16, జనవరి 2024, మంగళవారం

ఇంటింటి వెన్నెలలు...(సీరియల్)....(PART-5)

 

                                                                            ఇంటింటి వెన్నెలలు...(సీరియల్)                                                                                                                                                             (PART-5)

ఆ రోజు రాత్రి అమ్మ, సరోజా, రఘూ, పిల్లా లేకుండా ఆ ఇల్లు బోసి పోయింది.

పెద్దది సుమతి, తరువాతది కమలా కలిసి రాత్రి డిన్నర్ తయారు చేశారు.

మరుసటి రోజు ప్రొద్దున ఆరు గంటలకు సుమతి కుటుంబానికి విమానం. కమలాకు ప్రొద్దున తొమ్మిదింటికి రైలు. ఇద్దరూ తమ వస్తువులను ప్యాక్ చేయటంలో తీవ్రంగా ఉన్నారు.

భర్త, పిల్లలను రెడీ చేస్తున్నాడు.

"కమలా! నువ్వు రైలుకు ఏదైనా కట్టుకు వెళతావా?"

సుమతి అడిగింది.

"కట్టివ్వటానికి ఎవరున్నారు అక్కా? అమ్మా, సరోజా ఇద్దరిలో ఒకరైనా ఉంటే...అడగకుండానే వచ్చేది. జ్యోతీ వదిన దగ్గర ఎదురుచూడగలమా?"

"రైల్లో మంచి భోజనం దొరుకుతుందే!" -- సత్యా చెప్పింది.

కమలా వెనక్కి తిరిగి చూసింది.

"నాన్నను చూస్తేనే బాధగా ఉంది నాకు!"

"ఎందుకు?"

"వదినకు అక్కర లేదు. ఇది కూడా చెయ్యదు. నాన్న ఏం చేస్తారు?"

సత్యాకి బాగా కోపం వచ్చింది.

"వదిన ఉద్యోగానికా వెళుతోంది? చలపతి అన్నయ్యకు, పిల్లలకూ చేసే కావాలి కదా. అందులో మిగిలిన వాళ్లం తినలేమా ఏమిటీ?"

"నువ్వెందుకే ఉన్నావు?  ఏమీ చెయ్యవా? నువ్వేమన్నా ఉద్యోగానికి వెడుతున్నావా? ఇంట్లోనే కదా ఉంటున్నావు? ఈ కుటుంబం విడిపోవటానికి కారణం నువ్వే"

కమలా ఎత్తి పొడిచింది.

"దాన్ని ఎందుకే అంటావు?"

"అక్కా...దాన్ని చెడిపిందే నువ్వు. నువ్వు బయట దేశానికి వెళ్ళిపోతావు. నేను ముంబైకి! ఒక సంవత్సరం తరువాత వస్తాం. ఇక్కడ కుటుంబం విరిగిపోయిందే! అందరం కలిసి, మాట్లాడి మంచి చెయ్యకుండా వదిలేశాము"

"నువ్వూ అమ్మాయే కదా? అమ్మనెందుకు ఆపలేదు! అమ్మ ఉండుంటే...అంతా పాత విధంగా జరిగేది. రఘూ, సరోజా వేరుగా వెళ్ళినందు వలన ఎవరికీ నష్టం లేదు"

"తప్పు సత్యా. నీ అరాచకం అనగలేదు"

"నువ్వూ వాళ్ళ వైపేనా?"

"నేను ఏవైపూ లేను. ఈ ఇంట్లో పుట్టిన అమ్మాయలం, ఈ కుటుంబానికి మంచి చేయలేకపోయినా, పుట్టినందుకు భారంగా ఉండకూడదు. సరోజా ఖచ్చితంగా మంచిదే. ఆమె ఇక్కడ్నుంచి వెళ్లటం మహాలక్ష్మినే వెళ్ళినట్లు. నాన్న తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండవు"

ప్రొద్దున్నే మొదట సుమతి కుటుంబం, తరువాత కమలా కుటుంబం బయలుదేరి వెళ్ళిన తరువాత, వాళ్లను పంపిన తరువాత తండ్రి అలాగే 'ఆఫీసుకు ' వెళ్తానని వెళ్ళిపోయారు.

చలపతి తయారయ్యాడు.

"ఏమండీ...ఈ రోజు ఒక రోజు కాంటీన్లో తినండి"

"సరే జ్యోతీ!"

పిల్లలకు స్నాక్స్ ఇచ్చి, మధ్యాహ్నం లంచుకు 'బ్రెడ్ టోస్ట్' పెట్టి, వాళ్లను వ్యానులో ఎక్కించింది జ్యోతీ.

ఆమె స్నానం చేసి ముగించి, మూడు ముక్కలు బ్రెడ్ తిని, కాఫీ తాగి బయలుదేరింది.

"వదినా...వంట చేయలేదా?" -- సత్యా అడిగింది.

ఎవరికి? ఆయన్నీ, పిల్లల్నూ పంపించేశాను. మామయ్య తిన్నగా ఆఫీసుకు వెళ్ళారు. నాకు బ్రెడ్ చాలు. పిల్లలు వచ్చేటప్పుడే నేను వస్తాను. బయట పనుంది"

ఆమె వెళ్ళిపోయింది.

సత్యా భర్త కూడా బయలుదేరాడు.

అతను...భార్యా--పిల్లలను ఇక్కడ వదిలేసి, వారానికి ఒక రోజు వస్తాడు. బేవర్సుగా తింటాడు.   

ఇప్పుడు ఏమీ లేదు.

"తింటానికి ఏమీ లేదా...ఆకలేస్తోంది"

సత్యాకి కోపం వచ్చింది.

"పిల్లలతో పాటూ నేనూ వస్తాను. హోటల్లో తిందాం"

"నాకు టైం అయ్యింది! నేను బయట చూసుకుంటాను. అత్తయ్యా, సరోజా ఉండుంటే...ఆకలంటే ఏమిటో తెలిసేది కాదు. నేను బయలుదేరతాను. ఒక గూడునే చెదరగొట్టారు"

"ఎవర్ని చెబుతున్నారు?"

ఇదిగో చూడు! నీతో గొడవ పెట్టుకునే మనో పరిస్థితిలో నేను లేను.వస్తాను

"చేతిలో డబ్బులేదు...ఇవ్వండి"

"ఉన్నది నాకే చాలదు"

"ఏం చించుతున్నారు...మీరు జీతం తీసుకుంటున్నా, మా నాన్న ఇంట్లోనే కదా మన ఖర్చులన్నీ జరుగుతున్నాయి. డబ్బంతా ఎక్కడ పోతోంది? మీ అమ్మ మింగేస్తొందా?"

"మా అమ్మ గురించి మాట్లాడావా...నీకు పళ్ళు ఉండవు"

"ఎందుకంత ఆవేశం? ఆవిడ నా పిల్లను బాగా చూసుకోనుంటే...నేను ఇక్కడ ఉంటానా?”

"ఆపవే ! నీకు మీ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. కారణం...ఇంట్లో పనులు చేయటానికి నీకు ఒళ్ళు వంగదు. ఇక్కడ బేవర్స్ గా తినేసి, నిద్రపోతావు! పిల్లాడ్ని  మీ అమ్మ చూసుకుంటుంది. ఇప్పుడు అన్నిటికీ కలిపి... రఘూ పెట్టాడుగా ఒక చెక్. ఇక నీకు కష్ట కాలం మొదలు. అనుభవించు"

"ఇలాంటి మాటలను వింటుంటే మీకు సిగ్గుగా లేదా? రేపు మిమ్మల్నీ, మీ అమ్మనూ ఈ ఊరు తిట్టదూ. భార్యా--పిల్లాడినీ వాళ్ళ పుట్టింట్లోనే వదిలేసి వచ్చేశాడు...పనికిరాని వాడు అని మొహాన ఉమ్మేస్తారు" -- భర్తను కసురుకుంది సత్యా.

"ఏయ్! కోపం తెప్పించకు...నేను పిలిస్తే వెంటనే వచ్చేస్తావుటే నువ్వు? ఇక్కడేమన్నా సరిగ్గా ఉన్నావా? మా ఇంట్లో మా అమ్మను కష్టపెడుతున్నావు? ఇక్కడ అన్నయ్య, వదినలను టార్చర్ పెట్టి వాళ్ళను ఇక్కడ్నుంచి తరిమేశావు. మీ అమ్మ కూడా వాళ్లతో వెళ్ళిందే అదే నీకు శిక్ష. నీకు బ్యాడ్ టైము మొదలయ్యింది"

వేగంగా బయటకు వెళ్ళిపోయాడు.

సత్యాకు ఒళ్ళు మంట బాగా పెరిగింది.

ఆమె చేసే తప్పు ఆమె అర్ధం చేసుకోలేదు.

అందరి మీద కోపం ఎక్కువ అయ్యింది.

ఇంటి నిండా సరకులు ఉన్నాయి. వంట చేసుకుని తినచ్చు. కానీ, శరీరంతో పాటూ అతుక్కున్న బద్దకం జరగనివ్వలేదు.

ఇన్ని రోజులు ఇంకొకరి శ్రమలో చలి కాచుకుంది. జీవితం కొనసాగించింది. ఆ అలవాటు శరీరంలో ఊరిపోయింది.

తెలిసో...తెలియకో తల్లీ-తండ్రీ దాన్ని ఎంకరేజ్ చేశారు.

కనీసం  సరోజా చేస్తున్న ఉద్యోగం లాంటీ ఉద్యోగం కూడా లేదు.

ఉద్యోగం, ఇంటిపనులు, వీలున్నంతవరకు పిల్లను చూసుకోవటం అంటూ సకల భారాలనూ మూతి ముడుచుకోకుండా చేసేది సరోజా.

వేరే దారి లేదు!

ఈ రోజున్న అర్ధీక పరిస్థితుల్లో మధ్య తరగతి కుటుంబాలలో ఆడవారు ఉద్యోగానికి వెళ్ళే తీరాలి అనే నిర్భంధం ఏర్పడింది.

ప్రొద్దున వెళితే తిరిగి రావటానికి రాత్రి అయిపోతుంది.

ఇంటి పెద్దలను, మనవళ్లనూ చూసుకోవలసిన నిర్భంధం. రెస్టు తీసుకోవలసిన వయసులో, తరువాత ఘట్టం ఆటకు తయారు కావలసిన నిర్భంధం....కొందరు దాన్ని నిర్ధాక్ష్యంగా నిరాకారిస్తారు.

'భోజనం పెట్టటం...స్నానం చేయించటం...పిల్లలతో కుస్తీ పడటం మావల్ల కాదు!' అని సనుగుతారు.

అందరూ ఓపిక ఉండే చేస్తున్నారా?

నీ కొడుకు నిన్ను ఉంచుకుని మంచిగా పరామరిస్తూ ఉన్నప్పుడు, అతనికి నువ్వు సహాయం చేసే కావాలి.

యంగ్ జనరేషన్ కి మాత్రమే బాధ్యత ఉండాలి అనేదే కాదు జీవితం, పెద్దవాళ్లకూ అది ఉండాలి అనేదే జీవితం.

ఇక్కడ ఏదీ నిర్భంధం కాదు.

చెయ్యను అని విధిలించికొడితే, ఎవరూ భుజాలు ఎక్కి కూర్చోరు.

కానీ, కుటుంబం నలిగిపోతుంది.

రక్త సంబంధమైనా పరస్పర అనుకరణ, సహాయాలు --  ఇవే బంధుత్వాన్ని మోయగల స్థంబాలు.

దీన్ని ఇరు వర్గాలు, అంటే రెండు జనరేషన్లూ అర్ధం చేకుంటే మంచిది.

లేక పోతే బంధుత్వం తెగిపోతుంది.

సత్యా యొక్క పిల్ల ఏడ్చి, గోల చేయటం మొదలుపెట్ట...

పిల్లకు ఆహారం తయారు చేయటానికి వంటింట్లోకి వచ్చింది.

వంటింట్లోకి ఆమె వచ్చి చాలా నెలలు అయ్యింది.

తల్లీనూ, సరోజానూ అన్నీ చేతికి అందించేవారు.

పిల్లను చూసుకోవటం కూడా చేసేరు.

స్నానం చేసి, తినేసి, మెగా సీరియల్స్ చూసి...గొడవకు మాట్లాడి, ఉంటున్న వాళ్ళ తలలను దొర్లించి జీవించేసింది.

ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలయ్యింది.

వంట గదిలో ఏది ఎక్కడున్నదో కూడా తెలియటం లేదు.

వెతికి కనుక్కుని...అన్నం, పప్పు, చారు రెడీ చేసి పిల్లకు నోట్లో పెడితే...పిల్ల ఉమ్మేసింది.

చారులో ఉప్పు, పులుపు ఏదీ లేదు.

అన్నం సరిగ్గా ఉడకలేదు.

పిల్ల ఆకలితో ఏడవటం మొదలుపెట్టింది.

సత్యాకి కోపమూ, ఏడుపూ వచ్చింది. చేతిలో డబ్బు లేదు. వేగంగా వెళ్ళి బీరువా తెరిచి వెతికింది.

ఏమీ లేదు.

ఇల్లంతా పచారి సరకులు, కాయగూరలు, పాలుతో నిండి పోయింది.

ఆహారం రెడీ చేసేంత ఓర్పూ లేదు. చేతివాటమూ లేదు.

పిల్లకు పాలు కాచి ఇచ్చింది. ఆపిల్ పండును ముక్కలు చేసి ఇచ్చింది. బిస్కెట్ ఇచ్చింది.

పిల్ల అవి తినేసి నిద్రపోయింది.

ఆమెకే ఆకలి వేసింది. పెట్టిన చారును కొంచం సరిచేసి, ఉడకని అన్నంతో తిన్నది.

సరోజా వంట బాగా చేస్తేనే అందులో తప్పులు కనిబెడుతుంది.

'ఒక్కొక్క ఇంట్లోనూ వంట ఎలా ఉంటుందో తెలుసా? మనింట్లో వంట రుచే ఉండదు. నోట్లో పెట్టుకోలేకపోతున్నా'

"బాగానే కదవే ఉంది?"

"అమ్మా నీకు తలరాత...ఆమె వంటను తినే జీవించాలని రాసుంది. నా వల్ల కుదరటం లేదు. నాన్నా డబ్బులివ్వండి. నేను హోటలుకు వెళ్ళి తింటాను"

"అమ్మ దగ్గర తీసుకో..."

"అమ్మా...ఐదు వందలు ఇవ్వు"

"దేనికే?"

"ఇవ్వు గిరిజా...అడుగుతోంది కదా" -- తండ్రి యొక్క సపోర్ట్.

అమ్మ తీసిస్తుంది.

ఆమె భర్త కూడా బయలుదేరటంతో,

"పిల్లను చూడమ్మా! మేమిద్దరం వెళ్ళొస్తాం"

ఇలాంటి రోజులు!

ఇంట్లో చివరి కూతిరిగా పుట్టి పెరిగిన కారణం చేత కుటుంబం మొత్తం కలిసి ఆమెకు చనువు ఇచ్చి, పూర్తిగా చెడిపి ఉంచారు.

ఈ రోజు ఈ విడిపోవటానికి ఆమెను మాత్రమే తప్పు పట్టుకూడదు.

మొక్కగా ఉన్నప్పుడే తీసిపారేసుంటే.

అది చెట్టుగా అయిపోయినందువలన, కుదరకుండా పోయింది.

తాను అడిగింది దొరకటం, అనుకున్నది జరగటం ఉండటం కారణంగా...జీవితం ఆమె చేతుల్లోనే ఉండిపోయింది. ఆమె చూసింది అందులోని ఎదుగుదల మాత్రమే...దిగిపోవటం చూడలేదు.

ఇదిగో ఆమె దాన్ని కలుసుకోవటం మొదలుపెట్టింది.

అదేమో ప్రారంభమే!

                                                                                         Continued...PART-6

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి