13, ఫిబ్రవరి 2020, గురువారం

ఆలయం(సీరియల్)...PART-17




                                                  ఆలయం(సీరియల్)
                                                            (PART-17)


"ఈ రోజు ఏప్రిల్ ఒకటో తారీఖు! ఎవరో ఇతన్ని బాగా ఏమార్చి ఇలా చేసారు. 'కంపనీ లెటర్ ప్యాడ్' లో ఒక పేజీని దొంగలించి 'టైపు’ చేసి నకిలీగా సంతకం పెట్టి...ఓ....ఇది అతి పెద్ద తప్పు" అన్నాడు అకౌంట్స్ మేనేజర్.

'అకౌంట్స్ మేనేజర్’ తన వంతుకు ఒక వంతు పాడాడు. ప్రసాద్ కు అప్పుడు తెలిసింది ఆ రోజు ఏప్రిల్ 1-తారీఖని.

"వాట్ ఐ తింక్ ఈజ్...ఇతనే కూడా ఇలా చేసేసి మనలోని లోతును కొలిచి చూస్తున్నాడు అనుకుంటా"---'పి.ఆర్.ఓ.' యొక్క ఇంకో బాంబు వెంకట్ ప్రసాద్ గుండెల్లో గుచ్చుకున్నట్లు అయిపోయింది.

"సార్...నిజంగా లేదు సార్! ఈ రోజు ఏప్రిల్-1వ తేదీ అనేది జ్ఞాపకం లేదు" అంటూ కొంచం బెదురు చూపులతో చూశాడు ప్రసాద్.

"నో...నో...నువ్వు ఏమీ సరిలేవు. నీకు... ఈ 'కంపనీ' లోనే 'నువ్వొకడివే' బాగా పనిచేస్తున్నాను అనే పొగరు. అందుకే నువ్వుగా ఇలా ఒక 'ఆర్డర్న’ టైపు చేసి పెట్టుకున్నావు. నీకు నువ్వే మేనేజర్ ప్రమోషన్ ఇచ్చుకున్నావు! ఇది నిర్వాహానికి తెలిస్తే ఎక్కడికి పోయి ఆగుతుందో తెలుసా?"

"సార్...నిజంగా చెబుతున్నా సార్. నాకేమీ తెలియదు సార్. నేను, నా పని అని మాత్రమే అని ఉంటాను"

"ఇలాగంతా మాట్లాడితే సరిపోతుందా...నువ్వు చెప్పేది ఒకటి...చేసేది ఒకటి. దానికి ఈ నకిలీ 'ఆర్డరే' సాక్ష్యం."

"సార్...మళ్ళీ చెబుతున్నా! నాకూ, ఈ 'ఆర్డరుకూ' ఏ సంబంధమూ లేదు. నేను 'డిపార్టు మెంటు’ లోకి వచ్చినప్పుడు ఇది నా టేబుల్ మీద ఉన్నది" కొంచం గట్టిగా మాట్లాడాడు ప్రసాద్.

"ఏంటయ్యా వాయిస్ పెంచుతున్నావు... 'ప్రమోషన్ ఆర్డర్’ అనేది పిలిచి అభినందించి ఇవ్వవలసిన పెద్ద విషయం కదా...ఇలా టెబుల్ పైన ఉంటుందా?"

"నాకూ ఆ సందేహం వచ్చింది సార్. కానీ...?"

"ఏమిటి కానీ, గీనీ...? నువ్వు బాగా కథ చెబుతున్నావు. అందరినీ వెధవల్ని చేయాలని చూస్తున్నావు!"

"సార్...నేను ఎవర్నీ వెధవల్ని చెయ్యలేదు. నన్నే ఎవరో వెధవని చేసారు"

"ఇది ఇంకెవరి దగ్గరన్నా చెప్పు. బాధ్యతో నడుచుకోవలసిన నువ్వు...నకిలీగా ఒక 'ఆర్డర్’ తయారు చేసింది మొదటి నేరం. తరువాత, అందరినీ పిలిచి నీకు 'ప్రమొషన్’ వచ్చిందని నమ్మించడం రెండో తప్పు. మూడోది, మేనేజర్ సీటులో కూర్చున్నది. నాలుగోది, మమ్మల్ని ఎదిరించి మా దగ్గరే నేరాన్ని ఒప్పుకోకుండా మాట్లాడుతూనే ఉన్నది. దీనికంతా చేర్చి పెట్టి ఈ నిమిషమే నిన్ను 'సస్ పెండ్' చేస్తున్నాను. రేపు విచారణ పెట్టి నేరాలను నిరూపించి నిన్ను ఇంటికి పంపించే నేను మరో పని చేస్తాను. ఇప్పుడు నువ్వు బయలుదేరవచ్చు"

--'పి.ఆర్.ఓ.' న్యాయస్థానంలో మాట్లాడినట్టు మాట్లాడి ఆ నకిలీ 'ఆర్డర్’ ను చేతిలోకి తీసుకున్నాడు. వెంకట్ ప్రసాద్ కు అంతవరకు అనిచి పెట్టుకున్న కోపం అలాగే పెట్రోల్ పోసిన గుడ్డలో తగలబడిన నిప్పులా ఎగిసి పడటం మొదలుపెట్టింది.

"వద్దు సార్... నేను ఈ 'కంపనీ'ని ఒక ఆలయంలా భావిస్తున్నాను. మన 'చైర్మాన్’ నా వరకు దైవం. నన్ను అభినందించకపోయినా పరవాలేదు. ఇలా నామీద అపవాదు వేయకండి. ఎవరో నన్ను ఏప్రిల్ ఫూల్ చేశారు"

“నో ...నువ్వు ఒక మాట కూడా మాట్లాడకూడదు. మొదట చోటు ఖాలీ చేసి బయటకు పో. లేకపోతే...'సెక్యూరిటీ' ని పిలిచి పంపించ వలసి వస్తుంది"

ఆ బెదిరింపు మాటల తరువత ప్రసాద్ కు అక్కడ నిలబడటం ఇష్టం లేకపోయింది. ఆవేశాన్ని అనుచుకుని 'డిపార్ట్ మెంట్' నుండి బయలుదేరిన అతన్ని అక్కడున్న మొత్త కార్మీక గుంపు వెడుక చూసింది. అందరిలోనూ మేకు కొట్టినంత నొప్పి పుట్టింది. ఆ ఇద్దరి తోటి ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు ఎలా కావాలంటే అలా సమాధానం చెబుతారు అనే ఒక షాక్ తో ఉన్నారు.

వాళ్ళల్లో ఇప్పుడొక గుసగుసలు..."రేయ్ మామా! వెంకట్ ప్రసాద్ ని ఏప్రిల్ 'ఫూల్’ చేసి ఈ ఆఫీసర్ తెలివిగలవాడైయ్యాడే...ఈ 'కంపనీ' బాగుపడుతుందంటావా?"

"ఈ 'కంపెనీ' బాగుపడితే మనకేంటి...పడకపోతే మనకేంటిరా? ఇక మనం వేరే 'కంపెనీ' చూసుకోవలసిందే"

"ఎవడ్రా వీడు...? మనల్ని ఎవర్రా పనిలోకి రమ్మని పిలిచేది...? నువ్వేమన్నా బి.టెక్., ఎం.టెక్., చదివాను అనుకుంటున్నావా"

"అదే కదా...+2 పాస్ అవని వాళ్ళే లక్షల్లో ఉన్నారు. కానీ 'సర్వీస్’ అయిన బి.ఈ., ఎం.ఈ. వాళ్ళంతా బంగారంలాగా దొరుకుతున్నారు"

"చదువుకో వలసిన వయసులో చదువుకోకుండా పోయిన మనం....ఎంతో అనుభవంతో తెలివిగా ఉన్నా...బానిసల్లాగా అర్ధం లేకుండా దొరుకుతున్నామే మామా?" వాళ్ళ గొణుగుళ్ళను ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యంత్రాల శబ్ధాలు అనిచివేశాయి.

ఫ్యాక్టరీ లోపల గూడు కట్టుకున్న పావురాలు అక్కడ జరుగుతున్న విషయాలను ఆనందంగా వేడుక చూస్తున్నాయి.

మనిషి జన్మ ఎత్తకుండా స్వతంత్రంగా ఉండే పావురాలుగా పుట్టిన సంతోషం కనబడుతోంది వాటి దగ్గర...

                                                               ఇంకా ఉంది.....Continued in PART-18 *************************************************************************************************

11, ఫిబ్రవరి 2020, మంగళవారం

కరోనా వైరస్ ప్రభావం: ఇంకా ఖాలీగా ఉన్న చైనా నగర రోడ్లు.



                                               కరోనా వైరస్ ప్రభావం: 
                                 ఇంకా ఖాలీగా ఉన్న చైనా నగర రోడ్లు.


కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నదని చెబుతూ చైనాలోని వుహాన్ నగరంలో నివసిస్తున్న ప్రజలను ఇళ్ళల్లోనే ఉండమని హెచ్చరించారు. ఆ హెచ్చరికను ఇప్పుడు మరో నగరానికి కూడా ఇచ్చారని చెబుతున్నారు. ఎప్పుడూ జన సమూహంతో నిండిపోయుండే ఈ నగరం ఇప్పుడు ఇలా ఉండటం దురదృష్టకరం.

















Image Credit: To those who took the original photos

9, ఫిబ్రవరి 2020, ఆదివారం

ఆలయం(సీరియల్)...PART-16




                                                    ఆలయం(సీరియల్)
                                                             (PART-16)


“ప్రియమైన వెంకట్ ప్రసాద్....

శుభాకాంక్షలు! నీ లాంటి విశ్వాశం గల ఉద్యోగులను ఉత్సాహపరచాలని, శభాష్ అని భుజాలను తట్టి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. దాన్ని అమలుపరచటానికే నీకు ఈ ప్రమోషన్. నువ్వు ఇలాగే విశ్వాశంగా పూర్తి శ్రద్దతో, నిజాయితీతో పనిచేసి ఈ కంపనీ మరింత పెద్దది అవటానికి సహాయపడతావని నమ్ముతున్నాను… ఆల్ ద బెస్ట్” అని రాసి సంతకం పెట్టుంది.

ఆ లెటర్ను మళ్ళీ మళ్ళీ చదివి ఉప్పొంగి పొయాడు వెంకట్ ప్రసాద్. నిన్నటి వరకు 'కంపనీ' పై ఉన్న ఆందోళన, బాధ ఆ లెటర్ తో మాయమైంది. మళ్ళీ మళ్ళీ చదివాడు. ఇంతలో అతని స్నేహితులందరూ అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళు కూడా 'ప్రమోషన్ లెటర్’ ను చూసి వెంకట్ ప్రసాద్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారు.

ఒకడు మాత్రం తెలివిగా ఒక ప్రశ్న అడిగాడు.

“ప్రసాద్....ఈ 'ఆర్డర్ని’ నీకు ఇచ్చింది ఎవరు? మన జెనెరల్ మేనేజరా? పర్సనల్ మేనేజరా?”

"మన ‘పర్సనల్ మేనేజర్’ మూడు నెలల సెలవు మీద అమెరికా వెళ్ళారు కదా? ఇప్పుడు 'పర్సనల్’ , 'జెనెరల్ మేనేజర్’ అన్నీ మన కొత్త 'పి.ఆర్.ఓ.' విఠల్ రావ్ గారే...." ఇంకొకడు చెప్పాడు.

"ఆ మనిషి నిన్న నిన్ను పిలిచి ఇష్టం వచ్చినట్లు వాగాడని విన్నామే? ఈ రోజు ఏమిటి హఠాత్తుగా 'ప్రమోషన్’ ?" అనుమానం వెలిబుచ్చాడు మొదటతను

"అరే ఎవడ్రా వీడు... 'ప్రమోషన్’ ఇచ్చింది మన 'చైర్మన్’. అన్నాడు ఇంకొకడు

మన 'చైర్మన్’ నిన్ను బాగానే ఉత్సాహపరిచారు ప్రసాద్. మేమందరం కూడా సంతోష పడుతున్నాము. ఈ 'కంపనీ'లో కష్టపడి పనిచేయటంలో అర్ధం లేదు అనుకుంటున్నాము. కానీ, నీకు దొరికిన 'ప్రమోషన్’ మమ్మల్ని కొంచం ఆలొచింప చేస్తోంది"

స్నేహితులందరూ కలిసి వెంకట్ ప్రసాద్ ని అభినందించారు.

"'మేనేజర్’ అయిపోయావు...పార్టీ ఏమీ లేదా?" అని ఒకతను అడిగాడు.

“మన వెంకట్ ప్రసాద్ 'పార్టీ' ఇస్తే బాటిల్ తెరవలేము. అది కచ్చితమైన వెజిటేరియన్ 'పార్టీ' గానే ఉంటుంది"

"పార్టీ సంగతి తరువాత! ప్రసాద్ ...శుభముహూర్త టైములో వెళ్ళి 'సీటు’ లో కూర్చో. మేము కూడా కళ్ళార చూసి ఆనందిస్తాం”

“ఖాలీగా ఉన్న సీటులో ఎవర్ని వేస్తారో నని ఎదురు చూస్తూ ఉన్నాము. నిజం చెబుతున్నా...మనలో ఒకర్ని 'ప్రమోట్' చెయ్యరని తెలుసు. మనలో 'యూనివర్సిటీ ఫస్ట్’ వచ్చిన వాళ్ళున్నా, మనమంతా కార్మికవర్గం కదా? మనకి పనిచేసే ప్రతిభ లేదు, చేయించుకునే ప్రతిభ లేదు. చెప్పిచ్చినా రాదు. అనేదే మన మేనేజ్ మెంట్ ఉద్దేశం. కాబట్టి, సోడా బాటిల్ కళ్ళద్దాలు వేసుకున్న ఎవడో ఒకడు రాబోతాడని అనుకుంటే...'కంపనీ' ఈసారి మనకి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు"

ఇలా అందరూ మాట్లాడుతుంటే, వెంకట్ ప్రసాద్ వెళ్ళి ఖాలీగా ఉన్న మేనేజర్ కుర్చీలో కూర్చున్నాడు.

"న్యాయంగా చూస్తే మన జి.ఎం., పి.ఆర్.ఓ. ఇద్దరూ వచ్చి నిన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టాలి. కానీ, మన ‘చైర్మాన్’ వెంకట్ ప్రసాద్ కి ప్రమోషన్ ఇవ్వటం వాళ్ళకు ఇప్పుడు మెరపకాయ తిన్నట్టు ఉంటుంది. అందుకే 'ఆర్డర్’ ను ఇక్కడ పెట్టి వెళ్ళారు"

వెంకట్ ప్రసాద్ కూర్చున్న వెంటనే ఒక కార్మీకుడు చెప్పి బాధ పడ్డాడు.

తరువాత అందరూ వరుసగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. కొందరు నిట్టూర్పు విడిచారు.

"మనమందరం ఈ 'కంపనీ' లో అభివృద్ధి చెందలేము అనే అపనమ్మకంతో సరిగ్గా పనిచేయకుండా, చేస్తున్నట్టు నటించడం తప్పని ఇప్పుడు అనిపిస్తోందిరా"--అని గట్టిగానే గొణిగాడు ఒకడు.

కానీ, ఇదంతా 'పి.ఆర్.ఓ.' విఠల్ రావ్ ఆడుతున్న నాటకంలో ముఖ్యమైన భాగం అనేది ప్రసాద్ కు, కార్మీకులకు తెలిసే అవకాశమే లేదు.

ఖచ్చితంగా అదే సమయంలో ఆ 'డిపార్ట్ మెంటు’ వైపు కొత్త 'పి.ఆర్.ఓ.' విఠల్ రావ్, 'అకౌంట్స్ మేనేజర్’ తో కలిసి నడిచి వస్తున్నారు. వాళ్ళ తలలు కనిపించగానే...వేటగాడిని చూసిన కాకుల గుంపులాగా అందరూ చెదిరి వెళ్ళి పోయారు.

వెంకట్ ప్రసాద్ మాత్రం 'మేనేజర్ సీటు’లో....

అతనికి కూడా ఏం చాయాలి...ఎలా చెప్పాలి అనే విషయంలో గందరగోళంగా ఉన్నది. ఆలొచిస్తూ తల పైకెత్తినప్పుడు చిటపటలాడే మొహంతో పి.ఆర్.ఓ., 'అకౌంట్స్ మేనేజర్’ అతని ముందు నిలబడున్నారు. ప్రసాద్ వాళ్ళను చూసి 'గుడ్ మార్నింగ్' అన్నాడు.

"ఉండనీ...ఇక్కడ ఈ సీటులో కూర్చుని ఏం చేస్తున్నావు?" అడిగాడు 'పి.ఆర్.ఓ.' విఠల్ రావ్,

"సార్..."

"ఏమిటయ్యా సారు, గీరూ...'ఇది మేనేజర్ సీటు’! నువ్వు సాధారణ కార్మీకుడివి. ఈ సీటు లో నువ్వెలా కూర్చున్నావు?"

"సార్...ఇదిగో చూడండి...’ప్రమోషన్ ఆర్డర్’ మరియూ చైర్మాన్ గారి లెటర్..."

ప్రసాద్ వెంటనే 'ఆర్డర్’ ను చూపించాడు...ఇద్దరూ దాన్ని తీసుకుని చూశారు. లెటర్ను ఒక చూపు, వెంకట్ ప్రసాద్ ను ఒక చూపు చూసి మొదట వెకిలిగా నవ్వి, ఆ తరువాత పగలబడి నవ్వటం మొదలుపెట్టారు. మేనేజర్లను చూసి ప్రసాద్ ని విష్ చెయటానికి వచ్చుంటారని అక్కడక్కడ దాక్కున్న ప్రసాద్ సహ ఉద్యోగులు మేనెజర్ల నవ్వును ఆశ్చర్యంతోనూ, ఆందోళనతోనూ గమనించడం మొదలుపెట్టారు.

"ఏమిటయ్యా... ఇలా 'టేబుల్’ మీద పేరు లేకుండా ఒక కవరు ఉంటే అది 'కంపనీ ఆర్డరా'? ఇది నకిలీ--మొసపుచ్చే 'ఆర్డర్’ అనేది నీకు అర్ధంకాలేదా?"---'పి.ఆర్.ఓ.' మొదటి బాంబు పేల్చాడు.

                                                                           ఇంకా ఉంది.....Continued in PART-17 *****************************************************************************************************

7, ఫిబ్రవరి 2020, శుక్రవారం

ఆలయం(సీరియల్)...PART-15




                                                    ఆలయం(సీరియల్)
                                                            (PART-15)


“ఒకరికి ఎలాంటి గుణాలుంటే ఎలా నడుచుకుంటారో అనే మీ వివరణ ఒక పక్క ఉండనివ్వండి. ఈ మనిషి వలన నాన్నగారు విపరీతమైన మనో వేధనకు గురి అవుతున్నారు. ఆయన ఈ సమస్య లో నుండి బయట పడటానికి దారి చూపండి"---వెంకట్ ప్రసాద్ కొడుకు శంకరయ్య అడ్వకేట్ గోపీనాధ్ ను అడిగాడు.

"ఇదంతా తలరాత శంకరయ్యా! తల్లి, తండ్రి, గురువు...వీళ్ళ తరువాత యజమాని. ఆయన మంచివారు అయ్యుండటం వీళ్ళ అదృష్టం. వీళ్ళు ఆ యజమాని ప్రతినిధులు. దగ్గర దగ్గర వీళ్ళు కూడా యజమానుల లాగానే. వీళ్ళను అనుసరించి వెళ్ళాల్సిందే. వేరే దారి లేదు"

"ఏమిటి మామయ్యా...ఒక వకీలు అయ్యుండి ఇలా సమాధానం చెబుతున్నారు?" అన్నాడు ప్రసాద్.

“చట్ట ప్రకారం వీళ్ళను ఏమీ చెయ్యలేము ప్రసాద్. ఎందుకంటే ఆధారం పెట్టుకుని వీళ్ళెవరూ తప్పు చెయ్యరు. వీళ్ళ గుణగణాలను వివరించి కోర్టులో దండన ఇప్పించలేము. కానీ, వీళ్ళు మనసు పెడితే ఎవరినైనా దండిస్తారు. ఎందుకంటే...వీళ్ళ చేతిలో అధికారం ఉంది"

"తప్పు చెయ్యకుండా ఎలా దండన ఇవ్వగలరు?" ప్రసాద్ కొడుకు శంకరయ్య అడిగాడు.

"నువ్వు చిన్న పిల్లాడివి...నీకు అనుభవం చాలాదు. వీళ్ళు మనచేత తప్పు చేయించి దండన ఇప్పించగలరు"

"ఇదే ఆయుధాన్ని వాళ్ళ మీద మనం వేస్తే..."

"ఎలా...ఎలా?"

"అధికారులను తప్పు చేయనిచ్చి మనం దండన ఇప్పించలేమా?"

"ఎందుకు వేరుగా తప్పు చేయనివ్వటం! ఇప్పుడూ తప్పే చేస్తున్నారు కదా . కానీ, ఏమీ చేయలేకపోతున్నామే..."

"అరె...అవును కదా!"

"అందుకే కదా మొదటే చెప్పాను...నీకు అనుభవం చాలదని!"

"అయితే దీనికి ముగింపు..."

“మంచి మనుష్యులు అధికారులుగా రావాలి. మానవత్వంతో నడుచుకవాలి. ఇంతకంటే వేరే దారే లేదు"

అడ్వకేట్ మామయ్య సమాధానం వెంకట్ ప్రసాద్ కి కోపం తెప్పించింది.

"తప్పుగా చెబుతున్నారు మామయ్యా! మా ఆఫీసులో మంచి అధికారులు ఎంతోమంది ఉన్నారు. ఒకళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి అధికారులు అందరూ తప్పైన వాళ్ళని చెప్పద్దు"

"చూసావా శంకరయ్యా.....మీ నాన్నకు ఎంత కోపం వస్తోందో. మీ నాన్న విచిత్రమైన వ్యక్తి. మామూలుగా ఏ కంపనీలోనైనా రెండు రకాల మనుష్యులు ఉంటారు. ఒకళ్ళు అధికార యంత్రాగాన్ని ధైర్యంగా ఎదిరించేవారు. ఇంకొకళ్ళు అధికార యంత్రాగాన్ని మోసం చేస్తూ వారిని ఆదరిస్తునట్లు నటిస్తూ ఎదిరించేవారు. కానీ మీ నాన్న అధికార యంత్రాగాన్ని ఆదరించే మూడో కోవకు చెందిన వాడు. అందుకే ఇలా కోపగించుకుంటున్నాడు"

"కరెక్టుగా చెప్పారు...! కానీ, నాన్న చూపించే విశ్వాసం మీద మర్యాదే లేదే! యజమాని మీద విశ్వాసంగా ఉండటాన్ని సహ ఉద్యోగులే తప్పుగా మాట్లాడుతున్నారు...అధికారులు కూడా తప్పుగానే చూస్తున్నారు"

"అలాగే చూస్తారు! ఇరవై సంవత్సరాల వరకు మూర్ఖుడు గా ఉన్నా పరవాలేదు...దాన్నే విశ్వాసంగా తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు కాలం మారిపోయింది. ఇది 'హైటెక్' యుగం. విశ్వాసం కంటే తెలివితేటలకే మొదటి స్థానం"

"కొంచం అర్ధం అయ్యేటట్టు చెప్పండి..."

"అర్ధం అయ్యే లాగానా? సరే చెప్తా విను...ప్రతిభ గల ఉద్యోగిగా ఉండు. నిజాయతీ ఉద్యోగిగా ఉండు. అదే సమయం లోకజ్ఞానం తో తెలివిగలవాడివిగా ఉండు. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకటం...ఆ ఉద్యోగంలో లో చేరి కష్టపడటం పెద్ద విషయం కాదు. అందులో నిజాయతీ నిప్పు ఉండాలి. తప్పుగా ఎవరన్నా నడుచుకోవటానికి ప్రయత్నిస్తే...వాళ్ళను కాల్చే శక్తిగా మనం ఉండాలి. 'అధికారం లేదే...చాలా చిన్న పదవిలో ఉన్నామే' నన్న ఆత్మన్యూనతాభావం సహాయ పడదు. ఒక పరిశ్రమ యజమాని అయినా సరే... అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి అయినా సరే...వేరు వేరుగా వాళ్ళ విధులను చేస్తారు. ఉద్యోగంలోనే బేధాలు కానీ ఇంక దేంట్లోనూ బేధాలు ఉండవు. ఈ స్పష్టత తెలిసుండాల్సింది ముఖ్యం"

----మామయ్య చెబుతూ వెలుతున్నారు. వెంకట్ ప్రసాద్ కి అందులో చాలా విషయాలు అర్ధం కాలేదు. కానీ, ప్రసాద్ కొడుకు శంకరయ్య కి అర్ధమయ్యింది.

"ఇక నేను చూసుకుంటాను. నాన్న గారి విశ్వాసానికీ, నిజాయితీకీ ఆయనకు న్యాయంగా దక్కాల్సిన గౌరవ మర్యాదలు ఆయనకు దక్కేటట్టు చేస్తాను. ఇది నిశ్చయం" అన్నాడు శంకరయ్య.

కానీ, దాన్ని ఎలా సాధించబోతాడో అనేది మాత్రం పెద్ద క్వస్చన్ మార్కే!

ఆ మరుసటి రోజు వెంకట్ ప్రసాద్ ఆఫీసుకు వెళ్ళినప్పుడు అతనికి అక్కడొక ఆశ్చర్యం కాచుకోనుంది. ‘డిపార్ట్ మెంటు’లోకి వెళ్ళిన వెంటనే అతని టేబుల్ పైన 'ప్రమోషన్ ఆర్డర్’. అందులో 'ఆ రోజు నుండి అతనే మేనేజర్’ అనే 'ఆర్డర్’ ఉంది. జీతంలో సుమారు పన్నెండు వేలు ఎక్కువ రాసుంది.

మొదట్లో వెంకట్ ప్రసాద్ దాన్ని నమ్మలేదు. కానీ, 'కంపనీ' లెటర్ హెడ్ లో టైపు చేయబడ్డ లెటర్ లోని లైన్లు అతన్ని ఆశ్చర్యపరిచింది. అ లెటర్ తో పాటూ మరో లెటర్. అతను దేవుడు గా కొలిచే అతని 'చైర్మాన్’ శంకరయ్య గారు రాసిన లెటర్.

                                                                      ఇంకా ఉంది.....Continued in PART-16 ****************************************************************************************************

5, ఫిబ్రవరి 2020, బుధవారం

ఆలయం(సీరియల్)...PART-14




                                                    ఆలయం(సీరియల్)
                                                             (PART-14)


సాయంత్రం! ఆఫీసు టైము ముగిసిన తరువాత వెంకట్ ప్రసాద్ ఇంటికి బయలుదేరాడు. అప్పుడు దూరంగా నిలబడి వెంకట్ ప్రసాద్ నే గమనిస్తున్న ఆ మనిషి తిన్నగా 'పి.ఆర్.ఓ.' విఠల్ రావ్ గదికి వెళ్ళి నిలబడ్డాడు.

"సార్..."

"ఏమిటయ్యా..."

"నోరు తెరవలేదు సార్. మీరన్న మాటలను అలాగా నొక్కేసి జీర్ణించుకున్నాడు"

"నిజంగానా?"

"అవును! రాజేష్ కుమార్ మాత్రం ఏదో ఒకటి అడిగి చూసాడు. కానీ, పట్టు ఇవ్వలేదు. మామూలు కంటే ఎక్కువ శ్రద్దతో పనిచేసి మంచి 'అవుట్ పుట్' కూడా ఇచ్చాడు"

"ఏమిటయ్యా...పెద్ద కొండను మింగిన 'పరమేశ్వరుడి' లా ఉంటాడు లాగుందే?"

"అవును సార్....అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేయటం కష్టం సార్"

"ఇదే విషయాన్ని ఎన్ని సార్లు చెబుతావు? ఇతన్ని తరిమేసి ఆ చోటుకు నీ తమ్ముడ్ని తీసుకువచ్చి చూపిస్తాను చూడు"

"ఏమిటో సార్...మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. ఈ ఉద్యోగం దొరకకపోతే నా బందువులకు సమాధానం చెప్పలేను. దొరికితే మీకే చాలా మంచిది! కారణం, అతని తండ్రి...వైన్ షాపులోనే పనిచేస్తున్నాడు. రోజూ ఒక మంచి మందు సీసా కచ్చితంగా దొరుకుతుంది"

"సరే...నువ్వు బయలుదేరు! ప్రసాద్ కు తరువాతి రౌండ్ ఎలా పెట్టాలో ఆలొచిస్తాను"

“వాడి కధను చాలా సింపుల్ గా ముగించ వచ్చు సార్. కానీ, ఉద్యోగం పోవటంతో పాటూ జైలు ఊచలు లెక్కపెటాల్సి వచ్చినా వస్తుంది"

"అతను ఊచలు లెక్కపెడితే ఏమిటి....పుల్లలు లెక్కపెడితే మనకేమిటి. దాని గురించి మనం ఎందుకు ఆలొచించాలి? ఏం చేయాలో మాత్రం చెప్పు"

ఆ కూజా పార్టీ, విఠల్ రావ్ చెవిలో ఏదో చెప్పాడు. ఆయన కళ్ళు జిగేలు మని మెరిసాయి.

ఇంటికి తిరిగి వచ్చిన వెంకట్ ప్రసాద్ కు కాఫీ ఇస్తూ అతని మొహం వైపు చూసింది మాలతీ. అతని మొహం వాడిపోయుండటం గమనించి ఆఫీసులో ఏదో వ్యవహారం జరిగింది అనేది ఊహించగలిగింది. వెంకట్ ప్రసాద్ కూడా ఏదీ మరిచిపోలేదు. జరిగిందంతా భార్యకు వినిపించాడు. "నీకోసమే పళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నాను మాలతీ. నిజానికి నా రక్తం ఎంత ఉడికిపోయిందో తెలుసా?"--అన్నాడు వెంకట్ ప్రసాద్.

వెంకట్ ప్రసాద్ మాట్లాడింది అతని కొడుకు కూడా విన్నాడు.

ఇంట్లో 'నిక్కరు,'టీ షర్ట్' అని వేసుకుని 'హోమ్లీ'గా ఉన్న అతను, తండ్రి దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.

"నాన్నా...ఒక ఆఫీసులో ఇలా కూడా జరుగుతుందా?" అని సన్నని గొంతుతో అడిగాడు.

"జరిగింది కదరా...అదే కదా నువ్వు వింటున్నది!"

"ఇలా ఉంటే ప్రశాంతంగా పనిచేయటం కష్టం కదా?"

“ప్రశాంతంగా పనిచేయకూడదు...ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలనే కదా ఇలా జరుగుతోంది"

“ఉద్యోగం మానేస్తే ఎవరు నాన్నా పని చేసేది...ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? మీ యజమాని ఎలా లాభం సంపాదిస్తారు?"

"ప్రొడక్షన్ జరుగుతుంది...ఒకడు లేకపోతే ఇంకొకడు. ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళ సంఖ్య కోట్లలో ఉన్నదే!"

వెంకట్ ప్రసాద్ కొడుకుకు వివరిస్తున్నప్పుడు అడ్వకేట్ మామయ్య అనే గోపీనాధ్, ఇంట్లోకి వస్తున్నాడు. అతనొక లీడింగ్ అడ్వకేట్. చట్టంలోని లొట్టు లోసుగులు బాగా తెలిసినాయన. సమాజ సేవ చేయాలనుకునే గొప్ప వ్యక్తి.

ఆయన్ని చూడగానే వెంకట్ ప్రసాద్ కు కొంత ఉత్సాహం వచ్చింది.

"రండి మామయ్యా" అంటూ ఆయన్ని ఉత్సాహంగా ఆహ్వానించాడు. వెంకట్ ప్రసాద్ మామయ్య కూడా వెంకట్ ప్రసాద్ మొహాన్ని చూసి సమస్యను ఊహించాశాడు.

“ఏమిటి ప్రసాద్...ఎలా ఉన్నది మీ 'కంపనీ’?"

"ఏమిటి మామయ్యా...వచ్చీ రాగానే దాని గురించి అడుగుతున్నారు?"

"మీ ఆఫీసులో కొత్తగా ఒకతను 'పి.ఆర్. ఓ.' గా చేరినట్టు విన్నానే?"

"అవును మామయ్యా! ఆ వ్యక్తి వలనే ఇప్పుడు మనశ్శాంతి లేకుండా పోయింది"

"అతనొక మనొవ్యాధి గలవాడురా. మనసులో తానొక రాజు, మంత్రి అనుకుంటున్నాడు. ఇంతకు ముందు అతను పని చేసిన కంపెనీలో అతన్ని మెడ పట్టుకుని గెంటేశారు"

"అలాంటి మనిషిని మా కంపెనీ ఎలా ఉద్యోగంలోకి తీసుకుంది?"

"ఆ విషయాన్ని నువ్వే మీ పై అధికారులను అడిగి తెలుసుకోవాలి"

"నేనడిగితే నా పై అధికారులు సమాధానం చెబుతారా...ఏమిటి మామయ్యా నువ్వు?"

"అదీ కరెక్టే! క్లుప్తంగా చెప్తా...ఎవరికైతే టైము బాగుండలేదో...అక్కడ వీడుంటాడు. నోరు తెరిస్తే అబద్దం. ఈ దేశంలో ఎవరూ హరిశ్చంద్రులు కాదు. కానీ, ఈ మనిషి కారణమే లేకుండా అబద్దం చెప్పే వ్యక్తి. ఇప్పుడు నువ్వెళ్ళి చూశావనుకో, నీ ఎదురు కుండా ఎవరితోనో 'ఫోన్లో' మాట్లాడి, ఎం.ఎల్.ఏ తో మాట్లాడాను. ఎం.పి తో మాట్లాడాను అని చెబుతాడు.

మనసులో విపరీత భయము, దానితోపాటూ ఈర్ష్య, అసూయ, ద్వేషం, స్వార్ధం లాంటి గుణాలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో...వాళ్ళంతా ఇతనిలాగానే నడుచుకుంటారు"

                                                                      ఇంకా ఉంది.....Continued in PART-15 ****************************************************************************************************

3, ఫిబ్రవరి 2020, సోమవారం

ఆలయం(సీరియల్)...PART-13




                                                  ఆలయం(సీరియల్)
                                                             (PART-13)


ప్రసాదు కంపనీ గేటులోపలో నుండి ఫ్యాక్టరీలోకి ప్రవేశిస్తున్నప్పుడే విధి తన ఆట మొదలు పెట్టింది.

'సెక్యూరిటీ' పరిగెత్తుకుంటూ వచ్చి ప్రసాదును  అడ్డుకున్నాడు. “'పి.ఆర్.ఓ' విఠల్ రావు గారు మిమ్మల్ని చూడాలట, ఆయన్ని ఆయన డిపార్టుమేంటులో కలిసి చూసి వెళ్ళమన్నారు” చెప్పాడు సెక్యూరిటీ.

'సరే' నని తల ఊపుతూ 'బైకు’ ను 'స్టాండు’ లో పెట్టి, 'పి.ఆర్.ఓ.' సెక్చన్ కు వెళ్ళాడు ప్రసాదు. అప్పుడు విఠల్ రావు రూములో నుండి మధ్యం వాసన తొంగి చూసింది.

'భగవంతుడా'...అని గొణుక్కుంది ప్రసాద్ పెదవులు.

అయినా తప్పదని గది తలుపు తట్టాడు.

"లోపలకు రండి..." ఆహ్వానం వచ్చిన వెంటనే లోపలకు వెళ్ళాడు.

విఠల్ రావ్ ప్రసాద్ ని క్రిందా పైకీ చూసాడు. తన ఎదురుకుండా ఉన్న కుర్చీలో ప్రసాద్ ని కూర్చోమని చెప్పాలని కూడా ఆయనకు అనిపించలేదు. కంపనీ నిర్వాహ అధికారంలో ఉన్న అధికారులు, మిగిలిన అధికారులను తప్ప మిగిలిన వారిని ఎవర్నీ కూర్చోబెట్టి మాట్లాడ కూడదు అని అనేది అక్కడ రాయబడని రూలు. కుర్చీలో కూర్చోబెడితే సరిసమంగా చూసినట్లు అవుతుంది. అదే వాళ్ళకు పొగరు తెప్పిస్తుందని అని ఎవరో...ఎప్పుడో చెప్పిన దానిని గట్టిగా పట్టుకున్నారు. ప్రసాద్ కొంచం సేపు నిలబడి చూసి తానుగా కుర్చీలో కూర్చున్నాడు. అది విఠల్ రావ్ కి కోపం తెప్పించింది.

"నువ్వేనా వెంకట్ ప్రసాద్?"

"అవును సార్... కానీ మీరు కొంచం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. నేనూ ఈ ఆఫీసులో ఒక సీనియర్ ఉద్యోగిని...మీకంటే వయసులో పెద్ద వాడిని"

"భయంకరమైన రోషగాడివిగా ఉన్నావే?"

"ఇప్పుడెందుకు ఈ ప్రశ్నలు...నన్ను ఎందుకు పిలిచారు? విషయానికి రండి. నేను 'డిపార్ట్ మెంటు’ కు ఒక్కరోజు కూడా ఆలస్యంగా వెళ్ళింది లేదు"

"టైముకు వెడుతున్నావని గొప్ప ప్రతిభావంతుడవని అనుకోవద్దు"

"ఏమిటి సార్ చెబుతున్నారు?"

"వూరికే సినిమా చూపించవద్దని చెబుతున్నా"

“మీరు అడిగినందుకు నేను చెప్పాను...నేనుగా ఏమీ చెప్పలేదే...?"

"నీ గురించి నేను విన్నదంతా నిజమనే అనిపిస్తోంది..."

"ఏం విన్నారు?"

"దాన్ని వివరంగా చెప్పటం నాకు ఇష్టం లేదు. ఒకటి మాత్రం బాగా తెలుసుకో. పనికి వచ్చామా...పని చూసామా...ఇంటికి వెళ్ళామా అని ఉండాలి. ఎవరు, ఎక్కడ, ఏం చేస్తున్నారని గమనించటం, వాళ్ళ గురించి పై అధికారులకు పుకారు చేయడం లాంటివి చేయకూడదు. నీ కొడుక్కు 'చైర్మాన్’ పేరు పెట్టినందువలన ఆయనకు నువ్వు దగ్గర వాడివని మేమెవరం అనుకోవటం లేదు. నేను చాలా 'కంపనీ' లను చూసి ఇక్కడకు వచ్చాను. కూర్చున్న చోటులో నుంచే లోపల ఏం జరుగుతుందో తెలుసుకో గలడు ఈ 'పి.ఆర్.ఓ' జ్ఞాపకం ఉంచుకో...నువెళ్ళచ్చు"

విఠల్ రావ్ తాలింపు వేసిన తరువాత, వెంకట్ ప్రసాద్ కళ్ళు చెమర్చినై.

"నాకేమిటి?" అని అనుకుంటూ వీధిలో వెడుతున్న ఒక గుడ్డివాడ్ని పిలిచి, 'నా భార్య స్నానం చేస్తుంటే తొంగి చూసావుటుగా?' అని అడిగితే అది ఎంత అన్యాయమో అంత అన్యాయంగా అనిపించింది ప్రసాద్ కు.

కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ బయలుదేరిన ప్రసాద్, తన 'డిపార్ట్ మెంటు’ లోకి వెళ్ళినప్పుడు పని మొదలుపెట్టాల్సిన సమయం మొదలైపోయింది. కానీ, ఎవరూ పెద్దగా పని చేయటం మొదలుపెట్టలేదు. కబుర్లు చెప్పుకుంటున్నారు. సెలెబ్రిటీ నటుల సినిమాలు ఉగాదికి రిలీజ్ అవుతాయా...అవవా? అనే దేశ సమస్య గురించే వాళ్ళ బాధ.

వాడిపోయిన మొహంతో 'కంప్యూటర్’ ముందు కూర్చున్న ప్రసాద్ కు స్క్రీన్ కనబడలేదు. అంత ఎక్కువగా వెలువడిన కన్నీరు అతని కంటి చూపుకు మసక వేసింది.

"ప్రసాద్..." అంటూ పిలుస్తూ వచ్చాడు రాజేష్ కుమార్.

ప్రసాద్ తల ఎత్తలేదు.

"ఏమిటయ్యా...కళ్ళు చెమర్చున్నాయి?"

"ఏమీ లేదు రాజేష్"

"అబద్దం చెప్పకు! 'పి.ఆర్.ఓ.' గదిలో నుండి నువ్వు రావటం నేను చూసాను. ఆ మందు బండి ప్రొద్దున్నే తాగిన మత్తులో ఉన్నాడు. ఏదైనా అన్నాడా?"

"అనలేదు...మాటలతో నన్ను నిలబెట్టి తగలబెట్టాడు"

"నిన్నెందుకు ఆ మనిషి మాటలతో తగలబెట్టటం..."

"తెలియదు...! కానీ దాన్ని నేను జీర్ణించుకోలేక పోతున్నాను రాజేష్"

"నువ్వు కూడా తిరిగి బాగా అడగలేకపోయావా?"

"ఏమడగను...అతను తాగున్నాడు. చేతిలో అధికారం కూడా ఉంది"

"ఇప్పుడైనా అర్ధమవుతోందా...ఈ కంపెనీలో మన స్థాయి ఏంటో"

ఇదే సాకుగా రాజేష్ కుమార్ ప్రసాదును తనవైపుకు తిప్పుకోవటానికి ప్రయత్నించాడు.

"ప్రసాద్...ఏప్పుడూ కొన్ని కంపెనీలు అధికారుల కంపెనీలుగానే ఉన్నాయి. వాళ్ళు పెట్టిందే చట్టం. వాళ్ళకు ప్రియంగానే ఉండాలి. కాదూ కూడదని నిలబడితే ఆపద మనకే. సరే, ఇక దాని గురించి వదిలేయ్. నువ్వు 'యూనియన్’ లో ఫిర్యాదు ఇస్తావా?”

"వద్దు రాజేష్. వదిలేయ్...ఇంకోసారి ఆ మనిషి నా మనసును గాయపరచనీ. అప్పుడు చూసుకుందాం"

---- ప్రసాద్ తనని తాను సమాధనపరచుకుని తను చేయాల్సిన పని మీద శ్రద్ద పెట్టాడు. మొదట్లో కొంచం కష్టపడ్డాడు. కానీ, పోను పోను సర్ధుకుంది. అతను పెద్దగా బాధ పడకుండా పనిలో శ్రద్ద పెట్టి పనిచేయటాన్ని చాలా దూరం నుండి ఒక మనిషి గమనిస్తూనే ఉన్నాడు.

                                                                         ఇంకా ఉంది.....Continued in PART-14 ***********************************************************************************************

1, ఫిబ్రవరి 2020, శనివారం

ఆలయం(సీరియల్)...PART-12



                                                     ఆలయం(సీరియల్)
                                                               (PART-12)


"పిచ్చి పిచ్చి గా మాట్లాడకు మాలతీ... మా ‘చైర్మన్’ గురించి నీకు ఏం తెలుసు? ఎంత పెద్ద కోటీశ్వరుడో తెలుసా?,దానికీ మించి గొప్ప మానవత్వం ఉన్న మనిషి అనేది నీకు తెలుసా?

ఇప్పుడు కూడా 'కంపనీ' కి వస్తే క్యాంటిన్లో వర్కర్లతో పాటూ తాను కూడా క్యూలో నిలబడి మేము తినేదే ఆయన తింటారు. నేలను క్లీన్ చేసే సాధారణ వర్కర్తో సహజంగా భుజం మీద చెయ్యివేసి మాట్లాడతారు. అన్నిట్లోనూ 'నెంబర్ ఓన్’ గా ఉండాలనేది ఆయన లక్ష్యం. దాని కొసం రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. ఆయన అలా కష్టపడినందు వలనే మొదట్లో మూడు వందల రూపాయలు జీతం తీసుకునే నేను, ఈ రోజు ముప్పైవేలు సంపాదించేందుకు కారణమయ్యింది. ఒకే ఒక కంపనీ గా ఉన్న మా కంపనీ తొమ్మిది కంపనీలుగా ఎదిగింది. అలా ఎదిగి ఉండకపోతే ఇంత జీతం,ఇన్ని వసతులు ఇవ్వలేము అనేది ఆయన అభిప్రాయము. అదే నిజం కూడా....

నేను ఈ కంపనీలో చేరినప్పుడే నా స్నేహితుడు బాలూ ఒక రైసు మిల్లులో ఉద్యోగంలో చేరాడు. ఈ రోజు వాడు పదిహేను వేలు జీతం కూడా తీసుకోవటం లేదు. కానీ, నేను ఈ రోజు చేతుల నిండా సంపాదించటానికి నా యజమాని యొక్క దీర్ఘ దర్శనమే కారణం”

"అన్నీ సరే నండి...ఇంత దూరం ఒక కంపనీని తొమ్మిది కంపనీలుగా పెంచిన ఆయనకు మీ 'కంపెనీ' లో జరుగుతున్నాయని మీరు చెబుతున్న తప్పుల గురించి తెలియదా?"

"అదే ఇప్పుడు నా ప్రశ్న...నా కన్ ఫ్యూజన్..."

"సరే...ఆయనకు తెలియదనే పెట్టుకుందాం. ఆయన్ను చూసి నప్పుడు మీరు చెప్పేయండి"

"అలాగంతా చెప్పలేము మాలతీ. ఒక దేశ రాష్ట్రపతి ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్న సమస్య గురించి ఆలొచిస్తున్నప్పుడు ఒంటరిగా ఒకతను ఆయన దగ్గరకు పోయి 'మా ఇంటి కుళాయిలో నీళ్ళు రావటం లేదు’ అని చెప్పినట్లే ఉంటుంది...నేను గనుక ఈ సమస్య గురించి మాట్లాడితే..."

"మీ సమాధానం నాకు నవ్వు తెప్పిస్తోంది. ఆయన ఉన్న అంతస్తుకు ఇవేమీ పెద్ద సమస్యలు కావని అర్ధమవుతోంది. ఇంకా ఎందుకు మీరు బాధ పడుతున్నారు?"

"మాలతీ...ఒక మంచి సామెత ఏం చెబుతోందో తెలుసా?"

"ఏం చెబుతోంది?"

"చిన్న చిన్న సమస్యల్లో తీవ్రంగా దృష్టి పెడితే, పెద్ద పెద్ద సమస్యలు వాటికవే సర్దుకుపోతాయి అని ఆ సామెత చెబుతోంది"

"చివరగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు...?"

"దీనిని ‘చైర్మాన్’ దగ్గరకు తీసుకు వెళ్ళకూడదు. అదే సమయం ఇక్కడున్న వాళ్ళు భయపడాలి. ‘చైర్మాన్’ దృష్టికి తీసుకువెళ్ళకుండానే దీనిని సరి చేయటానికి ఏమిటి దారి అని ఆలొచిస్తున్నాను"

“సరే నాన్నా...బాగా ఆలొచించండి. ఏదో ఒకటి చెయ్యండి...అలాగే నాకూ ఒక దారి చూడండి"

"చూస్తాను ‘చైర్మాన్'!....కానీ, తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే చోట పనిచేయటం అంత మంచిది కాదు. అందుకని ఎందుకైనా మంచిది నువ్వు వేరే కంపనీలో కూడా ప్రయత్నించు"

"సరే...ఇకనైనా కంపనీ సమస్యలు మూట కట్టి పెట్టేసి భోజనానికి వస్తారా?" పిలిచింది భార్య మాలతి.

అంత వివరంగా మాట్లాడినందువలన వెంకట్ ప్రసాద్ మనసు కూడా తేలిక పడింది. డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. మాలతీ 'హాట్ ప్యాక్' లో నుండి వేడి వేడి చపాతీలు తీసి ప్లేటులో పెట్టింది.

ఆ సమయంలో అది అమ్రుతంలా ఉన్నది!

మరుసటి రోజు ప్రొద్దున'యూనీ ఫారం' వేసుకుని 'నేమ్ బ్యాడ్జ్' పెట్టుకుని ఉద్యోగానికి బయలుదేరిన వెంకట్ ప్రసాద్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన మాలతీ భర్తను అడ్డుకుని ఆయన్ని ఒకసారి పైకీ కిందకీ చూసింది.

"ఏమిటి మాలతీ...?”

"ఏమీ లేదు...అన్నీ సరిగ్గా ఉన్నాయా అని చూశాను"

"నేను ఎప్పుడు సరిగ్గా లేకుండా వెళ్ళనే?"

"మంచి ప్రశ్నే...!కానీ తప్పు చేసేవాళ్ళు ఎక్కువగా ఉండే చోట నిజాయితీగా ఒక్కరున్నా అది తప్పేనండి!"

"అయ్యో...ఇప్పుడే నువ్వు మొదలుపెట్టేశావా?"

"సరే సరే...జాగ్రత్తగా వెళ్ళి రండి. ఎవరో ఏదో చేస్తే మనకెందుకు? మీరు మీ పని చూసుకుని వచ్చేయండి. రాత్రి నేను చెప్పింది జ్ఞాపకం ఉంచుకోండి" మాలతీ మంత్రించి పంపించింది.

ఒక చిన్న నవ్వుతో 'బైకు’ పై కూర్చుని దాన్ని కిక్ స్టార్ట్ చేసాడు. అది వీధిలోకి వేగంగా వెళ్ళింది. అతని మనసులోనూ 'ఎవరు ఎలా పోతే మనకేంటి. మనం మన పనిని నిజాయితీగా చేద్దాం...' అనే మంత్రమే పరిగెత్తింది.

కానీ, ఎప్పుడూ 'విధి' అనేది వినోధమైనదే కదా! అది తన దారిలోకే అందరినీ లాక్కుని వెడుతుంది. వెంకట్ ప్రసాద్ మాత్రం దానికి మినహాయింపా ఏమిటి...?

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-13 ************************************************************************************************