేలు మన్నది. ‘కానిస్టేబుల్ చెప్పింది ఫలించిందా? లేక తన వల్ల ఆ తాగుబోతు పెద్దాయన్ని కాపాడటం కుదరలేదా? ఎందువల్ల ఇలా జరిగింది?’ అనే ప్రశ్నలు, వాటి తాకిడి కలిపి ప్రసాద్ దగ్గర ఒక చిన్న కథగా తయారయ్యింది.

కానీ, కథలో ప్రసాద్ మంచి మార్పు చేశాడు. తాగుబోతు పెద్దాయనను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి అప్పగించలేదు. దానికి మారుగా ఆయన్ని తీసుకువెళ్ళి తన ఇంటి తోటమాలిగా పెట్టుకున్నాడు.

పెద్దాయన కూడా తనకొక కొత్త జీవితం దొరికిందన్న ఆనందంతో...తోటమాలి పనిని ఒక పరిహారంగా తీసుకున్నాడు.

ఆ కథకు ఐదువేల రూపాయలు బహుమతిగా లభించింది. జీవితంలో అతను చూసే సంఘటనలతో ఇలాంటి పలు మంచి కథలు రూపొందాయి. ఆఫీసులోని తాగుబోతు అధికారి కూడా ప్రసాద్ కు, ఒక కథకు కథాంశం అవబోతాడా? లేక...'కంపెనీ' కి ఒక ఎరువుగా ఉపయోగపడతాడా అనేది మాత్రం కన్ ఫ్యూజన్ గానే ఉన్నది.

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-4

****************************************************************************************************

9, జనవరి 2020, గురువారం

ఆలయం(సీరియల్)...PART-2




                                                ఆలయం(సీరియల్)
                                                           (PART-2)


ప్రసాద్ తన కుర్చీలో కూర్చుని 'కంప్యూటర్లో' తన చూపులను కేంద్రీకరించాడు. అతని యొక్క అకౌంట్స్ ను...కావలసినంత వరకు 'రిపోర్టు’ తయారు చేసి 'ప్రింట్' తీయాలి. ప్రసాద్ ఆ పనిమీద ఉన్నప్పుడు తలుపు తెరుచుకుని అతని 'ఏ.సీ’ గదిలోకి వచ్చాడు రాజేష్ కుమార్.

రాజేష్ కుమార్, ప్రసాద్ యొక్క సహ ఉద్యోగి. వచ్చినతను వూరికే కూర్చోలేదు. ఫ్యాక్టరీలో జరుగుతున్న తప్పు ఒప్పులను చర్చించడం మొదలుపెట్టాడు.

"ప్రసాద్!"

"ఊ"

"కొంచం ఇటు చూడు ప్రసాద్ "

"నేను ఇప్పుడు 'బిజీ' గా ఉన్నాను. ఏదున్నా సరే లంచ్ టైములో మాట్లాడుకుందాం"

“అప్పుడూ మాట్లాడుకుందాం సరే. కానీ, ఇప్పుడు నేను మాట్లాడ దలచుకున్నది మాట్లాడి వెళ్ళిపోతాను"

"నేను ప్రశాంతంగా పని చేయడం నీకు ఎప్పుడూ నచ్చదే..."

"అదెలా? మనకి మన చుట్టూతా అందరూ మనలాగానే ఉండాలే!"

"ఈ సిగ్గులేని విషయాన్ని బహిరంగంగా ఒప్పుకుంటున్నావా?"

"ఇది సిగ్గులేని విషయం కాదు ప్రసాద్. ఇదే యథార్థం. ఏ ఫ్యాక్టరీలోనైనా నీలాగా ఉండే వ్యక్తులు ఒకరో...ఇద్దరో నే ఉంటారు...కానీ నూటికి తొంబై మంది నాలాంటి వ్యక్తులే ఉంటారు"

"అదేమో నిజమే. సరే...ఏమిటి విషయం? త్వరగా చెప్పి ఇక్కడ్నుంచి వెళ్ళు...నాకు చాలా పనుంది"

"సరేరా. అయ్యగారు నీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పబోతారు. బాగా విను!"

"నువ్వు నోరు తెరుస్తే అన్నీ ఆశ్చర్యమే. ఇందులో వేరుగా ఒక ఆశ్చర్యమా?"

“అవన్నీ మామూలైనవి. కానీ, ఇది స్పెషల్ ఆశ్చర్యం..."

"సరేరా... త్వరగా చెప్పి తగలడు"

"చెప్పేస్తాను…మన 'కంపనీ'కి కొత్తగా ఒక 'పి.ఆర్.ఓ' వచ్చారు."

"అంటే...'పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్’?"

"'పి.ఆర్.ఓ'కి ప్రపంచమంతా అదే అర్ధం అనుకుంటా"

"కొత్త 'పి.ఆర్.ఓ' వస్తారని తెలుసు. కానీ, వచ్చి జాయిన్ అయ్యారని తెలియదు. సరే...ఇప్పుడు దానికేమిటిట?"

"దానికేమిటనా అడుగుతున్నావు? మనిషిని చూశావా...చూసి వచ్చిన తరువాత ఆ మనిషి గురించి చెప్పు. ఇంతటితో ఆఫీసు వార్తలు సమాప్తం. ఆశ్చర్యకరమైన మరికొన్ని వార్తలతో మిమ్మల్ని మళ్ళీ అలరించటానికి లంచ్ టైములో క్యాంటీన్లో కలుస్తాను....టొంటడైన్..."

---- రాజేష్ కుమార్, ప్రసాద్ గదిలో నుండి బయటకు వెళ్లాడు.

వెంటనే కొత్త 'పి.ఆర్.ఓ' ను కలిసి విష్ చేయాలని, తనని పరిచయం చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రసాద్ ఆయన్ని కలవటానికి ఆయన రూముకు వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఒక ఆశ్చర్యం ఎదురైయ్యింది.

రాజేష్ కుమార్ చెప్పినట్లే ఆ 'పి.ఆర్.ఓ' ఉండటం దారుణం. షాక్. స్పెషల్ ఆశ్చర్యం.

చిన్నగా తెరిచున్న ఆఫీసు రూము అవతల వైపు ఉన్న ఆ మనిషి, ఆఫీసు రూములోనే ఒక చిన్న మద్యం బాటిల్ తీసి మూత తెరిచి ఏదో 'టానిక్' తాగుతున్నట్టు తాగుతున్నాడు.

ప్రసాద్ కు గుండె గుభేలుమంది!

ఆలయం లాంటి 'కంపెనీ' లోపల ఆఫీసు టైములో మద్యం!

అందులోనూ భాద్యత గల ఒక అధికారి!!!!

                                                                          ఇంకా ఉంది.....Continued in PART-3.

****************************************************************************************************

7, జనవరి 2020, మంగళవారం

ఆలయం(సీరియల్)...PART-1




                                                ఆలయం(సీరియల్)
                                                          (PART-1)


విజయవాడ నగరములోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ ఆలయం భక్తులుతో కిట కిట లాడుతోంది. ఆ రోజు అమ్మవారి దర్శనం కోసం కనకదుర్గ గుడికి వెళ్ళాడు ప్రసాద్. వెంకట్ ప్రసాద్ అని వాళ్ళ నాన్న పేరు పెట్టారు. అది ఎందుకో తెలియదు గానీ రెండు మాటలున్న పేర్లు గలవారిని చాలామంది ఆ రెండు మాటలతో పిలవరు. సురేష్ కుమార్ ను సురేష్, రామ మూర్తిని రామూ, క్రిష్ణ కుమార్ ను క్రిష్ణా అని పేరును కుదించి పిలవటమే అందరి నాలుకలకు అలవాటైపోయింది. ఆ కారణం కొసమే వెంకట్ ప్రసాద్, ప్రసాద్ అయిపోయింది.

మనం కూడా ప్రసాద్ అనే పిలుద్దాం...!

ప్రసాద్ ఒక కనకదుర్గ భక్తుడు. కనకదుర్గ గుడికి వెళ్ళే ముందు క్రిష్ణా నదిలో స్నానం చేసి వెళ్ళేటం అలవాటు. ఒక్కోసారి స్నానం చేసిన తరువాత అక్కడ మెట్ల మీద కూర్చుని ఊహల్లోకి వెళ్ళిపోతాడు.

అతను అలా ఊహల్లోకి వెళ్ళటానికి ముఖ్య కారణం అతనొక రచయత. అందులోనూ బాగా పేరుపొందిన రచయత. అతనికని విజయవాడ నగరంలో ఒక చిరునామా ఉన్నది. దాంతో పాటు అతను ఒక ఫ్యాక్టరీలో సీనియర్ ఉద్యోగస్తుడు.

అతనికని మూలాధార శక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఇంద్రకీలాద్రి పైన కొలువున్న కనకదుర్గ అమ్మవారు, రెండు అతను పనిచేస్తున్న ఫ్యాక్టరీ యజమాని శంకరయ్య! కనకదుర్గ అమ్మవారిని అందరికీ తెలిసుంటుంది. ఈ శంకరయ్య నే అందరికీ పరిచయం చేయాల్సి ఉంది.

శంకరయ్య, ప్రసాద్ పనిచేస్తున్న ఫ్యాక్టరీ యొక్క యజమాని!

యజమాని అని పిలిస్తే సామాన్యంగా ఉంది కదా? అందంగా 'చైర్మన్’ అని చెప్పటంలోనే ప్రసాద్ కూ ఇష్టం. ఆయన వలనే అతను రచయతగా అవగలిగాడు. గుడిలో అమ్మవారి ముందు ‘చైర్మన్’ కోసం కూడా ప్రార్ధన చేసుకుంటాడు ప్రసాద్. శంకరయ్య గారు ఒక 'మల్టీ మిల్లియనర్’ . ఎటు చూసినా ఆయనకు ఫ్యాక్టరీలున్నాయి. ప్రపంచం మొత్తాన్ని చుట్టి చుట్టి వస్తారు. వంశ పారంపర్యంగా ఆస్తిపరుడు. కానీ, ఎక్కువమంది డబ్బుగలవారిలో అతుక్కోనుండే ఎటువంటి అహంభావమూ లేని అద్భుత ఆత్మ.

ఈ ప్రపంచంలో అన్ని రంగాలలోనూ అద్భుతమైన మనుష్యులు ఉంటారు. అందులో ఒకరిగా శంకరయ్య గారిని చెప్పొచ్చు. ప్రసాద్ కు ఆయన ఒక అతిపెద్ద ఉదాహరణ మనిషి కూడా! అందుకనే నేమో ప్రసాద్ తన కొడుక్కి ఆయన పేరు పెట్టుకున్నాడు.

ఒక వేడుక ఏమిటంటే...కొడుక్కి ఆయన పేరు పెట్టి, 'రేయ్ శంకరయ్య ' అని ప్రేమతో పిలవటానికి ఇష్టపడడు. తన కొడుకును 'చైర్మన్’ అనే పిలుస్తాడు.

ప్రసాద్ భార్య మాలతి...మంచి హౌస్ వైఫ్. ఆమె కూడా భర్తతో కలిసి తన కొడుకును 'చైర్మన్’ అనో, ‘ఎం.డి’ అనో పిలవటం ఒక వెడుక గా మొదలయ్యి, తరువాత అలవాటుగా మరిపోయింది.

ప్రసాద్ కొడుకు శంకరయ్య, ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో 'బి.ఇ.' చదువుతున్నాడు. వాడి స్నేహితులు కూడా....'రేయ్ చైర్మన్’ అని అతన్ని పిలవటం, వింటున్న మనకే వింతగా ఉంటుంది.

ప్రసాద్ అవన్నీ పట్టించుకోడు. అతని వరకు కొడుకు, యజమాని శంకరయ్యలా విజయం పైన విజయం సాధించాలి. ఆయన లాగానే వేలాది మందికి ఉద్యోగం ఇచ్చి ఆదుకొవాలి. తెలుగు భాష మీద ప్రేమ, తెలుగు సంస్కృతి, నాగరికత--ఇవన్నీ అతనిలో ఉండాలి. ఇదే ప్రసాద్ కోరిక. దీనికొసమే రోజూ కనకదుర్గ అమ్మవారిని వెడుకుంటూ ఉంటాడు.

ఇంకో కొన్ని సంవత్సరాలలో ప్రసాద్ కొడుకు డిగ్రీ పూర్తిచేసి, ప్రసాద్ ఆశలను పూర్తిచేస్తాడు. కానీ, అంత వరకు అతను అతని గౌరవనీయ యజమాని అయిన శంకరయ్య ఫ్యాక్టరీలో పనిచేయగలడా, లేదో అనేదే అతనిలో పెద్ద ప్రశ్నార్ధంకంగా ఉంటోంది.

దానికి కారణం అతనిలో ఈ మధ్య ఏర్పడిన భయం!

ఊహల్లో సులభంగా సంచరించ గలిగిన అతను ఈ మధ్య స్వయంగా కొన్ని యధార్ధాల తాకిడికి లోనైయ్యాడు.

క్రిష్ణా నది ఒడ్డున కుర్చున్నప్పుడు అతని మనసులో దాని గురించే ఆలొచన వచ్చింది.

ఆరోజు ప్రొద్దున....ఆఫీసులో జరిగిన ఒక సంభవం అతన్ని కలవరపెడుతోంది.

                                                                  ఇంకా ఉంది.....Continued in PART-2.

********************************************************************************************


4, జనవరి 2020, శనివారం

లక్కీ క్యాట్ గుడి…(ఆసక్తి)



                                                     లక్కీ క్యాట్ గుడి


మనం ఏదైనా గుడికివెళ్తే ఇంటికి ప్రసాదం పట్టుకుపోయినట్లే, ఈ లక్కీ క్యాట్ ఆలయానికి వచ్చిన వారందరూ అక్కడుండే పిల్లి బొమ్మను కొనుక్కుపోతారు. ఎందుకంటే అదో అదృష్టచిహ్నంగా భావిస్తారు. దేవతగా నమ్ముతారు. ఇవన్నీ టోక్యోలోని 'గొటుకూ-జీ గుడి విశేషాలు. ఇక్కడుండే పిల్లి బొమ్మను 'లక్కీ క్యాట్' గా భావిస్తారు. కారణం తెలుసుకోవాలంటే దీని కథ తెలుసుకోవల్సిందే.


శకునం (Omen) అనగా జరగబోవు పని గురించిన సంజ్ఞ. కొన్నిటిని కొందరు వ్యక్తులు శుభ శకునాలుగానూ, కొన్నిటిని అశుభ శకునాలుగానూ భావిస్తారు. శకునాల శాస్త్రీయత ప్రశ్నార్ధకమైనందువల్ల హేతువాదులు శకునాలను పట్టించుకోవటాన్ని మూఢ నమ్మకంగా చెప్తారు. అయితే మానవ చరిత్రలో మరియు జానపద వాజ్మయంలో(Index) శకునాలకు చాలా ప్రధానపాత్ర ఉన్నది.


జానపదులు అనేక రకాల శకునాలను చూసుకుంటారు. అందులో ముఖ్యంగా కాకి శకునం వివరంగా చూసుకుంటారు. కాకి అరుస్తూ ఉంటే చుట్టాలొస్తారని ఎదురు చూస్తూ ఉంటారు.

శకునాలు తెచ్చే ఫలితాలను బట్టి వాటిని శుభశకునాలు మరియు అశుభ శకునాలుగా వర్గీకరిస్తారు. శకునాలు ఆ యా దేశాల సంస్కృతిని బట్టి మారుతూ ఉంటాయి. ఒక సంస్కృతిలో శుభ శకునంగా పరిగిణించిన దాన్ని వేరొక సంస్కృతిలో అశుభ శకునంగా పరిగణించే అవకాశం ఉంది. ఉదాహరణకు అమెరికాలో నల్లపిల్లిని అశుభ సూచకముగా భావిస్తే, ఇంగ్లాండులో అదే నల్లపిల్లిని శుభ సూచకముగా భావిస్తారు.


శకునాలను, వాటి ఫలితాలను భారతీయులు ఎంతగానో విశ్వసిస్తుంటారు. శుభకార్యాల నిమిత్తం బయలుదేరుతున్నప్పుడు, శుభకార్యాలకి సంబంధించిన పనులను ప్రారంభిస్తూ వున్నప్పుడు సహజంగానే శకునం చూసుకుంటూ ఉంటారు. శకునం మంచిగా అనిపించకపోతే శుభకార్యాలను వాయిదా వేయడమే కాదు, రద్దు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది.


ఈ శకునాల్లో పిల్లి శకునం మరింత ప్రభావం చూపుతుందని భావిస్తూ వుంటారు. పెంపుడు పిల్లికి తప్పులేదనే విశ్వాసం వుండటం వలన, తమ పిల్లి కాకుండా మరో పిల్లి ఎదురుపడితే దానిని శకునంగానే భావిస్తుంటారు. అంతేకాదు పెంపుడు పిల్లి ఇల్లు వదిలిపోతే ఇంటిలోని అదృష్టం కూడా దానితోనే పోతుందంటారు పెద్దలు. శకునాలలో ప్రపంచవ్యాప్తంగా పిల్లి శకునాన్నే ఎక్కువమంది పట్టించుకుంటున్నారు. పిల్లి ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తు గురించి పలు జోస్యాలు చెబుతుంటారు. పిల్లి కదలికల్లో ఏదో ఒక సూచనను చూసేవారు కోకొల్లలుగా ఉన్నారు.


వెన్నెలలో నల్లపిల్లిని చూడడం ఆ ప్రాంతంలో ఏదో ఒక అంటు వ్యాధి ప్రబలనున్నదనడానికి సూచనట(ఇది ఐరిష్ ప్రజల భయం). ఉద్దేశపూర్వకంగా పిల్లిని చంపితే మీరు మీ ఆత్మను దయ్యానికి కోల్పోయినట్టే(ఇది బ్రిటన్ వాసుల నమ్మకం). ఒక పిల్లి తన తోకను మంటవైపు ఉంచి, తన చెవుల పై భాగాన్ని నాకుతూ ఉంటే వాతావరణ పరిస్థితులు విషమిస్తాయి. వివాహవేదిక వద్ద పిల్లి ఉండడం మంచి అదృష్టం. ఒక మృతుడి శవపేటికపైనుంచి పిల్లి దూకితే శాశ్వత నిద్రపోతున్న ఆ మహానుభావుడు స్వర్గానికి చేరే ప్రసక్తే లేదు.(ఇది ఆస్ట్రేలియన్ల మాట). ఒక పిల్లి కిటికీలో నుంచి అదే పనిగా బయటకు చూస్తుంటే వర్షం ఖాయంగా రాబోతోందనడానికి సూచన.కలలో పిల్లి దర్శనమిస్తే ధన లాభం. వ్యాపారంలో కలిసొస్తుంది. నల్ల, తెల్ల పిల్లులు స్వప్నంలో కనిపిస్తే మీ సంతానం విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. చారలపిల్లి కలలో కనిపిస్తే మీ ఇంటిలో అదృష్టం వర్షిస్తుంది. నల్ల పిల్లులు గుప్త నిధులను కనిపెట్టగలుగుతాయి. ఐదురోడ్ల కూడలివద్దకు పిల్లిని తీసుకువెళ్ళి వదిలేయండి. ఆ తరువాత దానిని అనుసరించండి. మీకు గుప్తనిధులు దొరుకుతాయి( ఇది ఫ్రెంచ్ వారి ఆశాభావం).


జపాన్ దేశంలో సైగచేసే పిల్లి అదృష్టం, ఐశ్వర్యం తీసుకువస్తుందని గట్టి నమ్మకం. పిల్లులు సైగలు చేస్తాయా? వాటి ప్రవర్తనల బట్టి వాటికి శకునాలు నిర్ణయించుకున్నారు. పూర్వం ఒక రాజు సెటగయా నగరంలో నుండి వెడుతూ, అలసిపోయి ఉండటంతో సేద తీర్చుకోవడానికి ఒక చెట్టు దగ్గర ఆగాడు. ఇది గమనించిన ఒక పిల్లి ఆ రాజుకు సైగ చేసి వేరే చోటుకు తీసుకు వెళ్ళింది. కొద్దిక్షణాలలో గాలివానతో కూడిన వర్షం రావడం, అప్పుడు ఒక పిడుగు, అంతకు ముందు రాజు నిలబడ్డ చోట పడటం జరిగింది. అది చూసిన రాజు, ఆ పిల్లిని తన అదృష్ట దేవతగా భావించి, కోట్లకొలది డబ్బుతో అక్కడ ఆ పిల్లికి ఒక గుడి కట్టించాడట. అప్పటి నుండి ఆ గుడి, సైగచేసే ఆ పిల్లి, జపాన్ ప్రజలకు ప్రియమైనదిగా మారింది.


'మనేకి నెకో’ లేక 'సైగ చేయు పిల్లి’ ...ఇది జపాన్ దేశంలో అత్యంత పేరుపొందిన బొమ్మ (విగ్రహం). అదృష్టం, ఐశ్వర్యం తీసుకువస్తుందని గట్టి నమ్మకంతో జపాన్ దేశ ప్రజలు తమ ఇళ్ళల్లో, షాపులలో, వ్యాపార కేంద్రాలలో, ఆఫీసులలో ఈ పిల్లి బొమ్మను తప్పక ఉంచుకుంటారు. సెటగయా నగర సరిహద్దులలో 'గొటుకూ-జి’ అనే పేరుతో ఈ పిల్లి విగ్రహంతో ఒక గుడి ఉన్నది.

సైగ చేసే పిల్లుల బొమ్మలను బ్యాటరీలతో తయారు చేసి అమ్ముతున్నారు. ఈ బొమ్మ, బ్యాటరీ పవర్ తో, చేతితో సైగ చేస్తుంది. ఈ బొమ్మను అందరూ కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. ఈ బొమ్మ శక్తి ఇప్పుడు ఆసియా దేశాలలో కూడా వ్యాపించింది.

Images Credit: To those who took the original Photo. ****************************************************************************************************

2, జనవరి 2020, గురువారం

ముత్యాల వంతెన......(ఆసక్తి)



                                                    ముత్యాల వంతెన

జపాన్ దేశంలోని అకాసీ కైకో వంతెన ప్రపంచంలోని పొడవైన వేలాడే వంతెనలలో ఒకటి. ఈ బ్రహ్మాండమైన వంతెనకు ముత్యాల వంతెన అనే మరో పేరు కూడా ఉన్నది. జపాన్ దేశంలోని ముఖ్యమైన నగరాలలో ఒకటైన అకాసి నగరాన్ని, అవాజీ దీవిని కలపటానికి అకాసి సముద్ర నీటి జలాలపై ఈ వంతెనను నిర్మించారు.


కొన్ని సంవత్సరాల ప్రణాళిక తరువాత 1986, మే నెలలో నిర్మాణం మొదలుపెట్టి పన్నెండు సంవత్సరాల తరువాత ఏప్రిల్-5,1998లో వంతెన పూర్తి చేశారు. మొదట రైల్వే లైను కుడా అమర్చాలనుకున్నారు. కానీ, ఆ తరువాత ఆ ఉద్దేశం మానుకుని కార్లూ, బస్సులూ, లారీలూ వెళ్ళడానికి మాత్రం ఆరు రోడ్లు (వెళ్ళడానికి మూడు, రావడానికి మూడు) ఉండేటట్లు వంతెనను నిర్మించారు. పెను తుఫానలనూ, పెద్ద భూకంపాలనూ ( రిక్టర్ స్కేల్లో 8.5 వరకు నమోదయ్యే భూమి అధుర్లను) తట్టుకోగలిగే అతి గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీతో అకాసీ కైకో వంతెనను కట్టారు.


1986 వ సంవత్సరం అకాసీ కైకో వంతెనను నిర్మిస్తున్నప్పుడు జనవరి-17, 1995లో రిక్టర్ స్కేల్లో 7.2 గా నమోదైన భూకంపం ఏర్పడింది. ఆ భూకంప తాకిడిలో వంతెన నిర్మాణం ఎటువంటి నష్టానికీ గురికాకపోయినా వంతెన నిర్మాణ పొడవు ఒక మీటరుగా పెరగటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే మొదట్లో 1990 మీటర్ల సరిపడ వేసిన 2 వంతెన పిల్లర్లు ఆ భూకంపం తరువాత 1991 మీటర్లుగా జరిగాయి.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వేలాడే వంతెన (అకాసీ కైకో/ముత్యాల వంతెన) గురించిన మిగిలిన ఆశ్చర్య పరిచే అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాం.

1)వంతెన మొత్తం పొడవు 3,911 మీటర్లు( 12,831 అడుగులు) వంతెనకు ఊపిరిగా ఉండే రెండు పిల్లర్ల దూరం 1,991 మీటర్లు (అంటే 1,24 మైళ్ళు).

2)వంతెన మధ్య వేయబడిన ఊపిరి పిల్లర్ల దూరంలో ఎక్కువ దూరం ఉన్న వంతెన ప్రపంచంలోనే ఇదొక్కటే.


3) 100 కు పైన వంతెనలు నిర్మాణ కంపెనీలు కలిసి పనిచేసిన మొదటి వంతెన. 20 లక్షల మంది కార్మీకులు కలిసికట్టుగా పనిచేసిన వంతెన.

4) 286 కిలోమీటర్ల వేగమైన గాలినీ, రిక్టర్ స్కేల్లో 8.5 బలమైన భూకంపాన్ని తట్టుకునే శక్తి కలిగింది.

5) మొత్తం వంతెనకు ఉపయోగించిన ఇనుము 1,81,000 టన్నులు. పిల్లర్లకు వాడబడిన సిమెంట్ కాంక్రీట్ 14 లక్షల క్యూబిక్ అడుగులుగా ఉంటుంది.


6) అత్యంత ఉష్ణోగ్రతలలొ వంతెన 2 మీటర్లకు సాగుతుంది.

7) వంతెన సముద్రమట్టానికి 65 కిలోమీటర్ల ఎత్తులో కట్టబడ్డది కాబట్టి పెద్ద ఓడలు కూడా వంతెన కింద నుండి వెళ్ళవచ్చు.

8) వంతెన మొత్తం పొడవుకు ఉపయోగించబడ్డ మొత్తం ఐరన్ కేబుల్స్ పొడవు 3,00,000 కిలోమీటర్లు (అంటే 1, 90,000 మైళ్ళు). ఇందులోని ఒక్కొక్క కేబుల్ 44 ఇంచుల లావుగా ఉంటుంది.

9) పిల్లర్లలో వేసిన ఇనుప చట్రాలు, ఇనుప పైపులను చుట్టడానికి 36,880 ఇనుప కేబుల్స్ ఉపయోగించారు.

10) ఈ వంతెన మొత్తానికి ఉపయోగించిన ఇనుప కేబుల్స్ ను లెక్క వేస్తే అది ప్రపంచ మొత్తాన్నీ 7 సార్లు చుట్ట వచ్చుట.

11) అంతర్జాతీయ నౌకా రవాణా దారి అయిన ఈ సముద్ర నీటి జలపాత దారిలో రోజుకు 1000 నౌకలు ప్రయాణం చేస్తాయట.

12) రోజుకు సరాసరి 23,000 వాహనాలు వెళ్ళే ఈ వంతెనకు రాత్రిపూట వెలుతురు కోసం 1,737 లైట్లు అమర్చారు.

13) ఈ వంతెన కట్టటానికి అయిన మొత్తం ఖర్చు 500 బిల్లియన్ అమెరికన్ డాలర్లు.

Images Credit: To those who took the original Photo. **************************************************************************************************