8, నవంబర్ 2019, శుక్రవారం

భవిష్యత్ లో అనారోగ్యానికి స్టెమ్ సెల్స్ తో చెక్....(ఆసక్తి)




                             భవిష్యత్ లో అనారోగ్యానికి స్టెమ్ సెల్స్ తో చెక్


స్టెమ్ సెల్స్ = మూలకణాలు.

పాడైపోయిన (వ్యాధికి గురైన లేక బాగుచేయలేని) అవయవాలతో బాధపడే వారిని, అవయవ మార్పిడి వలన మాత్రమే బ్రతికించగలమని వైద్యశాస్త్రం ప్రచారం చేస్తున్నప్పటి నుండి అవయవ దానాలు చేసే వారి సంఖ్య కనీసంగా పెరిగిందనేది నిజం. అవయవ దానాలిచ్చిన వారి అవయవాలను అమర్చుకుని చావు నుంచి బయటపడి ఆనందంగా జీవితం కొనసాగిస్తున్న వారు ఎందరో ఉన్నారు.


అలాగే మూలకణాలతో అనారొగ్యానికి చెక్ పెట్టవచ్చునని వైద్యశాస్త్రం తెలియజేయడంతో మూలకణాలను బద్రపరుచుకునే వారి సంఖ్య మరియూ మూలకణాలను దానం చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అవయవ మార్పడికంటే మూలకణాలతో చేసే వైద్యమే ఖచ్చితమైన విజయాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేయడంతో మూలకణాలు బద్రపరిచే బ్యాంకులు కూడా ఎక్కువవుతున్నాయి.

మానవ శరీరం కణాల నిర్మితం. కణాలతో ఏర్పడిన కణజాలం వివిధ శరీర అవయవాలుగా రూపాంతరం చెందుతుంది. అయితే శరీర కణాలన్నీ మూలకణాలు కావు. రెండు నిర్ధిష్ట లక్షణాలున్న జీవకణాలను మాత్రమే మూలకణాలంటారు. వీటికి ఉన్న విశిష్టత ఏమిటంటే శరీరంలోని వేర్వేరు కణాలుగా (చరమ, ఎముక, కండరం తదితరాలు) మారగల సామర్ధ్యం ఈ కణాలకు ఉంటుంది. సమస్యాత్మక కణం అవయవాలుగా, కణజాలాల అభివృద్దికి మూలం ఈ మూల కణాలు. అసాధారణ పరిస్థితుల్లో లేదా ఏదైనా అవయవం లేదా కణజాలం పనిచేయని స్థితి ఏర్పడినప్పుడు మూలకణాలు ఆయా రకాల కణాలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని సంధర్భాల్లో అవయవాన్ని పూర్తిగా తయారుచేస్తాయి.


కాన్పు తరువాత గర్భాశయ ద్రవంలో, బొడ్డుతాడును అంటిపెట్టుకుని ఉండే రక్తంలో బిడ్డ తాలూకా మూలకణాలు ఎక్కువ మొతాదులో ఉంటాయి. బొడ్డుతాడును బిడ్డ నుంచి వేరు చేసిన తరువాత ఆ రక్తాన్ని సేకరిస్తారు. బొడ్డుతాడు రక్తంలో మూలకణాలు (హెమటోపాయనిక్ సెల్స్) చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని రక్త, జన్యు సంబంధ వ్యాధులు చికిత్సకు ఉపయోగించవచ్చు. బొడ్డు తాడును బిడ్డ నుంచి వేరు చేసిన తరువాత ఆ రక్తాన్ని సేకరిస్తారు. ప్రసవం జరిగిన ఆరు గంటల లోపు బొడ్డు తాడును, రక్తాన్ని సేకరిస్తే అందులో 98 శాతం మూలకణాలు లభిస్తాయి.

చాలా సందర్భాల్లో బిడ్డ పుట్టిన వెంటనే రెండో ఆలొచన లేకుండా బొడ్డుతాడును, రక్తాన్ని పారవేస్తారు. ఎంతో అమూల్యమైన మూలకణాలు ఉన్న రక్తాన్ని వృధా చేస్తుంటారు. మూలకణాలపై ఎన్నో పరిశోధనలు జరిగిన తరువాత శరీర భాగాలను ఉత్పత్తి చేసే శక్తి వీటికి ఉందని గుర్తించారు. బొడ్డుతాడును, అందులోని రక్తాన్ని ఎముక మూలుగ (బోన్ మేరో) మాదిరిగానే సేకరించి నిల్వ చేస్తారు. ఇలా మూలకణాలను నిల్వ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో బిడ్డకు రాగల వ్యాధులకు చికిత్స, అవసరమైతే శరీరావయవాలను పరిశోధన శాలల్లో ఉత్పత్తి చేసేలా వీలు కలుగుతుంది.


మూలకనాలతో చికిత్స చేయగల వ్యాధులు.

లుకేమియాతో పాటు కొన్ని ఇతర రకాల క్యాన్సర్లు, గుండెకు సంబంధిత వ్యాధులు, మంటింగ్ టన్ వ్యాధి వంటి మెటబాలిక్ స్టొరేజ్ వ్యాధులు. అవయవ, కణజాల పునర్నిర్మాణం...రీ జనరేటివ్ మెడిసన్ లో కొత్త కణజాలాలను నిర్మించేందుకు మూలకణాలను ఉపయోగిస్తున్నారు. కిలో బరువు ఉన్న శరీర అవయవం రూపొందడానికి ఒక్క మిలియన్ మూలకణాలు అవసరం అవుతాయి. వీటిని పరిశోధనాలయాల్లో తయారుచేస్తారు. చాలా సంధర్భాలలో రోగికి సరిపోయే రక్తకణాలను గుర్తించేలోపు రోగం ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఇలాంటి సంధార్భాలలో మూలకణాలు ద్వారా చికిత్స అనేది చాలా సులభం.

కాలుష్యమయమైన వాతావరణం, క్రమం తప్పిన ఆహారపు అలవాట్లు, అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్న జీవన విధానం అన్నీ కలిపి కొత్తకొత్త రోగాలు, అకాల మరణాలు...వీటన్నింటికీ వైద్య నిపుణులు ప్రత్యామ్నయ వైద్య చికిత్స విధానాలను పరిశోధిస్తున్నారు.


1960లలో ఎర్నస్ట్ ఏ.మక్కల్లో, మరియు జేయమ్స్ ఇ.టిల్ అనబడే కెనడియన్ శాస్రవేత్తలు చేసిన పరిశోధనల మూలంగా మూలకణాల రంగం ఎంతో పురోగమించింది. జపాన్ శాస్త్రవేత్త షినియా యమనాక, బ్రిటన్ శాస్త్రవేత్త జాన్ గురుడాన్ మూలకణాల పరిశోధనలో 2012 సంవత్సరం వైద్య రంగంలో నోబుల్ బహుమతికి ఎంపికయ్యారు. ఎన్నో పరిశోధనలకు ఆస్కారం కల్పిస్తూ భవిష్యత్ అనారోగ్యాలకు చెక్ చెప్పేలా మూలకణాల నిల్వ అనేది కొనసాగుతున్నది. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక్క మూలకణాల బ్యాంకు ప్రజలకు అందుబాటులో ఉంది.

మానవ శరీరావయవాలను తయారుచేయడం సాధ్యం కాదు కాబట్టి ఇతరుల నుండి సేకరించడం, లేదా మూలకణాల నుంచి ఉత్పత్తి చేయడం మాత్రమే ప్రాణాంతక వ్యాధులకు చికిత్సగా గుర్తించారు. మరి శరీరావయవాలను దానం చేయాలన్న ఆలొచన ఎంతో ఉన్నతాశయాలు ఉన్న వారిలోనే కలిగే ఆలొచన...మరి అలాంటి వారు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులు మార్పిడిల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ఇక మిగిలిన ఆలొచన మూలకణాల నుంచి శరీరావయవాలను ఉత్పత్తి చేయడం. అయితే ఇందుకు మూలకణాలు కావలి. నిర్ధిష్ట లక్షణాలున్న జీవకణాలను పరిశోధన శాలలో శరీర అవయవాలుగా మార్చవచ్చు. విదేశాల్లో బహు ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ విధానం ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ అందుబాటులోకి వస్తోంది.


గర్భం దాల్చిన స్త్రీలలో 13-28 వారాలలో పిండం ఎదుగుదల ఏర్పడుతుంది. అప్పుడు గర్భంలోని ఉమ్మునీరులో ఈ మూలకణాలు బలంగా ఉంటాయని ఈ మధ్య తెలుసుకున్నారు. అందువలన 13-28 వారాలలో గర్భంలోని ఉమ్మునీరును కొంచంగా తీసి బద్రపరచుకుంటే ఆ తరువాత అది పుట్టే బిడ్డకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. పుట్టిన బిడ్డకే కాకుండా వారి దగ్గర బంధువులకు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఎదుగుతున్న పిండంలోని మూలకణాలు, అన్ని రకాల ప్రత్యేక పిండ ధాతువులు గాను విభేదన చెందగలవు. ఎదిగిన జీవాలలో, మూలకణాలు మరియు పూర్వ కణాలు, దేహం ధాతువుల్లో దోషాలని చక్క దిద్దడం, నాశనం అయిపోయిన ప్రత్యేక కణాలని తిరిగి భర్తీ చేయడం వంటి పనులు చేస్తుంటాయి. ఇవికాక పునరుజ్జీవితం కాగల అవయవాలలో చచ్చిపోయిన ధాతువు స్థానంలో కొత్త ధాతువు వచ్చే సహజ ప్రక్రియలో కూడా ఈ ఎదిగిన మూలకణాలు పాత్ర వహిస్తాయి.

Images Credit: to those who took the original photos. *****************************************సమాప్తం************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి