23, ఆగస్టు 2020, ఆదివారం

జీవన పోరాటం…(సీరియల్)...PART-2


                                                                          జీవన పోరాటం...(సీరియల్)                                                                                                                                                                     PART-2 

(ముక్కూ మొహం తెలియని ఒక వ్యక్తికి తాముగా ముందుకు వచ్చి చేసే సహాయానికి ఆకాశాన్నీ, భూమినీ   పరిహారంగా ఇచ్చినా సరిపోదు)

సహాయం అడిగి తన కాళ్ళ దగ్గర పడున్న ఆమె ఎదో పెద్ద ఆపదలో ఉన్నదని అక్కడున్న తెలుగు తెలియని వాళ్ళు కూడా సులభంగా అర్ధం చేసుకున్నారు.

అప్పుడు కొంతమంది హడావిడిగా ఎవరినో వెతుకుతున్నట్టు ఒక్కొక్క కిటికీలో నుండీ రైలు పెట్టెలోకి క్షుణ్ణంగా  చూస్తూ వస్తుండటం చూశారు.

అమ్మాయినే వెతుకుతున్నారని గ్రహించిన పరంధామయ్య వెంటనే పనిలోకి దిగారు. బిడ్డను తీసుకుని ఎదురుగా కూర్చున్న ఆడవాళ్ళ దగ్గర ఇచ్చి బెంగాలీలో ఏదో చెప్పారు. వాళ్ళల్లో ఒకామె బిడ్డని తన చీర కొంగులో చుట్టి మొహం కనబడకుండా గుండెలకు హత్తుకుని ఉంచుకుంది.

అమ్మాయిని కాళ్ళదగ్గర ముడుచుకుని పడుకోబెట్టి తన భుజంపైన వేసుకున్న దుప్పటితో ఆమెను పూర్తిగా కప్పారు.  హడావిడిగా వచ్చిన ముగ్గురూ, పెట్టె మొత్తం వెతికారు. అందులో ఒకడు తెలుగు వాడు. మిగిలిన ఇద్దరూ బెంగాలీ వారు.

వాళ్ళు ఆమె ఉన్న చోటును కనుక్కోలేకపోయారు. పరంధామయ్య మాత్రం అంత  వేగంగా పని చేసుండకపోతే ఆమె ఖచ్చితంగా వాళ్ళకు దొరికిపోయేది.

అలా జరిగుంటే ఆమె గతి ఏమై పోయుంటుందని అనుకుని ఆమెకోసం జాలి పడ్డారు.

సమయంలో రైలు బయలుదేరటంతో, ముగ్గురు మొరటోళ్ళూ పెట్టెలోనే ఉండి, అటూ, ఇటూ చూస్తూ ఆమెకోసం వెతుకుతున్నారు.

"ఖచ్చితంగా పెట్టెలోనే ఉండాలి. అది పెట్టెలోకి ఎక్కటం నేను చూశాను" అని అందులో ఒకడు నమ్మకంగా చెప్పాడు. పెట్టెలోని ప్రతి చోటునీ క్షుణ్ణంగా చూసుకుంటూ వచ్చిన వాళ్ళు, పరంధామయ్య కూర్చున్న చోటు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడున్న అందరికీ ఆందోళన పట్టుకుంది.

తనని తాను ధైర్యపరచుకుని ముగ్గురిలో తెలుగు తెలిసున్న అతన్ని చూసి, "ఏంటయ్యా...ఏమిటి వెతుకుతున్నారు?" అని కొంచం స్వరం పెద్దదిచేసి అడిగారు పరంధామయ్య.

దానికి అతను, "ఏమీ లేదండీ, ఏమీలేదు" అని చెబుతూ మిగితా ఇద్దరితో కలిసి అక్కడ్నుంచి జారుకున్నాడు. అక్కడున్న వారికి అప్పుడు గాని గుండె దఢ తగ్గలేదు.

అరగంట వెతకిన తరువాత వాళ్ళులో కొంచం కొంచం గా నమ్మకం తగ్గింది. తరువాతి స్టేషన్ వచ్చిన తరువాత పెట్టెలో నుండి దిగి మిగితా పెట్టల్లో వెతకటానికి వెళ్ళిపోయారు.

ఎక్కడ వెతికినా ఆమె దొరకలేదనే కడుపు మంట, కచ్చె వాళ్ళ మొహంలో అతుకున్నట్టు బాగా తెలుస్తోంది. వాళ్ళు ముగ్గురూ తీవ్రంగా వివాదించు కుంటున్నారు.

ఇంతలో రైలు స్టేషన్ నుండి బయలుదేరి మెల్ల మెల్లగా వేగం పుంజుకుంది.

పరంధామయ్య కిటికీలో నుండి   ముగ్గురునీ చూస్తూనే ఉన్నారు. అలా ఆ ముగ్గురునీ కనుమరుగయ్యేంత దూరం వరకు చూస్తూనే ఉన్నారు. అప్పటికే రైలు వేగం ఎక్కువ అయ్యింది.  వాళ్ళు  కనుమరుగైన తరువాత వాళ్ళు ఇతర పెట్టెలోనూ ఎక్కలేదని, బండీ వెడుతున్న వేగానికి పెట్టెలోనూ ఎక్కలేరని నమ్మారు.

ఆపద తొలగిపోయిందని అమ్మాయి దగ్గర చెప్పారు. ఆమె తడబడుతూ లేచి కూర్చుని తన బిడ్డను తీసుకుంది. ఆమె లోని భయం పూర్తిగా తగ్గలేదని ఆమె ముఖమూ, వణుకుతున్న చేతులు చూపెడుతున్నాయి.

ఎవరైనా తనని వెతుకుతున్నారా అని అన్వేసిస్తున్నట్టు అప్పుడప్పుడు అటూ ఇటూ చూస్తోంది.

కొంచం కొంచంగా భయం తగ్గుతూ సహజ స్థితికి వచ్చిన తరువాత కూడా నీరసంగా కనబడింది. నిద్ర లేచిన బిడ్డకు ఆకలి కాబోలు...ఏడుపు మొదలెట్టింది.

రైలులో అమ్మకానికి వచ్చిన బిస్కెట్టు, పండ్లు, టీ లాంటివి కొని ఇచ్చాడు. ఆమెకూ ఆకలి. వద్దని చెప్పకుండా తీసుకుని ఇద్దరూ తిన్నారు.

రైలు ఊర్లు దాటి వెడుతుంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రయాణీకులు మధ్య మధ్య దిగేరు. అప్పుడు ఆయన తన ఎదురు సీటులో కూర్చోమన్నప్పుడు...ఆమె సీటులో కూర్చుంది.

కొత్తగా ఎక్కిన ప్రయాణీకులు మిగిలి ఉన్న చోటును నింపటంతో, పెట్టెలో రద్దీ తగ్గలేదు. ఆమె దగ్గర 'టికెట్టు లేదని అమె యొక్క భిక్కు భిక్కు మంటున్న చూపులే చెబుతున్నాయి. టికెట్ చెకింగ్ స్టాఫ్ పెట్టెలోకి ఎక్కి ఆమె దగ్గరకు వచ్చి, ఆమె దగ్గర టికెట్టు లేదని తెలుసుకుని హిందిలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది ఆమెకు అర్ధం కాలేదు. కానీ, పరంధామయ్య కు అర్ధమయ్యింది. వచ్చే స్టేషన్ లో దిగిపోవాలని చెబుతున్నారు.

"ఎక్కడికి వెళ్ళాలి?"-- అడిగాడు పరంధామయ్య.

జగ్గయ్యపేట కు దగ్గరలో ఉన్న వెంకటాద్రి పురం" హీన స్వరంతో సమాధానం వచ్చింది.

పరంధామయ్య ఆమెకోసం విజయవాడ వరకు అపరాధంతో కలిపి టికెట్టుకు డబ్బులిచ్చి రసీదు తీసుకున్నారు.

చిన్నగా తలెత్తి చూసినప్పుడు...ఆమె కళ్ళు ఆయనకు శతకోటి ధన్యవాదాలు చెబుతూ కన్నీరు కారుస్తున్నాయి.

పెట్టెలోని వాళ్ళంతా నిద్రలో ఉన్నారు! కానీ, పరంధామయ్య కు నిద్ర రాలేదు. '  అమ్మాయి ఎవరు? ఆమెను తరుముకుంటూ వచ్చిన వాళ్ళు ఎవరు? ఏందుకు ఆమెను తరుముకుంటూ వచ్చారు? ఈమె మంచిదా...చెడ్డదా?' అంటూ పల రకాల ప్రశ్నలు. ప్రశ్నలన్నిటికీ ఆమె దగ్గర నుండి సమాధానాలు ఎదురు చూసి కాచుకోనున్నారు.

ఆమె కూడా నిద్రపోలేదు! కిటికీలో నుంచి ఆమె చూపులు ఎక్కడో దూరంగా చూస్తున్నాయి. మాట్లాడుతేనే దుఃఖం తగ్గుతుందని అనుకోవటంతో, "నీ పేరేమిటమ్మా?" అని అడిగారు.

"మంగమ్మ" సన్నటి స్వరంతో చెప్పింది.

"నిన్ను తరుముకొచ్చినవారు ఏవరు...ఎందుకు తరుముకుంటూ వచ్చారు?"

" ముగ్గురిలో ఒకతన నా భర్త. మిగిలినవారు అతని స్నేహితులు. చెయ్యకూడని పనిలో నన్ను...నా భర్తే..."

అంతకు పైన మాట్లాడలేక నొరు నొక్కు కుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.

పరంధామయ్య కు అంతా అర్ధమయ్యింది. ఆమె దయనీయ స్థితి తెలుసుకుని కలత  చెందారు. ఆమెను ఇంకేమీ ప్రశ్నలు అడగ కుండా వదిలేశారు. కిటికీ ఊచల మీద తల ఆనించుకుని ఆలొచనలో మునిగిపోయారు. ' దేశంలో ఆడవాళ్ళను ఎనెన్ని రకాలుగా కష్టపెడుతున్నారు?' అని ఆలొచించినప్పుడు మనసు భారం అయ్యింది. ఎప్పుడు నిద్రపోయేరో తెలియలేదు.

ప్రొద్దుటి ఎండ చుర్రుమని ముఖం మీద పడటంతో మేలుకున్నారు. రైలు ఏదో ఒక స్టేషన్ లో ఆగున్నది. హడావిడి పడుతూ క్రిందకు దిగి టిఫినూ, వాటర్ బాటిల్ కొనుక్కుని రైలు పెట్టెలోకి ఎక్కిన వెంటనే...రైలు బయలుదేరింది.

ఆమె దగ్గర ఒక ప్యాకెట్ ఇచ్చారు.

బిడ్డకు కొంచం పెట్టి, తాను తింటున్నప్పుడు ఆమెకు 'తరువాత ఏమిటీ?' అన్న ప్రశ్నతో ఆమెలో భయం చోటు చేసుకుంది.

పరిగెత్తుకునొచ్చి రైలు ఎక్కినప్పుడు పెట్టెలో తనకి ఇలా సహాయం దొరుకుతుందని అలొచించి కూడా చూడలేదు. భర్త అనే మృగం దగ్గర నుండి తప్పించుకుంటే చాలు  అనే ఒకే ఒక ఆలొచనే ఉండేది.

ఇంటి నుండి బయలుదేరి, తెలియని వీధులలో నుండి రైల్వే స్టేషన్ కి వచ్చి - రైలు ఎక్కి - మొరటోళ్ళ దగ్గర నుండి తప్పించుకుని - సగం దూరం వచ్చిన తరువాతే తన సోయలోకి వచ్చింది.

ఇప్పుడే ఆమె పరంధామయ్య గురించి ఆలొచించటం మొదలుపెట్టింది. 'ఎవరీయన?  ఎందుకని ఇన్ని సహాయాలు తానుగా ముందుకు వచ్చి చేస్తున్నారు?  ఈయన మంచివారా లేక నా భర్తలాగా ఇంకొక నయవంచకుడా?' అని పలు రకాలుగా ఆలొచించి కన్ ఫ్యూజ్ అయ్యింది.

కానీ, మరు క్షణమే ఆలొచనను మార్చుకుంది. 'లోకంలో మంచి మగవాళ్ళూ ఉన్నారు. చెడ్డవాడితో కలిసి కాపురం చేసి కష్టాలు పడ్డందువలన ఈయన్ని కూడా మనసు తప్పైన మనిషిగా తూకం వేస్తోంది అని ఆలొచించింది.

అప్పుడు ఆయన అన్నారు, "మనో భారాన్ని ఎవరి దగ్గరైనా చెప్పుకుంటేనే భారం తగ్గుతుంది. నువ్వు నీ జీవితంలో ఏన్నో కష్టాలు అనుభవించి ఉంటావని నిన్ను చూస్తేనే తెలుస్తోంది. అది నా దగ్గర చెప్పాలనుకుంటే చెప్పు...కానీ, నిర్భంధం లేదు" అన్నారు.

ఆమెకు ఇదే మొదటిసారి ఆయన కళ్ళను నేరుగా చూడటం. 'ఇంత మంచి మనిషిని అనవసరంగా తప్పుగా అనుకున్నామే?’ అని బాధ పడ్డది. జరిగిపోయిన తన జీవితం గురించి ఆయన దగ్గర కొంచం కొంచంగా చెప్పి ముగించింది.

                                                                                                                           Continued...PART-3

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి