9, జూన్ 2021, బుధవారం

ఈ గుడిలోకి వెళితే రాయిగా మారిపోతారట...(మిస్టరీ)

 

                                                             ఈ గుడిలోకి వెళితే రాయిగా మారిపోతారట                                                                                                                                                         (మిస్టరీ)

అంతుచిక్కని వింతలకు ప్రపంచం పెటింది పేరు. ప్రపంచ పటాన్ని సారి పరికించి చూస్తే అందులో మనకు ఎన్నో తెలియని విషయాలు, శాస్త్రవేత్తలు పరిశోధించలేని అంశాలు కనిపిస్తాయి. కొన్ని వింతలను పరిశోధకులు చేధించినా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉండిపోయాయి. అలాంటి మిస్టరీ ఒకటి రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఉన్న ఒక దేవాలయంలోకి ఎవరైనా వేళకాని వేళలో వెళితే రాళ్లుగా మారిపోతారట. ఆసక్తి కలిగించే మిస్టరీని గురించి తెలుసుకుందాం. 


మనం ఎవరినైనా ముట్టుకోగానే రాయిలా మారిపోతామనే కథలను చాలా సినిమాల్లో చూపించారు. అలాగే దేవాలయంలోకి ఎవరైనా వెళితే రాళ్లుగా మారిపోతారట. ఇది సినిమా కాదు. నిజమట. వినడానికి వింతగా ఉన్నా అక్కడున్న చాలామంది దీన్ని నమ్ముతున్నారు.

రాజస్థాన్ లోని బర్మెర్ జిల్లాలో కిరడు అనే దేవాలయం ఉంది. దేవాలయంలో రహస్యం ఏంటంటే గుడికి  సూర్యాస్తమయం తరువాత ఎవరైనా వెళితే రాయిగా మారిపోతారట. అందుకని సూర్యాస్తమయం తరువాత గుడికి అక్కడి వాళ్ళేవరూ వెళ్లరు.

ఒక వేళ ఎవరైనా ధైర్యం చేసి వెళ్లినా తెల్లారే సరికి రాయిగా మారిపోతారని అక్కడ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత ఎన్నో ఏళ్లుగా మిస్టరీ దేవాలయంలో దాగి ఉంది. అయితే అది నిజమా కాదా అనేది సైన్స్ కు కూడా అర్థం కావడం లేదు.

అక్కడి పురాణ కధల ప్రకారం కొన్ని వేల సంవత్సరాల కిందట ఒక బుషి తన శిష్యులతో కలిసి దేవాలయానికి వచ్చారని, బుషి తన శిష్యలను దేవాలయం దగ్గర విడిచి దగ్గర ప్రాంతాలను చూడటానికి వెళ్లారట. అయితే గురువు గారు శిష్యులను విడిచిపెట్టి వెళ్ళడంతో  శిష్యుల ఆరోగ్యం తిండి లేక క్షీణించిందట. దేవాలయం ప్రాంతంలో తిరుగుతున్న స్థానికులు ఎవ్వరూ ఋషి శిష్యులకు సహాయం చెయ్యలేదట. అక్కడికి వచ్చి తన శిష్యుల బాధలను చూసిన బుషి చలించిపోయారని అక్కడివారి కథనం.

అక్కడి వారెవ్వరూ తన శిష్యులకు సహాయం చెయ్యలేదని తెలుసుకున్న ఋషి, ఇంతటి కఠినమైన రాతి హృదయాలు కలిగిన స్థానికులను రాళ్ళు గా మారమని శపించాడు. గ్రామంలో వారు ఎవరు సహాయం చెయ్యకపోయినా ఒక మహిళ మాత్రం ఋషి శిష్యులకు తన వల్ల అయిన సహాయం చెయ్యడంతో ఆమెకు శాపం వర్తించకుండా చేసాడట. మహిళను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలని చెప్పగా, వెళ్తూ వెళ్తూ మధ్యలో వెనక్కి తిరిగి చూస్తుందట మహిళ. దీంతో మహిళ కూడా రాయిగా మారిపోయిందని. మహిళ విగ్రహం ఇప్పటికీ దేవాలయం సమీపంలో ఉందని స్థానికులు చెబుతున్నారట. ఋషి శాపం వల్ల దేవాలయంలోకి సూర్యాస్తమయం తరువాత వెళ్ళినా, లేక సూర్యాస్తమయం తరువాత దేవాలయంలో ఉన్నా రాయిగా మారిపోతారని నమ్ముతారు. అక్కడ చాలామంది విషయాలను నమ్ముతారు కూడా. అందుకే గుడి తలుపులు సాయంత్రానికే మూతబడతాయట. అయితే దీని గురించి తెలిసిన చాలామంది గుడిలో సూర్యాస్తమయం తరువాత ఉండటానికి భయపడిపోతున్నారు. పరిశోధకులు సైతం వెనుకంజ వేస్తున్నారు. ఇటువంటి మిస్టరీలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి.

అయితే మిస్టరీ రహస్యాలను చేధించడానికి పరిశోధకులు కుస్తీలు పడుతున్నారు. కొన్ని మిప్టరీలను చేధించినా ఇలాంటి మిస్టరీలు మాత్రం ఇంకా రహస్యంగానే ఉన్నాయి. సైంటిస్టులు త్వరలోనే మిస్టరీని చేధించాలని పరిశోధనలుతో ప్రయత్నాలు చేస్తున్నారు...కనుక్కోగలరా?

Images Credit: To those who took the original photo.

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి