27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

తొలివలపు (సీరియల్)...PART-16



                                              తొలివలపు….(సీరియల్)
                                                           (PART-16)


ఆ రోజు గాయత్రిని స్కూలుకు తీసుకువెళ్ళి దింపి ఇంటికి వచ్చిన బాపిరాజు గారికి, భార్య పెళ్ళిళ్ల బ్రోకర్ తో మాట్లాడటం వినబడగానే అలాగే అరుగు మీద కూర్చుండిపోయాడు.

"అదంతా తరువాత మాట్లాడుకుందాం! నా కూతుర్ని పెళ్ళికొడుకు వాళ్ళింట్లో అందరూ నచ్చిందని చెప్పేరా...లేదా? ఆది చెప్పండి మొదట"

"నచ్చిందా అని అడుగుతున్నారా...? భలే అడిగేరు పొండి. మీ అమ్మాయే వాళ్ళింటి కోడలని వాళ్ళింట్లో వాల్లందరూ తీర్మానమే చేసుకున్నారు. మీ సమాధానం కోసం మాత్రమే వాళ్ళు కాచుకోనున్నారు. ఒకవేల మీకు వాళ్ళ సంబంధం నచ్చింది అంటే, తాంబూళాలు మార్చుకున్న వెంటనే పెళ్ళి కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళు అలా తొందరపడుతున్నందుకు ఒక కారణం ఉంది. వాళ్ళింట్లో వయసైన ఒకావిడ ఉన్నది. నాలుగు వంశాలను చూసింది. ఆవిడ తన చేతులతో తాళి తీసిచ్చే వాళ్ళింట్లో అన్ని పెళ్ళిల్లూ జరిగినైయట. ఆ వయసైన ఆవిడ ఇప్పుడు సీరియస్ గా ఉన్నదట. కళ్ళు మూసేలోపల చివరి మనవడి పెళ్ళి కూడా చూడాలని ఆశపడుతోందట. అందుకనే ఇలా ఒక ఏర్పాటు.

మీరు దేని గురించి భయపడక్కర్లేదు. చాలా మంచి మనుషులు. ఆ ఇంటి సంబంధం దొరకటానికి మీకు అదృష్టం ఉండాలి. నా కమీషన్ ఎదురు చూసి నేను ఈ మాట చెప్పటం లేదు. ఆ తరువాత మీ ఇష్టం. వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలో చెప్పారంటే నేను బయలుదేరతాను" అన్నాడు పెళ్ళిళ్ళ బ్రొకర్.

"ఈ రోజే తాంబూళాలు పుచ్చుకుందామని చెప్పేయండి" అన్నది శకుంతలాదేవి.

"నిజంగానే చెబుతున్నారా?" అన్నాడు పెళ్ళి బ్రోకర్, నమ్మలేక.

"అవును...మీరు వెంటనే అబ్బాయి వాళ్ళింటికి వెళ్ళి విషయం చెప్పి వాళ్ళింట్లో ఏర్పాట్లు చేయమనండి. మేము వెనకాలే వస్తాం"

"మంచిదండి. అయితే బయలుదేరతాను" అని ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళాడు పెళ్ళిళ్ళ బ్రోకర్.

బ్రోకర్ వెళ్ళిన తరువాత లోపలకు వెడుతున్న శకుంతలాదేవిని ఆగమని చెప్పి ఆపారు బాపిరాజు గారు.

"నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ రోజు ఏదో కోపంలో చెప్పావనుకున్నాను. కానీ, ఇప్పుడు నిజంగానే...! వద్దు శకుంతలా, నేను చెప్పేది కొంచం విను"

"అక్కర్లేదు! టైమవుతోంది...బయలుదేరండి"

“నేను రాను”

"అయితే సరి, నేనే అన్నీ ఖాయం చేసుకుని వస్తాను"

"వాళ్ళెవరు....ఎలాంటి కుటుంబం. ఇవన్నీ కనుక్కోకుండనే..."

"నాకు నమ్మకం ఉంది. నా కూతురు ఆ ఇంట్లో సంతోషంగా జీవిస్తుంది"

"శకుంతలా...నేను..."

"నేను నిర్ణయం తీసుకున్నది తీసుకున్నదే. దాన్ని మార్చటం ఇక ఎవరి వల్లా కాదు"

నిక్కచ్చిగా చెప్పి, బయలుదేరింది శకుంతలాదేవి.

*********************

బస్సు దిగి మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తోంది గాయత్రి. 'నాన్నకు ఏమైంది? ఎందుకు ఈరోజు నన్ను ఇంటికి తీసుకు వెళ్ళటానికి రాలేదు?-- అన్న ఆలొచనతో వస్తుంటే...ఎవరో తనను పిలవటంతో, నిలబడి వెనక్కి తిరిగింది. ఆయసపడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు మోహన్.

'అరె భగవంతుడా! వీడు ఎందుకు ఇక్కడకు వచ్చాడు?' -- ఆమె ఆలొచించిన క్షణంలో అతను ఆమె దగ్గరకు వచ్చాడు.

"ఒక్క నిమిషం ఆగు గాయత్రీ. నేను నీతో కొంచం మాట్లాడాలి"

"నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళిపో మోహన్. మా ఊరి వాళ్ళు ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది"

"మాట్లాడి వెళ్ళిపోతాను. ప్లీజ్ గాయత్రీ"

“ఏది మాట్లాడాలనుకున్నా రేపు స్కూల్లో మాట్లాడుకుందాం. మొదట బయలుదేరు"

"కుదరదు గాయత్రీ. నిన్ను ఒంటరిగా కలుసుకోవటం నాకు ఈ రోజే కుదిరింది"

"దేవుడా!...సరే, ఏమిటో త్వరగా చెప్పు"

"మొదట నన్ను క్షమించు గాయత్రీ. బుద్ది లేకుండా నేను ఆ రోజు చేసిన తప్పుకు. పవిత్రమైన మన స్నేహాన్ని అపవిత్రం చేసినందుకు"

"వదిలేయిరా. అదంతా నేను ఆ రోజే మరిచిపోయాను. నువ్వు ఎప్పుడూ నా స్నేహితుడివే...చాలా?"

"నువ్వు అబద్దం చెబుతున్నావు. నేను నీ స్నేహితుడనేది నిజమైతే నాతో ఎందుకు మాట్లాడనంటున్నావు?"

"............................"

"నువ్వు మౌనంగా ఉంటేనే అర్ధమవుతోంది. నువ్వు ఇంకా నన్ను క్షమించలేదని"

"నువ్వు అనుకుంటున్నది నిజం కాదురా"

"అయితే నాకు ప్రామిస్ చెయ్యి. ఇక మీదట మాట్లాడతాను, అంతకు ముందులాగానే మన స్నేహం కొనసాగుతుంది అని చెప్పు. అప్పుడే నమ్ముతాను"

తన ముందు జాపిన అతని చేతినే చూస్తూ నిలబడ్డది గాయత్రి.

'శ్రద్దగా చదువుకోవటానికి వెళ్ళామా...వచ్చామా అని ఉండాలి. ఏ మగడితో పడితే ఆ మగాడితో నిలబడి మాట్లాడటమో, నవ్వనో చెయ్యకూడదు. జ్ఞాపకమున్నదా?'---తల్లి శకుంతలాదేవి , కళ్ళ ముందు కనబడి కళ్ళు పెద్దవి చేసుకుని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తోంది గాయత్రికి.

అప్పుడు...తాంబూళాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తోంది శకుంతలాదేవి. దూరం నుండి వస్తున్నప్పుడే మోహన్ తో కూతురు మాట్లాడుతున్నది చూశేసింది. ఆవేశంతో వేగంగా నడిచి కూతుర్ని చేరుకుంది. పాపం...ఇద్దరూ ఇది గమనించలేదు.

"ఏం గాయత్రీ ఇంకా ఆలొచిస్తున్నావు? నా మీద నీకు నమ్మకం లేదు...అంతే కదా?"--అంటున్నప్పుడే అతని కళ్ళల్లో నీళ్ళు ఉబికి వస్తున్నాయి.

"హాయ్! మోహన్. ఏమిట్రా ఇది? సరే...ప్రామిస్" అంటూ అతని చేతిలో చేయివేసిన ఆ క్షణం, హఠాత్తుగా ఎవరో వాళ్ళ చేతులను తోశేసినట్లు అనిపించి ఇద్దరూ తిరిగారు.

ఆవేశం చివరి దసలో నిలబడుంది శకుంతలాదేవి. ఆ సమయంలో తల్లిని అక్కడ ఎదురుచూడని గాయత్రిలో వణుకు మొదలైయ్యింది.

"నేను వచ్చి..." అన్న మొహను కు ఎదురుగా నిలబడి……

"నీకు ఎంత ధైర్యం ఉంటే దీన్ని వెతుక్కుని ఉర్లోకే వచ్చుంటావు? నీ ప్రేమ నీ కళ్ళు కప్పి ఇక్కడి దాకా తీసుకువచ్చిందా...థూ… నువ్వొక…." అంటూ, ఇంకా ఏదేదే మాటలతో తన ఆవేశం తీరే వరకు తిట్టి ముగించింది శకుంతలాదేవి.

ఊరే గుమికూడింది. అవమానంతో కుంగి కృషించి నిలబడ్డాడు మోహన్. వాడ్ని చూడటానికే 'అయ్యో పాపం' అనిపించిది గాయత్రికి. వివరం తెలుసుకుని క్రిందా మీదా పడుతూ పరిగెత్తుకు వచ్చాడు వెంకన్న. శకుంతలాదేవి దగ్గర క్షమాపణ కోరి మేనల్లుడ్ని తీసుకుని వెళ్ళాడు. మరోపక్క గాయత్రిని చెతులు పుచ్చుకుని లాక్కుని వెడుతున్నట్టు నడిచింది శకుంతలాదేవి.

ఇంటి లోపలకు వెళ్ళటం ఆలశ్యం...తలుపులు మూసింది శకుంతలాదేవి. టేబుల్ మీదున్న పెద్ద స్కేల్ తీసుకుని కూతుర్ని పిచ్చి పిచ్చిగా కొట్టింది. నొప్పి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయింది గాయత్రి.

బయట తలుపును విరకొడుతున్నట్టు గట్టిగా తలుపు తడుతున్నారు బాపిరాజు గారు.

ఆవేశం తగ్గిన తరువాత తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది శకుంతలాదేవి. ఆమెను కోపంగా చూసుకుంటూ లోపలకు వెళ్ళి భయంతో వణుకుతున్న కూతుర్ని చూసిన వెంటనే ఆయన కళ్ళల్లో నెత్తుటి కన్నీరు వచ్చింది.

మరో అరగంటలో ఆ వార్త ఊరు ఊరంతా పాకిపోయింది. 'వెంకన్న అక్క కొడుకు మోహన్, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు' అని!

ఇంకా ఉంది.....Continued in: PART-17

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి