24, సెప్టెంబర్ 2020, గురువారం

జీవన పోరాటం...(సీరియల్)...PART-18


                                                                           జీవన పోరాటం...(సీరియల్)                                                                                                                                                                    (PART-18) 

(పొందవలసిన బంధం అర్ధం నిండిన బంధంగా పొందటమే అతి పెద్ద బంధం. దానికంటే ఇక దేనినీ పెద్ద బంధంగా మనం గౌరవించం)

ఆ కారు హైదరాబాద్ నుండి గ్రామం వైపు వేగంగా వెడుతోంది. సత్యపాల్ కారు నడుపుతున్నాడు. పక్కన పరంధామయ్య కూర్చోనున్నారు.  మహిళలు ముగ్గురూ వెనుక సీటులో! గాయత్రి మధ్యలో ఉన్నది. కారును చల్లదనంతో పాటూ ఉత్సాహమూ నింపింది. 

"అన్నయ్యా...హైదరాబాద్ కు తిరిగి వెళ్ళిన వెంటనే ఈ కారు అమ్మేసి పెద్ద కారు కొనాలి"

"ఎందుకమ్మా...ఇది మనకి వసతిగానే కదా ఉన్నది?"

"వసతిగానే ఉన్నది. కానీ, వసంత కూర్చోవటానికి ఇందులో చోటులేదే?"

అసలు విషయాన్ని బద్దలుకొట్టింది గాయత్రి.

"వసంతనా...ఇదేమిటి కొత్త పేరు?" అడిగింది మంగమ్మ.

"చిన్నమ్మా...మీకు మాత్రమే ఇది కొత్త పేరు. సత్యపాల్ సార్ గారికి ఇది అలవాటైన పేరు. మెగా ఆలొచనతో ఆమెను ఆఫీసులోకి తీసుకు వచ్చిన సారు...ఇప్పుడు ఇంటిలోపలకూ తీసుకు రావటానికి ప్లాన్ వేస్తున్నారు. వెంటనే ఆమె మెడలో పసుపుతాడు కట్టి ఆమోదించకపోతే, ఆఫీసులో ఆమె హడావిడిని తట్టుకోలేము" కుండ బద్దలు  కొట్టింది.

అందరికీ విషయం అర్ధమయ్యింది. సత్యపాల్ వంకర్లు తిరిగాడు.

"తప్పు చేసిన వాళ్ళను దండిచకుండా వాళ్ళకు జీవితం ఇచ్చి కాపాడే గుణం నీకూ వచ్చేసిందా?" నవ్వుతూ అడిగింది రాజరాజేశ్వరి.

ఆమె ప్రశ్నలోనే తనకి సమ్మతమే అన్నది చిలిపిగా తెలిపింది.

రాజరాజేశ్వరి చిలిపితనాన్ని లోలోనా ఆనందించారు పరంధామయ్య.

"అమ్మా...తల్లుల్లారా నా బుర్ర తినకండి" అని నకిలీగా నటిస్తూ-రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేశారు.

గలగలమని నవ్విన గాయత్రి అడిగింది, "అది సరే నాన్నా... వసంత గురించి  మీరేమనుకుంటున్నారు? అది చెప్పండి మొదట..."

అప్పుడు కొంచం సీరియస్ అయిన ఆయన, “సత్యపాల్ ఏది చేసినా కరెక్టుగానే చేస్తాడు. ఆ నమ్మకం ఇందులోనూ నాకు ఉన్నది. ఆమెను వాడు ఇష్టపడితే దానికి నేను అబ్జెక్షన్ తెలుపను" అన్నారు.

"ఓ.కే.నాన్నా! చిన్నమ్మా...నువ్వేమంటావు?"

"పెద్దలు తీసుకునే నిర్ణయమే నా నిర్ణయం" అని పరోక్షంగా తన ఆమోదాన్ని తెలిపింది మంగమ్మ.  

మంగమ్మ గాయత్రి వైపు తిరిగి " గాయత్రీ, నువ్వు నీ ఇష్టాన్ని చెప్పలేదే?" అని అడిగింది.

"నాకు ఇది కొంచం కూడా ఇష్టం లేదు" అన్నది గాయత్రి. 

అందరూ గాయత్రిని ఆశ్చర్యంగా చూశారు. సత్యపాల్ కంగారుపడ్డాడు.

వాళ్ళందరి గందరగోళాన్ని ఆనందిస్తూ చెప్పింది, "నా అన్నయ్య ప్రేమలో భాగం పంచుకోవటానికి ఒకామె వస్తే ఆమెను ఎలా ఎన్నుకోను?"

మళ్ళీ అందరూ ఉత్సాహంగా నవ్వారు.

కారు నడుపుతున్న సత్యపాల్ ఒకసారి వెనక్కి తిరిగి ఆమెను చూసి నవ్వాడు. ఆ నవ్వులో ఉన్న  థ్యాంక్స్ ను అర్ధం చేసుకున్న గాయత్రి బోటను వేలు చూపించి 'జయం' అన్నట్టు చెప్పింది.

తల్లి-తండ్రుల దగ్గర వసంత గురించి ఎలా చెప్పబోతాను  అనే సంధిగ్ధంలో ఉన్న సత్యపాల్ కు చెల్లెలు దాన్ని చాలా ఈజీగా తీర్చిపెట్టినందుకు ఆమెకు మానసీకంగా ధన్యవాదాలు చెప్పాడు.

"అది సరే... వసంత విషయం నీకెలా తెలిసింది?" -- పరంధామయ్య అడిగారు.

"నాన్నా...అన్నయ్య పులిలాగా దాగి దాగి నన్ను ఫాలో చేశాడు. కానీ నేను సింహము. ఒకే దెబ్బ. నిజం బయటకు వచ్చేసింది"

"అమ్మా తల్లీ...ఓవర్ 'బిల్డ్ అప్' మంచిది కాదు! జరిగిన విషయం చెప్పు"

జరిగింది తెలుసుకోవటానికి అదుర్దా పడ్డ సత్యపాల్ అడిగాడు. వసంత కూడా ఇంతవరకు అతని దగ్గర చెప్పలేదే!

దాన్ని గాయత్రి ఉత్సాహంగా వివరించగా...అందరూ ఆసక్తిగా విన్నారు.............

ఆఫీసులో నవీన్ ను కలుసుకున్న రోజు నుండి వసంత పైన సత్యపాల్ ప్రత్యేక ఆసక్తి చూపించటం గమనించింది గాయత్రి. 'ఒకవేల ప్రేమగా ఉంటుందా' అని సంతోష పడింది. అదే నిజమైతే ఆమెకు అది సంతోషమే.  

అది నిజమేనని తెలుసుకోవటానికి ఒకరోజు సత్యపాల్ ఆఫీసులో లేనప్పుడు ఆఫీసుకు వెళ్ళి ఇంటర్ కాం లో వసంతను పిలిచింది.

"ఎస్ మ్యాడం" అంటూ లోపలకు వచ్చిన వసంతను చూసి "మాకు సెక్రెటరీ గా వచ్చిన దానివి, ఇప్పుడు ఈకంపెనీకే యజమాని అయిపోదామని ఆశపడుతున్నావా?" అని గట్టిగా అడిగింది.

గబుక్కున ఆమె కళ్ళ వెంట కన్నీరూ ధారగా కారింది. చేతి రుమాలతో అది తుడుచుకుంటూ, "మ్యాడం, అనారొగ్యంతో బాధ పడుతున్న అమ్మకు అవుతున్న హాస్పిటల్ ఖర్చు, మేమిద్దరం గౌరవంగా జీవించడానికి అవుతున్న ఖర్చూ...ఈ రెండింటికీ సరిపోయేంత డబ్బును జీతంగా ఇస్తున్నారు...దీనికంటే ఇప్పుడు నాకు ఇంకే ఆశ లేదు"

ఇప్పుడు లేదంటే...ఇకమీదట వస్తుందా"

తన నోటి నుండి నిజం తెప్పించటానికి గాయత్రి ప్రశ్నలను పొడిగిస్తోందని గ్రహించిన వసంత, గాయత్రి అడగబోయే తరువాత ప్రశ్నకు, ముందుగానే తన జవాబు చెప్పింది. 

"మ్యాడం,జీవితంలో చాలా దెబ్బ తిని ఉన్నాను.ఇప్పటికి నా అవసరాలు, ఆశలు  చాలాచాలా తక్కువ"

"ఇది నేను నమ్మాలంటావా?"

గాయత్రి కూడా వదల దలుచుకోలేదు.

గాయత్రి మనసులో ఏదో పెట్టుకునే తనని ప్రశ్నల బాణాలతో గుచ్చుతోంది అనే కోణంలో ఆలొచించిన వసంత కి 'సడన్ గా ఒక విషయం గుర్తుకు వచ్చింది.

"మ్యాడం, మీరడిగే ప్రశ్నకు నేను తిన్నగానే సమాధానం చెబుతాను. మీ అన్నయ్యే నన్ను ప్రేమిస్తున్నానని ఒక సారి చెప్పాడు. కానీ నేను ఖచ్చితంగా 'నో' అని చెప్పి తిరస్కరించాను. దానితో అది నేను మర్చిపోయాను. మీ అన్నయ్య కూడా ఆ తరువాత దాని గురించి నా దగ్గర మాట్లాడలేదు. దీన్ని మనసులో పెట్టుకునే నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారా?"

"ఏం, మా అన్నయ్యకు ఎం తక్కువ?"

ప్రశ్నను మార్చి అడిగింది గాయత్రి.

"అయ్యో మ్యాడం...మీ అన్నయ్య దగ్గర ఏటువంటి కొరతా లేదు. కోరత అంతా నా దగ్గరే"మళ్ళీ కళ్ళల్లో కన్నీరు.

ఆమెను చూడటానికే గాయత్రికి పాపం అనిపించింది. అయినా కానీ, గాయత్రికి తాను ఉన్న 'జాలి మూడు ను కొనసాగించి వసంతను కెలికింది.

"నీ దగ్గర అలా ఏమిటి కొరత?"

"మ్యాడం, అన్నీ తెలిసిపెట్టుకున్నా, వాటిని నా నోటి నుండి వినాలనే గా మీ ఉద్దేశం. అందుకని చెబుతాను. పెళ్ళి అంటేనే ఆడపిల్ల వారి ఇంటి నుండి సారె ఇవ్వాలి. దానికి నా దగ్గర నయాపైసా కూడా లేదు. అంతకంటే ముఖ్యంగా కన్నె పిల్లలు పెళ్ళి వరకు బద్రపర్చుకోవలసిన మానసిక కన్యాత్వాన్ని ప్రేమ పేరుతో నేను పెళ్ళికి ముందే పోగొట్టుకున్నాను..."

"నాన్సెన్స్"--ఆ రూమే దద్దరిల్లేటట్టు అరిచిన గాయత్రి, పరిగెత్తుకు వచ్చి వసంతను కౌగలించుకుంది.

గాయత్రి భుజాలపై వంగి తలపెట్టుకున్న వసంత తన మనోభారాం తగ్గేంతవరకు వెక్కి  వెక్కి ఏడ్చింది. ఆమె తల్లికి కూడా ఈ విషయం తెలియదు. అందువలన తన ఆవేదనకు పంటకాలువలాగా ఈ సంధర్భాన్ని వాడుకుంది వసంత. 

ఏడుపు ఆగేంతవరకు ఆమెకు ఆదరణగా, కౌగలింతను మరింత బిగువు చేసి మరింత దగ్గరకు చేర్చుకుని సమాధాన పరచింది గాయత్రి.

"ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇంత అమాయకత్వంగానా? ఎప్పుడు నీ తప్పును తెలుసుకుని మనసు విప్పి ఏడ్చేవో...అప్పుడే అది నిన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇది నేను చెప్పలేదు. రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. ఏడుపు ఆపు. కన్నీటిని తుడుచుకో" అని వసంతను సోఫాలో కూర్చోపెట్టింది.  

టీ తెప్పించుకుని ఇద్దరూ తాగారు.

వసంత సహజ స్థితికి రాగానే ఆమెతో చెప్పింది, "సారీ...నిన్ను ఏడిపించి చూడాలని అనుకోలేదు. కానీ, ఒక విధంగా ఇది నీకు మంచే చేసింది. ఇంతవరకు అణిచిపెట్టుకున్న నీ దుఃఖానికి కారణంగా ఉన్న విషయాన్ని బయటకు చెప్పి మనసు విప్పి ఏడ్చినందు వలన నీ మనసు ప్రశాంతంగా ఉంటుందే. కరెక్టే కదా?"

''అని తల ఊపింది వసంత.

గాయత్రి మళ్ళీ మాట్లాడింది, "కానీ దీంతో నిన్ను వదిలిపెట్ట దలుచుకోలేదు"

ఎదురుకుండా ఉన్న వసంత తలపైకెత్తి ఆశ్చర్యంగా చూసింది.

"నీకు ఒక ప్రమోషన్ ఇవ్వబోతాను"

మౌనంగా ఉండిపోయింది వసంత.

"ఏమిటని అడగవా?"

"మీరే చెప్పండి మ్యాడం"

"నాకు 'వదిన గా 'ప్రమోట్' చెయ్య బోతాను. ఏమిటి...ఓ.కే.నేనా?"

"మ్యాడం, మీ ఇంట్లో..."

"మా ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు ఆలొచించకు! అది నేను చూసుకుంటాను. నీకు ఓకేనా? అది చెప్పు మొదట

"లేదు మ్యాడం. నేను కొంచం ఆలొచించాలి"

"నువ్వు ఏం ఆలొచిస్తున్నావో నాకు తెలుసు"

'ఏం తెలుసు?' అన్నట్లు ఆమెను ఆశ్చర్యంగా చూసింది.

"పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే అమ్మను ఎవరు చూసుకుంటారు అనే కదా ఆలొచిస్తున్నావు! కరెక్టే కదా?"

'ఈమె సత్యపాల్ యొక్క చెల్లెలు. ఈమె కూడా తెలివిగలదిగా  ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు...'అనుకుంది వసంత.

"ఒకటి చెయ్యి...నువ్వు కట్నంగా ఇవ్వవలసిన వస్తువులు మా ఇంట్లో ఏదీ లేదు. మీ అమ్మను కట్నంగా మా ఇంటికి ఇచ్చేయి"

అదిరిపడ్డది వసంత. దీనికిపైన ఆలొచించ వలసినది ఆమెకు ఏముంటుంది?

"హలో, ఏమిటి ఇంకా ఆలొచన... ఒకేనే కదా?"

ఒకేనే అన్నట్టు తల ఊపింది వసంత.

"వదిలిపెట్టను. నువ్వు నోరు విప్పి జవాబు చెప్పేంతవరకు వదిలిపెట్టను"

"ఓకేనే మ్యాడం"--సన్నటి స్వరంతో జవాబు, పెదాలలో సిగ్గుతో కూడిన నవ్వు కనబడింది.

"అది సరే, ఓకే చెప్పేవు కదా? ఆ తరువాత ఇంకా దేనికి మ్యాడం...మ్యాడం?” 

"మ్యాడం, జీవితంలో ఒక సారి తొందరపడినందువలన తగిలిన దెబ్బతో మంచి పాఠం నేర్చుకున్నాను. ఇక మీదట వేసే ప్రతి ఒక్క అడుగు నిదానంగా వేయబోతాను. ఎందుకంటే...నేను ఆశపడినది ఏదీ పూర్తిగా దొరికిందేలేదు. నా మెడలో మీ అన్నయ్య తాలి కట్టేంత వరకూ మీరు 'మ్యాడమే', నేను వసంతనే..."

"సరే నండి మ్యాడం"---లేనిపోని భవ్యం నటిస్తూ ప్రతి మర్యాద చూపింది గాయత్రి.

ఇద్దరు ఆడవాళ్ళూ కలిపి గలగలమని నవ్వటంతో ఆ గదంతా ఆనందంతో నిండింది.

అప్పుడు ఆ కుటుంబంలో వచ్చి చేరాల్సిన కొత్త బందువు ఒకటి విరబూనసిన పువ్వు వాసన మొదలయ్యింది.

కవిత మాటలను పొడిగించింది, "మనిద్దరి మధ్య ఒక 'డీల్ . ఈ విషయాన్ని నేను మన కుటుంబంలో మాట్లాడి వాళ్ళ అంగీకారం తీసుకునేంత వరకూ నువ్వు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. మా అన్నయ దగ్గర కూడా!"

గాయత్రి 'మన కుటుంబం' అనే మాటను నొక్కి చెప్పటంతో కరిగిపోయింది వసంత.. దానికి జవాబుగా "ఎస్ మ్యాడం" అని వసంత చెప్పిన జవాబులో ఉత్సాహం తీరం దాటి వెళ్లటంతో గాయత్రీ కూడా సంతోషపడింది.

ఆమె వివరించటంతో "ఓసినీ దుంపతెగ...ఆ అమ్మాయిని ఇలాగా బాధపెట్టేది?" అన్నది రాజరాజేశ్వరి.

"అబ్బో ఇది మరీ ఎక్కువగా ఉందే. అప్పుడే కొడలు పిల్లకు అత్తగారు సపోర్టా" అన్నది గాయత్రీ.

ఆ ఉత్సాహంలో గాయత్రీను వెక్కిరించటం మొదలుపెట్టాడు సత్యపాల్.  అందులోనూ వచ్చే సంవత్సరం నువ్వు ఈ కారులో రావు!  అందువలన నీ చోటు వసంతకే"

"ఈ కారులో రాకపోతే అప్పుడు నేనెక్కడి వెడతాను?"

"నిన్ను ఇంట్లోంచే తరిమేయబోతానే"

ఇన్నిరోజులుగా నేను నిన్ను ఇంట్లో నుండి తరిమేయాలని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను తరిమేయ బోతావా?"

"లేదులేదు, నిన్ను ఒకడి చేతిలో పెట్టి కట్న కానుకలతో...ఆస్తిపాస్తులతో తరమ బోతాను"

ఉత్సాహంగా మాట్లాడాడు. కానీ, గాయత్రీకు అది ఉత్సాహంగా లేదు.

"అన్నయ్యా...నా పెళ్ళి విషయాన్ని రెండు, మూడు సంవత్సరాలవరకు వాయిదా వెయ్యి. స్వర్గంలోనే ఉంటూ అది అర్ధం చేసుకోకుండా ఇన్ని రోజులు దాన్ని నరకంగా పెట్టుకున్నాను. ఇప్పుడే ఆ నరకాన్ని కొంచం కొంచం స్వర్గంగా మార్చుకుని అందులో జీవించటం ప్రారంభించాను. కొన్ని సంవత్సరాలు దీన్ని అనుభవించ నివ్వు..."

ఆమె మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. గాయత్రీ ఇంత ఇదిగా తనని తానే మార్చుకున్నది చూసి ప్రశాంతత చెందేరు.

గాయత్రీను మాట్లాడించే విధంగా మాట్లాడాడు సత్యపాల్. "డ్రైవర్ సీటును స్వర్గం అని చెబుతావే! కారు నువ్వు నడుపుతావా? నేను వెనుక సీటులో కూర్చుంటాను"

"తప్పైన ఆలొచనతో డ్రైవర్ సీటును స్వర్గమని చెప్పాను. అది మాత్రమే కాదు అన్నయ్యా...నేను ఇప్పుడు ఉన్న చోటే నిజమైన స్వర్గం. ఇక మీదట ఏ కారణం చేత కూడా ఈ స్వర్గాన్ని వదిలిపెట్టను"

తనకు చెరో పక్క కూర్చున్న తల్లుల చేతి వెళ్లలో తన చేతి వేళ్లను పోనిచ్చి మరింత గట్టిగా పట్టుకుని చెప్పింది గాయత్రీ.

ఆమె జవాబుతో ఆనందం పొందిన అందరూ, మానసికంగా వాళ్ళను వదిలి దూరంగా వెళ్ళిన గాయత్రీ మళ్ళీ వాళ్ళను బాగా అర్ధం చేసుకున్నదని ఆనందపడ్డారు.

వాళ్ళ దగ్గర కనిపించిన ఉత్సాహం ఆ కారుకూ అంటుకుంది. అది వేగం పెంచింది.

వీటిని కూడా చదవండి:

అగ్ని బంతుల వర్షం(మిస్టరీ)

కదిలే అలలపై--కదలని ఏయర్ పోర్ట్(ఆసక్తి)

**************************************************సమాప్తం***************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి