10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

మహాలక్ష్మి...(కథ)


                                                                                      మహాలక్ష్మి                                                                                                                                                                                            (కథ) 

ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో దేశం సస్యస్యామలంగ వుంటుంది. అందుకే ఒక కవి స్త్రీ గురించి ఇలా రాసాడు బ్రతుకు ముల్లబాటలో జతగా స్నేహితురాలవయ్తివి...కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి...వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన భార్యవైతివి...పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి...అని అన్నారు. కష్టంలో ముందుండి...సుఖంలో క్రిందుండి...విజయంలో వెనకుండి ...ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ.

కాని నేడు స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూ,  ఉద్యోగాలు చేస్తూ, పురుషుల పరిమితమైన విజయాల్ని సైతం దక్కించుకుంటున్నారు, పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఆధునిక కాలంలో ఆడది అబల కాదు 'సబల' అనగా పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలదు అని నిరూపించుకుంటున్నారు. నేటి స్త్రీ ఉద్యోగాల వల్ల ఎంతో ఒత్తిడి ఎదుర్కొకుంటోంది.

ఇంతమారినా ఇంకా స్త్రీని వ్యాపార ప్రకటనలలో, సినిమాలలో స్త్రీని ఒక ఆటబొమ్మగా సెక్స్ సింబల్ గా మాత్రమే చూపిస్తున్నారు....కానీ, ఇంకా ఎంతోమంది పురుషులు స్త్రీపట్ల అత్యంత గౌరవం కలిగి మహాలక్ష్మిగా చూస్తున్నారు. కథలో పేదరికంలో ఉంటున్న ఒక పురుషుడు స్త్రీని ఎలా చూసాడో చూడండి.

వికలాంగుడైన అతను ప్రతిరోజూ వీధికి ఒక పక్కగా, వీధిపై బ్రహ్మాండమైన దేవుడి చిత్రాలను తన చేతి ప్రతిభతో గీసి మెరుగులు దిద్దుతూ ఉంటాడు. అద్భుతంగా గీసిన కళాఖండం చిత్రాలను చూసి ఆనందించటానికి చాలామంది గుమికూడుతారు. కళాచిత్రం మీద వాళ్ళు ఎగరేసివెళ్ళే డబ్బులే వాళ్ళ కుటుంబ ఖర్చులకు చేయూతనిస్తోంది. ఈశ్వరమ్మ దగ్గర్లో ఉన్న ఒక ఇంట్లో పనిచేస్తోంది. అందులో దొరికేది కొద్ది సంపాదనే.

ఏడుకొండలు తన వారినందరిని సునామీకి అర్పణం ఇచ్చాడు. అందువల్ల ఒంటరి మనిషిగా అయ్యాడు. ఈశ్వరమ్మకు ఒకే ఒక బామ్మ. ఆవిడ కూడా చనిపోయిన తరువాత ఈశ్వరమ్మ కూడా  ఒంటరిగా నిలబడింది. 

ఈశ్వరమ్మ, ఏడుకొండలు మీద జాలిపడి, అతని చిత్రాలు గీసే ప్రతిభ మీద ఆకర్షితురాలై ప్రేమలో పడి, ఇద్దరూ భార్యా-భర్తలు అయ్యారు.

రోజు మామూలుకంటే ఎక్కువ గుంపు వీధి పక్క గీయబడిన చిత్రం చుట్టూ నిలబడి ఉండటం చూసి వేగ వేగంగా వెళ్ళిన ఈశ్వరమ్మ, గుంపును  జరుపుకుని ముందుకు వెళ్ళి చూసింది. అక్కడ ఏడుకొండలు మహాలక్ష్మి చిత్రం ను చాలా అందంగా తత్ రూపంగా గీసున్నాడు. దేవత చేతిలో ఉన్న కుండలో నుండి, బంగారు నాణాలు నేలమీద పడుతున్నట్టు స్వాభావికంగా ఉన్నది.

అటువైపుగా వెడుతున్న కొందరు కళాకండం ను చూసి ఆశ్చర్యపోయి, చాలా డబ్బును వేస్తున్నారు. ఎలాగైనా రోజు మామూలుకంటే ఎక్కువ డబ్బులు వస్తాయని సంతోషపడ్డ ఈశ్వరమ్మ కళ్ళు భర్తను వెతికినై. రోడ్డుకు అవతలివైపు అతను ఉన్నాడు. అక్కడ కారులో కూర్చునే ఉన్న ఒకాయన ఏడుకొండలుతో మాట్లాడుతున్నారు. కొంత సమయం తరువాత కారు బయలుదేరటంతో...  ఏడుకొండలు తన భార్య ఉన్న వైపుకు చూసి నవ్వుతూ దేక్కుంట్టూ వచ్చాడు.

ఏంటయ్యా రోజు ఇంత సంతోషంగా ఉన్నావు...నువ్వు గీసిన చిత్రం సూపర్ గా ఉంది...అవును, కారులో ఉన్నది ఎవరు...ఏమడిగారు?”

"... అదా...ఆయన చాలా పెద్ద డబ్బుగల వ్యక్తి. గొప్ప వ్యాపారి. తన విసిటింగ్ కార్డు ఇచ్చి, అడ్రస్సుకు రమ్మన్నారు. కళా చిత్రాలు వేసే పని ఇస్తానని, దానికి మంచి కూలీ ఇస్తానని ప్రామిస్ చేసారు. నేను వెంటనే బయలుదేరాలి" అన్నాడు.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మహాలక్ష్మి...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి