12, జులై 2021, సోమవారం

ఎడారి హోటల్: కాంక్రీట్ లేకుండా కట్టిన ఏకైక సృష్టి...(ఆసక్తి)R

 

                                                          ఎడారి హోటల్: కాంక్రీట్ లేకుండా కట్టిన ఏకైక సృష్టి                                                                                                                                           (ఆసక్తి)

ఎడారి అంటే ఎటువంటి వృక్షసంపదా, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం అనేది అందరికీ తెలుసు. భూమిపై 1/3 వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే ఓయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. అక్కడ నీరు లభ్యమవ్వడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి.

ఓయాసిస్ అంటే ఎడారిలో ఉపరితలం నీటి ఊటకు దగ్గరగా ఉన్న ఒక పల్లపు ప్రాంతం. ఎడారిలో కూడా అప్పుడప్పుడు వర్షం పడుతుంది. వర్షంలో కొంత నీరు ఇసుకలోంచి ఇంకి కింద, అనగా రాతి పొర కింద ఊటగా ఉంటుంది. ఎడారిలో ఇసుక రేణువులు గాలి దుమారాల ద్వారా చెల్ల చెదురవుతాయి. అలా కొండల్లాంటి ఇసుక మేటులు ఒక చోటు నుండి మరొక చోటికి కదులుతుంటాయి. ఒక ఘన మైలు (a cubic mile...1.6 ఘన కిలోమీటర్ cubic km) గాలి ద్వారా 4,600 టన్నుల ఇసుక ఒక చోట నుండి మరొక చోటికి కదులుతుంది. ఒక పెద్ద గాలి దుమారం 100 మిలియన్ టన్నుల ఇసుక లేదా మట్టిని స్థాన భ్రంశం చేస్తుంది. ఇలా ఇసుకమేటులు కదిలే ప్రక్రియలో కొన్ని ప్రాంతాలలో ఒరవడికి అక్కడి ఇసుక కొట్టుకుపోయి పల్లపు ప్రదేశం ఏర్పడుతుంది. పల్లపు భూతలం దాదాపు భూగర్భ జలం (water table) దగ్గరగా వస్తుంది.అలాంటి చోట పడిన విత్తనాలు మొలకెత్తి, వాటి వేళ్ళు కింద ఉన్న తడి ప్రదేశంలోకి విస్తరిస్తాయిఅక్కడ నీటి ఊటలు పైకి వచ్చి ఓయాసిస్ గా ఏర్పడతాయి. ఒకో చోట ఇలా ఏర్పడిన పల్లపు ప్రాంతాలు చాలా విశాలమైనవి. ఉదాహరణకు సహారా ఎడారి లోని "ఖర్గా ఒయాసిస్" సుమారు 100 మైళ్ళ పొడవు, 12 నుండి 50 మైళ్ళ వరకు వెడల్పు కలిగినది

అటకామా ఎడారి భూమి మీద అత్యంత తేమ రహిత ప్రదేశం. ఇసుక ఎడారుల్లో అన్నింటికన్నా పెద్దది ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి. మృత్తికా క్రమక్షయానికి లోనైన ఎడారుల్లోని కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి. దీర్ఘకాలికంగా అత్యధికమైన పొడి వాతావరణం ఉండటం వలన ఇవి శిలాజాలను అలాగే నిల్వ ఉంచుకుంటాయి.

ఎడారులు జీవకోటి మనుగడకు అంతగా సహకరించవని పేరుంది. అయితే నిజానికి వీటిలో కూడా మనం చక్కటి జీవ వైవిద్యాన్ని గమనించవచ్చు. ఇక్కడ జంతువులు పగటి సమయంలో తమ శరీర ఉష్ణొగ్రతను  అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలలో దాక్కుంటాయి. కంగారూ ర్యాట్స్, కోయెట్, జాక్ ర్యాబిట్, వివిధ రకాలైన బల్లులు, కొన్ని రకాల కప్పలు ఇందులో ముఖ్యమైనవి. అలాంటి ఎడారులలో ఒకటైన ఒక ఎడారిలోనే ఎడారి హోటల్(రిసార్టు) కట్టారు.

మంగోలియా దేశంలోని విస్తారమైన ఇసుక సముద్రం అని పిలువబడే ఎడారిని క్వియాంగ్షావన్ ఎడారి(Xiangshawan Desert) అని పిలుస్తారు. ఎడారిలో అరుదైన ఖనిజాలు ఉన్నాయని చెబుతారు. ఇసుక ఎడారిలోని ఇసుక దిబ్బల మధ్య ప్రాంతంలో అద్భుతమైన ఒక హోటల్ నిర్మించారు. హోటలుకు "ఎడారి తామరపువ్వు హోటల్" (Desert Lotus Hotel) అని పేరు పెట్టారు. ఇది చైనా రాజధాణి బీజింగ్ నగరానికి 800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాంక్రీట్ లేకుండా (ఉపయోగించకుండా) కట్టబడ్డ ఏకైక సృష్టి. హోటల్ ప్రసిద్ది చెందటానికి కాంక్రీట్ ఉపయోగించని భవనం అనేది మొదటి కారణమైతే, ఎడారులలో తేలే ఓడల డిజైన్ కలిగి ఉన్నదనేది రెండవ కారణం.

మంగోలియా ఒక భూపరివేష్టిత దేశం. ఇది తూర్పు ఆసియా మరియు మధ్య ఆసియాలో ఉన్నది. దీనికి ఎల్లలు ఉత్తరాన రష్యా, దక్షిణం, తూర్పు మరియు పడమరలలో చైనా దేశాలు ఉన్నాయి.

హోటల్ పర్యావరణ అనుకూలమైన మరియు తక్కువ కార్బన్ డయాక్సైడ్ వెలువరించే భావనతో నిర్మించారు.

ఎడారి ఇసుక దిబ్బలలో హోటల్ కట్టాలి కనుక కాంక్రీట్ మరియు నీరు ఉపయోగించ కుండా ఒక కొత్త నిర్మాణ వ్యవస్థను కనుగొన్నారు. ప్లాట్ ఆర్కిటెక్ట్స్ అనే సంస్థ తడి ఇసుకలొ నిలబడగలిగే కొత్త ఇంజనీరింగ్ పద్దతిని కనుగొన్నది. ఉక్క ప్యానల్స్ తో పునాదిని తయారు చేసి, పునాదిపై ఉక్కు ఊచలతో హోటల్ నిర్మాణం చేశారు. పునాది ఉక్కు ప్యానల్స్ పైన ఉక్కు స్ప్రింగులతో ఊచలు నిర్మించడం వలన హోటల్ తెలుతున్న భావన కలిగిస్తుంది(ఎడారి గాలికి కొంచంగా ఊగటం వలన). 

30,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టబడిన హోటల్ ఎత్తు 40 మీటర్లు. నిర్మాణంలో హోటల్ పైకప్పులను పునరావృతమైన త్రిభుజాన తెల్లటి గుడారాలతో వరుసక్రమంలో అమర్చారు. అయితే, 45 డిగ్రీల భ్రమణంతో ఒకదానికొకటి కలుసుకునేటట్లు తామరపువ్వు ఆకారంలో నిర్మించారు. ఇటుకలు, రాతి పలకలు, కాంక్రీట్ లేకుండా నిర్మించబడ్డ నిర్మాణంలో ఉపయోగించిన వస్తువులు సౌర, నీటి మరియు పవన విద్యుత్ శక్తిని మాత్రమే ఉపయోగించుకుంటాయి. దీనివలన పర్యావరణ కాలుష్యం తగ్గటమే కాకుండా, జీవావరణ రక్షణను బలపరిచేటట్లు చేస్తుంది.

ఈ హోటల్ వారు పర్యాటకుల కోసం మంగోలియా దేశ సంస్కృతిక నేపధ్యంతో ప్రదర్శనలు, ఒంటె సవారీలు, ఎడారి సర్ఫింగ్ లాంటి ఎన్నో వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఎడారి 'పాటలు పాడే' ఎడారిగా ప్రసిద్ది చెందింది. ఎడారిలో శాంతంగా ఉండే మట్టిని భగ్నపరిస్తే గర్జించు మరియు విజృంభిస్తున్న శబ్ధం వినబడుతుంది.( ఈ ప్రకృతి సంఘటన ఎందుకు/ఎలా జరుగుతోందో ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు).

ఈ ఎడారిలో కొన్ని రోజులు గడపటానికి, ఇసుక దిబ్బెలు పాడే పాటలను వినడానికి, తేలే హోటల్ ఇంజనీరింగ్ వండర్ని చూడటానికి ఎంతోమంది పర్యాటకులు వచ్చి వెడుతున్నారట.

Images Credit: To those who took the original photos.

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి