28, జులై 2023, శుక్రవారం

వర్షంలో వెన్నెల...(సీరియల్)...(PART-3)


                                                                         వర్షంలో వెన్నెల...(సీరియల్)                                                                                                                                                                     (PART-3) 

కారు జరగటం మొదలై ఐదు నిమిషాల వరకు ఇద్దరి మధ్యా మౌనం ప్రధానమైన భాషగా ఉన్నది. కారులో పాటలు కూడా పెట్టుకోలేదు కిషోర్.

ఇదిగో చూడు వినోధినీ! మనం గొడవపడే మనుషులం కాదు. ఇంకా చెప్పాలంటే కలిసి ఒకటిగా పెరిగాం. పెద్దవాళ్ళు చేసిన నేరం కోసం... మనమెందుకు ఒకరికొకరు శత్రువులుగా ఉండాలి? మనం సహజంగా ఉండొచ్చు కదా... అని స్వరం తగ్గించి చెప్పాడు.

ఆ స్వరం ఆమెలో ఒక గిలిగింత కల్పించింది. ఇతనితో సహజంగా ఉండటం కంటే, గొడవపడటమే మేలు అనుకున్న ఆమె...మౌనంగా కారు అద్దాల ద్వారా బయటకు చూస్తూ కూర్చున్నది.

సహనం కోల్పోయిన అతను,  ఇప్పుడు మావయ్య మీద జాలి పడో, ప్రేమ ఉండో వచ్చినట్టు నాకు అనిపించటం లేదు. నువ్వు రాకుండా ఉండుంటే...నేనే సర్ది  చెప్పేవాడిని. ఇప్పుడు చూడు. నిన్ను ఒక రెండు రోజులు ఇక్కడే ఉంచాలనుకుని...అందరూ నీ కాళ్ళ మీద పడాలని ఎదురు చూస్తున్నావు. మీ అమ్మకున్న పొగరే నీకూ ఉంది! అని మళ్ళీ కఠిన స్వరంతో మాట్లాడాడు.

నేను వచ్చింది మీకు నచ్చలేదని నేను మొదట్లోనే అర్ధం చేసుకున్నాను.  ఇక్కడున్న ఆస్తికి ఆశపడి నేను రాలేదు. ఇదంతా మీరే పెట్టుకుని, చిన్న యజమానిగానే ఉండండి. ఎక్కడ మీ ఆ పదవికి, ఆస్తికి ఆటంకం వస్తుందోనన్న భయమే కదా? నేను...

హఠాత్తుగా కారు సడన్ బ్రేకుతో ఆగిన వేగంలో ముందుకు పడుంటుంది. సీటుబెల్టు వలన తప్పించుకుంది. తిరిగి అతన్ని చూసింది. కోపంతో మొహం ఎర్రబడుంది. చేతులు స్టీరింగ్పైన ఉన్నాయి.

మంచి పెంపకం! ఎందుకిప్పుడు సంబంధమే లేకుండా ఆస్తి గురించి  మాట్లాడుతున్నావు?--వెర్రి కోపంతో అడిగాడు.

అతని కోపం వలన ఏర్పడ్డ భయాన్ని కప్పి పుచ్చుకుని, "మరి! నేను వచ్చిన దగ్గర నుండీ విసుగు, కోపంతో మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలి? నేనే ఎన్ని సమస్యలతో వచ్చానో తెలుసుకోకుండానే మాట్లాడుతున్నావు? మిగిలిన వారి గురించి మీకు ఎటువంటి పట్టింపూ లేదు. ఎంతసేపూ మీరు, మా నాన్న ఎన్ని బాధల్లో ఉన్నారో అనేదే మీకు ముఖ్యం. ఎందుకంటే మీ ఆలొచనలో మాకేమీ సమస్యలు ఉండవు? నేను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వచ్చాను...నేనొచ్చింది వాళ్ళకు తెలిస్తే నన్ను చంపేస్తారు. అందుకనే వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని 'టికెట్టు బుక్' చేసుకున్నాను" అని తానూ కోపంగానే మాట్లాడింది.

కొద్ది సేపటి వరకు అతని దగ్గర నుండి సమాధానం లేదు. తరువాత "నాకు మావయ్య మీద ప్రేమ-అభిమానం కంటే, అంతకంటే ఎక్కువ మర్యాద ఉంది. దాన్ని నీ దగ్గర నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. కానీ, మావయ్య కోసం చెబుతున్నా...విను. ఆల్రెడీ--అంటే ఎప్పుడో ఆయన ఆస్తిలో డెబ్బై ఐదు శాతం నీ పేరుకూ, పాతిక శాతం ఆయన నడుపుతున్న అనాధ ఆశ్రమానికీ రాయించేసేను. ఇకమీదట ఇలా అసహ్యంగా మాట్లాడకు!" -- ఎమోషనల్ స్వరంతో గట్టిగా చెప్పాడు.

కొద్ది క్షణాలు మౌనంగా ఉన్న ఆమె, “సారీ. నేను మిమ్మల్ని అలా మాట్లాడి ఉండకూడదు." అని క్షమాపణలు కోరింది.

అతను కూడా చూపల నుండి కఠినత్వాన్ని దాచి, "పరవాలేదు...నేనూ నిన్ను అంత కఠినంగా మాట్లాడుండకూడదు" అని కారును కదిపాడు.

మావయ్య అనుభవించిన బాధలను, ఆయనతో ఉంటూ చూసినందువలన నాకు  మీ ఇద్దరి మీద కోపం. అత్తయ్య ఆయన మీద కోపంతో రాలేదు. నువ్వు ఒకసారైనా వచ్చి చూసుండొచ్చే? కనీసం ఫోనులోనైనా ఆయనతో మాట్లాడుండొచ్చే? నీకు ఆయన మీద ప్రేమే లేదనేదే నాకు మంట" అని కారణం చెప్పాడు.

'ఇతనికి వినోధినీ రాలేదన్నదే కోపమే తప్ప, నా మీద ఏమీ లేదు ' అని ఒకసారి బుర్రలో అనిపించ, మనసు కొంచం ప్రశాంతత చెందింది.

"అది పదిహేడు సంవత్సరాలకు ముందు, మనసు మొద్దుబారి పోవటం వలన ఏర్పడింది. పెద్దల చేష్టల వలన పిల్లలు అనుభవించే అవమానాలు, వేదనలు జీవితం మీద ఎంత విరక్తిని ఏర్పరుస్తుందని అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్ధమవుతుంది" అన్నది శైలజా.

"ఇప్పుడు మనం వెళ్ళబోయేది 'దయా' అనాధ--వృద్దాశ్రమం. మావయ్య ఇది ప్రారంభించి పది సంవత్సరాలు అవుతోంది. పండుగ రోజుల్లో మావయ్య ఇక్కడకు వస్తారు. పిల్లలకూ, వృద్దులకూ రకరకాల పలహారాలు, భోజనం పెట్టించి, వాళ్ళతోనే పండుగ జరుపుకుంటారు. మేము పిలిస్తే కూతుర్నీ, భార్యను విడిపోయిన దుఃఖము -- వాళ్ళతో ఉన్నప్పుడు తెలియటం లేదుఅని చెప్తారు. మనుషులు తప్పు చేయటం సహజం. తప్పు చేసిన వాళ్ళు. దేవుడిలాగా గుడిలోనే ఉండాలి. ఏం మీ అమ్మ తప్పే చేయని మనిషా?" అని తిరిగి చూసి ఆమెను అడిగాడు.

"ఎవరు తప్పు చేసారు అనే అన్వేషణ అవసరంలేని విషయం.కానీ, కన్నవారు స్వార్ధపరులుగా ఉంటే, పిల్లల జీవితం ఎప్పుడూ ప్రశ్నార్ధకమే" అన్న ఆమె, మాట మార్చాలనే ఉద్దేశంతో "మీరు ఏం చదువుకున్నారు?" అని విచారించింది.

ఆమెను ఆశ్చర్యంగా చూసిన అతను, "నేను బి.కాం. తరువాత ఎం.బి..  సొంతంగా 'కంప్యూటర్--లాప్ టాప్' బిజినెస్. మావయ్య ఆరొగ్యం బాగుండలేకపోవటంతో గత ఆరు నెలలుగా ఆయన్ హోటల్ ను కూడా చూసుకోవలసి వచ్చింది. నువ్వు వచ్చేస్తే, నీకు అన్నీ నేర్పించి నా పనులు చూసుకుంటాను.  లేక--లక్ష్మీ అత్తయ్య వచ్చినా ఆవిడే చూసుకుంటుంది. అంతకు ముందు ఆవిడే చూసుకునేది" అని సృష్టం చేశాడు.

"అది జరుగుతుందనేది అనుమానమే" అన్నది ఆలొచనతో.

"జరుగుతుంది! నా తర్వాతి పని అదే. నేనూ బెంగళూరు వచ్చి, అత్తయ్యను తీసుకు వస్తాను చూడు" -- ఛాలెంజ్ చేశాడు.

నిజం తెలిసేటప్పుడు, నా గతి ఏమిటీ?’ అని ఆలొచించిన ఆమెకు శరీరమంతా వణికింది. ఆమె దగ్గర కదలిక చూసిన అతను ఏమిటీ....సి. చలిగా ఉందా వినోధినీ?” అని అడిగాడు.

శైలజా అని పిలిస్తే ఎలా ఉంటుంది?’ అని అనుకోవటంతో మళ్ళీ వణుకు ఏర్పడింది. .సి. తగ్గించాడు. వేస్తున్న ఎండకు, అందులోనూ ఒక బెంగళూరు నివాసికి, చలి వేస్తోందంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ఎగతాలి నవ్వుతో.

అతని నవ్వు వెచ్చదనం ఇచ్చినట్టుగా ఉన్నది. జవాబుగా నవ్వుదాం అని తుళ్ళిపడుతున్న మనసును అనిచి, చూపులను తిప్పి మౌనంగా బయటకు చూసింది.

ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తున్నప్పుడు కారు ఒక గేటు ముందు ఆగింది.

దయా నిలయంఅన్న నేమ్ బోర్డు ఉన్న పెద్ద స్థలంలోకి కారువెళ్ళి ఒక బిల్డింగ్ ముందు ఆగింది. నిశ్శబ్దంతో మునిగిపోయున్న నిలయం. కుమారి ఇసబిల్లాఅని పరిచయం చేయబడ్డ వృద్దురాలిని ఆశ్చర్యంతో నమస్కరించింది శైలజా.

ఏమిటమ్మా అంత ఆశ్చర్యం? నేనెలా ఇక్కడ అనేగా? ఒక కాన్వెంటులోనే బాధ్యత స్వీకరించాను. కానీ అక్కడకొచ్చి సహాయం చేయమని మోహన్ గారు వెడుకున్నారు కాబట్టి వచ్చాను. మోహన్ గారికి ఉన్న దయా గుణం, ప్రపంచంలో చాలా కొద్దిమందికే ఉంటుంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రోజూ ప్రార్ధన చేస్తున్నారు. ఇక్కడ జాతీ--మతం భేదం లేదు. అన్ని పండుగలను జరుపుకుంటాం అని గబగబా చెప్పేసి, లంచ్ గురించి కిషోర్ దగ్గర చెప్పింది.

ఈరోజు స్పేషల్ గా పాయసం చేయమని చెప్పాను! అదికూడా రెడీ అయ్యింది. బ్రదర్’--అని చెప్పి, మళ్ళీ శైలజా వైపుకు తిరిగి బ్రదర్ తనని సార్ అని పిలవకూడదని చెప్పారుఅందువలనే నేను అలా పిలుస్తున్నాను అని  వివరించింది.

కొనసాగిస్తూ నేనొక వాగుడుకాయిని, మాట్లాడుతూనే ఉంటాను. మీరు ఆశ్రమం  మొత్తం ఆమెకు చూపించండి బ్రదర్. నేనొచ్చి జాయిన్అవుతాను అని చెప్పి, టెలిఫోన్ పిలుపుకు జవాబు చెప్పటం మొదలుపెట్టింది.

రా వినోధినీ! వెళ్ళి పిల్లలనూ, పెద్దలనూ చూద్దాం అమెను పిలుచుకు వెళ్ళాడు. బిల్దింగులో నుండి తిన్నగా ఒకదారి వెళ్లగా, రెండు వైపులా రంగుల మయంగా పలురకాల పూల మొక్కలు. అక్కడక్కడ అలాంకార లైట్లు.

ఆమె చుట్టు పక్కలను ఆసక్తిగా చూడటాన్ని గమనించిన కిషోర్ ఎడం వైపు విశాలమైన ప్లే గ్రౌండ్, కుడివైపు కలామండపం. తన యొక్క రిసార్టుకు సరిసమంగా ఆశ్రమం ఉండాలని మావయ్య ఆశపడ్డారు. డబ్బులు ఉన్నవారు మాత్రమే జీవితాన్ని అనుభవించలా? ఇక్కడున్న ఇరవై ఐదు మంది అనాధ పిల్లలూ, ఇరవై మంది వృద్దులూ కూడా అనుభవించనీఅనేది ఆయన ఆలొచన. అందువలన పూర్తిగా అనాధలుగా ఉన్నవారిని ఎంపిక చేసి, వాళ్ళకు పరిపూర్ణ జీవితాన్ని ఇస్తున్నారు అంటూ ఆమెను పిలుచుకు వెళ్ళిన చోటు ఒక పెద్ద ట్రైనింగ్ సెంటర్.

ఇక్కడ టైలరింగ్ ట్రైనింగ్ నుండి మొదలుపెట్టి, కంప్యూటర్ వరకు రకరకాల ప్రొఫషనల్ ట్రైనింగ్ వరకు ఇవ్వబడుతుంది. పిల్లలు కాకుండా మావయ్య దగ్గర పనిచేసే పనివాళ్ల వారసులు కూడా నేర్చుకుంటున్నారు -- చెబుతూ వచ్చిన అతను, ఆమె చేత్తో నోటిని మూసుకోవటం చూసి ఏమిటీ?” అన్నాడు.

సారీ! వసతులు చేసిస్తే పిల్లలు బద్దకస్తులుగా పెరుగుతారు అని నిర్లక్ష్యంగా అనుకున్నాను. దానికొసం బాధపడుతున్నాను అన్నది నిజమైన బాధతో.

మెల్లగా నవ్వినతను కానీ, నిన్ను తప్పు పట్టకూడదు. మావయ్య గురించి నీకు తెలిసే అవకాశమే లేదే! ఆయన్ని నువ్వు తండ్రిగా పొందటానికి నువ్వు ఎప్పుడో పుణ్యం చేసుకోనుండాలి వినోధినీ అన్నాడు ఎమోషనల్ గా.

నేర భావనతో తలవంచుకుంది శైలజా. అక్కడ ఒకరిద్దరు పనివాళ్ళను పరిచయం చేసిన అతను, కళామందిరం లోకి వెళ్ళినప్పుడు వెల్కం...వెల్కం... వినోధినీ అక్కయ్యా అని కోరస్ స్వరం వినిపించింది. వరుసగా వేసున్న కుర్చీలలో  ఒకవైపు, మరోవైపు పెద్దవాళ్ళూ నిలబడి చప్పట్లు కొడుతున్నారు. ముందున్న స్పీకర్ దగ్గర నిలబడ్డ ఇద్దరు పిల్లల స్వరం పెద్దగా వినబడ, మందిరం మొత్తం కోలాహళంగా ఉన్నది.

పూలగుత్తి ఒకటి ఒక పిల్ల తీసుకువచ్చి ఇచ్చి వెల్కం అక్కా! వెల్కం అంకుల్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. దగ్గర నిలబడ్డ పిల్ల పిల్ల పేరు కావ్యా. పదో తరగతి చదువుతోంది. పూలగుత్తిని అరగంటలో మీకొసం రెడీ చేసింది అని గర్వంగా చెప్పినప్పుడు, ఇసబెల్లా వచ్చింది.

రోజు టంగుటూరి ప్రకాశం పంతులుగారి పుట్తిన రోజు వేడుక సాయంత్రం నాలుగింటికి ఏర్పాటు చేసుంచాము. మీరు వస్తున్నట్టు బ్రదర్ అప్పుడు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే సాయంత్రం చేయాలనుకున్న కార్యక్రమాలను ఇప్పుడే జరిపేద్దామని మార్చాము. పిల్లలు కూడా రెడీగా ఉండటంతో ఈజీ అయిపోయింది. రండి...ముందు వరుసలో కూర్చోండి అంటూ వాళ్ళను పిలుచుకు వెళ్ళింది.

ఏం మాట్లాడాలో తెలియని పరవశంతో నిలబడింది శైలజా. అందరినీ చూస్తూ నమస్కరిస్తూ వెళ్ళి కూర్చుంది. పక్కన కిషోర్ కూర్చున్నాడు.

హలో! ఏమైంది? ఒకేసారి షాకయ్యావా? రిలాక్స్! ఇంకా పిల్లల తెలివిని చూడు అంటూ ఆమె చెవి దగ్గర గుసగుస లాడాడు. అంత పక్కగా వచ్చిన అతని మొహం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. తరువాతి అరగంట ఎలా గడిచిందో తెలియనంతగా...ఆటా, పాట, కామెడీ, చిన్న నాటకం, మిమిక్రీ అంటూ ఆశ్చర్య పరిచారు పిల్లలు.

తిరిగి చూసింది. ఒకవైపుగా కూర్చోనున్న పెద్దవాళ్ళు మొహాలలో ఆనందం. మరోవైపున ఉన్న పిల్లల దగ్గర కుతూహలం. ఇది, ఎక్కడా చూడని వింతలాగా అనిపించింది శైలజాకి.

పిల్లలూ, పెద్దలూ కలిసున్న కొత్త లోకం. ఎలాగైనా సరే వినోధినీను ఇక్కడికి తీసుకువచ్చి చూపించాలిఅని మనసులో అనుకుంది. తరువాత ఆశ్రమంలో ఉన్న నవీన వసతులతో కూడిన శుభ్రమైన గదులు, చిన్న క్లీనిక్, లైబ్రరీ, పెద్ద వంట గది, డైనింగ్ హాలు అంటూ అన్నిటినీ చుట్టి చూపించాడు కిషోర్.

ఆశ్రమంపైన అతనికి చాలా శ్రద్ద ఉండటాన్నీ...పిల్లల దగ్గరా, పెద్దల దగ్గరా అతను అభిమానంతో మాట్లాడిన విధం చూసి ఆశ్చర్యపడింది. రాతిలో కూడా తడి ఉంటుందిఅని అనుకుంది.

అక్కడ్నుంచి బయలుదేరినప్పుడు, మధ్యాహ్నం ఒంటిగంట అయిపోయింది. అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది శైలజా. అందరూ 'అప్పుడప్పుడు రావాలి '  అని అన్నారు. పెద్దవాళ్ళు రాణిలాగా బ్రతకాలమ్మాఅని ఆశీర్వదించారు.

ఐదేళ్ళ పిల్ల వచ్చింది. అక్కా, మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా రానేలేదక్కా. నన్ను ఆవిడ దగ్గరకు తీసుకు వెళతావా అక్కా అని ఆశగా అడిగింది.

మోకాళ్ళ మీద కూర్చున్న పిల్లను ఎత్తుకుని, గుండెలకు హత్తుకుని, లేచి కారు దగ్గరకు పరిగెత్తింది.

                                                                                                 Continued...PART-4

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి