21, జనవరి 2023, శనివారం

మారని రాగాలు...(సీరియల్)....(PART-2)

 

                                                                               మారని రాగాలు...(సీరియల్)                                                                                                                                                                     (PART-2)

వంటగది లైటును ఆపేసి బయటకు వచ్చింది మాలతీ. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్ద అయ్యింది. ఇంటి వెనుకకు వెళ్ళి కుళాయి తిప్పి ముఖాన్నీ, కాళ్ళూ-చేతులను కడుక్కుని తుడుచుకుంటూ లోపలకు వచ్చింది.

సోపుతో కడుక్కోకపోయినా, ఉత్త నీటితో కడుక్కున్నందుకే ఆమె మొహం మెరిసిపోతోంది. చెవి చివరలలో తుడుచుకోకుండా వదిలేసిన నీటి చుక్కలు వజ్రాల బొట్లులాగా మెరుస్తున్నాయి. పూజగదిలో చిన్న గిన్నెలో ఉన్న విభూధిని పాము వేళుతో తీసి నుదిటి మీద రాసుకుంది.

పక్కనే బొట్టు భరిణె ఉన్నది. ముందంతా కూతుర్ల పట్టుదల వలన, అళ్లుల్ల ఒత్తిడివలన ఆవగింజంత బొట్టు పెట్టుకునేది. ఇద్దరు కూతుర్లలో ఒకత్తి ఢిల్లీకి, ఇంకొకత్తి జలంధర్ కూ వెళ్ళిన తరువాత అది వదిలేసింది.

పిల్లలకు సెలవులు ఇవ్వటంతో, కూతుర్లు ఇద్దరూ వాళ్ళ భర్తలతో కలిసి పిల్లలను తీసుకుని రేపు రాబోతున్నారు. ఢిల్లీలో వేసవి ఎండలను తట్టుకోలేమని పెద్ద కూతురు గిరిజ ఒకొక్క పెద్ద సెలవులకు బెంగళూరు వచ్చేస్తుంది. అల్లుడు మొహన్ వాళ్లను తీసుకువచ్చి వదిలిపెట్టి వారమో-పదిరోజులో ఉండి వెళ్ళిపోతాడు. ఇద్దరు పిల్లలకూ స్కూళ్ళు తెరిచేవరకు గిరిజ ఇక్కడే ఉండటం అలవాటు.

చిన్న కూతురు మేనకా ఎప్పుడైనా వస్తుంది. పెళ్ళి చేసుకుని వెళ్ళిన తరువాత గత మూడు సంవత్సరాలలో ఒకే ఒకసారి వచ్చింది. అది కూడా కాన్పుకు వచ్చింది. పిల్లాడు విగ్నేశ్వర్ కు ఆరు నెలలు పూర్తి అయిన తరువాతే అల్లుడు బద్రి వచ్చి పిలుచుకు వెళ్ళాడు.

తరువాత ఇప్పుడే వస్తోంది మేనకా. సారి అల్లుడు గారు కూడా నాతో వస్తారమ్మా. పదిహేను రోజులు ఆఫీసుకు సెలవు చీటీ రాసిచ్చేరు. అందువలన ఆయన కూడా అక్కడే ఉంటారు. గిరిజాను కూడా బావనూ, పిల్లల్ను తీసుకుని రమ్మని చెప్పమ్మా.

అందరూ నీతోనే ఉండొచ్చు. ఎంత పిలిచినా, నువ్వేమో మాతో వచ్చి ఉండవు అంటున్నావు. మేమైనా నీ దగ్గరకొచ్చి ఉంటాము...అని ఉత్తరం రాసింది.

కూతుర్ల లాగానే అళ్లుల్లు కూడా మాలతీతో అభిమానంగా ఉంటారు. మర్యాదతో నడుచుకుంటారు. అమ్మా...అమ్మా...అంటూ చుట్టి చుట్టి వస్తారు. మా అమ్మ వేరు...మీరు వేరు కాదు అత్తయ్యా... అంటారు. వాళ్ళు కూడా ఆమెను తమతో వచ్చి ఉండమని అడిగి చూసారు.

ఇక్కడెందుకమ్మా ఒంటరిగా ఉండటం? మాతో వచ్చి ఉండండి... అని బ్రతిమిలాడి చూసారు.

వద్దు. నేను ఇక్కడే ఉంటాను. చోట ఉండటం నాకు ఓదార్పుగా ఉంది... అన్న సమాధానం తరువాత వాళ్ళు కూడా బలవంతం చేయటం మానుకున్నారు.

రెండు నెలల కోలాహలం తరువాత ఇల్లు అంతకు ముందులాగా నిశ్శబ్ధం అయిపోతుంది. మాలతీ మాత్రం ఒంటరిగా చుట్టి వస్తుంది. ఒంటరితనం, నిశ్శబ్ధం, ప్రశాంతత వీటిని అంగీకరించ మనసు అలవాటు చేసుకుంది. ఎటువంటి లోటుబాట్లనైనా సహించుకో గలిగే ధైర్యం వచ్చేసింది.

ధైర్యం రోజు కాదు...నిన్న కాదు. పెళ్ళి మండపంలోకి దూరి, చంద్రమోహన్ ఆమెకు తాళి కడుతున్నప్పుడు కళ్ళెదురుగా కూర్చుని, చేతిలో ఒక నిమ్మపండు ఇచ్చేసి కృష్ణమూర్తి వెళ్ళిపోతునప్పుడే ఆమె మనసు రాయి అయిపోయింది.

ఇక జరగబోయేది ఏదైనా మాలతీ యొక్క శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు...అని ఆత్మను, శరీరాన్నీ వేరు వేరుగా విడదీసి ఉంచుకోగల విద్యను నేర్చుకుంది. అందువల్ల జీవితాన్ని కొంతవరకు చిక్కులు లేకుండా నడిపించగల దారిని తెలుసుకోగలిగింది.

ఆమె నవ్వింది అంటే. ఉత్త నోరు నవ్వింది. మాట్లాడిందీ అంటే పెదవులు మాట్లాడినై. చూసింది అంటే కళ్ళు చూసినై. ఇద్దరు పిల్లలను చంద్రమోహన్ కు కనిచ్చింది అంటే శరీరం కని ఇచ్చింది.

మనసు...?

అది ఎప్పుడో కృష్ణమూర్తి దగ్గర ఐక్యమైపోయింది. ఆయన్ని దాంతో అవగాహన చేసుకుంది! అది అర్ధం చేసుకోకుండా ఆయన దగ్గర నుండి ఆమెను వేరుచేశారు. కొట్టారు. గదిలోకి తోసి తాళం వేసి కాపలా ఉండి పెళ్ళి చేశారు.

మనసు గురించి వాళ్ళు పట్టించుకోలేదు. ఆత్మ గురించి బాధపడలేదు. ఈయన కూడా శరీరానికే కదా అని పెళ్ళి చేసారు. వదిలేసారు.

అందువలన చంద్రమోహన్ కు బాధ్యతగా చెయ్యాల్సిన వన్నీ చేయకుండా వదిలిపెట్ట లేదు. ఆయన్ని సంతోషపరచటాన్ని ఆపలేదు. ఒకే పరుపుపై పడుకోవటం తప్పించుకోటానికి ప్రయత్నించటం చేయలేదు.

దాన్ని కర్మ భావనగా తీసుకుని -- కర్మ కోసం బాధ్యతలు స్వీకరించి, ఇరవై సంవత్సరాలు జీవితం గడిపి, తరువాత నిమోనియా జ్వరం వల్ల చంద్రమోహన్ వెళ్ళి జేరిపోయిన తరువాత కూతుర్లకు పెళ్ళిచేసి...ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడ పుట్టిన ప్రదేశాన్ని తొక్కలేదు. తొక్క కూడదు అనే పట్టుదలను రోజు వరకు కాపాడింది. అదేలాగా కృష్ణమూర్తి గురించి ఎవరి దగ్గరా ఎంక్వయరీ చెయ్యలేదు.

తనకు పెళ్ళి అయిన తరువాత ఆయనకు ఏమైంది, ఆయన ఏమైయ్యాడు తెలియలేదు. ఊర్లోనే ఉన్నాడా అనేది కూడా తెలియదు. పెళ్ళి చేసుకున్నారా అనేది కూడా తెలియదు. అలా తన మనసును బంకమట్టి పోసి గట్టి చేసుకుని అనిచిపెట్టుకుంది.

కానీ, అప్పుడప్పుడు ఆయన జ్ఞాపకాలు మాత్రం వస్తాయి. కళ్ళెదురుగా మొహం వచ్చి నిలబడి వేదన పెడుతుంది. చివరగా ఆయన చెప్పేసి వెళ్ళిన ఉపదేశ వాక్యాలు చెవిలో వినబడి జ్ఞాపకాలను కట్టుబరుస్తుంది.

రోజు ఏమిటో పొద్దున లేచిన దగ్గర నుండి ఆయన జ్ఞాపకమే వస్తోంది. వంట  చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, పగటిపూట ఖాలీగా రెస్టు తీసుకుంటున్నప్పుడు.

                                                                               ***********************

అప్పుడే గబుక్కున జ్ఞాపకాలను వెనక్కి నెట్టి పడుకుంది. గదిపై ఉన్న దూలాన్ని చూస్తూనే ఉంది. నిద్రలోకి జారుకుంది.

నిశ్చింతగా నిద్రపోతోంది. పగటి కలలు లేని నిద్ర. కదులుడో, దడబిడలు లేని ప్రశాంతమైన పరిస్థితి.

పరిస్థితిలో పడుకోనున్నప్పుడు పాలవాడి పిలుపు విని మెలుకువ వచ్చింది. లేచి టైము చూసింది. సాయంత్రం ఐదు ఇరవై. అర్జెంటు పడుతూ ముఖాన్ని తుడుచుకుని, గిన్నెతో వాకిట్లోకి వచ్చి పాలు పోయించుకుంది.

రేపట్నుంచి ఒక లిటర్ పాలు ఎక్కువ కావాలి గోపాల్. ఉరి నుండి పిల్లలు  వస్తున్నారు...

సరేనమ్మా...పోస్తాను

భవ్యంగా సమాధానం చెప్పి పాలవాడు వెళ్ళిన తరువాత లోపలకు వచ్చి  డికాక్షన్‌ దింపి కాఫీ కలుపుకుని తాగింది. కొంచం ఉత్సాహం వచ్చినట్టు అనిపించింది. రాత్రి భోజనం అవసరం లేదు అనిపించటంతో, వంటగది లైటు ఆపి మొహం కడుక్కుని వచ్చింది.

హాలులోకి వచ్చినప్పుడు టైము ఆరుగంటలు కొట్టింది. చేతులు యంత్రంలాగా దేవుడికి దీపం వెలిగించి, నోరు లలితా సహస్రనామంచెప్ప...రెండు మూడుసార్లు తడబడింది. మనసును దాంట్లో లగ్నం చేయకుండా చెప్పి ఫలితంలేదని అలాగే ఆపేసింది.

ఈరోజు ఎందుకు ఇలా తడబడుతున్నాం?’ అనేది అర్ధంకాని ఆమె, మెట్లు ఎక్కి మేడపైకి వెళ్ళింది.

రోజూ సాయంత్రం దీపం వెలిగించి, మంత్రం చెప్పిన తరువాత టెర్రస్సుకు వచ్చి కూర్చోవటం అలవాటు. మడత కుర్చీ విడదీసి వేసుకుని గంటలకొద్ది కూర్చుంటుంది.

కళ్ళు ఆకాశంలోని నక్షత్రాలను చుట్టివస్తుంది. గాలి చల్ల చల్లగా వీస్తుంది. కొబ్బరిచెట్టు కొమ్మలు రహస్యం మాట్లాడతాయి. వెన్నెల అందంలో చిన్నపిల్లలా కూర్చోనుంటుంది.

సమయంలో ఆమెలో వివరించలేని ఒక అనుభవం ఏర్పడుతుంది. ఎటువంటి ఆలొచనా లేకుండా... ప్రతిస్పందన లేకుండా, ఎవరి జ్ఞాపకాలూ లేకుండా... దృశ్యమూ కనబడకుండా మనసు శూన్యం అయిపోతుంది.

శబ్ధమూ చెవిలో పడకుండా ఉంటుంది. కళ్ళుమూసుకుంటే ఒంట్లో నుండి ఒక్కొక్కటీ విడిపోయి పైన తేలుతున్నట్టు తెలుస్తుంది. తేలుడులో చాలాసేపు ఉంటుంది. నోరు తానుగా చండీ స్లోకంచెబుతుంది.

కానీ  రోజు.

ఎటువంటి పట్టూలేదు. ఏదో ఒకటి మనసును తరుముకుంటూ వస్తోంది. కళ్ళు మూసుకుంటే ఏవో దృశ్యాలు. కాలేజీ, ఆమె... కృష్ణమూర్తి పాఠం చెప్పే దృశ్యం...పూవుల కుండీపై పెయింటుతో ప్రేమికులు ముద్దుపెట్టే చిత్రం.

ప్రేమకు విడిపోవటం ఏదీ...?.......ముగింపు ఏదీ...?.......అంతం ఏదీ...?......."ఏం చెబుతున్నావు మాలతీ...?".....కొబ్బరి ఆకుల చలనానికి సమాధానం, చెవి దగ్గర కృష్ణమూర్తి స్వరం.

అధిరిపడి ఒళ్ళు జలదరించింది.

గదిలోపలకు దూరినా పేడపురుగు లాగా తిరిగి తిరిగి ఇదేం జ్ఞాపకం...? ఏమైంది నాకు? ఇన్ని సంవత్సరాలుగా లేకుండా ఈరోజు మాత్రం ఎందుకు ఇంత తడబాటు...? ఉండకూడదు. దీన్ని అనిచే తీరాలి...మనసును దాని దారిలో దాన్ని వెళ్ళనివ్వకూడదు

గబుక్కున ఈజీ చైర్లో నుండి లేచి కిందకు దిగివచ్చి రెండు, మూడు గ్లాసులు చల్లటి నీళ్ళు పోసుకుని తాగి మళ్ళీ పడుకోవటానికి  వెళ్ళినప్పుడు,

వాకిలి కాలింగ్ బెల్ మోగింది.

ఎవరై ఉంటారు...?’ అని ఆలొచించింది. ఒకవేళ రేపు వస్తానని చెప్పిన కూతుర్లలో ఒకత్తి ఈరోజే వచ్చేసిందో...?’

హాలులో లైటువేసి, జాగ్రత్తగా మామూలు పరిస్థితిలో కిటికీ ద్వారా ఎవరది...?” అని అడిగింది.

నేనే... అన్న స్వరం... కొంతసేపటి క్రితం చెవులకు వినబడిన స్వరం.

ఇన్ని సంవత్సరాల తరువాత కూడా అరిగిపోకుండా, మార్పు లేకుండా ఉన్న అదే స్వరం.

నిజమా...ఇది నిజమేనా...?”

గబుక్కున ఒంట్లో కొత్త నెత్తురు ప్రవహించిన భావనతో, ఆందోళనతో వాకిలి తలుపులు తెరిచింది.

కృష్ణమూర్తి  నిలబడున్నారు!

                                                                                                                 Continued...PART-3

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి