తొలివలపు….(సీరియల్)
(PART-18)
భార్య మరణం బాపిరాజు గారిని నడిచే శవంలాగా తయారుచేసింది. అంచెలంచెలుగా సమస్యలు. కొలవటం వీలుకాని శోకం అంటూ ఆ ఇల్లే విధి ఆడిన ఆటవలన చిన్నాభిన్నం అయ్యింది. ఇదేమీ చాలదన్నట్లు శకుంతలాదేవి చనిపోయిన పదమూడో రోజు కార్యం ఎప్పుడు పూర్తి అవుతుందా అని కాచుకోనున్నట్లు, బాపిరాజు గారి ఇల్లు వెతుక్కుంటూ ప్రమీల పెట్టెతో వచ్చింది. ఊరి ప్రజలను పిలిచి శోకాలు పెట్టింది. బాపిరాజు గారు ప్రమీలను ఏలుకోవాలని పంచాయతి తీర్పు ఇచ్చింది. ఇష్టంలేకపోయినా ప్రమీల మెడలో తాళి కట్టారు బాపిరాజు గారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి