10, జనవరి 2023, మంగళవారం

వేరు కాపురం!...(కథ)


                                                                                   వేరు కాపురం!                                                                                                                                                                                       (కథ) 

ఇదిగో చూడండి...నేను తీర్మానంగా చెబుతున్నా. ఇక మీదట మీ అమ్మ ఉన్న ఇంట్లో, నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఇప్పుడే మా అమ్మగారింటికి వెలుతున్నాపద్మజ ఖరారుగా చెప్పేసి పెట్టెతో బయలుదేర...ఆమెను ఆపటానికి ప్రయత్నించి ఓడిపోయాడు ఆమె భర్త బాలు.

చాలా ఇళ్ళల్లోసుప్రబాతంలేకపోతే వేరే ఏదైనా భక్తి శ్లోకాలు...అది కూడా లేకపోతే, ఒక సహజమైన ప్రశాంత వాతావరణంతో పొద్దు ప్రారంభమవుతుంది.

కానీ తనింట్లో మాత్రం ప్రతి రోజూ అత్తగారూ--కోడలూ వేసే పోట్లాడుకునే అరుపులతోనే ప్రతి రోజూ తెల్లారుతుంది. అది తలుచుకున్నప్పుడల్లా ఒక నిట్టూర్పు వస్తుంది బాలూకి. సారి భార్య 'అల్టిమేటం' ఇచ్చి వెళ్ళిపోయింది. భార్యా-తల్లా?

గొడవను ఎలా పరిష్కరించాడు బాలూ? ఎవరికి న్యాయం చేసాడు? ఎందుకు చేసాడు? ఏం చేసాడు?....తెలుసుకోవటానికి ఎమోషనల్ కథ చదవండి. 

గిన్నెలు దొర్లుతున్న శబ్ధంతో కళ్ళు తెరిచాడు బాలమురళి అనే బాలూ. శబ్ధంతో పాటు అతని తల్లి యొక్క చిన్న స్వరం, భార్య పద్మజ యొక్క అరుపులు వినబడినై.

చాలా ఇళ్ళల్లో సుప్రబాతంలేకపోతే వేరే ఏదైనా భక్తి శ్లోకాలు...అది కూడా లేకపోతే, ఒక సహజమైన ప్రశాంత వాతావరణంతో పొద్దు ప్రారంభమవుతుంది.

కానీ తనింట్లో మాత్రం ప్రతి రోజూ అతాగారూ--కోడలూ వేసే పోట్లాడుకునే అరుపులతోనే ప్రతి రోజూ తెల్లారుతుంది. అది తలుచుకున్నప్పుడల్లా ఒక నిట్టూర్పు వస్తుంది.

ఇంతలో గిన్నెల శబ్ధం ఎక్కువ అవగా, ఇంతకు మించి ఇంకా పడుకోనుంటే, గిన్నెలన్నీ తన వైపుకు దూసుకుంటూ వస్తాయనే భయంతో గబుక్కున లేచి వంట గది వైపుకు వెళ్ళాడు.

అలా వంట గదిలోకి వెడితే అమ్మకు కోపం వస్తుందనేది గుర్తుకు వచ్చి, వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి, వేగంగా పళ్ళు తోముకుని, మొహం కడుక్కుని వెళ్ళాడు.

వచ్చారా... మీరే న్యాయాన్ని అడగండి. నిన్న రాత్రి అన్నం మిగిలిపోయింది! దాంట్లో నీళ్ళు పోసి పెట్టటం మరిచిపోయాను. అలాగే గిన్నెను అరుగు మీద పెట్టేశాను. అది ఇప్పుడు తినలేని పరిస్థితిలో గుజ్జు గుజ్జుగా అయిపోయింది.

దానికి నేనేం చేయగలను? మీ అమ్మ ఏమో వండిన వంటకాలన్నిటినీ నేను వేస్టు చేస్తున్నానని నా మీద అపవాదు వేస్తున్నారు. ఏం...ఆవిడే నీళ్ళు పోసి పెట్టుండచ్చే?”--- పద్మజ కోపంగా అడిగింది.

అతని తల్లి ఒక గిన్నెను తీసి కొడుక్కి చూపించింది.

ఇదిగో చూడు బాలూ...ఎంత అన్నం వేస్టు అయిపోయిందో? ఇప్పుడు బియ్యం అమ్ముతున్న రేటుకు ఇలా వేస్టు చేయటం తప్పు కాదా? రోజుల్లో చేతి నిండా డబ్బు తీసుకు వెడితే, సంచి నిండుగా వంట సామాన్లు కొనగలిగే వాళ్ళం.

కానీ, కాలంలో సంచి నిండుగా డబ్బు తీసుకు వెళ్ళినా కూడా, చేతి నిండుగా వంట సామాన్లు కొనలేకపోతున్నాము. అలా ఉన్నప్పుడు...మిగిలిపోయిన వంటలను జాగ్రత్తగా ఉంచుకోవద్దూ? అది చెప్పినందుకు నీ భార్య నాతో గొడవ పడుతోంది --- అన్నది తల్లి శ్యామల.

ఏమిటీ... నేనా గొడవపడుతున్నాను. ప్రొద్దున నుంచి రాత్రి పడుకోపోయేంతవరకు మీరే కదా ఏదో ఒక దానికొసం నన్ను పోట్లాటకి లాగుతున్నారు! ఇందులో కాలంలో...అంటూ మాటకి ఒకసారి ప్రారంభిస్తారు. పాత కథలన్నీ మాట్లాడి మాట్లాడి చంపుతున్నారు -- ఉరిమింది పద్మజ.

కోడలు ఇలా ఏదో ఒకటి విసుగ్గా చెప్పగా, అత్తగారు ఏదో ఒకటి అనగా...వీటికి మధ్య ఏమీ మాట్లాడకుండా నిలబడున్నాడే అని ఇద్దరూ అతన్ని పోట్లాటలోకి ఈడ్చేరు.

ఇదిగో చూడండి...నేను తీర్మానంగా చెబుతున్నా. ఇక మీదట మీ అమ్మ ఉన్న ఇంట్లో, నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఇప్పుడే మా అమ్మగారింటికి వెలుతున్నా పద్మజ ఖరారుగా చెప్పేసి పెట్టెతో బయలుదేర...ఆమెను ఆపటానికి ప్రయత్నించి ఓడిపోయాడు బాలు.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

వేరు కాపురం!...(కథ) @ కథా కాలక్షేపం-1

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి