వర్షంలో వెన్నెల...(సీరియల్) (PART-5)
ఏదో శబ్దంతో
కళ్ళు తెరిచిన
ఆమెకు, కొద్దిసేపటి
తరువాతే...తాను
పడుకున్నది వినోధినీ
మావయ్య ఇంట్లో
అని అర్ధమయ్యింది.
మధ్యాహ్నం కిషోర్
తో వచ్చి
లంచ్ చేసింది
గుర్తుకు వచ్చింది.
ప్రేమ, అభిమానంతో
లంచ్ వడ్డించిన
తల్లిని ఆ
రోజు మొదటిసారి
చూసింది శైలజా.
వినోధినీ ఇంట్లో
ఒకటి,రెండు
సార్లు ఉన్నప్పుడు, ఒక
యంత్రంలాగా ఉండటం
గుర్తుకు
వచ్చింది శైలజాకి. ఎవరూ
అక్కడ ఒకరినొకరు
చూసుకుని తిన్నగా
మాట్లాడుకోరు.
ఒకటిగా కూర్చుని
భోజనం తినేవారు
కాదు. తమ
గదిలో తప్ప
మిగిలిన చోట్ల
మాట్లాడుకోవటమే
‘తప్పు’ అనేలాగా
నడుచుకునే వారు!
కానీ, ఇక్కడ
కిషోర్, అతని
తల్లీ ఏవేవో
విషయాలు మాట్లాడారు.
అందులో ఆమెను
కూడా కలుసుకునేటట్టు
చేయటమే కాకుండా
కంచంలో ఏదో
ఒకటి వడ్డిస్తూనే
ఉంది ప్రభావతి.
కిషోర్ యొక్క
చూపులు అప్పుడప్పుడు
ఆమె మీద
ఆతురుతతో పడిలేచింది.
కడుపు నిండుగా
తిన్నది తెలియక
ఆమె భుక్తాయాసంతో
శ్వాస వదిలినప్పుడు, “అమ్మ
యొక్క వంటను
మనం తినకుండా
ఉండలేము. కానీ, తిన్నదానికి
తగినంతగా వ్యాయామం
చెయ్యకపోతే ఇంతే
సంగతులు” అని చెప్పినప్పుడే, అంత
తిన్నా అతను
ఎలా అంత
శరీర దారుఢ్యంతో
ఉండగలుగుతున్నాడు
అనేది అర్ధమయ్యింది.
“ఇలాంటి
రుచికరమైన భోజనం
నేను ఇంతకు
ముందు తిన్నదే
లేదు. చాలా
థ్యాంక్స్ ఆంటీ” అని ఆమె
అనగా “అలాగే
ఒక దెబ్బవేస్తాను
చూడు” అంటూ కోపంగా
చూశాడు.
శైలజా అర్ధంకాక
చూడటంతో, “వదులయ్యా...ఏదో
చెప్పాలని థ్యాంక్స్
చెప్పింది. అందుకని
ఇలాగా కోపగించుకునేది? నువెళ్ళమ్మా, వెళ్ళి
కాసేపు నిద్రపోయి
రెస్టు తీసుకో” అంటూ ఆమెకు
సపోర్టు చేసి
మాట్లాడింది.
అతను కొన్నిసార్లు
ప్రేమగా మాట్లాడతాడు.
హఠాత్తుగా కోపగించుకుంటాడు.
అర్ధం చేసుకోవటమే
కుదరటంలేదు! కానీ, ఆ
కోపం శైలజాను
బాధించిందనేది
నిజం.
ఆమెను పిలుచుకుని
ఒక గదికి
వచ్చిన ప్రభావతి, “అతి
త్వరలో లక్ష్మీ
రావాలని వేడుకుంటున్నానమ్మా.
ఆమె చాలా
మంచిది. తమ్ముడి
మీదే తప్పంతా
ఉన్నా, అతన్ని
క్షమించి ఉండొచ్చు” అని నిట్టూర్పు
విడిచింది.
"ఆంటీ!
వాళ్ళిద్దరికీ
మధ్య ఏమిటి
నిజమైన సమస్య? కొంచం
చెప్పగలరా? నాకు
పూర్తిగా తెలియదు.
ప్లీజ్ ఆంటీ"
అని అడిగింది.
ఆమెతో పాటూ
మంచం మీద
కూర్చున్న ప్రభావతి, “ప్రారంభంలో
వాళ్ళ లాంటి
భార్య-భర్తలు
లేరని చెప్పేంత
దంపతులుగా ఉండేవారు.
మా చిన్నప్పుడు
మా నాన్నగారు
చనిపోవటంతో, ఆస్తులను
జాగ్రత్తగా చూసుకుంటూ, నాకూ
పెళ్ళి చేశాడు
నా తమ్ముడు.
ఇక్కడ అవుటర్
రింగ్ రోడ్డులోనూ, ముంబై వెళ్ళే
రోడ్డులోనూ రెండు రెస్టు
హౌసులు నిర్మించి
-- యంత్రంలాగానూ, ఒత్తిడితోనూ
జీవించే ప్రజలకు
రెస్టు తీసుకునే
నీడలాగా ఉంచాడు.
లక్ష్మీను మేమే
చూసి పెళ్ళి
చేశాము. నీకు
మూడేళ్ళ వయసు
ఉన్నప్పుడు, వాళ్ళిద్దరి
మధ్యా ఏదో
సమస్య ఉన్నది
అనేది మాకు
అర్ధమయ్యింది. మొదట్లో
మా దగ్గర
మా తమ్ముడు
ఏమీ చెప్పలేదు.
మేమూ, మామూలు
గొడవ అని
అనుకుని వాళ్ళ
సమస్యను పెద్దగా
పట్టించుకోకుండా
వదిలేశాము. కానీ, తన
వలన సరిచేసుకోలేనే
నన్న పరిస్థితిలో...మీ
మావయ్యతో వివరాలు
తెలిపాడు తమ్ముడు.
మూడు నెలల
ఇంటీరియర్ డెకోరేషన్
చదువు మరియూ
ట్రైనింగుకు విదేశాలకు
వెళ్ళాడు తమ్ముడు.
అప్పుడు వ్యాపారాన్ని
లక్ష్మీనే చూసుకుంది.
కొత్తగా చేరిన
మేనేజర్ ఏదో
అవకతవకులు చెయ్యటంతో
అతన్ని పిలిచి
హెచ్చరించటమే కాకుండా
అతను చేసే
ముఖ్యమైన బ్యాంకు, పేమెంట్
పనులను కట్
చేసి తానే
చూసుకోవటం మొదలుపెట్టింది.
దాంతో కోపం
తెచ్చుకున్న అతను
లక్ష్మీ మీద
పగతీర్చుకోవాలని
ఆమె మీద
ఒక అపవాదు
ప్లాన్ చేశాడు
ఆ పాపిష్టి
వెధవ...ఆడీటర్
రాం కుమార్
కీ, లక్ష్మీకీ అక్రమ
సంబంధం ఉన్నట్టు
పుకారు పుట్టించాడు.
వ్యాపారం అంటే
ఆడీటర్ను కలుసుకుని
ఆలొచన చెయ్యకుండా
ఎలా ఉండగలం? వాళ్ళు
మాటి మాటికీ
కలుసుకున్న విషయాన్ని
వేరే విధంగా
ప్రచారం చేశాడు.
మూడు నెలల
తరువాత తమ్ముడు
తిరిగి వచ్చినప్పుడు, వాడి
చెవులారా ఆ
ప్రచారాన్ని పనివాళ్ళు
కథలు కథలుగా
మాట్లాడుకునేటట్టు
డబ్బులిచ్చి ‘సెటప్'’చేశాడు.
మొదట్లో తమ్ముడు
ఆ విషయాన్ని
పెద్దగా తీసుకోలేదు.
కానీ, పనివాళ్ళు
అక్కడక్కడా నిలబడి
మాట్లాడుకోవటం...మేనేజర్
యొక్క తంత్రమైన
మాటలు అతని
మనసులో సంచలనం
లేపింది.
తన ప్రాణానికి
ప్రాణమైన భార్య
తనని వదిలి
వెళ్ళిపోతుందో
నన్న భయం
అతని బుర్రను
కన్ ఫ్యూజ్
చేసింది. ఆలొచించకుండా
తప్పు చేశాడు.
ఇంట్లోని పని
మనుషుల దగ్గర
విచారించాడు. లక్ష్మీకీ
ఈ విషయం
తెలిసిపోవటంతో
‘ఇన్ని
సంవత్సరాలు నాతో
కాపురం చేసినా
నన్ను అర్ధం
చేసుకోకపోవటం మొదటి
తప్పు. దాని
కంటే...నన్ను
విచారించకుండా...ఇంట్లోని
పనిమనుషుల దగ్గర
విచారించేరే! సిగ్గుగా
లేదా? ఇక
మీదట మనం
భార్యా--భర్తలుగా
ఉండటం వేస్టు’ అన్న
ఆమె, నిన్ను
పిలుచుకుని బయలుదేరింది” -- కళ్ళు
తుడుచుకుంటూ కొనసాగించింది
ప్రభావతి.
ఆ తరువాత
మా తమ్ముడు
బెంగళూరు వెళ్ళి
ఎంతో మాట్లాడి
-- క్షమించమని బ్రతిమిలాడినా, లక్ష్మీ
క్షమించలేదు. ఒక
స్త్రీగా నేనూ
ఆమె భావాలను
గౌరవిస్తాను. కానీ, దానికోసం
ముగ్గురికీ శిక్ష
ఇవ్వటం న్యాయం
కాదు. నీకు
ఎంత కష్టమో
చూడు?"
అంటూ ఆమె
బుగ్గలను ముట్టుకుంది
ప్రభావతి.
“...........................”
“ఆ
తరువాతే మాకు
విషయం తెలిసింది.
మేమూ వెళ్ళి
మాట్లాడి చూశాము.
కానీ, లక్ష్మీ
ఏమందో తెలుసా
ఇక ఆమెను
వెతుక్కుని వస్తే
బెంగళూరు వదిలి
వెళ్ళిపోతానని
బెదిరించింది. మనసు
విరిగిపోయిన మీ
నాన్నకు అప్పుడే
మొదటి అటాక్
వచ్చింది. లక్ష్మీకీ
కబురు పెట్టాము.
ఆమె రాలేదు.
తన మనసు
చచ్చిపోయిందని
జాలి అనేదే
లేకుండా చెప్పిందమ్మా.
ఎలాగో అందులో
నుండి తమ్ముడ్ని
లాగి, వ్యాపారంలో
మనసు పెట్టేట్టట్టు
చేసాము. కానీ
తనతో పాటూ
తన కుటుంబం
లేదన్న బాధ
ఎలా వదిలి
వెల్తుంది? ఇప్పుడు
నువ్వైనా వచ్చావే, అదే
ఓదార్పుగా ఉందమ్మా” అని చెప్పి
ముగించింది ప్రభావతి.
“పెద్దవాళ్ళు
కలిసి ఇంకా
కొంచం ప్రయత్నించి
ఉంటే, అన్నీ
సర్ధుకునేవేమో
అని అనిపిస్తోంది
ఆంటీ!” అన్నది శైలజా.
“లేదమ్మా.
ఇక జీవితంలో
మోహన్ కుమార్ మొహం
చూస్తే, అదే
తనకి చివరి
రోజుగా ఉంటుందని
రాత పూర్వంగా
మాకు తెలియపరచి
భర్తను మరింత
గాయపరిచింది” అన్నది కోపంగా.
అప్పుడు అక్కడకు
వచ్చిన చద్రశేఖరం
“ఏమిటీ, అత్తా--కోడళ్ళు
కలిసి టీవీ
సీరియల్లో
నటిస్తున్నారా? నేలంతా
ఒకటే వరదగా
ఉంది. నేను
ఈత కొట్టుకుంటూ
వచ్చాను తెలుసా” అని ఎగతాలి
చేసి భార్య
వైపు తిరిగాడు.
“ప్రభావతీ!
ఆ పిల్ల
కాసేపు రెస్టు
తీసుకోనివ్వు. ఆమెనూ
ఏడిపించావే! నువ్వు
మనసులో ఏమీ
పెట్టుకోవద్దమ్మా.
అన్నీ త్వరలోనే
సర్దుకుంటాయి” అని చెప్పి
భార్యను చెయ్యి
పుచ్చుకుని పిలుచుకు
వెళ్ళాడు.
‘కుటుంబం
అంటే ఇలాగే
ఉంటుందనుకుంటా.
వినోధినీకి కూడా
చెప్పాలి’ అని
ఆలోచన తిరుగుతున్నప్పుడు
వినోధినీనూ చాలాసేపటి
నుండి కాంటాక్ట్
చెయ్యలేదు అని
గుర్తుకు వచ్చి, సెల్
ఫోనును తీసింది.
అందులో పది
మిస్స్ కాల్స్.
అన్నీ వినోధినీ
నెంబర్ నుండే.
వినోధినీకు ఫోను
చేసింది. ఆమె
తీయనే లేదు.
ఆలొచనతో పడుకున్న
ఆమె, తనకు
తెలియకుండానే గాఢ
నిద్రలోకి జారుకుంది.
సాయంత్రం డైనింగ్
టేబుల్ మీద
అందరూ కలిసారు.
శంకర్ యొక్క
చిన్న చెల్లెలు
ప్రమీలా పరిగెత్తుకు
వచ్చి శైలజాతో
మాట్లాడింది.
“రండక్కా.
మీరు చాలా
అందంగా ఉంటారని
అందరూ చెప్పారు.
నేనొక్క దానినే
మిమ్మల్ని
చూడలేదు. అందుకే
చాలాసేపటి నుండి
మీకొసం కాచుకోనున్నాను.
మిమ్మల్ని చూడాలని
అప్పుడే వచ్చేశాను.
కానీ, మీరు
గాఢ నిద్రలో
ఉన్నారు....” అన్నది.
“గాఢ
నిద్ర అంటే...కుంభకర్ణుడిలాగానా
నిద్రపోయాను?” అని
అడిగింది శైలజా, వాళ్ళ
దగ్గరగా కూర్చుంటూ!
“అరె...అక్కయ్య
కూడా మన
‘గ్రూపే’. సరదాగా
మాట్లాడుతున్నారు.
కానీ, మీరు
చాలా అందం
వినోధినీక్కా” అంటూ సంతోషంతో
అరిచింది.
“అరవకు
ప్రమీలా. వాళ్ళ
గ్రూపులో మనల్నీ
చేర్చేస్తారు” అని శంకర్
చెప్ప, అతన్ని
ప్రశ్నార్ధకంగా
చూసింది. ‘అదే
చెప్పిందే కుంభకర్ణుడినా
అని. ఆ
గ్రూపును చెప్పాను.
నువ్వు నిద్రపోతున్నది
చూస్తే, కుంభకర్ణీ
అని పేరు
పెట్టచ్చు” -- కళ్ళల్లో
అల్లరి కనబడింది.
“పోరా, నువ్వే
కుంభకర్ణుడివి...ఈవిడ
ఎంత అందంగా
ఉంది! ఈవిడ్ని
పోయి...” అన్నది ప్రమీలా.
“క్లాసులో
నిద్రపోయి, వదిలేసిన
పాఠాలను ఎవరినైనా
పిలిచి అడిగి
రాస్తావే! ఆ
పని ఈ
రోజు లేదా?” అని
ప్రమీలాను చూసి
అడిగాడు శంకర్.
“నువ్వు
చాలా పర్
ఫెక్టా? చూడండి
వినోధినీక్కా. వీడి
తొమ్మిదో క్లాసు
పరీక్షకు, తెలియక
ఎనిమిదో క్లాసు
క్వశ్చన్ పేపర్
ఇచ్చారు. అది
తెలియక అదే
క్వశ్చన్లకు జవాబురాసి
తక్కువ ‘మార్కు’ తెచ్చుకున్నాడు” అని చెప్పిన
వెంటనే అందరూ
నవ్వారు.
అదేదీ పట్టించుకోక
శంకర్ పద్మని
గేలిచేశాడు. “ఏమిటి...
‘మిస్
కాల్’ ఇచ్చి
ఎవరితోనైనా బాతాకానీ
కొడతావే! ఈరోజు
నీకు ఎవరూ
దొరకలేదా? దీని
వలన ఇంకా
కొన్ని రోజుల్లో
‘మిస్
కాల్స్’ కు
కూడా డబ్బులు
తీసుకోవటం మొదలుపెట్టేస్తారు.
సెల్ ఫోన్
కంపెనీ వాళ్ళకు
దీనిలాంటి వారి
వలన పిచ్చి
లాభాలు వస్తాయి” అంటూ ధీర్ఘం
తీయ...వదుల్తుందా
పద్మ?
“చిన్న
వయసులో వీడు
డబ్బులడిగి ఏడుస్తాడు
చూడు. యాభై
పైసలు కాయిన్
తప్ప ఏదిచ్చినా
కిందపడి దొర్లుతూ
ఏడుస్తాడు. వందరూపాయలు
ఇచ్చినా కూడా
ఒప్పుకోడు. అప్పట్నుంచి
వీడికి యాభైపైసలు
అనే పేరు
కూడా ఉండేది
తెలుసా?” రహస్యంగా
చెప్పి నవ్వింది.
అప్పుడు వినోధినీకి
టిఫిన్ తీసుకు
వచ్చిన ప్రభావతీ
“చాలు...చాలు.
ఒకరికొకరు ఇలా
పోటీపడి కొట్టుకుంటే
వినోధినీ మిమ్మల్ని
సరైన గొడవ
కోళ్ళు అని
అనుకుంటుంది. వెళ్ళి
చదువుకునే పని
చూడండి” అంటూనే దోస, మశాలా
పెట్టింది.
“అదంతా
కుదరదమ్మా! ఈ
రోజు పూర్తిగా
వినోధినీ అక్కతోనే
ఉంటాను. మాట్లాడాల్సింది
చాలా ఉందే” అన్నది ప్రమీలా, పెద్ద
మనిషిలాగా.
“అలాగంటారా...అలా
ఏం మాట్లాడబోతారండీ?” అని
ఆమె స్టయిలులో
అడిగింది పద్మ.
“అంతా
రాత్రి డిన్నర్
టైములో మాట్లాడుకోవచ్చు...మీరిద్దరూ
వెళ్ళి చదువుకోండి.
పద్మా నువెళ్ళి
వినోధినీకి ఫ్యామిలీ
ఆల్బం తీసుకువచ్చి
చూపించు” అని ఆర్డర్
వేయ, చిన్నవాల్లిద్దరూ
మొహం చిట్లించుకుని
జరిగారు.
పద్మా, శైలజాను
లోపలకు తీసుకువెళ్ళింది.
వినోధినీ యొక్క
బంగళా అంత
గ్రాండుగా
లేకపోయినా, చక్కగా
ఉంది ఇల్లు.
పెద్ద హాలు, డైనింగ్
హాలు, మిగిలిన
గదులు చక్కగా
ఉన్నాయి. ఒక
గదికి తీసుకువెళ్ళి, అలమారులో
ఉన్న ‘ఆల్బం’ లను
తీసింది పద్మ.
“మీ
ఇల్లు ఎప్పుడూ
ఇంత కోలాహాళంగానే
ఉంటుందా అక్కా?” అని
అడిగింది శైలజా.
“అవును.
మేము ముగ్గురం
ఉన్నామంటే గోలగోలే!
అన్నయ్య ఉంటే
గోల తక్కువగా
ఉంటుంది. ఎక్కువగా
గోల చేస్తే
అన్నయ్యకు నచ్చదు.” అని చెప్పిన
ఆమె, మొదటగా
వినోధినీ యొక్క
కుటుంబ ‘ఆల్బం’ ను
చూపింది.
“ఎంత
సరదాగా జీవిస్తున్నారు!” ఆశ్చర్యంగా
చూసింది శైలజా.
“జీవిస్తున్నామా? జీవించేమని
చెప్పు. ఏం
చేయను వినోధినీ? అర్ధం
చేసుకునే విధమే మన
జీవితాన్ని నిర్ణయిస్తుంది.
ప్రశాంతమైన జీవితమే
ముఖ్యం అనుకుంటే, కొన్ని
విషయాలను పట్టించుకోకుండా
ఉండే తీరాలి.
ఒక గీత
గీసి, అందులోనే
వెళ్తాను అని
మొండికేస్తే...సరిగ్గా
రాదు. పట్టించుకుంటే
జీవితమే వేస్టు
కదా” అని
సిద్ధాంతము మాట్లాడిన
ఆమెను ఎగతాలిగా
చూసిన శైలజా, “అబ్బబ్బా!
ఎంత పెద్ద
సిద్ధాంతం! ఈ...సిద్ధాంత
జ్ఞానిని పెళ్ళి
చేసుకునే అదృష్టవంతుడు
ఎవరో?” అంటూ
ఆలొచనతో పైకి
చూసింది.
“నేను
నీకంటే రెండేళ్ళు
పెద్ద. ఇలాగంతా
గేలి చేయకూడదు” అంటూ సిగ్గు
పడుతూ నవ్వుతూ
చెప్పింది పద్మా.
తరువాత, వినోధినీ
యొక్క అత్తయ్య
కుటుంబం ఆల్బం
చూసింది. పిల్లలను
ఒక్కొక్క వయసులోనూ
చాలా ఫోటోలు
తీసుండటం చూసి
లోలోపల తపన
పుట్టింది శైలజాకి.
చాలా వరకు
ప్రారంభకాలంలో
అన్ని ఫోటోలలోనూ
వినోధినీ కుటుంబం
ఉంది. అందులో
ఒకటి కిషోర్
ఏడేళ్ళ వయసు
పిల్లాడు, ఊయలలో
కూర్చుని...రెండువైపులా
శంకర్ ను, వినోధినీనూ
పట్టుకుని నవ్వుతూ
ఉన్నాడు.
“అప్పుడంతా
అన్నయ్యే పిల్లలను
బాగా చూసుకునేవాడట.
ఇప్పుడు బాధ్యత
అంటూ అప్పగిస్తె, చాలా
బాగా చేసి
ముగించేవాళ్ళు
అన్నయ్యకు సమంగా
ఎవరూ లేరు
తెలుసా?” అన్నది
పద్మ గర్వంగా.
“ఓ...అందుకనే
ఎక్కువ కోపగించుకుంటున్నారా, కొంచం
విశ్వామిత్రుడి
లాగా...” అంటూ సాగదీస్తూ
నాలికను కరుచుకుంటూ
భయంగా పద్మని
చూసింది శైలజా.
“ఎవరు…కిషోర్
అన్నయ్యనా విశ్వామిత్రుడు
అంటున్నావు? ఉండు.
అన్నయ్యరానీ
చెబుతాను. బాధ్యత, డ్యూటీ
అంటూ వచ్చినప్పుడు
ఆయన స్ట్రిక్టు.
కానీ, మిగతా
సమయంలో ఆయనా
ఒక సరదా
మనిషే. అది
సరి...? విశ్వామిత్రుడ్ని
ఒక మేనకా
మత్తు ఎక్కించిందని
చదివాను. అలా
ఏదైనా...?” అంటూ
శైలజాను కెలక
“ఛఛ...అదంతా
ఏమీ లేదు.
ఊరుకో తల్లీ...అనవసరమైన
రూమర్ లేపకు?” అన్న
ఆమె ముఖం
ఎర్రగా మారటం
చూసి ఆశ్చర్యపడింది
పద్మ.
“ఓయమ్మో...సిగ్గుతో
ముఖం ఎర్రబడింది
అంటారే! అది
ఇదేనా? ఎంత
అందంగా ఉన్నావో?” అంటూ
మరింత ఆశ్చర్యపడింది
పద్మ.
“ఏమిటీ
పద్మా...అయ్యిందా? సుత్తి
వేసి వేసి
వినోధినీ బుర్రను
తింటున్నావని అనుకున్నాను.
కానీ, నువ్వు
ఆమె మొహాన్ని
గాయపరిచినట్టు
ఉన్నావే? ఇలా
ఎర్రబడిందే!” అంటూ ఆశ్చర్యపోయాడు
అక్కడకొచ్చిన కిషోర్.
“పద్మ
నీ బుర్రను
సుత్తివేసి తినేసే
ముందే, నిన్ను
కాపాడాలని పరిగెత్తుకువచ్చాను
వినోధినీ. ఏదైనా
సహాయం కావాలా?” అని
ఆమెను చూస్తూ
అడిగాడు. కళ్లల్లో
రసికత్వం కనబడింది.
“ఇంతవరకు
బుర్ర మీద
గాయం ఏర్పడలేదు.
ఇప్పుడే కొంచంగా
రక్తం వచ్చేటట్టు
అనిపించింది” అని తలమీద
చేతితో రుద్దుకుంటూ
చెప్పింది శైలజా.
వెంటనే పద్మ
చప్పట్లు కొట్టి, “వెరి
గుడ్...వెరీ
గుడ్ వినోధినీ!
అన్నయ్యనే ‘బుర్ర’ తినకండి
అని తోసేస్తున్నావే...నువ్వు
కూడా మా
గ్రూపే” అంటూ కుతూహలంగా
చెప్పింది.
“అమ్మో!
నువ్వు కూడా
ఈ అల్లరి
మూకలో చేరిపోయావా? నేను
ఈ ఆటకు
రాను” అంటూ చేతులెత్తి
దన్నం పెడుతూ
నవ్వాడు.
మొట్ట మొదటిసారిగా
అతను గలగల
మంటూ నవ్వటాన్ని
ఆశ్చర్యంగా చూసింది
శైలజా. ఆమె
చూపులు అతనిపై
నుండి మారనంటున్నాయి.
Continued...PART-6
*********************************
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి