21, జనవరి 2020, మంగళవారం

ఆలయం(సీరియల్)...PART-8




                                                ఆలయం(సీరియల్)
                                                           (PART-8)


మరుసటి రోజు!

ఆ జిల్లా రాజకీయ పార్టీ ఆర్గనైజర్, పార్టీ రంగుతో మెరిసిపోతున్న పంచ కట్టుకుని ఆఫీసులోకి దూరాడు. అతనికి కోలాహలమైన స్వాగతం. విఠల్ రావ్ కూడా ఒక పెద్ద పూలమాలను కొని ఉంచాడు. ఆ మాల వేసి అతన్ని తన గదికి తీసుకు వెళ్ళి, కూర్చోబెట్టి కుషీ చేయటం మొదలుపెట్టాడు.

"మీరేనా కొత్తగా వచ్చిన ఆఫీసరో?"

“అవునండి...ఇక నేనే ఇక్కడ ‘ఆఫీసర్- ఇన్ చార్జ్’ ని"

"ఇంతకు ముందు ఎక్కడ ఉండే వాళ్ళు?"

"విశాకపట్నంలో ఉన్న ‘ఎఫ్.జే.ఎస్ పైప్స్’ అనే కంపెనీలో..."

"ఓ...అది చాలా పెద్ద కంపెనీ కదా?"

"అవును...నెలకు వంద కోట్ల బిజినస్ ఉన్న కంపెనీ"

"ఈ కంపెనీలో బిజినస్ ఎంత ఉంటుంది"

"ఇక్కడ కూడా సుమారుగా అంతే బిజినస్ ఉంటుంది"

"విశాకపట్నంలో క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా! అది వదిలేసి ఎండిపోయిన ఈ ఊరుకు వచ్చారు?"

“ఏప్పుడూ 'మేనేజ్ మెంట్ టాప్స్’ ఒకే చోటే ఉండకూడదు. ‘ఎక్స్ పీరియన్స్’ రాను రాను 'జంప్' అవుతూనే ఉండాలి. పాత కంపెనీ కంటే ఇక్కడ సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తామని చెబుతుంటే చల్లని క్లైమేట్టు...విశాకపట్నం, ఇవన్నీ దేనికి చెప్పండి"

"అదీ నిజమే...ఇంట్లో ఒక 'ఏ.సి’ మిషన్ కొని తగిలిస్తే చల్లటి క్లైమేట్ వస్తుంది. దానికోసం విశాకపట్నం వెళ్ళాలా ఏమిటి?"

---వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి సంభాషణే జరుగుతోంది. మధ్యలో అందులో ఒక చిన్న మార్పు. విఠల్ రావ్ తన కుర్చీ పక్కన పెట్టుకున్న బ్రీఫ్ కేసును ఆ రాజకీయ నాయకుడికి అందించాడు.

“ఈ ఐదు లక్షలు మీ 'కంపనీ’ కి చిల్లర డబ్బులు. మేము 50 లక్షలు వరకు ఎదురు చూశాము"

"అరే మీరొకరు. మా 'కంపనీ’ ‘చైర్మాన్’ పెద్ద పిసినారి అనేది తెలుసుకునే నేను ఈ కంపనీలో చేరాను. మీరు పెద్దగా బాధ పడకండి. అప్పుడప్పుడు భయపెడుతూ ఉండండి. నేను డైరక్టర్లతో మాట్లాడి మీకు 'సెటిల్’ చేస్తూ ఉంటాను"

"అరె...మీరు మా సైడా? ఇంతకు ముందు మీ 'సీటు’లో ఉన్న మనిషి పెద్ద పొగురుబోతు. నేను గాంధీ గారికి మనవుడ్ని, నెహ్రూ గారికి మేన మామను అంటూ డబ్బులే ఇవ్వనని చెప్పాడు. నేను కూడా...చుట్టు పక్కలున్న వారితో గొడవ పెట్టుకోకండని ఎంతో చెప్పి చూశాను. వినలేదు. కరక్టుగా అప్పుడే మీ కంపనీలో పని చేస్తున్న ఒకతను పనిచేస్తున్నప్పుడే 'హార్ట్ అటాక్' వచ్చి చనిపోయాడు. ఎవరో ఒక ఆఫీసర్ ఎక్కువగా శ్రమ పెట్టినందువలనే 'హార్ట్ అటక్' వచ్చిందనే విషయం నా చెవికి చేరింది. అది చాలదా నాకు? పిడి దొరికింది కదా. మీ 'చైర్మాన్' కి ఒక లెటర్ పంపించాను. ఆయన ఇంకొక ఆయనకు లెటర్ పంపించాడు. ఇప్పుడు ఐదు లక్షలు వచ్చింది. ఇదే మీ 'కంపనీ లక్షణం”

---ఆ రాజకీయ నాయకుడు బాగానే మంట వెలిగించాడు. విఠల్ రావ్ కూడా అలాగే 'ఇదే మనకు ఒక మంచి సంచీ' అని ఆ బంధుత్వాన్ని గట్టిగా బిగించుకున్నాడు.

"వదిలేయండి సార్...పాత చెత్తను ఎందుకు కెలకటం? మీరు నాకు మద్దత్తుగా నిలబడండి. మిగితాది నేను చూసుకుంటాను"

"అరె ఏమిటండి మీరు...ఇంత ఒపన్ గా మీరు మాట్లాడిన తరువాత నేను చెప్పటానికి ఏముంది? లోపల హత్యే జరిగినా మీరు భయపడ అక్కర్లేదు. అన్నీ నేను చూసుకుంటాను"

----మొత్తానికి ఆ రాజకీయ నాయకుడు, తను ఎలాంటి మనిషి...తన గుణం ఎలాంటిదీ అనే విషయాలన్నీ చెప్పి ముగించి ఆ బ్రీఫ్ కేసు తీసుకుని వెళ్ళిపోయాడు.

విఠల్ రావ్ ముఖంలో విజయం సాధించిన నవ్వు. దానికి ఎన్నో అర్ధాలు. రాజకీయ నాయకుడు వెళ్ళిన వెంటనే...'అకౌంట్స్ మేనేజర్’ లోపలకు వచ్చాడు.

"నమస్తే సార్...ఒకలాగా రాజకీయ నాయకుడ్ని సమాధానపరచి పంపించారు లాగుందే?"

"అవును...ఇక మన దగ్గర తోక ఆడించడు. అంతలా బెదిరించి పంపాను"

"గొప్ప మనిషి సార్ మీరు....మీ సీటులో ఇంతకు ముందు ఉన్న ఆఫీసర్ ఆయన్ని లోపలకు రానిచ్చేవాడే కాదు"

"అందుకే ఇక్కడ పనిచేయలేకపోయాడు. నాకు....ఎలాంటి వాళ్లతో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. సరే...మీరు ఎందుకు వచ్చారు?"

"సార్...వౌచర్ లో సంతకం తీసుకు వెల్దామని వచ్చాను"

"అవును...ఇలాంటి హెడ్దింగ్గులే లేని ఖర్చులను ఏ లెక్కలో రాస్తారు?"

"అదెందుకు సార్ అడుగుతారు...'మెషనరీ బ్రేక్ డౌన్, కంపనీ మెత్తం పైంటింగ్ వేయించాము...అని ఏదో ఒక లెక్కలో రాయాల్సిందే..."

--అకౌంట్స్ మెనేజర్ మాట్లాడుతూనే వౌచర్ జాపాడు. అందులో సంతకం పెట్టటానికి పెన్ను తెరిచిన విఠల్ రావ్ గుండె గుబేలు మన్నది. కారణం, ఐదు లక్షల రూపాయలకు బదులు 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు అందులో రాసుంది.

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-9 ****************************************************************************************************

19, జనవరి 2020, ఆదివారం

ఆలయం(సీరియల్)...PART-7



                                                  ఆలయం(సీరియల్)
                                                             (PART-7)


"అలా కాదురా...మనల్ని మన తల్లి తండ్రులు పదినెలలు తరువాతే కన్నారు. వాళ్ళనూ వాళ్ళ తల్లితండ్రులు పదినెలల తరువాతే కన్నారు. వాళ్ళకు మాత్రం 'ఏ.సీ.' గదులు, కార్లూ అంటూ చాలా వసతులు. కానీ, మనం కుర్చీలో కూడా కూర్చోకూడదు. నిలబడే పని చేస్తూ చచ్చిపోవాలి"

"దానికేం చేయగలం...వాళ్ళు స్కూల్లో బాగా చదువుకుని మంచి 'మార్కులు’ తెచ్చుకున్నారు. అందువలన 'బి.ఈ', 'ఎం.ఈ' అని సీటు తెచ్చుకుని ఆ చదువులను కూడా విజయవంతంగా పూర్తిచేశారు. మీరు 'సినిమా' కోసం స్కూల్ కట్ చేసి వెళ్ళినందుకు 'ప్లస్ టూ' కూడా పాస్ అవలేదు. అక్టోబర్ లో పరీక్షలు రాసి ఎలాగో 'పాస్’ అయ్యి బ్రతికిపోయారు. మనిషి యొక్క జీవిత పర్వాలలోనే ముఖ్యమైనది విధ్యార్ధి పర్వం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే జీవితం తప్పుగానే స్థిరపడుతుంది. ఏదో ఈ చదువుకు ఈ మాత్రమైనా మంచి కంపెనీలో ఉద్యోగం దొరికి నెల జీతం తీసుకుంటున్నది తలచుకుని సంతోష పడండిరా"

-- ప్రసాద్ ఇలాగే సమాధానం చెబుతాడు. అతనితో మాట్లాడిన వాళ్ళకు 'ఎందుకురా మాట్లాడాము?' అని అనిపిస్తుంది. అందువలన వాళ్ళ వరకు ఇతనొక ప్రత్యేక వ్యక్తి.

ఈ వ్యక్తి ఆరోజు కూడా వీళ్ళ మాటలను పట్టించుకోకుండా, వాళ్ళతో కలవక, విడిగా ఉండి తన పని తాను చేసుకుంటూ వెడుతున్నాడు. అందరి జీవితమూ ఎప్పుడూ ఒకే లాగానే పయనిస్తుందా? అందులో ఎన్నో భయం పుట్టించే మార్పులు, వంకర్లు వస్తూనే ఉంటాయి కదా!

ప్రసాద్ వరకు అలాంటి ఒక మార్పు వచ్చింది.

అతనికి 'పర్సనల్ డిపార్ట్ మెంటు’ నుండి పిలుపు వచ్చింది.

"మిస్టర్ వెంకట్ ప్రసాద్...మీరు కొత్త ‘పి.ఆర్.ఓ.’ సారును చూడాలని చెప్పుంచారా?"

"అవును..."

“ఆయన డ్యూటీలో జాయిన్ అయ్యి ఈ రోజు రెండో రోజు. నిన్న మీరు ఆయన్ని కలవటానికి వచ్చి అలాగే తిరిగి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వెళ్ళండి. సారు మీకోసం కాచుకోనున్నారు"

ప్రసాద్ ను పిలిచినతను తప్పుకున్నాడు. కానీ ‘పి.ఆర్.ఓ.’ ను వెతుక్కుంటూ వెళ్ళి 'విష్' చేయటానికి ప్రసాదుకు బిడియంగా ఉంది. ఎందుకంటే ముందు రోజు ఆయన్ని కలవడానికి వచ్చినప్పుడు అతను చూసిన ఆ దృశ్యం అతని మనసులో కదలాడుతోంది.

'ఒక తాగుబోతు--అందులోనూ పని చేసే సమయంలోనే తాగుతున్న మహా తాగుబోతుగా మనసులో పదిలమైపోయిన ఆయన్ని ఏమని చెప్పి విష్ చేయాలి?’

"ఇంకా ఎక్కువగా తాగి ఆనందంగా జీవించండి!" అని విష్ చేయాలా? -- గందరగోళంతో 'కంప్యూటర్ మానీటర్ నే' చూస్తూ కూర్చున్న అతను, చివరగా ఆ ‘పి.ఆర్.ఓ’ ను కలిసి విష్ చేయాలనే ఐడియానే మార్చుకున్నాడు.

అప్పుడు రాజేష్ కుమార్ వచ్చాడు.

“ప్రసాద్...ఇంకా వెళ్లలేదా?"

"లేదు రాజేష్... అభినందనలు అనేది మంచి మనుషులకు మాత్రమే"

"వచ్చిన 'పార్టీ' ఒక వేస్టు వ్యక్తి అనేది మొదటి రోజే తెలిసిపోయిందా?"

ప్రసాద్ మౌనంగానే దాన్ని ఆమోదించాడు.

రాజేష్ కుమార్ కు కుషీగా ఉన్నది.

"పెద్ద అధికారంలో ఉండే ఆఫీసర్లు అందరూ ఎప్పుడూ దేవాది దేవతలు అని అనుకుంటావే. వాళ్ల గురించి నీదగ్గర ఇప్పుడొక మార్పు...మంచిది" అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళాడు.

అదే సమయం 'డిపార్ట్ మెంటులో' ఆ 'పి.ఆర్.ఓ.' రహస్యంగా బాటిల్ తెరిచి గ్లాసులో పోసుకుని తాగటం మొదలుపెట్టాడు. ఎక్కువగా వాసన రాని విదేశీ మధ్యం. అయినా కానీ, ఒక జాగ్రత్తకోసం వక్కపొడి పొట్లం కట్ చేసి నోట్లో పోసుకున్నాడు. అద్దాల అడ్డు దగ్గరకు వెళ్ళి కర్టన్ను పక్కకు జరిపి ఎవరైనా గమనిస్తున్నారా? అని ఒక చూపు వేశాడు.

టెలిఫోన్ మోగింది. రిజీవర్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతలవైపు ఆ పరిశ్రమకు చెందిన అతిపెద్ద పోస్టులో ఉన్న మరో అధికారి ఒకరు మాట్లాడారు.

"మిస్టర్. విఠల్ రావ్!"

"ఎస్ సార్..."

"పనిలో చేరి ‘సెటిల్’ అయ్యారా?"

"ఎస్ సార్..."

"సరే...నేను చెప్పినదంతా జ్ఞాపకం ఉంచుకున్నారు కదా?"

"ఉంది సార్"

"రేపు ఆ ప్రాంతం వ్యక్తి, రాజకీయ పార్టీ జిల్లా ఆర్గనైజర్ వస్తారు. ఆయనకు ఐదు లక్షలు 'బ్రీఫ్ కేసు’ లో ఉంచి ఇవ్వండి. సస్ పెన్స్ అకౌంటులో డబ్బులు తీసుకోండి. అలాగే 'వౌచర్’ లో సంతకం అడిగితే వేసి ఇవ్వండి. ఈ డబ్బు ఇచ్చే విషయాన్ని రహస్యంగా ఉంచండి...అది వాళ్ళ ఎలక్షన్ ఫండ్"

"ఓ.కే. సార్...నేను చూసుకుంటాను"

--- విఠల్ రావ్ అంటూ 'టాప్ లెవల్లో' పిలవబడ్డ ఆ 'పి.ఆర్.ఓ.'...వెంటనే ఫోను పెట్టేసి, వచ్చి కూర్చున్నాడు. అతని కడుపు రగిలిపోతోంది. ‘ఏ పనీ చేయని రాజకీయ నాయకులకు నా చేతులతో లంచం ఇవ్వాల్సి వస్తోంది. హు...మనం కూడా ఒక రాజకీయ నాయకుడై ఉండాల్సింది, ఏ పనీ చేయకుండా డబ్బు సంపాదించుకోవచ్చు’ అని గొణుక్కోవడం మొదలుపెట్టాడు.

                                                                      ఇంకా ఉంది.....Continued in PART-8 ****************************************************************************************************

17, జనవరి 2020, శుక్రవారం

ఆలయం(సీరియల్)...PART-6



                                                  ఆలయం(సీరియల్)
                                                             (PART-6)



అతనికి జీతం నెలకు పదిహేనువేలు. అందులో డిడెక్షన్స్ పోను చేతికి వచ్చేది పన్నెండు వేలు. పోయిన ఏడాది వరకు నాలుగు వేల రూపాయల ఇంట్లోనే అద్దెకు ఉండేవాడు. ఈ రోజు అతను ఉంటున్న ఇంటి అద్దే పదివేలు. అంతే కాదు ఆఫీసుకు రావాటానికి ఒక 'బుల్లెట్' మోటర్ బైకు. చల్లగా పడుకోటానికి ఇంటి బెడ్ రూము గదిలో ఒక ‘స్పిట్ ఏ.సీ.’ అని...'జెనెరల్ మేనేజర్’ రేంజ్ లో ఉన్నాడు. అతను తీసుకుంటున్న జీతంలో ఇవన్నీ ఎలా సాధ్యం?"

-- రాజేష్ కుమార్ అలా చెప్పేసరికి ప్రసాద్ ఇబ్బంది పడ్డాడు.

"చాలు...ఇలాంటి విషయాలు నా చెవిలో పడుతున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతోంది. 'కంపనీ' భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆలొచనతో నాకు తల తిరుగుతోంది" చెప్పాడు ప్రసాద్.

"దానికేం చేయగలం...టాప్ లో ఉన్న తలలు సరిగ్గా ఉంటే, క్రింద ఉండే వీడిలాంటి వాళ్ళు సరిగ్గా ఉంటారు. కానీ,పెద్ద తలలు వేరే విధంగా నడుచుకుంటున్నారే?

"వేరే విధంగా అంటే?"

"నీకేమీ తెలియదన్నట్టు మొహం పెడతావేం...వీడిక్కడ టీ పొడి, ఆహార సామగ్రి లో దొచుకుంటుంటే...అక్కడ వాళ్ళు, 'సబ్-కాంట్రాక్ట్', 'మెటీరియల్ పర్చేస్’ అని చెప్పి దోచుకుంటున్నారు"

"చాలు...ఇంతకంటే ఇంకేమీ మాట్లాడొద్దు! మంచిది ఏదైనా ఉంటే మాట్లాడు"--- అని చెప్పి ప్రసాద్ తాత్కాలికంగా రాజేష్ కుమార్ ను తప్పించుకుని వెళ్ళిపోయాడు.

డిపార్ట్ మెంటులో కి దూరేటప్పుడు ఎప్పటిలాగానే ప్రసాదే మొదటి వ్యక్తి. సమయం 8.50. తొమ్మిదింటికి షిఫ్ట్ మొదలు. అతనితో పాటు మరో ఏడుగురు ఆ డిపార్ట్ మెంటులో పనిచేస్తున్నారు. అందరూ మిలటరీ వాళ్ళలాగా కరెక్టుగా ఫ్యాక్టరీ బెల్లు తొమ్మిదింటికి మోగంగానే లోపలకు వచ్చారు. కానీ, పది నిమిషాల ముందే వచ్చి, కంప్యూటర్ ఆన్ చేసి పని మొదలుపెట్టిన ప్రసాద్ ను చూసి ఒక నవ్వు నవ్వారు. దాన్ని ప్రసాదూ గమనించాడు.

ఇదంతా అక్కడ రోజూ జరిగే తంతే. 'కంపెని’ లో ప్రసాద్ లాంటి నిజాయితీ అయిన ఉద్యోగులు ఉండటమే కష్టం. మిగిలిన అందరికీ ప్రసాద్ లాంటి వారు 'పాఠాలు నేర్పుతారు’. అందులో కనకారావ్ అనే ఒకతను ఉన్నాడు. అతనికి వెంకట్ ప్రసాద్ అంటే వొళ్ళుమంట. వెక్కిరిస్తూ మాట్లాడతాడు. ఎందుకంటే ప్రసాద్ ఖాళీ సమయంలో కూడా 'ఉద్యోగం చేసే చోటు ఆలయంలాంటిది. దాంట్లో ఉద్యోగం దేవుడు లాంటిది’ అని చెబుతూ ఎప్పుడూ పని పని అంటూ కళ్ళార్పకుండా పనిచేశేవాడు.

"రేయ్ కేశవ్, నువ్వూ ఉన్నావే...నీకు శ్రమ అంటే ఏమిటో తెలుసారా? మన ప్రసాద్ ను చూడు...శ్రమకు ప్రసాదే ఒక ఉదాహరణ" అని వేలాకోళంగా మొదలెడతాడు.

అందరూ అతనితో వంతుపాడుతారు. కొంతమంది ప్రసాద్ దగ్గరకు వెళ్ళి అతన్ని కెలుకుతారు.

"రేయ్ ప్రసాద్...నేను తెలియక అడుగుతున్నాను. ఇంతగా కష్టపడి పనిచేస్తున్నావే! నీకేమన్నా 'కంపనీ’ లో గోల్డు మెడల్ ఇస్తారా?"

"అంటే...కష్టపడి పనిచేస్తే బంగారు పతకం ఇవ్వాలి అంటావా?..."

"నేను అలా చెప్పటంలేదు! నువ్వెందుకు అంత కష్టపడాతవు...మనం కొండనే పగలుగొట్టినా మనం 'లేబర్’ గుంపే. కావాలంటే ఐదొందలో, వెయ్యో జీతం ఎక్కువ ఇస్తారు. నువ్వొక మేనేజర్ గానో....ఆఫీసర్ గానో అవలేవురా!"

"నేను మేనేజర్ అవటంకోసం ఇక్కడ పనిచేయటంలేదు. తీసుకునే జీతానికి న్యాయం చేయాలి. అందుకోసమే పనిచేస్తున్నాను. నేను ఈ కంపనీలో పనిచేయటానికి నాకు ఒక అవకాశం దొరికింది. అప్పుడు జీతం కూడా వద్దు 'ఉద్యోగం దొరికితే చాలు’...పని నేర్చుకోవచ్చు. అదే చాలు అనుకున్నాను. కానీ, జీతంతో ఉద్యోగం దొరికింది. అలాగే అప్పుడప్పుడు జీతం పెరుగుతూ ఇప్పుడు నెలకు ముప్పైవేల రూపాయలు వస్తోంది. ఇంత పెద్ద జీతం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఇది నిలకడగా ఉండాలి. ఇలాగే కొనసాగాలి. దానికోసం ఈ కంపనీ ఇప్పటి లాగానే ఎప్పుడూ ఉండాలి. దానికోసమే నా పనిని నేను బాధ్యతగా చేస్తున్నాను. నేను ఇలా పనిచేయడంలో నాకు ఒక ఆనందం ఉందిరా. దయ చేసి మీ వ్యాఖ్యానాలతో నా బుర్రను మార్చటానికి ట్రై చేయకండి. ప్లీజ్..."

"ఇలా చూడరా...మేము నీమీద ఏమీ రుద్దటం లేదు. యధార్ధాన్ని మాట్లాడుతున్నాము. ఇక్కడ మనం చెమటోడ్చి పనిచేస్తున్నాము. దానికి తగిన జీతాలు ఇవ్వటం లేదు. కానీ, 'ఆఫీసర్’ అనే ముసుగులో 'ఏ.సీ.' గదులలో వార్తా పత్రికలు చదువుతూ డెబ్బైవేలు, ఎనభైవేలు జీతాలు తీసుకుంటున్నారు...దీని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలొచించావా?"

"చాలురా...నువ్వేదో వాళ్ల పక్కనే ఉండి చూసినట్టు మాట్లాడకురా! ఎవరో ఒకలిద్దరు కథల పుస్తకాలు చదువుతూ ఉండి ఉండొచ్చు. వెంటనే అందర్నీ అలాంటి వారనే చెప్పాలా?...వెళ్ళరా. వెళ్ళి పనిచూసుకో"

నేను చెప్పేది కొంచం విను.

చెప్పు...వింటూనే ఉన్నాగా...చెప్పు.

                                                                           ఇంకా ఉంది.....Continued in PART-7 **************************************************************************************************

15, జనవరి 2020, బుధవారం

ఆలయం(సీరియల్)...PART-5



                                              ఆలయం(సీరియల్)
                                                         (PART-5)


"పరవాలేదే...సరిగ్గా అర్ధం చేసుకున్నారే!"

"నువ్వు చెప్పేది వాస్తవమే మాలతీ. ఒక విధంగా ఇది అనవసరమైన పనే. అనవసరమైన బాధ కూడా....!. 'మనం మన పనిని కరెక్టుగా చేసుకుంటూ వెళదాం. తప్పు చేసిన వాళ్లను ఆ దేవుడే ఒకరోజు ధండిస్తాడు అనుకుంటూ మామూలుగా వెళ్ళటం నా వల్ల కాదు. ఒక రచయతగా - కళ్ల ఎదురుకుండా జరుగుతున్న అన్యాయాన్ని,అవినీతిని చూస్తుంటే నా రక్తం ఉడికిపోతోంది"

"తెలుసు...చివరగా 'నేను జస్ట్ ఒక స్టోర్ కీపర్ మాత్రమే కాదు...సమాజ సంరక్షణ కలిగిన రచయతను అనే కదా చెప్పబోతారు...అందులోనూ మీ యజమానిని దేవుడు కంటే ఎక్కువగా చూస్తున్నారు కాబట్టే ఇలాంటి విషయాలను మీరు మామూలుగా తీసుకోలేరని నాకు తెలుసు. సరే...మిమ్మల్ని ఒకటడుగుతా కోపగించుకోకూడదు..."

"ఏమిటది మాలతీ?"

"ఈ అవినీతిని ఎదిరించి పోరాడబోతారా?"

"ఎదిరించక...?"

"ఎలా ఎదిరిస్తారు?"

"దాని గురించే ఆలొచిస్తున్నాను. అది మాత్రమే కాదు మాలతీ. ఇలాంటి అవినీతిని జరగకుండా ఆపి ఒక మంచి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచాల్సిన 'పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్’ రే ఒక పెద్ద తాగుబోతుగా ఉన్నాడే. ఆయన మధ్యం తాగటం నా కళ్ళార చూశానే"

"మీరే ఒక కథలో...మధ్యం తాగటం ఒక బలహీనం. అదేమంత పెద్ద నేరం కాదు! అని రాసారు. మీకే తెలుసు...మామూలు 'హై స్కూలు’ పిల్లలు కూడా ఇప్పుడు సర్వ సాధారణంగా మధ్యం తాగుతున్నారు. మధ్యం తాగటాన్ని ఎందుకు ఒక పెద్ద విషయంగా మాట్లాడుతున్నారు?"

"ఏది చెప్పినా నా కథను చూపి సమాధానం చెబుతున్నావే మాలతీ. నేను చెప్పేది పూర్తిగా విని మట్లాడు. మురికి కాలువ నీళ్ళను పరిశుభ్రం చేసే వాళ్ళూ, శ్మశానంలో పీనుగులను తగలబెట్టే వాళ్ళూ, మార్చూరీలో శవాల మధ్య తిరిగే వాళ్ళు...వీళ్లంతా కష్టపడటానికి మధ్యమే ఒక సరైన విరుగుడు మందు అనుకుంటున్నారు. అది లేకపోతే మా కర్తవ్యం నెరవేర్చడం కష్టం అని వాళ్ళు అనుకోవడం కూడా నాకు తెలుసు. కానీ, ఒక భాద్యత గల అధికారి తాను భాద్యత తీసుకున్న మొదటి రోజే ---తన ఆఫీసులోనే మధ్యం తాగటం ఎంత పెద్ద తప్పో తెలుసా?"

-- వెంకట్ ప్రసాద్ "తెలుసా?" అని ఆవేశంగా అడిగి ముగించినప్పుడు గోడ గడియారం పదకొండు గంటలు కొట్టింది. అది కొట్టి ముగించనీ అని మౌనంగా కాచుకున్న మాలతీ ఆ తరువాత,

“మీరు అనవసరంగా బయటకు వెడుతున్న పామును అడ్డగించి ఇంట్లోకి పోనిస్తున్నారు..." అన్నది.

"నువ్వేం చెబుతున్నావు మాలతీ...?"

"మాట్లాడకుండా పడుకోండి! ఇలాంటి అనవసరమైన బాధలను మూటకట్టి కిటికీలో నుంచి పారేయండి. మన అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. వాడికి 'ఫీజు’ కట్టాలి. 'ఎల్.ఐ.సీ’డ్యూ, ‘టెలిఫోన్ బిల్లు’ చాలా అవసరాలు ఉన్నాయి. పత్రిక వాళ్ళు కథ పంపంచమని అడిగారు. వాళ్ళకు కథ రాసి ఇవ్వండి. నాలుగు డబ్బులైనా వస్తాయి. ఇవన్నీ వదిలేసి ఇలా మీరు బాధ పడుతుంటే...వ్యాధులే వస్తాయి" -- కాళ్ళ క్రింద ఉన్న తన దుప్పటి తీసుకుని కప్పుకుని...తాను చెప్ప దలుచుకున్నది చెప్పేసి పడుకుంది మాలతీ.

ప్రసాద్ కు వొళ్ళు మండింది.

పెళ్ళికాక ముందు 'నీకెందుకురా ఊళ్ళో వాళ్ల గొడవలన్నీ?' అని ప్రసాద్ వాళ్ళ అమ్మ అడిగేది. ఇప్పుడు ఆ చోట భార్య!

వ్యక్తులు మాత్రం మారారు.

కానీ రాగం మారనేలేదు.

అతనిలో కడుపు మంటతో పాటూ ఆవేశమూ చోటు చేసుకుంది.

మరుసటి రోజు!

'ఆఫీసు క్యాంటీన్లో' ప్రొద్దున టిఫిన్ తింటున్నప్పుడే ప్రసాద్ చెవులు కొరకటం మొదలుపెట్టాడు ట్రబుల్ కింగ్ రాజేష్ కుమార్.

"మావా...ఏమిట్రా డల్ గా ఉన్నావు?"

"........."

"నిన్ను నవ్విస్తాను చూస్తావా?"

".........”

"రేయ్...ఇది క్రికెట్ 'సీసన్’. ఒక 'ఎస్.ఎం.ఎస్’ వచ్చింది…… చెప్పనా?"

"..........."

"రేయ్...నోరు తెరవకపోయినా ఒక 'ఊ' అనొచ్చు కదా?"

"సారీ రాజేష్ కుమార్. నేను నీ దగ్గర నుండి ఎటువంటి మాట వినే మనో స్థితిలో లేను. 'ప్లీజ్' నన్ను విడిచిపెట్టు"

"అదెలా...నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తాను. నువ్వు వింటే విను,లేకపోతే మానేయి. అది నీ ఇష్టం. మన 'క్యాంటీన్’ కొసం కొన్న 'టీ' పొడి పర్చేస్ లో మాత్రం క్యాంటీన్ మేనేజర్ డేవిడ్ యాభై వెల రూపాయలు నొక్కేశాడు. తెలుసా నీకు?"

"అవును...అతను ఒక ఫూల్ చూడు. నీ లాంటి వ్యక్తిని ఎదురుకుండా పెట్టుకుని...'చూసారా యాభై వేలు’ నొక్కేస్తున్నను చూడండి. అన్నాడా?..."

"పోరా ఇడియట్…….. నాకు ఎలా తెలుసో చెబుతా విను....

                                                                       ఇంకా ఉంది.....Continued in PART-6 ***************************************************************************************************

13, జనవరి 2020, సోమవారం

ఆలయం(సీరియల్)...PART-4



                                        
                                                 ఆలయం(సీరియల్)
                                                           (PART-4)


రాత్రి సమయం!

నిద్ర పోవటానికి ముందు ఏదైనా ఒక పుస్తకంలో పది పేజీలన్నా చదివి, దాని గురించి ఆలొచించుకుంటూ నిద్రపోవటం ప్రసాద్ కు అలవాటు.

"లైటు ఆపండి...వెలుతురు ఉంటే నేను ఎలా నిద్రపోవాలట?"--అని పది నిమిషాలకు ఒకసారి ప్రసాద్ భార్య గొణుగుతూ ఉంటుంది. ఆ రోజు అతను పుస్తకం చదవలేదు. నిద్రా రాలేదు. చేతులు కట్టుకుని, కాళ్ళు జాపుకుని అలాగే కూర్చున్నాడు.

రోజూ నిద్ర పోయేముందు ఒక గ్లాసు పాలు తాగుతాడు ప్రసాద్. ప్రసాద్ భార్య పాల గ్లాసుతో వచ్చింది. భర్త తీవ్రమైన ఆలొచనలో ఉండటం గమనించింది. ఇరవై సంవత్సరాల దాంపత్యం...'అతను ఎలాంటివాడు?' అనేది అమెకు ఎప్పుడో నేర్పింది.

ఇలా ఉన్నాడూ అంటే అతని మనసులో ఏదో ఒక నవలకు కావలసిన వృత్తాంతము తిరుగుతూ ఉండాలి. లేకపోతే సమాజ తాకిడి ఏదైనా ఏర్పడుండొచ్చు అనేది ఆమెకు తెలుసు.

భార్య అందించిన పాల గ్లాసును తీసుకుని తాగకుండా అలాగే చేతిలోనే ఉంచుకున్నాడు ప్రసాద్. ఆమె అతన్ని కెలకటం మొదలుపెట్టింది.

"ఏమండీ...?"

"హూ..."

"పాలు తాగండి..."

"ఓ...పాలుందా నా చేతిలో"

"సరిపోయింది...చేతిలో పాల గ్లాసు ఉన్నది కూడా తెలియనంత మాయలో పడేసిన ఆ ఆలొచన ఏమిటో?"

"ఏమీలేదు మాలతీ..."

"మీరే ఇంతకు ముందు అన్నారు...'ఏమీలేదని ఎవరైనా అన్నారంటే అందులో ఎన్నో విషయాలున్నాయని అర్ధం!' అని"

"నాలోనూ చాలా విషయాలు ఉన్నాయి! వాటి భారాన్ని ఎంతవరకు నేను తట్టుకోగలనన్నదే తెలియటంలేదు"

"ఏ విషయాన్నైనా మనసువిప్పి చెప్పుకుంటే...దానికొక దారి దొరుకుతుందని మీరే ఒక కథలో రాశారు"

"ఇది 'కంపనీ' విషయం మాలతీ...నీతో మాట్లాడినందు వలన ఒక్క ప్రయోజనమూ ఉండదు"

"అదెలా మీకు తెలుసు?"

"ఏమిటి మాలతీ నువ్వు...నేను చెప్పే సమస్యలను మొదట నువ్వు సరిగ్గా అర్ధం చేసుకోగలవో లేదో అనేదే నాకు సందేహం. ఆ తరువాత...నేను మాట్లాడిన తరువాత నా ఆందోళన నీకూ అంటుకుంటే. ఇది అవసరమా నీకు?"

"ఏమండి...'బెటర్ హాఫ్' అని నాకు ఇంకో పేరు ఉంది. సంతోషాన్ని మాత్రమే పంచుకునే మనిషిని నేను కాదు. ఏదైనా సరే సరదాగా నాతో చెప్పండి..."

---- మాలతీ అతన్ని వదిలేలా లేదు. అతను కూడా ఆమెతో అంతకంటే వాదించకుండా ఆమెదగ్గర తన మనో భారాన్ని పంచుకోవటం ప్రారంభించాడు.

"'కంపనీ'! ముందు లాగా లేదు. ఇప్పుడు కంపనీలో అవినీతి ఎక్కువగా ఉన్నది!"

"ఏమిటీ? అవినీతా?...అంటే కంపెనీ ఇప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ది చెందుతోంది అని అర్ధం"

"నేనొకటి చెబితే, నువ్వొకటి చెబుతున్నావే మాలతీ..."

“ఛ ఛ...నేను నిజమైన కారణాన్నే చెప్పేను. 'నువ్వు ఏలా ఉండాలని అనుకుంటావో...అలాగే మారుతావు!' అనే సామెతకూడా ఉన్నదండి. మనం ఇప్పుడు ఎక్కడండీ మంచిగా ఆలొచిస్తున్నాము? మనం వింటున్న విషయాలు కూడా తప్పుతప్పుగానే కదా ఉంటున్నాయి? ఇప్పుడంతా సాధనల గురించి మాట్లాడటంకంటే వేధనలు, అవినీతి, హత్య, మానభంగాలు, దొంగతనాలు....వీటి గురించే కదా ఎక్కువ మాట్లాడుతున్నాం. ఏదైతే మనల్ని ఎక్కువగా భాదిస్తుందో...అలాగే కదా మనం మారుతాం"

--- మాలతీ చాలా సహజంగా....అదే సమయం బాగా నొక్కి చెబుతూ ఒక కొత్త కోణంలో మాట్లాడింది.

"చాలు మాలతీ...నీ ఇష్టం వచ్చినట్టు వాగకు! 'మనం' అని నిన్నూ, నన్నూ ఎందుకు చేరుస్తావు? ఎటువంటి అవినీతి ఇంతకు ముందు నేను ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడూ చెయ్యలేదు, రేపూ చెయ్యను, ఎప్పుడూ చెయ్యను”

----అతను కోపగించుకోవటం మొదలుపెట్టాడు.

"అరే ఏమిటండీ మీరు...కోపగించుకున్నారా? నేను మిమ్మల్ని చెప్పలేదు. ఈ సమాజాన్ని చెప్పాను"

"అది నేను అసలు ఒప్పుకోను. తప్పుకు ఇలా కారణం కనిపెట్టి తప్పించుకోవటం తప్పుల్లోనే పెద్ద తప్పు"

"అది నాకూ తెలుసు. కానీ, నేను చెప్పిందే నిజం. దీన్ని ఎలా మార్చగలమో మనం ఆలొచించాలి. అది సరే...అసలు అవినీతికి పాల్పడింది ఎవరు?...అందులోనూ 'మిస్టర్ క్లీన్’ అయిన మీకు తెలిసేటట్టు"

"నువ్వు ఏం చెప్ప దలచుకున్నావు?"

"అదేమిటంటే...ఈరోజుల్లో దొరికిపోయేంత తేలికగా ఎవరూ తప్పు చేయటంలేదు. ఇది 'కంప్యూటర్’ యుగం. రుజువు వదిలిపెట్టకుండా ఎలా తప్పు చేయాలో 'కంప్యూటర్’ ఎక్కువగానే చెప్పిచ్చింది. అందుకే అలా అడిగాను"

"నువ్వు చెప్పేది నిజమే. నేను తెలుసుకున్న ఏ విషయానికీ ఒక్క 'రుజువు' కూడా లేదు. నా బాధకు అదీ ఒక కారణమే....”

“అవును నేను తెలియక అడుగుతున్నాను. మీరు మీ 'కంపనీ'లో ఒక 'స్టోర్ కీపరా?' లేక...మీరే 'చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టరా'?"

"తరువాత నువ్వు ఏం చెప్పబోతావో నాకు తెలుసు.'మీ పనిని మీరు కరెక్టుగా చెయ్యండి...అవినీతి గురించి బాధ పడాల్సింది యజమాని. మీకు ఎందుకు ఈ అక్కర్లేని పని!' అని అడగబోతావు?..........అవునా? "

                                                                      ఇంకా ఉంది.....Continued in PART-5 **************************************************************************************************

11, జనవరి 2020, శనివారం

ఆలయం(సీరియల్)...PART-3



                                                ఆలయం(సీరియల్)
                                                           (PART-3)


క్రిష్ణా నది ఒడ్డున కూర్చున్న ప్రసాద్ కు, ఆఫీసు రూములోనే మద్యం తాగుతున్న ఆ అధికారి యొక్క మొహం కళ్ళ ముందుకు వస్తూ, పోతూ ఉన్నది.

"ఇలాంటి ఒక చెడు అలవాటున్న ఒక వ్యక్తి ఎలా ఒక అధికారిగా నడుచుకోగలడు?" అనే ప్రశ్న ప్రసాద్ మనసును వెధిస్తున్నది.

ప్రసాద్ దేవుడుగా తలచుకుంటున్న 'చైర్మన్’ శంకరయ్య గారు, తాగుడుకు మాత్రమే కాదు...అన్ని చెడు అలవాట్లకూ దూరంగా ఉండటమే కాకుండా, ఆ అలవాట్లన్నీ తప్పు అని గట్టిగా చెబుతారు. 'శరీరాన్ని ఆరొగ్యంగా ఉంచుకోవాలంటే క్రమశిక్షణ అవసరం!' అని చెబుతారు. దాన్ని తన జీవితంలోనూ ఆచరణలో పెడుతూ వచ్చారు.

చూడటానికి యాభై ఏళ్ళ వ్యక్తి లాగానే ఉంటారు. కానీ, ఆ యౌవన రూపానికీ, శరీర దారుఢ్యానికీ కారణం ఆయన చేపట్టిన క్రమశిక్షణే. కానీ, ప్రసాద్ స్నేహితులు'నా దగ్గర కూడా కోట్ల కోట్ల డబ్బుంటే నేను కూడా తలతలమని మెరిసిపోతాను...'అని ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతారు.

డబ్బుగల వారు మెరిసిపోవటానికీ, క్రమశిక్షణతో ఆరొగ్యంగా ఉన్నవారు మెరిసిపోవటానికీ గల తేడా ప్రసాద్ కు బాగానే తెలుసు. ప్రసాద్ భార్య కూడా శంకరయ్య గారి ఫోటో చూసి...మీ 'చైర్మన్’ మంచి శరీర దారుఢ్యం గలవారూ అంటూ సరైన మాటలతో సూచిస్తుంది.

క్రమశిక్షణతో ఉంటే శరీర దారుఢ్యం ఏమిటి....అన్నీ వెతుక్కుంటూ వస్తాయి అనడానికి శంకరయ్య గారు ఒక ఉదాహరణ. అలాంటి మనిషి యొక్క సంస్థలో...మధ్యం అలవాటున్నఒక అధికారి!

ప్రసాద్ కు ఆఫీసులోనే మధ్యం తాగుతున్న ఆ అధికారి మొహం మాటి మాటికీ గుర్తుకు వస్తూ క్షోభ పెడుతోంది. గుడికి వచ్చిన చోట కూడా కనకదుర్గ అమ్మవారిపైన మనసును కేంద్రీకరించలేకపోయాడు. ఒక వార పత్రిక యాజమాన్యం దగ్గర నుండి చిన్న కథ ఒకటి పంపించమని ఫోన్ కూడా వచ్చింది.

మామూలుగా క్రిష్ణా నది ఒడ్డున కూర్చుంటే ప్రసాద్ కు కథలకు కావలసిన ఐడియాలు దొరుకుతాయి. ఒకసారి ఒక పెద్దాయన క్రిష్ణా నది ఒడ్డున కూర్చున్న ప్రసాద్ దగ్గరకు వచ్చి, కన్న బిడ్డలు అతన్ని కొట్టి బయటకు పంపించేసేరని చెప్పి ఏడుస్తూ చెయ్యి జాపాడు. పది రూపాయలు తీసుకున్న తరువాతే ప్రాసాద్ ను వదిలిపెట్టాడు. గంట తరువాత ఇంటికి తిరిగి వెడుతున్నప్పుడు ఆ పెద్దాయన ప్లాట్ ఫారం మీద మధ్యం మత్తులో తూలుకుంటూ నడిచి వెళ్లటం ప్రసాద్ కళ్ళకు కనబడింది. తాగటం కోసమే ఆయన అలాంటి అబద్దం చెప్పాడు అనేది ఆ క్షణమే ప్రసాద్ కు అర్ధమయ్యింది.

ప్రసాద్ వరకు మొసం పోవటమూ నచ్చదు; మోసగించటమూ నచ్చదు. ఆ క్షణం అతనికి వచ్చిన కోపానికి కొలతే లేదు. మరుసటి రోజు ప్రసాద్ క్రిష్ణా నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు ఆ పెద్దాయనను చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. గబుక్కున ఆయన చేయి పుచ్చుకుని సరసరమని ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ ప్రసాద్ పెద్దాయన గురించి చెప్పింది ఎవరూ పట్టించుకోలేదు.

“మీరే సార్ జాగ్రత్తతో వ్యవహరించాలి! దీని కోసం అతన్ని పట్టుకుని జైల్లో పెడితే...జైల్లోనే బిచ్చం అడుక్కుంటాడు. ఇది అవసరమా? వదిలేయండి సార్. ఒక రోజు కాకపోతే...మరొక రోజు తాగేసి క్రిందపడిపోయి...ఏ లారీ క్రిందనో, బస్సు క్రిందనో పడి చస్తాడు. అదే వీళ్లకంతా ఒక ముగింపు" అన్నాడు, కానిస్టేబుల్.

చక్కటి బాధ్యత గల సమాధానం!?. ప్రసాద్ కు పోలీసుల నిజమైన మొహం తెలియటం అలాంటి సందర్భాలతొనే ప్రారంభమైంది!

ఆ తరువాత పోలీసులు చెప్పినట్లు జరగటమే ఘోరం!

ఆ తాగుబోతు పెద్దాయన సిటీ బస్సు చక్రాల క్రింద రక్తపు ముద్దలా పడున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రసాద్ కు గుండే గుభేలు మన్నది. ‘కానిస్టేబుల్ చెప్పింది ఫలించిందా? లేక తన వల్ల ఆ తాగుబోతు పెద్దాయన్ని కాపాడటం కుదరలేదా? ఎందువల్ల ఇలా జరిగింది?’ అనే ప్రశ్నలు, వాటి తాకిడి కలిపి ప్రసాద్ దగ్గర ఒక చిన్న కథగా తయారయ్యింది.

కానీ, కథలో ప్రసాద్ మంచి మార్పు చేశాడు. తాగుబోతు పెద్దాయనను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి అప్పగించలేదు. దానికి మారుగా ఆయన్ని తీసుకువెళ్ళి తన ఇంటి తోటమాలిగా పెట్టుకున్నాడు.

పెద్దాయన కూడా తనకొక కొత్త జీవితం దొరికిందన్న ఆనందంతో...తోటమాలి పనిని ఒక పరిహారంగా తీసుకున్నాడు.

ఆ కథకు ఐదువేల రూపాయలు బహుమతిగా లభించింది. జీవితంలో అతను చూసే సంఘటనలతో ఇలాంటి పలు మంచి కథలు రూపొందాయి. ఆఫీసులోని తాగుబోతు అధికారి కూడా ప్రసాద్ కు, ఒక కథకు కథాంశం అవబోతాడా? లేక...'కంపెనీ' కి ఒక ఎరువుగా ఉపయోగపడతాడా అనేది మాత్రం కన్ ఫ్యూజన్ గానే ఉన్నది.

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-4

****************************************************************************************************

9, జనవరి 2020, గురువారం

ఆలయం(సీరియల్)...PART-2




                                                ఆలయం(సీరియల్)
                                                           (PART-2)


ప్రసాద్ తన కుర్చీలో కూర్చుని 'కంప్యూటర్లో' తన చూపులను కేంద్రీకరించాడు. అతని యొక్క అకౌంట్స్ ను...కావలసినంత వరకు 'రిపోర్టు’ తయారు చేసి 'ప్రింట్' తీయాలి. ప్రసాద్ ఆ పనిమీద ఉన్నప్పుడు తలుపు తెరుచుకుని అతని 'ఏ.సీ’ గదిలోకి వచ్చాడు రాజేష్ కుమార్.

రాజేష్ కుమార్, ప్రసాద్ యొక్క సహ ఉద్యోగి. వచ్చినతను వూరికే కూర్చోలేదు. ఫ్యాక్టరీలో జరుగుతున్న తప్పు ఒప్పులను చర్చించడం మొదలుపెట్టాడు.

"ప్రసాద్!"

"ఊ"

"కొంచం ఇటు చూడు ప్రసాద్ "

"నేను ఇప్పుడు 'బిజీ' గా ఉన్నాను. ఏదున్నా సరే లంచ్ టైములో మాట్లాడుకుందాం"

“అప్పుడూ మాట్లాడుకుందాం సరే. కానీ, ఇప్పుడు నేను మాట్లాడ దలచుకున్నది మాట్లాడి వెళ్ళిపోతాను"

"నేను ప్రశాంతంగా పని చేయడం నీకు ఎప్పుడూ నచ్చదే..."

"అదెలా? మనకి మన చుట్టూతా అందరూ మనలాగానే ఉండాలే!"

"ఈ సిగ్గులేని విషయాన్ని బహిరంగంగా ఒప్పుకుంటున్నావా?"

"ఇది సిగ్గులేని విషయం కాదు ప్రసాద్. ఇదే యథార్థం. ఏ ఫ్యాక్టరీలోనైనా నీలాగా ఉండే వ్యక్తులు ఒకరో...ఇద్దరో నే ఉంటారు...కానీ నూటికి తొంబై మంది నాలాంటి వ్యక్తులే ఉంటారు"

"అదేమో నిజమే. సరే...ఏమిటి విషయం? త్వరగా చెప్పి ఇక్కడ్నుంచి వెళ్ళు...నాకు చాలా పనుంది"

"సరేరా. అయ్యగారు నీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పబోతారు. బాగా విను!"

"నువ్వు నోరు తెరుస్తే అన్నీ ఆశ్చర్యమే. ఇందులో వేరుగా ఒక ఆశ్చర్యమా?"

“అవన్నీ మామూలైనవి. కానీ, ఇది స్పెషల్ ఆశ్చర్యం..."

"సరేరా... త్వరగా చెప్పి తగలడు"

"చెప్పేస్తాను…మన 'కంపనీ'కి కొత్తగా ఒక 'పి.ఆర్.ఓ' వచ్చారు."

"అంటే...'పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్’?"

"'పి.ఆర్.ఓ'కి ప్రపంచమంతా అదే అర్ధం అనుకుంటా"

"కొత్త 'పి.ఆర్.ఓ' వస్తారని తెలుసు. కానీ, వచ్చి జాయిన్ అయ్యారని తెలియదు. సరే...ఇప్పుడు దానికేమిటిట?"

"దానికేమిటనా అడుగుతున్నావు? మనిషిని చూశావా...చూసి వచ్చిన తరువాత ఆ మనిషి గురించి చెప్పు. ఇంతటితో ఆఫీసు వార్తలు సమాప్తం. ఆశ్చర్యకరమైన మరికొన్ని వార్తలతో మిమ్మల్ని మళ్ళీ అలరించటానికి లంచ్ టైములో క్యాంటీన్లో కలుస్తాను....టొంటడైన్..."

---- రాజేష్ కుమార్, ప్రసాద్ గదిలో నుండి బయటకు వెళ్లాడు.

వెంటనే కొత్త 'పి.ఆర్.ఓ' ను కలిసి విష్ చేయాలని, తనని పరిచయం చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రసాద్ ఆయన్ని కలవటానికి ఆయన రూముకు వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఒక ఆశ్చర్యం ఎదురైయ్యింది.

రాజేష్ కుమార్ చెప్పినట్లే ఆ 'పి.ఆర్.ఓ' ఉండటం దారుణం. షాక్. స్పెషల్ ఆశ్చర్యం.

చిన్నగా తెరిచున్న ఆఫీసు రూము అవతల వైపు ఉన్న ఆ మనిషి, ఆఫీసు రూములోనే ఒక చిన్న మద్యం బాటిల్ తీసి మూత తెరిచి ఏదో 'టానిక్' తాగుతున్నట్టు తాగుతున్నాడు.

ప్రసాద్ కు గుండె గుభేలుమంది!

ఆలయం లాంటి 'కంపెనీ' లోపల ఆఫీసు టైములో మద్యం!

అందులోనూ భాద్యత గల ఒక అధికారి!!!!

                                                                          ఇంకా ఉంది.....Continued in PART-3.

****************************************************************************************************