10, జనవరి 2024, బుధవారం

ఇంటింటి వెన్నెలలు...(సీరియల్)---PART-3


                                                                           ఇంటింటి వెన్నెలలు...(సీరియల్)                                                                                                                                                               (PART-3) 

తిన్నగా బ్యాంకుకు వచ్చారు.

"అమ్మా...నీ నగ వద్దు. మేము ఏర్పాటు చేసుకుంటాము"

లేదు రఘూ! నేను సరదాకి మాట్లాడాలేదు. నువ్వు నా కొడుకువు. నీ కష్ట నష్టాలలో నాకూ భాగం ఉంది. నన్ను ఆపకు! ఏ.టి.ఏం. లో డబ్బులు తీసుకో. పక్కనున్న నగల కొట్టు మనకు తెలిసిందే. నగ అమ్మితే డబ్బులు ఇస్తాడు. ఈ వయసులో నగ పెట్టుకుని నేనేం చేస్తాను? రామ్మా"

"అత్తయ్యా! అందులో అందరికీ భాగం ఉందని సత్యా గొడవ మొదలుపెట్టింది"

తల్లి చెప్పినట్టు నగలను అమ్మి, అవసరమైన 'బడ్జెట్టు' ను అక్కడే లెక్క కట్టి, మిగిలిన డబ్బుతో ఒక జత గాజులు కొని... సరోజాకి వేయగా,

ఆమె అదిరిపడ్డది.

"ఇది ఎందుకు అత్తయ్యా?"

"నా మనవరాలికి! జ్యోతీ సేవింగ్స్ చేసి తన పిల్ల భవిష్యత్తు ప్లాను వేసుకుంటోంది. నా కూతుర్లు స్వార్ద పరులుగా కూర్చుని తింటున్నారు. నువ్వూ, రఘూ మీ చేతిలో ఏమీ ఉంచుకోకుండా...ఇరవై నాలుగు గంటలూ పనులు చేస్తూ,  ఇప్పుడు అందరి మాటలకూ గురి అవుతున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను.  నేను చాలా లెక్క పత్రాలు మాట్లాడవలసి ఉంది. అవసరమైన వస్తువులు కొని, కాపురానికి ఏర్పాట్లు చేద్దాం. మిగిలినవన్నీ తరువాత!"

ఇంటికి కావలసిన అన్ని వస్తువలనూ లిస్టు రాసి, ఒకే షాపులో కొన్నారు.

కొత్త ఇంటి అడ్రస్సు ఇచ్చి హోం డెలివరీ చెయ్యమన్నారు.

తల్లి తుఫాను వేగంతో పనిచేసింది.

కొత్త ఇంటికి రాగానే, స్నేహితురాలు నిత్యా కాచుకోనున్నది.

"లోపలకు రా సరోజా!"

బిడ్డతో పాటూ ముగ్గురూ వచ్చి చుట్టి చూడ...ఇల్లు పెద్దదిగా, గాలి, వెళుతురు వాటంతో ప్రకాశంగా ఉన్నది. ఇంటికి పక్క వీధిలోనే సరోజాకి స్కూలు. పక్కనే చాలా షాపులు, బ్యాంకు, హాస్పిటల్, హోటల్, ఇంటి వాకిట్లోనే బస్ స్టాండ్, షేర్ ఆటో అంటూ అద్భుతమైన చోటు.

"అత్తయ్య కూడా మాతోటే ఉండబోతోంది. మనవరాలిని వదిలి అక్కడ ఉండలేదు"

"నువ్వు అదృష్టవంతు రాలివి"

"లేదమ్మాయ్! మాకు సరోజా దొరకటం వలన మేమే అదృష్టవంతులం" – గిరిజా చెప్పగా.

రఘూ వంకర్లు తిరిగాడు.

ఇల్లు బాగా కట్టారు. గంటలో కొన్ని వస్తువులు వచ్చి దిగినై...వాటిని సర్దాల్సిన చోటు చూసి ఇద్దరూ సర్దటం మొదలుపెట్ట,

కొనుకొచ్చిన దేవుడి ఫోటోలు పూజ భాగంలో ఉంచ,

ఇంటికి ఒక కళ వచ్చింది.

"రేప్రొద్దున ఏడు గంటలకు పాలుకాచి, పూజ చేసేసి కాపురం మొదలు పెడదాం"

"అమ్మా! మనింట్లో పద్దెనిమిది మంది ఉన్నారే. టిఫిను, భోజనం హోటల్లో చెప్పేద్దాం"

"వద్దు. నేనూ, సరోజా చేసేస్తాం. అందరినీ పిలుస్తావా?"

"ఖచ్చితంగా! మనం గొడవపడి రాలేదుగామ్మా...మంచిగానే కదా రాబోతున్నాము"

"అత్తయ్యా...మావయ్య దీన్ని ఇష్టపడతారా?"

"దేన్నమ్మా?"

"మీరు మాతో రావటాన్ని..."

"దీన్ని ఆపాలంటే ఆయన న్యాయంగా నడుచుకోవాలి. పోతే పోనీ అని నేనూ ఓర్చుకుని ఇన్ని రోజులు ఉన్నాను. సత్యా దగ్గర చాలాసార్లు చెప్పేను. ఇది నీ ఇల్లు కాదు...ఇది పద్దతి కాదు అని చెప్పాను. అది వినడం లేదు. అందరూ దానివైపు నిలబడ్డారు. చలపతి, జ్యోతీ...డబ్బులు విసేరేసి ఏమీ పట్టనట్టు జీవిస్తున్నారు. చెత్త కాగితం ముక్కను కూడా కింద నుండి తీసి ఏరి పారేయలేరు.  మీ మామగారు ఉద్యోగం చేస్తున్న కారణంగా, దగ్గర దగ్గర నలుగురు పిల్లలను పెంచుతూ...ఇంటి పనులూ చేయటానికి నా దగ్గర ఓపిక లేదు. నువ్వొక్కదానివే కదా గొడ్డులాగా పనిచేశావు.

ఇవన్నీ ఒక ముగింపు రావాలి. కన్న తల్లిని కాబట్టి, అన్నిటినీ సహించుకున్నాను. ఇక సత్యా యొక్క ఆటలు జ్యోతీ దగ్గర చెల్లుబడి కావు. మీ మామగారూ, చలపతి...ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. జ్యోతీ ఏ పనీ చేయకుండా జీవించగలదు.  రంగు తేలిపోతుంది. నువ్వూ, నేనూ ఉన్నంత వరకు బద్దకస్తులకు స్వర్గంగా ఉన్న ఆ ఇల్లు, ఇక అడ్రస్సు మార్చుకుంటుంది. న్యాయాన్ని వాళ్ళు ఫీలవాలి సరోజా లేకపోతే మీ మావయ్యకే తిండి దొరకదు" 

"పాపం అత్తయ్యా...అలా మాట్లాడకండీ"

"లేదమ్మా! అన్యాయానికి తోడుగా ఉండే వాళ్ళందరినీ దేవుడే శిక్షిస్తాడని మనం ఏమీ చేయకుండా కూర్చుంటే అది మూర్ఖత్వం. కొన్ని సంధర్భాలలో తీర్పులను మనం రాసుకోవచ్చు. అందులో తప్పులేదు"

తల్లి దీర్ఘంగా మాట్లాడ,

రఘూ ఆశ్చర్యపోయాడు.

అమ్మ దగ్గర పారపక్ష్యం లేదు! కుట్ర లేదు. న్యాయమైన మహిళ అనేది రఘూ, సరోజా ఇద్దరికీ తెలుసు. అందువలనే అమ్మకోసం అన్నిటినీ సహించుకో  గలిగాడు.

ఆ తల్లే ఇప్పుడు ఉద్యమకారినిలాగా లేచిందే!   

అదే సమయం అక్కడ ఇంట్లో పెద్దక్క సుమతి, రెండో అక్క కమల తో మీటింగు పెట్టింది సత్యా.

కమల దేంట్లోనూ కలగజేసుకోదు. ఎవరినీ సపోర్ట్ చేసి మాట్లాడదు. పెద్దక్క సుమతి, సత్యాకు సపోర్టు చేస్తుంది.

"అమ్మకు పిచ్చెక్కింది. లేకపోతే వాళ్ళతో ఎందుకు వెళ్లటం?"

"చెబితే వినటంలేదక్కా. ఆ సరోజా అమ్మకు చేతబడి చేసుంటుంది. మనం మాట్లాడి లాభం లేదు.

"వేరే ఎవరు మాట్లాడతారు?"

"అమ్మను వెళ్ళకూడదని నాన్న ఆర్డర్ వేస్తే?"

"వేస్తారా?"

"వేయించాలి...భర్త మాటను కాదని వెళ్ళగలదా...అమ్మకు అది గౌరవమా?"

"నాన్నను పిలు!"

సత్యా ఆయన్ని లాక్కొచ్చింది.

అమ్మ ఎందుకు వెళ్ళాలి...ఎందుకు అనుమతించారు? నిషేదించండి. వెళ్ళకూడదని అడ్డుపడి ఆపండి"

ఆయన మాట్లాడలేదు.

"తెల్లవారు జామున ఐదు గంటలకు మీరు లేచిన వెంటనే 'బెడ్ కాఫీతో' మొదలై, రాత్రి నిద్రపోయే ముందు గ్లాసుడు పాల వరకు మీ 'రొటీన్ ' అమ్మకు మాత్రమే తెలుసు. తాగిన కాఫీ గ్లాసును వంగి కిందపెట్టని మనిషి! వంట గదివైపు వెళ్ళిందే లేదు. మీ డ్రస్సు, మనీపర్స్, సెల్ ఫోన్, ఐ.డీ కార్డు ఎక్కడున్నాయో మీకు తెలుసా? అమ్మ లేకుండా ఒక్కరోజు మీరు ఉండగలరా?"

అప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు.

"మీకు చెయ్యాల్సిన బాధ్యత అమ్మకు ఉంది. వెళ్ళకుండా అడ్డుపడి ఆపండి. దేనికీ మీరు సమాధానం చెప్పకపోతే ఎలా?"

"రానీ...మాట్లాడదాం!"

అన్నీ పనులూ ముగించుకుని సాయంత్రం ఆరు గంటలకు అమ్మ, రఘూ, సరోజా వచ్చారు.....తమ బట్టలు, వస్తువులూ ప్యాక్ చేశారు.

"నాన్నా...రేపు ప్రొద్దున ఏడు గంటలకు పాలు కాస్తున్నాం. బండి ఏర్పాటు చేసాను. ఆరు గంటలకు అందరూ స్నానాలు ముగించుకుని రెడీగా ఉండండి"

"అమ్మ కూడానా?" -- సత్యా అడగ,

రఘూ సమాధానం ఇవ్వలేదు.

సత్యా, తల్లి దగ్గరకు వచ్చింది.

"నువ్వు నాన్నను వదిలి వెళ్ళటం పద్దతి కాదు!"

"ఇది సొంత నిర్ణయం! దాని గురించి మాట్లాడటానికి నీకు ఎటువంటి హక్కూ లేదు"

"నాన్న కోసరమే మాట్లాడుతున్నాను"

"మీ నాన్న ఏమైనా మూగవారా?"

జగన్నాధం దగ్గరకు వచ్చారు.

"శారదా! నువ్వు వెళ్ళద్దు"

"లేదండీ...నేను వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. నా మనవరాలితోనే ఉంటాను"

"ఇక్కడ నీకు ఇద్దరు మనవుళ్ళు, ఒక మనవరాలూ ఉంది" -- అన్నది సత్యా

"నేను నాన్నతో మాట్లాడ తున్నాను"

"నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏముంది గిరిజా...? అలా నీకు ఇక్కడేం తక్కువ?"

"నేను పనులు చేయలేను. నాకు రెస్టు కావాలి. నన్ను కూర్చోబెట్టి చేసేది సరోజా మాత్రమే! మిగిలిన వాళ్ళెవరూ చేయ్యరు. నా సమస్యలూ, భావాలూ అర్ధం చేసుకున్నది అదొక్కతే. నా వసతి కోసం నేను వెడుతున్నాను"

"అయితే...నాన్న యొక్క వసతులు?"

ముప్పై ఆరు సంవత్సరాలుగా ఆయనకు పనిచేశాను. అందరికీ సేవలు చేసేను. అయినా నాన్నను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళటం లేదే! ఒక కొడుకూ -- కూతురూ ఇక్కడున్నారే. వాళ్ళు ఆయన్ని చూసుకుంటారు"

"అదెలా?"

"ఇప్పుడు అర్ధమవుతోందా! ఇవతలి గ్లాసు అవతల పెట్టని వాళ్ల మధ్య జీవిస్తేనే...శ్రమ పడుతున్న వారి గొప్పతనం అందరికీ తెలుస్తుంది. ఇంట్లో ఎవరెవరు ఉండాలి...ఎవరెవరు వెళ్లాలి అనే నిర్ణయం తీసుకోవటానికి నాన్న వలన కుదరకపోతే, ఆయన కష్టపడే కావాలి. నేను వెళ్ళటాన్ని ఆపే హక్కు ఆయనకు కూడా లేదు. నేను బాగా అలసిపోయాను. నేను పడుకుంటున్నా రఘూ "

"అత్తయ్యా...మీరు డిన్నర్ చేయలేదు"

"కాస్త మజ్జిగ మాత్రం ఇవ్వు సరోజా"

సత్యా కోపగించుకుని, “ఏమిటి నాన్నా...ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నారు?" అన్నది.

"వెళ్ళాలని ఆమె తీర్మానించుకుంది. ఎవరి స్వతంత్రం వాళ్లకు ఉంటుంది. దాన్ని గౌరవించే వాడిని నేను. ఆపటానికి నాకు హక్కులేదు"

ఆయన లోపలకు వెళ్ళారు.

సరోజా మజ్జిగ తీసుకువచ్చింది.

ఆమెతో పాటూ రఘూ కూడా వచ్చాడు.

"అత్తయ్యా! మావయ్యకు కుడి భుజంగా ఉన్నారు. మీరు లేకుండా ఆయన ఉండగలరా? వదిలేసి రావటం న్యాయమేనా"

"కష్టమే సరోజా! కానీ, అరాచకం ఒక ముగింపుకు రావాలంటే...ఇది చేసే కావాలి"

"నాన్న ఎందుకు మౌనంగానే ఉన్నారు?"

దానికి కారణం నాకు తెలుసు. మీ నాన్న మూర్ఖులు కాదు రఘూ! మిగితావారి కంటే తెలివిగలవారు. ఎక్కువ మాట్లాడరు. మిత భాషి. కానీ, మనసులో ఒక లెక్కపోతూ ఉంటుంది! అది ఇప్పుడు నేను చెప్పను. ఈ 'ఆపరేషన్ ' ఖచ్చితంగా విజయవంత మవుతుంది. వెళ్ళి పడుకోండి. తెల్లవారు జామున నాలుగింటికి అలారం పెట్టి, నన్ను లేపు సరోజా"

"సరే అత్తయ్యా!"

ఇద్దరూ బయటకు రాగా, వరాండాలో కూర్చుని చలపతి -- జ్యోతీ ఇద్దరూ చిన్న స్వరంతో తీవ్రంగా మాట్లాడుకుంటాన్నారు.

"నా వల్ల ఖచ్చితంగా కుదరదు. నా దగ్గర తోకాడించారో...తోకను నరికి పారేస్తాను"

జ్యోతీ స్వరం కొంచం గట్టిగా వినబడింది.

ఆమె ఎవరి గురించి చెబుతోందో అనేది సరోజాకి బాగా అర్ధమయ్యింది.

ఇద్దరూ లోపలకు రావటంతో,

"అత్తయ్య మనతో రావటం మన అదృష్టం. జీవితంలో మనకి ఇక అంతా మంచే జరుగుతుంది!"

                                                                                         Continued....PART-4

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి