3, జనవరి 2022, సోమవారం

ప్రతీకారంతో వందలాది కుక్కపిల్లలను వధించిన కోతులు...(న్యూస్)

 

                                           ప్రతీకారంతో వందలాది కుక్కపిల్లలను వధించిన కోతులు                                                                                                                                             (న్యూస్)

                                                 క్రూరత్వం కేవలం మనుషులకే కాదు, అనిపిస్తుంది.

మీరు మీ హాలిడే సీజన్ ఆనందాన్ని నాశనం చేసుకోకూడదనుకుంటే, మీరు కథనాన్ని చదవకుండా దాటేయచ్చు. ఎందుకంటే ఇది ఎవరినీ సంతోషపెట్టదు.

క్రూరమైన మరియు అసాధారణమైన విధంగా ప్రతీకారం తీర్చుకోవడం పూర్తిగా మానవ లక్షణం అని మనలో కొందరు అనుకోవచ్చు. కానీ జంతువులు కూడా క్రూరమైన, ప్రతీకార కోపాన్ని  కలిగి ఉన్నాయని తేలింది.

మధ్య భారతదేశంలోని బీడ్ జిల్లాలో కోతుల నెలరోజుల హత్యాకాండలో, కోతులు వందల కొద్దీ కుక్కపిల్లలను వధించాయి. మజల్గావ్ నగర పరిసర ప్రాంతాల్లో 250 కంటే ఎక్కువ పిల్ల కుక్కలను చంపాయి.

5,000 జనాభాతో మజల్గావ్కు ఆరు మైళ్ల దూరంలో ఉన్న లావూల్ గ్రామం కోతుల భీభత్సానికి కేంద్రంగా ఉంది. స్థానిక వార్తా ఛానెల్ న్యూస్ 18 ప్రకారం, గ్రామంలో ఒక్క కుక్క కూడా సజీవంగా లేదు.

మితిమీరిన క్రూరత్వం

గ్రామస్తుల ప్రకారం, కోతుల చర్యలు బహుశా న్యాయబద్ధమైన ప్రతీకారంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల క్రితం లావూల్కు చెందిన కుక్కల గుంపు కోతి పిల్లపై దాడి చేసి చంపేసినై.

దుఃఖంలో మునిగిన వానర దళం కుక్కలను శిక్చించాలని      నిర్ణయించుకున్నాయి. కానీ అవి కేవలం దెబ్బకు దెబ్బపై స్థిరపడలేదు

అసలు బాధిత కోతుల గుంపు తమ హంతక విధ్వంసానికి ఇతర కోతులను కూడా చేర్చుకున్నట్లు కనిపిస్తోంది. మరియు కుక్కపిల్లలను త్వరగా కొట్టి చంపడం వాటికి సరిపోలేదుదు. కుక్కలు తీవ్రంగా బాధ పడాలని నిర్ణయించుకున్నాయి.

ఎక్కువ శాతం దాడులు ఇదే క్రూరమైన పద్ధతిలో జరుపబడ్డాయని స్థానికులు చెబుతున్నారు. కోతులు కుక్కపిల్లని గుర్తించిన వెంటనే, దానిని పట్టుకోవడానికి పరుగెత్తుతాయి. పట్టుకున్న తరువాత, కోతులు నిస్సహాయ కుక్కపిల్లని చెట్టు పైభాగం లేదా భవనం పైకప్పు వంటి ఎత్తైన ప్రదేశానికి లాక్కెడుతాయి. అక్కడికి తీసుకు వెళ్ళిన తర్వాత, ఎత్తుపై నుంచి వాటిని కిందకు పడేస్తాయి.

 కుక్కపిల్లలు అయిపోయిన తర్వాత, కోతులు తాము మోయగలిగిన కుక్కలపైకి వెళ్లాయి. గత నెలలో, కోతులు ఆచరణాత్మకంగా లావూల్ లోని కుక్కలను నిర్మూలించాయి.

కొత్త లక్ష్యాలు

లావూల్ గ్రామస్తులు, కోతులు తమ క్రూరమైన కుక్కల-హత్యాకాండను అమలు చేస్తున్నప్పుడు కేవలం చూస్తూ నిలబడలేదు. ముందుగా స్థానిక వన్యప్రాణి అధికారులను సంప్రదించారు.

అయినప్పటికీ, కోపోద్రిక్తులైన కోతిని పట్టుకోవడం తేలికైన విషయం కాదు. జంతు నియంత్రణ అధికారులు ఎంత ప్రయత్నించినా ఒక్క కోతిని కూడా పట్టుకోలేకపోయారు.

అధికారులు కోతులను అడ్డుకోవడం విజయవంతం కాకపోవడం, కోతుల ప్రతీకార వలయం వెంటాడుతూనే ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెంది, తమ ప్రయత్నంగా కోతులను పట్టుకోవాలని చూశారు. కానీ వారికి కుదరలేదు.

అయితే కోతులను అడ్డుకునేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు కోతుల ఆగ్రహానికి ఆజ్యం పోశాయి. కోతులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పురుషులపై దాడి చేయడం ప్రారంభించాయి.

నివేదికల ప్రకారం, కోతులను లొంగదీసుకునే ప్రయత్నంలో చాలా మంది వ్యక్తులు భవనాలపై నుండి పడిపోయారు లేదా గాయపడ్డారు. కానీ అది పెద్ద సమస్యకాదు?.

కుక్కలు వాటిపై దాడి చేయడంతో మొదట కోతులు కుక్కలను హత్య చేసేందుకు పూనుకున్నాయి. మనుషులు కూడా తమపై దాడి చేయడం ప్రారంభించినప్పుడు అవి ఎలా స్పందించాయని మీరు అనుకుంటున్నారు

అవి అప్పుడు మానవ పిల్లలపై దాడి చేయడం ప్రారంభించాయి.

పాఠశాలకు వెళ్తున్న పలువురు చిన్నారులపై కోతులు దాడిచేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఎటువంటి మానవ ప్రాణనష్టం జరగనప్పటికీ, గ్రామస్థులు నిజంగా భయాందోళనలకు గురవుతున్నారు.

ఇప్పుడు అధికారులూ, స్థానికులూ పహారా కాస్తున్నారట.

Images Credits: To those who took the original photos.

***************************************************************************************************



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి