17, నవంబర్ 2022, గురువారం

మహాలక్ష్మి...(కథ)

 

                                                                                    మహాలక్ష్మి                                                                                                                                                                                           (కథ)

ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో దేశం సస్యస్యామలంగ వుంటుంది. అందుకే ఒక కవి స్త్రీ గురించి ఇలా రాసాడు బ్రతుకు ముల్లబాటలో జతగా స్నేహితురాలవయ్తివి...కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి...వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన భార్యవైతివి...పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి...అని అన్నారు. కష్టంలో ముందుండి...సుఖంలో క్రిందుండి...విజయంలో వెనకుండి ...ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ.

కాని నేడు స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూఉద్యోగాలు చేస్తూ, పురుషుల పరిమితమైన విజయాల్ని సైతం దక్కించుకుంటున్నారు, పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఆధునిక కాలంలో ఆడది అబల కాదు 'సబల' అనగా పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలదు అని నిరూపించుకుంటున్నారు. నేటి స్త్రీ ఉద్యోగాల వల్ల ఎంతో ఒత్తిడి ఎదుర్కొకుంటోంది.

ఇంతమారినా ఇంకా స్త్రీని వ్యాపార ప్రకటనలలో, సినిమాలలో స్త్రీని ఒక ఆటబొమ్మగా సెక్స్ సింబల్ గా మాత్రమే చూపిస్తున్నారు....కానీ, ఇంకా ఎంతోమంది పురుషులు స్త్రీపట్ల అత్యంత గౌరవం కలిగి మహాలక్ష్మిగా చూస్తున్నారు. కథలో పేదరికంలో ఉంటున్న ఒక పురుషుడు స్త్రీని ఎలా చూసాడో చూడండి.

సూర్యకిరణాలు గుడిసె ఇంటిపైన ఉన్న చిల్లులో నుండి లోపలకు దూరింది. నిద్రపోతున్న ఈశ్వరమ్మను కాల్చింది. ఆమె నిద్రలో నుండి లేచింది. ఆమె యొక్క ఇద్దరుపిల్లలూ ఆదమరచి నిద్రపోతున్నారు. వాళ్ళు వేసుకోనున్న చిరిగిన బట్టలు, ఎండిపోయున్న తల కేశాలు వాళ్ల పేదరికం అబలాన్ని ప్రతిఫలింపజేస్తోంది.

ఇంటినుండి బయటకు వచ్చిన ఈశ్వరమ్మ వంద అడుగుల దూరం నడిచింది. అక్కడ వీధి పక్కగా చాలామంది జనం గుమికూడి ఉన్నారు. చోటే ఆమె భర్త ఏడుకొండలుకు జీవాధారం.

వికలాంగుడైన అతను ప్రతిరోజూ వీధికి ఒక పక్కగా, వీధిపై బ్రహ్మాండమైన దేవుడి చిత్రాలను తన చేతి ప్రతిభతో గీసి మెరుగులు దిద్దుతూ ఉంటాడు. అద్భుతంగా గీసిన కళాఖండం చిత్రాలను చూసి ఆనందించటానికి చాలామంది గుమికూడుతారు. కళాచిత్రం మీద వాళ్ళు ఎగరేసివెళ్ళే డబ్బులే వాళ్ళ కుటుంబ ఖర్చులకు చేయూతనిస్తోంది. ఈశ్వరమ్మ దగ్గర్లో ఉన్న ఒక ఇంట్లో పనిచేస్తోంది. అందులో దొరికేది కొద్ది సంపాదనే.

ఏడుకొండలు తన వారినందరిని సునామీకి అర్పణం ఇచ్చాడు. అందువల్ల ఒంటరి మనిషిగా అయ్యాడు. ఈశ్వరమ్మకు ఒకే ఒక బామ్మ. ఆవిడ కూడా చనిపోయిన తరువాత ఈశ్వరమ్మ కూడా  ఒంటరిగా నిలబడింది. 

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మహాలక్ష్మి...(కథ) @ కథా కాలక్షేపం-1  

***************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి