4, నవంబర్ 2021, గురువారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-3

 

                                                                        నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                                    PART-3

బయట ఒకటి, రహస్యంగా ఒకటి అని రెండు జీవితాలు జీవిస్తున్నాడు మోహన్. అతను మంచివాడుఅనే ఒక మోహమే సౌందర్య కు కనబడింది.

నిజమైన మొహాన్ని అతను చాలా జాగ్రత్తగా సౌందర్య కు కనబడకుండా దాచి పెట్టాడు. అదే అతని వ్యాపారం. చట్టానికి విరుద్దమైన వ్యాపారం.

అయినా కానీ, చట్టాన్ని--గౌరవించే వారికి లంచాలుఇస్తూ రావటంతో, అదే అతని వ్యాపారానికి రహస్య కాపలాగా ఉన్నది.

గ్రామం నుండి నగరానికి వచ్చిన వెంటనే ఒక నీడ ప్రపంచ దాదా దగ్గర అతని ఉద్యోగం ఏర్పాటు అయ్యింది. ప్రారంభంలో అది అతనికి నచ్చలేదు. దానికి తోడు భయంగా ఉండేది.

కానీ, చేతిలోకి వస్తున్న డబ్బు, ఎలాంటి బాధ్యతా-కలత లేని జీవితమూ, ఆడవారి సావాసం, అతన్ని జీవితానికి కట్టిపడేసింది.

గత రెండు సంవత్సరాలలో, డబ్బు కోసం ఎలాంటి మహా కిరాతకమైన పనినైనా చేయటం మొదలు పెట్టాడు.

ఇది ఏదీ సౌందర్య కు తెలియదు. కొన్ని సంధర్భాలలో అతని వ్యాపారం గురించి అడిగేది. తెలివిగా ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకునే వాడు.

జీవితం సంతోషంగా గడుస్తూ ఉండటంతో, ఇక ఆమె దేని గురించీ దిగులు పడలేదు. మోహన్ కూడా సౌందర్య కు ఎటువంటి కొరత రాకుండా జాగ్రత్త పడుతూ చూసుకున్నాడు.

వాళ్ళకు బిడ్డ స్వప్నా పుట్టి ఒక సంవత్సరం అయ్యింది.

పక్కింటి ఏడుకొండలు అన్నయ్య, సరస్వతి వదిన వాళ్లకు ఆదరణగా ఉన్నారు. మిగతా వారు కూడా వాళ్ళ దగ్గర ప్రేమగానే నడుచుకున్నారు. అలాంటి సమయంలోనే సౌందర్య జీవితంలో ఎదురుచూడని పిడుగు పడింది.

మోహన్ యజమాని, ఎదురు చూడని పరిస్థితులలో సౌందర్య ను చూశేశాడు. ఆమె అందానికి ముగ్దుడయ్యాడు. మోహన్ దగ్గర తన ఇష్టాన్ని బహిరంగంగానే చెప్పాడు.

మోహన్ కూడా దానిని చాలా సింపుల్ గా తీసుకున్నాడు. అతని చరిత్రలో ప్రాతివత్యం, నిజాయతీ లాంటి మాటలకు చోటు లేదు. అంతే కాకుండా, యజమాని గోవర్ధన్ తో మరింత సన్నిహితంగా ఉండటానికి ఇదొక సంధర్భం అనుకున్నాడు.

సౌందర్య మాత్రం కొంచం సహకరిస్తే, వ్యాపారంలో తన పొజిషన్ చాలా పెద్దదిగా పెరుగుతుంది అని ప్లాను వేశాడు. నేను తప్ప ఆమెకు ఇంకెవరూ లేరు కాబట్టి ఆమె నేను చెప్పేది వినే తీరాలి అని అనుకున్నాడు.

ఒక రోజు మోహన్ ఇంట్లో యజమాని గోవర్ధన్ కు స్పేషల్ మధ్యాహ్న విందు ఏర్పాటు చేయబడింది. సరస్వతి వదిన వచ్చి సౌందర్య కు సహాయం చేయటంతో...వంట పనులు చేసి ముగించారు. వెళ్ళేటప్పుడు సరస్వతి సౌందర్య దగ్గర ఇంటికొచ్చే గెస్టును మంచిగా చూసుకోఅని చూచాయగా చెప్పేసి వెళ్ళింది. సరస్వతి వదిన చెప్పిన దాంట్లోని లోపలి అర్ధం అప్పుడు సౌందర్య అర్ధం చేసుకోలేదు.  

యజమాని గోవర్ధన్ వచ్చిన వెంటనే విందు ఏర్పాటుకు ముఖ్యమైన కారణం ఏమిటో చెప్పిన తరువాత ఆమె అల్లాడిపోయింది.

పిచ్చి ఎక్కిన మృగం ఒకటి తన మీద దూకటానికి తయారుగా ఉండటాన్ని గ్రహించింది. పరిస్థితి విషమించే లోపే ఇల్లు వదిలి తప్పించుకోవాలిఅని నిర్ణయించుకుంది.

ఎక్కడి నుండి వచ్చింది ధైర్యం అనేది సౌందర్య కే తెలియలేదు. ఊయలలో పడుకోనున్న బిడ్డ స్వప్నాను ఎత్తుకుని పిచ్చి పట్టిన దానిలాగా బయటకు పరిగెత్తింది.

సౌందర్య అలా చేస్తుందని కొంచం కూడా ఎదురు చూడని మోహన్, గోవర్ధన్ అదిరిపడ్డారు.

సౌందర్య వేగంగా పరిగెత్తుకు వెళ్ళిన చోటు....

పోలీస్ స్టేషన్!

అక్కడున్న అధికారి దగ్గర తన పరిస్థితి వివరించింది. అధికారి ఒక కానిస్టేబుల్ ను పిలిచాడు. ఆమెతో వెళ్ళి ఆమె భర్తను లాక్కురమ్మన్నాడు.

కానిస్టేబుల్ తో కలిసి ఇంటికి వచ్చింది సౌందర్య. అప్పుడు ఇంట్లో నుండి ఎవడో ఒకడు బయటకు వచ్చాడు.

అతన్ని చూసిన వెంటనే కానిస్టేబుల్ అడిగాడు ఏమిటి తుకారాం, ఎలా ఉన్నావు?”

నేను బాగున్నానయ్యా అన్నాడు అతను చేతులు కట్టుకుని.

మరు క్షణం ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఈమే నా భార్య అయ్యా అన్నాడు తుకారాం. సౌందర్య కి తల తిరిగింది.

కొద్ది సేపటి ముందు వరకు భర్తతో తాను కాపురం ఉన్న ఇంట్లో, ఇప్పుడు ఎవరెవరో ఉన్నారు. భర్త అక్కడ లేడు!

అయ్యా...ఇది నేనూ, నా భర్త రెండు సంవత్సరాలుగా కాపురం ఉంటున్న ఇల్లయ్యా ఆవేశంగా చెప్పింది.

కానిస్టేబుల్ కు ఇప్పుడు విషయం అర్ధమయ్యింది.

అయినా కానీ కఠినత్వం చూపించాడు. ఇది మీ ఇల్లు అనడానికి ఏదైనా ఆధారం ఉందా?”

సౌందర్య ఆలొచించింది.

మోహన్ తో కలిసి ఒక ఫోటో కూడా తీయించుకోలేదు. ఆమె ఆశపడినప్పుడు మోహన్ ఏవో మాటలు చెప్పి వద్దన్నాడు.

అతను కట్టిన తాళికి ఇప్పుడు అర్ధం లేకుండా పోయింది.

తమ పెళ్ళిన రిజిస్టర్ చేసుకోవాలనే హెచ్చరిక భావం ఆమెలో ఎప్పుడూ ఏర్పడింది లేదు.

మోహన్ మీద ఆమెకు అంత నమ్మకం. తనకు సపోర్టుగా ఏదీ లేదని ఆమె గ్రహించినప్పుడు భయపడింది. ఏం చేయాలనేది తెలియక ఆందోళనతో నిలబడున్నప్పుడు...

పక్కింట్లోంచి ఏడుకొండలు అన్నయ్యా, సరస్వతి వదినా బయటకు వచ్చారు. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది సౌందర్య కు. హడావిడిగా వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది.

అన్నయ్యా! ఎవరేవరో నా ఇంట్లో ఉండి, ఇది వాళ్ళ ఇల్లు అని చెబుతున్నారు. మోహన్ కూడా కనబడటం లేదు. మీరైనా పోలీసుల దగ్గర నిజం చెప్పండి -- బ్రతిమిలాడింది.  

ఎవరమ్మా నువ్వు? తుకారామూ, అతని భార్య ఐదారు సంవత్సరాలుగా ఇంట్లోనే కాపురం ఉంటున్నారు  సౌందర్య ఉలిక్కిపడేలాగా  ఒక్కసారిగా అబద్దం చెప్పాడు ఏడుకొండలు.

ఇంతకు ముందు మేము నిన్ను చూసిందే లేదే...ఎవరమ్మా మోహన్? అలాంటి వారు మాకు ఎవరూ తెలియదే! వంతు పాడింది సరస్వతి.

కొంత సేపటికి ముందు వరకు తనతో కలిసి నవ్వుతూ మాట్లాడి, వంట చేసిన సరస్వతేనా ఇలా మాట్లాడుతోంది? ఎందుకు వాళ్ళు ఇలా తలకిందలుగా మారిపోయి మాట్లాడుతున్నారు?’

ప్రపంచమే చీకటైపోయినట్టు అనిపించింది...చుట్టూ గుమికూడిన వాళ్ళు వేడుక చూశారు గానీ, ఎవరూ ఆమె సహాయానికి రాలేదు.

కానిస్టేబుల్ చెప్పాడుఅమ్మా...నువ్వేదో మనసు గందరగోళంలో ఉన్నావు. ఇక్కడున్న వారందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు. నా దగ్గర అబద్దం చెప్పరు. నువ్వే బాగా ఆలొచించి మీ ఇల్లు ఎక్కడుందో గుర్తుకు తెచ్చుకుని మీ ఇంటికి వెళ్ళు చేరు

ఆమెను అక్కడే వదిలిపెట్టి అతను అక్కడ్నుంచి బయలుదేరాడు.

ఆమె తపించిపోయింది.

                                                                                                Continued....PART-4

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి