24, ఏప్రిల్ 2023, సోమవారం

అతడు కాలంలో ప్రయాణించాడా?... (మిస్టరీ)

 

                                                                 అతడు కాలంలో ప్రయాణించాడా?                                                                                                                                                           (మిస్టరీ)

చరిత్రలో మేధావులు, శాస్త్రవేత్తలూ అదృశ్యమైన సంఘటనలు ఏన్నో ఉన్నాయి. వీరంతా ఎలా అదృశ్యమైపోయారో తెలియక చనిపోయిన వారి లెక్కలో వేసేసుకుంటున్నారు. అలాంటి ఒక విచిత్రమైన సంఘటన గురించే మనం తెలుసుకోబోతున్నాము.

శాస్త్రవేత్త ఎటొరే మజోరనా 1906 సంవత్సరం ఇటిలీలో జన్మించారు. ఇటలీ దేశంలోని పలెరెమో నగరం నుండి అమెరికాలోని ఫ్లోరిడా నగరానికి ఓడలో ప్రయాణం చేసిన శాస్త్రవేత్త ఓడలో నుండి హఠాత్తుగా మాయమయ్యాడు. అతని కోసం గాలించిన ప్రయత్నాలు విఫలమవడంతో 1938 మార్చి నెల 27 అతను చనిపోయినట్లు ప్రకటించారు. అప్పుడు అతని వయసు 32 సంవత్సరాలు.

ఎటోరే మజోరనా ఒక ఇంజనీర్. గణిత శాస్త్రజ్ఞుడు మరియు సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఇతను Neutrino కణాల ముద్దల గురించి పరిశోధనలు చేశాడు.(న్యూట్రినో అనేది పరమాణువులో ఎలాంటి విద్యుదావేశం లేని కణం. న్యూట్రినో ఎలాంటి వస్తువు గుండా అయినా ప్రయాణించగలదు. న్యూట్రినోలు రేడియో ధార్మికత, పరమాణు ప్రతిచర్య ద్వారా రూపొందుతాయి. అందువలన ఇవి సూర్యుని ఉపరితలం మీద, కాస్మిక్ కిరణాలు అణువును తాకినప్పుడు ఉద్భవిస్తాయి). అందువలన కొన్ని గణితశాస్త్ర సమీకరణాలకు మరియు భౌతిక కణాలకు శాస్త్రవేత్త పేరుపెట్టారు. (The Majorana equation and Majorana fermions). సైద్ధాంతిక భౌతిక రంగంలో నూతన ఆవిష్కరణ చేసిన వారికి 2006 నుండి శాస్త్రవేత్త పేరుతో బహుమతి అందజేయడం మొదలుపెట్టారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

అతడు కాలంలో ప్రయాణించాడా?... (మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి