6, మార్చి 2020, శుక్రవారం

భూమిపై అన్యగ్రహ రహస్య స్థావరం?....(మిస్టరీ)



                                       భూమిపై అన్యగ్రహ రహస్య స్థావరం?
                                                                (మిస్టరీ)

                          హిమాలయా పర్వతాలలో అన్యగ్రహ రహస్య స్థావరం?

'కొంగ్కా లా' అనేది హిమాలయాలలో దిగువ పర్వతశ్రేణి ప్రాంతం. ఇది లడఖ్‌ లోని వివాదాస్పద భారత-చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంది. చైనీయుల ఆధీనంలో ఉన్న ఈశాన్య భాగాన్ని అక్సాయ్ చిన్ అని, ఇండియాలో ఉన్న సౌత్ వెస్ట్‌ ప్రదేశాన్ని లడఖ్ అని పిలుస్తారు. 1962 లో భారత మరియు చైనా సైన్యాలు పెద్ద యుద్ధం చేసిన ప్రాంతం ఇది.

ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతి తక్కువ ప్రవేశ సౌలభ్యం ఉన్న ప్రాంతాలలో ఒకటి. ఇరుదేశాల ఒప్పందం ప్రకారం రెండు దేశాలూ,సరిహద్దులోని ఈ భాగంలో (కొంగ్కా లా ప్రాంతం)పెట్రోలింగ్ చేయవు. చాలా మంది పర్యాటకుల,బౌద్ధ సన్యాసుల,లడఖ్ స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం, భారత సైన్యం మరియు చైనీస్ మిలటరీ ఆ ప్రాంతం (కొంగ్కా లా ప్రాంతం) చుట్టూ నియంత్రణ రేఖను కలిసి నిర్వహిస్తున్నట్టు చెబుతారు. కానీ ఈ ప్రాంతంలో ఇంకేదో చాలా తీవ్రమైన విషయం జరుగుతోంది.

భారత మరియు చైనా కంట్రోల్లో ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న స్థానికుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాంతంలోని భూమి క్రింద నుండి క్రమం తప్పకుండా యు.ఎఫ్.ఓ (గుర్తు తెలియని ఎగిరే పళ్లాలు) లు రోజూ బయటకు వస్తాయి. ఈ ప్రాంతంలో యు.ఎఫ్.ఓ ల భూగర్భ స్థావరాలు ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు. ఈ విషయం భారత మరియు చైనా ప్రభుత్వానికి బాగా తెలుసు.

హిమాలయా పర్వతాలపై ఎగురుతున్న యు.ఎఫ్.ఓ క్లోస్ ఆప్ ఫోటో

ఇటీవల, కొంతమంది హిందూ యాత్రికులు వెస్ట్రన్ పాస్ నుండి కైలాష్ పర్వతానికి వెళుతుండగా, ఆకాశంలో వింత లైట్లు కనిపించాయి. చైనా స్థానిక గైడ్‌లు ఇది కొత్తేమీ కాదని, కొంగ్కా పాస్ ప్రాంతం నుండి ఎప్పుడూ జరిగే సాధారణ విషయం. – అని చెబుతారట.

ఈ వింత వెలుగు, త్రిభుజాకార పళ్ళెం ఆకారంలో భూగర్భం నుండి నిలువుగా, వేగంగా పైకి కదులుతాయి. సాహసోపేత యాత్రికులు కొందరు ఆ ప్రాంతమ్ను పరిశీలించాలనుకున్నారు. చైనా వైపు నుండి వారికిప్రవేశం నిరాకరించడంతో వారు భారత దేశ సరిహద్దు వైపు నుండి వెళ్లటానికి ప్రయత్నించారు. కానీ, భారతదేశ సరిహద్దు సైనికదళం కూడా వాళ్ళకు అనుమతి ఇవ్వలేదు.

'కొంగ్కా లా' పర్వతశ్రేణి ప్రాంతం ఒక పెద్ద రంద్రంలో నుండి బయటకు వస్తున్న యు.ఎఫ్.ఓ.

సరిహద్దు యొక్క రెండు వైపులా ఉన్న స్థానికులు ఈ ప్రాంతంలో భూగర్భ UFO స్థావరం ఉందని నమ్ముతారు. స్థానిక గైడ్‌లు ఇది కొత్త విషయం కాదని, కొంగ్కా లా పాస్‌లో ఇది చాలా సాధారణ దృశ్యం అని చెబుతారు.

ఈ సిద్ధాంతానికి విశ్వసనీయత ఇచ్చేటట్టు, జూన్ 2006 లో, గూగుల్ ఎర్త్‌లోని ఉపగ్రహ చిత్రాలు సరిహద్దు యొక్క చైనా వైపున ఉన్న ప్రశ్నార్థకం అయిన ప్రాంతం యొక్క 1: 500 స్కేల్ వివరణాత్మక భూభాగ నమూనాను వెల్లడించాయి.

గూగుల్ ఎర్త్ ఫోటో...హిమాలయా పర్వతాలపై అన్యగ్రహ రహస్య స్థావరం అని చెబుతున్న ప్రాంతం.

ఈ నమూనా చుట్టూ సైనిక సౌకర్యాన్ని పోలిన భవనాలు ఉన్నాయి.

అక్సాయ్ చిన్ అనే ఈ ప్రదేశం, యురేషియా మరియు భారతీయ ప్లేట్లు కలిసే సరిహద్దు. ఇక్కడ ఒక ప్లేట్ మరొకదాని క్రింద మునిగిపోతుంది. అందువల్ల ప్రపంచంలోని అత్యంత లోతైన భూ ఉపరితలం కలిగిన కొన్ని ప్రాంతాలలో ఇది ఒకటి, ఇక్కడ భూ ఉపరితలం యొక్క లోతు ఇతర ప్రదేశాల కంటే రెండు రెట్లు ఎక్కువ.

హిమాలయా పర్వతాలపై ఉన్నదని చెబుతున్న అన్యగ్రహ రహస్య స్థావరం.

సరిహద్దులో నివసిస్తున్న స్థానికుల ప్రకారం, భారతీయ మరియూ చైనా అధికారులకు అక్కడ భూమి క్రింద గ్రహాంతర వాసుల ఉనికి ఉన్నదని బాగా తెలుసు. కొన్ని కారణాల వల్ల భారత మరియు చైనా ప్రభుత్వాలు వాస్తవాన్ని బహిర్గతం చేయడానికి ఇష్టపడటం లేదని వారు నమ్ముతారు. స్థానికులు ఈ విషయాన్ని ప్రభుత్వాల ముందు ఉంచినప్పుడు. స్థానికులు నిశ్శబ్దంగా ఉండాలని మరియు ఈ విషయాన్ని మరచిపోవాలని చెబుతున్నారట.

అన్యగ్రహ రహస్య స్థావరం అని చెబుతున్న ప్రాంతం నుండి వస్తున్న యు.ఎఫ్.ఓ లు.

కొన్నేళ్ల క్రితం హిమాలయ పర్వత శిఖరం కొనలో ఉన్న మంచు గడ్డల క్రింద నుంచి కూరుకుపోయి,పాడైపోయిన ఆరు గ్రహాంతరవాసుల యు.ఎఫ్.ఓ లను, అందులో నుండి ఆరు గ్రహాంతరవాసుల శరీరాలను అమెరికా మరియు నేపాల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారట.

గ్రహాంతరవాసుల గురించి పరిశోధనలు జరపటానికి యునైటడ్ నేషన్స్(UNO)ఏర్పాటుచేసిన సభ్యమండలి లోని UFO నిపుణుడు డాక్టర్ జాన్ మాల్లీ (Dr. John Malley ) ఈ ఆవిష్కరణ చేశారు. అన్ని వాస్తవాలను బహిరంగపరిస్తే ప్రపంచం భయాందోళనలకు గురవుతుందనే భయంతో ఇరు దేశాల ప్రభుత్వాలు ఈ ఆవిష్కరణను రహస్యంగా ఉంచడానికి కుట్ర చేస్తున్నాయని డాక్టర్ మాల్లీ ఆరోపించారు.

అవశేషాలు మంచుతో కప్పబడి ఉన్నాయి, కాబట్టి అవి కుళ్ళిపోయుండవు. మృతదేహాలకు 10,000 సంవత్సరాల వయస్సు ఉండవచ్చు.

ఇటీవల ఒక భారతీయ పురావస్తు శాస్త్రవేత్త 10000 సంవత్సరాల పురాతన గ్రహాంతర చిత్రలేఖనాన్ని భారతీయ నగరం ఛత్తీస్‌గఢ్ సమీపంలో ఉన్న ఒక గుహలో కనుగొన్నారు. ఇది ఆధునిక గ్రహాంతర నాగరికత ఒకసారి భూమిని సందర్శించి ఉంటుందనడానికి రుజువుగా ఉపయోగపడుతుంది.

మానవుల సంక్షేమం గురించి గ్రహాంతరవాసులు తనిఖీ చేస్తున్నారా?

మరో సందర్భంలో, ఈశాన్య భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో వరదలు సంభవించిన విభాగాలపై డిస్క్ ఆకారంలో ఉన్న వస్తువు ఎగురుతూ ఉండటాం ఫోటో తీయబడింది. బాధిత మానవుల సంక్షేమం కోసం గ్రహాంతరవాసులు తమ UFO లలో వచ్చి తనిఖీ చేస్తున్నారా? భారతదేశంలో యు.ఎఫ్.ఓ స్థావరం సాధ్యమే అనడానికి ఇది మరో రుజువా? పై విషయాన్ని ‘ది నార్త్ఈస్ట్ టుడే’ అనే దినపత్రిక ప్రచురించింది. ఎగురుతున్న యు.ఎఫ్.ఓ యొక్క చిత్రాన్ని సెప్టెంబర్ 4-2015 న ఫోటోగ్రాఫర్ మోమినా వాసిమ్ తీశారు, అతను ఆ సమయంలో ఎడ్యుకేటెడ్ నిరుద్యోగ సంక్షేమ సంఘం (Educated Unemployed Welfare Society...EUWS) కోసం పనిచేస్తున్నాడు. అస్సాంలోని దిబ్రుగార్ జిల్లాలోని మైజాన్ సమీపంలోని మోథోలా టీ ఎస్టేట్‌లో మోమినా, బ్రహ్మపుత్ర నది వరదలలో నష్టపడ్డ బాధితులకు ఆహారం మరియు సామాగ్రి పంపిణీని అందిస్తున్నారు.

క్లోస్ ఆప్ ఫోటోలు.

తన ప్రొఫెషనల్ మోడల్ కెమెరాతో ఛాయాచిత్రాలను తీస్తున్నప్పుడు మోమినా ఒక ఫ్రేమ్‌లో తన తలపై ఎగురుతున్న ఎర్రటి గోధుమ రంగు రిమ్ ఓవర్‌హెడ్‌తో మెరిసే వైట్ డిస్క్‌ను కూడా ఫోటో తీసింది. ఆ తరువాత తాను తీసిన ఫోటోలను పరిశీలిస్తున్నప్పుడు ఆమె ఆకాశంలో ఎగురుతున్న UFO ని గమనించింది. అది వేగంగానూ, నిశ్శబ్దంగానూ కదులుతున్నట్లు గ్రహించింది.

ఆ సంవత్సరం అది భారతదేశంలో తీసిన రెండవ స్పష్టమైన UFO ఛాయాచిత్రం అది. జూన్ 2015 లో,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ మీదుగా సాసర్ ఆకారంలో వెడుతున్న UFO ను ఒక యువకుడు ఫోటో తీశాడు.

2014, 2013 మరియు 2007 సంవత్సరాలలో కూడా UFO లు చూశామని చెప్పిన వాళ్ళూ చాలామంది ఉన్నారు. అంటే UFO లు భూగ్రహాన్ని చుట్టి రావడానికి విపత్తులలో మానవుల సంక్షేమం గురించి తెలుసుకోవటానికి మాత్రమే కాదు...మరింకేదో కారణం ఉంది అని UFO లను చూసిన ప్రజలు అనుకుంటున్నారు.

మన భూమి అన్యగ్రహ వాసులకు కేంద్రంగా ఉంటోందా?!....ఇదే మిస్టరీ

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి