30, అక్టోబర్ 2022, ఆదివారం

మరో ప్రపంచం నుండి వచ్చిన మనిషి…(మిస్టరీ)


                                                                      మరో ప్రపంచం నుండి వచ్చిన మనిషి                                                                                                                                                                   (మిస్టరీ) 

ఇప్పుడిప్పుడే భూమిలాంటి మరో గ్రహం ఉన్నది అని చెబుతున్నారు.

కానీ 1954 లో జపాన్ లోని టోక్యో విమానాశ్రయంలో జరిగిన ఒక వింత సంఘటనను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే, ఇప్పుడు చెబుతున్న భూమిలాంటి మరో గ్రహం ఎప్పటి నుండో ఉండి వుండవచ్చు, అందులో మనలాంటి మానవజాతి మనుగడ కలిగి ఉండవచ్చునేమో అనిపిస్తుంది.

1954 సంవత్సరం జూలై నెలలో టోక్యో విమానాశ్రయంలో ఒక మనిషి దిగాడు. అతను చూడటానికి యూరప్ ఖండానికి చెందిన మనిషిలా కనిపించాడు. మన సంప్రదాయ రీతిలోనే ఉన్నాడు. కానీ విమానాశ్రయ అధికారులకు అతని మీద అనుమానం వచ్చింది.

అతని పాస్ పోర్టును తనిఖీ చేశారు. అతను టౌరడ్ అనే దేశానికి చెందినవాడని అందులో రాసుంది. అతని పాస్ పోర్ట్ వాస్తవమైన అధార స్థానం నుంచి ఇవ్వబడినట్లే ఉన్నది. కానీ అతను చెప్పిన దేశం మన ప్రపంచంలోనే లేదు.

అతన్ని విచారణకు తీసుకు వెళ్ళి అతని దేశం ఎక్కడుందో చెప్పమన్నరు. మ్యాపులో చూపించమన్నారు. అతను వెంటనే మ్యాపులోని 'ప్రిన్సిపాలిటీ ఆఫ్ అండోర్రా' అనే దేశంపై తన వేలు ఉంచి చూపించాడు(అండోర్రా: అధికారిక నామం ప్రిన్సిపాలిటీ ఆఫ్ అండోర్రా. పశ్చిమ యూరప్ లోని ఒక చిన్న భూపరివేష్టిత దేశం. దేశం, పైరెనీస్ పర్వతాలకు తూర్పున, స్పెయిన్ మరియూ ఫ్రాన్స్ దేశాలు సరిహద్దులుగా కలిగి ఉన్నది). అయితే అతనికి వెంటనే కోపం వచ్చింది. కోపంతో పాటు గందరగోళంలో పడ్డాడు. నా దేశం పేరు టౌరడ్. అండోర్రా పేరు నేనెప్పుడూ వినలేదు. అయినా నా మాతృదేశం ఎందుకు మ్యాపులో లేదు అని అడిగాడు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మరో ప్రపంచం నుండి వచ్చిన మనిషి…(మిస్టరీ)@ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి