22, ఆగస్టు 2021, ఆదివారం

కదిలే రాళ్ళు...(మిస్టరీ)

 

                                                                                  కదిలే రాళ్ళు                                                                                                                                                                                    (మిస్టరీ)

అదొక ఎడారి ప్రాంతం. ప్రాంతంలో ఎవరూ మనుషులు ఉండరు. అక్కడ కుప్పలు కుప్పలుగా రాళ్లు మాత్రం ఉంటాయి. మరి రాళ్లు అక్కడ ఉండటం ఏం వింతని ఆశ్చర్యపోతున్నారా. అక్కడే మిస్టరీ దాగి ఉంది. అవన్నీ కదిలే రాళ్లు. ఒక రోజు ఒకచోట ఉన్న రాయి తెల్లారేసరికి వేరోచోట ఉంటుంది. మరి మనుషులే లేని చోట రాళ్లు ఎలా కదిలాయి. అంత నిర్మానుష్య ఎడారిలో రాళ్లు ఎలా కదులుతున్నాయి.

అమెరికాలోని మిడిల్కాలిఫోర్నియాలోని పానామింట్పర్వతాలకు సమీపంలో మృత్యులోయ అనే ప్రదేశం ఉంది. అక్కడ జనసంచారం ఉండదు కాబట్టి దానికి పేరు వచ్చింది. అది ఎడారి లాంటి ప్రదేశం.

అక్కడ రాళ్లు జీవం ఉన్న ప్రాణుల్లా వాటంతట అవే కదులుతాయి. రాళ్లనే సెయిలింగ్స్టోన్స్అనీ, స్లైడింగ్రాక్స్అనీ, మూవింగ్రాక్స్అనీ ఇలా ఎవరికి తోచిన పేర్లు వారు పెడుతూ వచ్చారు

అక్కడ ఎడారిలో ఎండిన సరస్సులో బరువైన రాతిశిలలు కదులుతూ ఉంటాయి. ఒక్కో రాతిశిల బరువు 700 పౌండ్లు ఉంటుంది. మరి అంత బరువున్న రాయి ఉన్న ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి ఎలా కదులుతుందనేది తెలియక సైంటిస్టులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. రాళ్లు కదిలినట్లుగా మనకు అక్కడ ఈజీగా తెలుస్తుంది. అవి ఎంత దూరం ప్రయాణించాయో ప్రయాణించిన మేరకు చారలు స్పష్టంగా కనిపిస్తాయి అక్కడ. చార చివరలో రాయి ఆగి ఉంటుంది. చారల ద్వారా రాయి ఎక్కడ నుంచి ఎక్కడికి దొర్లుకుంటూ వచ్చిందనే విషయం తెలుసుకోవచ్చు

అయితే రాళ్లు రోజూ కదులుతూ ఉంటాయి అనుకుంటే పొరబాటే. రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రాళ్లు కదలడం లేదా దొర్లడం జరుగుతూ ఉంటుంది. అదీ సమాంతరంగా ఒక రాయి కదలడం మొదలుపెడితే రాతితో పాటే మరో రాయి తన దిశను మార్చుకుంటుంది. దిశ మార్చుకున్న రాయి, సమాంతర రాయి రెండూ ఒకే బరువుతో ఉండడం ఇంకో విశేషం.

దాదాపు తొంభై సంవత్సరాల క్రితం పరిశోధకులు రాళ్ల కదలికలను మొదటిసారి గుర్తించారు. ఇప్పటికి డెబ్బై ఏళ్లుగా వీటి కదలికలపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. పరిశోధనలు చాలా వరకు సఫలీకృతం కాలేదు.

పరిశోధనలు జరుగుతున్నంతసేపూ ఒక్క అంగుళం కూడా కదలని రాళ్లు పరిశోధనలు అయిపోయి వారంతా తిరిగి వెళ్లిపోతున్నప్పుడు కదిలాయి. కానీ వీటిని వీడియోలో బంధించలేక పోయారు. ఫోటోలు మాత్రం తీయగలిగారు.

1955లో, 1972లో బాండ్షార్ప్, డ్విట్కేరే అనే శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ఆయా ప్రాంతాల్లో అప్పటికే 30 రాతిశిలల్లో కదలిక ఉందని గ్రహించారు. ఏడేళ్ల సుదీర్ఘ కాలంలో పరిశోధనల్లో కొంత పురోగతి కనిపించినప్పటికీ సంగతులేవీ సరిగ్గా తెలియలేదు.

1972లో బాబ్ షార్ప్ అనే పరిశోధకుడు డెత్ వేలీలోని ముప్పై రాళ్లకి పేర్లుపెట్టి వాటి బరువు, చుట్టుకొలతలని తీసుకున్నాడు. వాటి స్థానాలని కూడా మార్చాడు. కొన్ని మాసాల తర్వాత వెళ్లి చూస్తే వాటిలోని ఇరవై ఐదు రాళ్లు రెండు వందలనుంచి రెండు వందల పన్నెండు అడుగుల దూరం కదిలినట్టు తెలిసింది.మేరీ ఏన్ అనే పేరుపెట్టిన రాయి ఎక్కువ దూరం, అంటే రెండు వందల పన్నండు అడుగుల దూరం వెళ్లింది. అవన్నీ కేవలం వేసవిలోనే కదిలాయి.

1993లో జరిగిన మరో పరిశోధనలో కరెన్ అనే రాయి అరమైలు వరకు ప్రయాణించిందని కనుగొన్నారు. రాళ్లల్లో వాటిని కదిలించే శక్తి కానీ జీవి కాని పరిశోధకులకి కనపడలేదు. ఇక పరిశోధనలో తేల్చింది ఏంటంటే... ప్రాంతం కొండల మధ్యలో ఉంటుంది. వర్షాకాలంలో అక్కడ భారీగా వర్షాలు కురుస్తాయి. కొండల వాలు వెంబడి వర్షం నీరు జారి మైదానాన్ని ముంచెత్తుతుంది. ప్రాంతం చిన్నపాటి సరస్సులా మారుతుంది.

ఎండాకాలంలో నీరు పూర్తిగా ఇంకిపోతుంది. ఎండిన నేలలో బీటలు పడతాయి. అప్పుడు నేల మీద పూర్తిగా తడి ఆరని పరిస్థితుల్లో నేల చిత్తడిగా ఉంటుంది. స్థితిలో రాళ్లకి నేలకి మద్య రాపిడి కాస్త తక్కువగా ఉంటుంది. సమయంలో గాలి ప్రభావం వల్ల రాళ్లు మరికొంచెం వేగంగా కదిలే అవకాశం.

ప్రాంతంలో గమనించదగిన విషయం ఏంటంటే అక్కడ బలమైన ఈదురు గాలులు వీస్తాయి. అక్కడి గాలులు సామాన్యంగా నైరుతి దిశ నుంచి ఈశాన్యదిశ వైపు వీస్తుంటాయి. విచిత్రమేమిటంటే, కదిలే రాళ్ల దిశ కూడా క్రమంలోనే ఉంటుంది. విషయమై వైజ్ఞానిక బృందం పరిశోధించింది.

మంచు, గాలి రాళ్ల కదలికకు కారణమనీ, వేసవి కాలంలో వీటిలో కదలికలు లేవనీ, శీతాకాలంలో మాత్రమే కదులుతున్నాయని తేల్చారు. ఆయా కాలాల్లో వీచే గాలులు,శీతోష్ణ స్థితిగతులు ఇవన్నీ రాతి కదలికలపై ప్రభావాన్ని చూపుతున్నాయని కనుగొన్నారు.

మరొక శాస్త్రవేత్త పీ మెస్సినా ఇంకో రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఆమె రేస్ట్రాక్ ప్లాయా వాతావరణ పరిస్థితుల ప్రభావం ద్వారా రాళ్లు కదిలే అవకాశం ఉందని తెలిపింది.

రాళ్లు సంవత్సరంలో నాలుగుసార్లు అయినా కదులుతాయి. ప్రాణం లేని రాళ్లు ఎందుకు కదులుతున్నాయో తెలుసుకునే పరిశోధనలు 1948 నుంచి కొనసాగుతున్నాయి.

అయితే రాళ్లు కదులుతుండగా ఇంతవరకూ ఎవరూ చూడలేదు. ఇకపైన జరిగే పరిశోధనల్లో అయినా కదిలే రాళ్ల వెనక రహస్యం తెలుస్తుందేమో..చూడాలి.

Image Credits: To those who took the original photos.

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి