5, ఫిబ్రవరి 2023, ఆదివారం

సరి భాగం...(కథ)

 

                                                                                        సరి భాగం                                                                                                                                                                                            (కథ)

ముగ్గురు కూతుర్లున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రాజమౌలికి ముగ్గురు కుమార్తెలు. కష్టపడే సంసారాన్ని ఈదుకు వస్తున్నాడు.పెద్ద కూతుర్లిదరూ పెద్దగా చదువుకోలేదు. అంత కష్టంలోనూ  మూడవది, చివరిది అయిన కూతుర్ను డిగ్రీ చదివిస్తున్నాడు. ఉద్యోగం లో ఉన్నప్పుడు పెద్ద కూతురికీ, రిటైర్ అయిన తరువాత రెండో కూతురికీ కష్టలు పడి, అప్పు చేసే పెళ్ళిల్లు చేసేడు. వాళ్ళిద్దరికీ తాను చేయగలిగినంత వరకు మాత్రమే కట్నకానులు ఇచ్చి పెళ్ళి చేశాడు. అప్పులు తీరెంతవరకూ, మూడో కూతురు చదువు పూర్తి అయ్యేంతవరకు, రెండూ మరో రెండేళ్ళల్లో పూర్తి అయిపోతాయి కనుక తరువాత ఆమె పెళ్ళి గురించి ఆలొచించవచ్చు అనుకున్నాడు.

ఇంతలో అనుకోకుండా మూడో కూతురుకి మంచి సంబంధం వచ్చింది. అయినా కానీ వరుడి దగ్గర, వరుడి కుటుంబీకుల దగ్గర తన ఆర్ధీక పరిస్థితిని వివరించి ఇప్పట్లో పెళ్ళి చేయలేనని చెప్పాడు.

వరుడు మరియు వరుడి కుటుంబీకులూ రాజమౌలి మూడో కూతుర్ని చూసిన తరువాత, ఆమె చదువు గురించి తెలుసుకున్న తరువాత తమకి కట్న కానుకలమీద ఆశలేదని తెలుపుతారు.

మంచి సంబంధం, తానుగా వెతుక్కుంటూ వచ్చి ఏమీ ఎదురు చూడకుండా పెళ్ళికి రెడీ అని చెప్పటం రాజమౌలిని, అతని కుటుంబీకులనూ ఆనందంలో ముంచెత్తింది.

ఆనందం ఎక్కువ సేపు వాళ్ళను తనతో ఉంచుకోలేదు. కారనం, రాజమౌలి మూడో కూతురు తనకు కాబోయే భర్త మరియు వాళ్ళ కుటుంబీకులు ఎటువంటి కట్న కానుకలూ వద్దని చెప్పినా, తన పెళ్ళికి తండ్రి అక్కయ్యలకు ఇచ్చిన అదే కట్న కానుకలు తన పెళ్ళికీ ఇవ్వాలని, లేకపోతే తాను పెళ్ళి చేసుకోనని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పటంతో రాజమౌలి ఆనందంలో నుండి సోకం లోకి వెళ్ళిపోతాడు.

మరి పెళ్ళి జరిగిందా? జరగలేదా? జరిగుంటే ఎలా జరిగింది?

తెలుసుకోవటానికి కథను చదవండి.

ప్రభుత్వ ఆఫీసు ఉద్యోగం  నుండి రిటైర్ మెంట్ అయిన తరువాత రాజమౌలి సార్ కు ప్రశాంతతే పోయింది. ముప్పై సంవత్సరాలప్పుడు సులోచనాను పెళ్ళి చేసుకున్న ఆయనకు పుట్టింది ముగ్గురూ  ఆడపిల్లలే.

పెద్దది పార్వతికి ఇరవై ఏడేళ్ల వయసు. ఆమెకు వరుడుగా వచ్చిన వాడు యాదగిరి. రైతు. మూడెకరాల మాగాణీ, రెండెకరాల మెట్ట అతనికి సొంతం. ఇంటికి ఒకడే కొడుకు. పార్వతి ఎక్కువగా చదువుకోలేదు. కానీ చాలా సాధువు.

రెండో కూతురు శేషమాంబ కూడా పదో తరగతి కంటే ఎక్కువ చదవటం ఇష్టం లేకపోవటంతో. లారీ డ్రైవరు, సొంతంగా రెండు లారీలూ ఉన్న పోతరాజు కు ఆమెను వివాహం చేసి ఇచ్చాడు. ఆమెకు వయసు ఇరవై నాలుగు. పోతరాజు తన సొంత రెండు లారీలలో ఒకటి తమ్ముడికిచ్చి తోలుకోమన్నాడు. రెండు లారీల సంపాదనతో కుటుంబాన్ని నడుపుతూ వచ్చాడు.

అందరికంటే చిన్నది కామాక్షి. వయసు ఇరవై. ఎం.ఎస్.సి. చదువుతోంది. కోపిష్టిది. పట్టుదల మనిషి. కానీ చదువులో చాలా గట్టిది.

మొదటి కూతురికి కట్నకానుకలుగా ఇరవై కాసుల బంగారమూ, యాభైవేలు డబ్బుగా ఇచ్చి పెళ్ళి జరిపారు రాజమౌలి. భార్య యొక్క నగలతోనూ, ఆఫీసు లోనుతోనూ రెండవ అమ్మాయి శేషమాంబకు  అదేలాగా కట్నకానుకలు ఇచ్చి పెళ్ళి ముగించారు. అందువలన రాజమౌలికి అప్పు ఎక్కువ అయ్యింది.

కామాక్షీ కాలేజీలో చదువుతున్నా కూడా ఒకటి, రెండు చోట్ల నుండి సంబంధాలు వచ్చాయి. అమ్మాయి ఫోటోను చూసి బాగుంది అని చెప్పినా, కట్నకానుకల గురించి సంభాషణ వచ్చినప్పుడు...ఎదురు చూసినంత దొరకదు అని తెలిసిన వెంటనే చెప్పేవారు.  కామాక్షీ కూడా ఇది మూడో సంవత్సరం చదువే కదా...చదువు పూర్తవని అని దాటేసింది.

కామాక్షీ చిన్న వయసులోనే బొమ్మల దగ్గర నుండి ప్రతి చిన్న విషయానికి తన  అక్కయ్యలతో గొడవపడుతుంది. మొండికేస్తుంది. కానీ ఆమె అక్కయ్యలు ఇద్దరూ చెల్లి కోసం తమ ఆశలను వదిలిపెడతారు. తల్లి సులోచనా చివరి పిల్ల కదా అని, చదువులో దిట్ట అని బాగా గారాబం చేయటంతో ఎప్పుడూ కామాక్షీ వైపే సపోర్టు చేస్తుంది. తండ్రి దాన్ని చూసీ చూడనట్లు వెళ్ళిపోతారు.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

సరి భాగం...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి