22, ఫిబ్రవరి 2022, మంగళవారం

శపించబడిన ఒక ద్వీపం...(మిస్టరీ)

 

                                                                           శపించబడిన ఒక ద్వీపం                                                                                                                                                                         (మిస్టరీ)

గియోలా ద్వీపం: (ఇటాలీ భాషలో ఐసోలా డెల్లా గయోలా) ఇటలీలోని నేపుల్స్ సముద్ర ఖాతంలోని  చిన్న ద్వీపాలలో ఒకటి, ఇది గయోల్ అండర్వాటర్ పార్క్ నడిబొడ్డున ఉన్న నేపుల్స్ సముద్ర అగాధముపై ఉంది, ఇది సుమారు 42 హెక్టార్ల రక్షిత ప్రాంతం. ద్వీపం రెండు అద్భుతమైన, నిర్మలమైన అతిచిన్న ద్వీపాలను కలిగి ఉంది. పోసిలిపో నగరం  యొక్క దక్షిణ సరిహద్దులోని తీరప్రాంతానికి చాలా సమీపంలో ఉంది - సుమారు 30 మీటర్ల దూరంలో ఉన్న ద్వీపంను చేరుకోవడం చాలా సులభం. ఒక ద్వీపంలో ఏకాంతమైన విల్లా ఉండగా, మరొక ద్వీపంలో  ఎవరూ లేరు. ఒక చిన్న వంతెన రెండు ద్వీపాలను కలుపుతుంది.

ద్వీపానికి గియోలా అనే పేరు లాటిన్ భాషలోని కేవియా అనే పదం నుండి వచ్చింది., కేవియా అంటే "చిన్న గుహ" అని అర్ధం. ఆపై "కేవియోలా" అనే మాండలికం ద్వారా పొసిలిపో నగర సముద్ర  తీరాన్ని చుట్టుముట్టే కావిటీస్ నుండి ద్వీపం దాని పేరును తీసుకుంది. వాస్తవానికి, చిన్న ద్వీపాన్ని యూప్లియా అని కూడా పిలుస్తారు. సురక్షిత నావిగేషన్ యొక్క రక్షకుడు శుక్రుడికి అంకితం చేయబడిన ఒక చిన్న ఆలయం ఉన్న ప్రదేశం. రోమన్ల కాలం నుండి అనేక ఇతర శిధిలాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి, నీటిలోని ద్వీపాల క్రింద అనేక రోమన్ నిర్మాణాలు ఉన్నాయి, అవి ఇప్పుడు సముద్ర జీవుల నివాసంగా ఉన్నాయిమాంత్రికుడిగా భావించే కవి వర్జిల్ ఇక్కడ శిధిలాల వద్ద బోధించేవాడని కొందరు నమ్ముతారు.

19 శతాబ్దం ప్రారంభంలో, ద్వీపానికి "ది విజార్డ్" అని పిలువబడే సన్యాసి వచ్చాడు. ఆయన అక్కడ నివసించేవాడు తరువాతే, ద్వీపంలో (ఫోటోలో చూస్తున్న) విల్లా నిర్మాణం చేయబడింది. ఇది ఒకప్పుడు, ల్యాండ్ ఆఫ్ ది సైరన్ రచయిత నార్మన్ డగ్లస్ యాజమాన్యంలో ఉండేది. పదవీ విరమణ తరువాత ప్రశాంతంగా జీవితం గడపడానికి చాలా బాగుంటుందని అనుకునే వారు. కానీ, స్థానికులు ద్వీపం శపించబడిందని నమ్ముతారు. ఎందుకంటే ద్వీపంలొ నిర్మించబడ్డ విల్లాను కొనుకున్న దాని యజమానులు తరచూ అకాల మరణం చెందిన కారణంగా ద్వీపానికి శపించబడ్డ ద్వీపం అనే పేరు శాశ్వతమయ్యింది.

దురదృష్టకర పరంపరలు 1920 లలో ప్రారంభమయ్యాయి, అప్పటి యజమాని, హన్స్ బ్రాన్ అనే స్విస్ దేశస్తుడు హత్య చేయబడి, ఒక రగ్గుతో చుట్టబడి ఉన్నట్లు కనుగొనబడింది. కొద్దిసేపటి తరువాత అతని భార్య సముద్రంలో మునిగి చనిపోయింది. విల్లా యొక్క తదుపరి యజమాని జర్మన్ ఒట్టో గ్రున్బ్యాక్. అతను ద్వీపంలో ఉన్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. తరువాతి యజమాని స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఔషధ పారిశ్రామికవేత్త మారిస్-వైవ్స్ సాండోజ్. ఈయనకు మానసిక వ్యాధి ఏర్పడటంతోస్విట్జర్లాండ్లోని ఒక మానసిక ఆసుపత్రిలో చేర్చారు. కానీ, ఆయన అక్కడ  ఆత్మహత్య చేసుకున్నాడు. శాపం ఆయన్ను కూడా వదిలిపెట్టలేదని స్థానికి నివాసులు వాదించారు. దాని తరువాతి యజమాని, జర్మన్ స్టీల్ పారిశ్రామికవేత్త, బారన్ కార్ల్ పాల్ లాంగీం. అడవి జీవనం ద్వారా ఆర్థిక నాశనానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. తరువాత ద్వీపాన్ని ఫియట్ అధిపతి జియాని ఆగ్నెల్లికి కొనుక్కున్నారు. అతని ఏకైక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి అకాల మరణం తరువాత జియాని తన మేనల్లుడు ఉంబెర్టో ఆగ్నెల్లిని తీసుకు వచ్చి ఫియట్ నడపడం ప్రారంభించాడు, కాని ఉంబెర్టో కూడా 33 సంవత్సరాల వయస్సులో అరుదైన క్యాన్సర్తో మరణించాడు. మరొక యజమాని, మల్టీ-బిలియనీర్ పాల్ జెట్టి, ద్వీపాన్ని కొనుగోలు చేసిన తరువాత, అతని మనవడు కిడ్నాప్ చేయబడ్డాడు. అప్పుడు ఆయన విల్లాను జియాన్పాస్క్వెల్ గ్రాప్పోన్ అనే ఇన్ స్యూరన్స్ వ్యాపరవేత్తకు అమ్మాడు. అతని భీమా సంస్థ విఫలమైనప్పుడు అతను  జైలు పాలయ్యాడు. తరువాత, విల్లా జనావాసాలు లేకుండా వదిలివేయబడింది.


అది నిజంగానే శపించబడ్డ ద్వీపంగా నిర్ణయించి నాటి పాలకులు దానిని కైవసం చేసుకుని అలాగే ఉంచారు. రోజులు, సంవత్సరాలు గడిచిన తరువాత పర్యాటకులను మాత్రం అనుమతిస్తున్నారు.

Images Credits: To those who took the original photos.

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి