10, డిసెంబర్ 2022, శనివారం

ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)...(PART-1 of 11)

 

                                                                           ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)                                                                                                                                                                 (PART-1)

దివ్యాకి రాత్రంతా నిద్ర పట్టలేదు.ఆందోళన ఆమె మనసును చెదలా తింటున్నది. దొర్లి దొర్లి పడుకుంటూ, ఆలొచిస్తూ ఉన్నది.

రేపు ఆమె ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అర్జున్ అమెరికా నుండి వచ్చేస్తాడు.

అతను వస్తున్నాడన్న సంతోషం కూడా ఆమె మనసులో ఇమడటం లేదు? దీనికి కారణం ఎవరో కాదు? ఆమె తండ్రి డాక్టర్.విఠల్ రావ్!

ఆయన క్రితం రాత్రి నుండి కనబడటం లేదు. ఏం చేయాలో తెలియని దివ్యాకి తండ్రి ముందు రొజు కారణమే లేకుండా చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి. 

చెడిపోయే వాడే చెడు ఆలొచిస్తాడు. అపూర్వమైన విషయాలన్నీ అపూర్వమైన మనుష్యులకే దొరుకుతుంది. అందరికీ దొరకదు. దొరికితే దాన్ని తప్పైన విషయంకోసం వాడటం మొదలుపెడతారు. కొన్ని రహస్యాలు రహస్యాలుగానే ఉండాలి. అలా జరగలేదనుకో--దాని వలన ఊరికి, ప్రపంచానికీ ఆపద.

మనసును ఎప్పుడూ జారవిడుచుకోకూడదు. చివరిదాకా నమ్మకాన్ని వదలి పెట్టనే కూడదు. ఏం జరిగినా పరవాలేదని పట్టుదలగా ఉండి పోరాడి ధైర్యంగా కొండ శిఖరాన్ని అయినా ఎక్కాలి.

ఏం జరిగినా సరే....ధైర్యవంతులకి నిద్ర ఉండదు అని పెద్దలు చెబుతారు. నువు కూడా ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండాలి. అప్పుడు భయము, దిగులు మరు క్షణమే మాయమైపోతుంది--మనసులో ప్రశాంతత, చిన్న తృప్తి తల ఎత్తుతుంది

ఆయన ఎందుకలా చెప్పాడు? ఆయన కనబడకుండా పోవటానికీ ఆయన చెప్పిన దానికీ ఏదైనా లింక్ ఉందా? కనబడకుండా పోయిన దివ్యా తండ్రి తిరిగి వచ్చాడా? లేక దివ్యానే ఆయనను వెతికి కనుక్కోగలిగిందా? ఆయన కనబడకుండా పోవటానికి కారణం ఏమై ఉంటుంది?.....వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవటానికి త్రిల్లింగ్ సీరియల్ ను చదవండి.

                                                                 **********************************

దివ్యాకి రాత్రంతా నిద్ర పట్టలేదు.

ఆందోళన ఆమె మనసును చెదలా తింటున్నది.

దొర్లి దొర్లి పడుకుంటూ, ఆలొచిస్తూ ఉన్నది.

రేపు అర్జున్ అమెరికా నుండి వచ్చేస్తాడు.

అతను వస్తున్నాడన్న సంతోషం కూడా ఆమె మనసులో ఇమడటంలేదే? దీనికి ఎవరు కారణం?

ఆమె తండ్రి విఠల్ రావ్!

విజయవాడ సిటీకి పక్కనున్న మంగళగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చీఫ్ డాక్టర్ గా  పనిచేస్తున్నారు ఆమె తండ్రి విఠల్ రావ్. ఎందుకోనో, తెలియదు నిన్న రాత్రి ఆయన ఇంటికి తిరిగి రాలేదు.

చుట్టు పక్క ప్రదేశాలలో 'హస్త వాసి గల డాక్టర్ అనే పేరు సంపాదించాడు. తన ఇంటి ముందు ఒక చిన్న గది కట్టి అందులో క్లీనిక్ ఒకటి నడుపుతున్నాడు.

దివ్యాను కంటికి రెప్పలాగా--ప్రేమగా చూసుకుంటాడు. నాలుగు సంవత్సరాలకు ముందు ఆమె తల్లి త్రిపురాంబ చనిపోయింది.

తల్లిని పోగొట్టుకున్న దుఃఖం మరిచిపోయే విధంగా ప్రేమ వర్షాన్ని కురిపించి తల్లి స్థానమును కూడా ఆయనే పూర్తి చేశాడు. ఆయనకు భక్తి ఎక్కువ. ఇరవై నాలుగు గంటలూ ఆయన నుదిటి మీద విబూది  మెరుస్తూ ఉంటుంది.

రెస్టు దొరికిన సమయంలో ధ్యానం, యోగాసనాలూ లాంటి వాటిలో తనని తాను ఈడుపఱుచుకుని తనని తాను బిజీగా ఉంచుకుంటాడు. భగవద్గీతను అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాడు.

మూడు నెలలకు ఒకసారి లంబసింగి అటవీ ప్రాంతంలోని ఒక కొండకు వెళ్ళిరావటం అలవాటుగా పెట్టుకున్నారు.

లంబసింగి లోని జలపాతంలో స్నానం చేసుకుని, అక్కడున్న ఒక వినాయకుడి గుడిని దర్శించుకుని, తరువాత ప్రాంతంలోని కొండపైన ఉన్న ఒక శివలింగాన్ని కళ్ళార చూసుకుంటేనే ఆయనకు చాలా తృప్తిగానూ, సంతోషంగానూ, ఉత్సాహంగానూ ఉంటుంది.

మూడు రోజులు కూతుర్ని వదిలిపెట్టి వెళ్ళటానికి ముందు---ఆయన మనసు విపరీతమైన క్షోభకు గురవుతుంది.

"అమ్మా దివ్యా! పక్కింటి బామ్మ దగ్గర చెప్పేసి వెలుతున్నాను. వయసులో ఉన్న కూతుర్ని ఇలా ఒంటిరిగా వదిలిపెట్టి వెళ్ళటం తప్పే. కానీ, మూడు నెలలకు ఒకసారి  అక్కడికి వెళ్ళివస్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటోంది. ఏదో రీచార్జ్ ఎక్కించుకున్నట్టు, ఎనర్జిటిక్ గా ఉన్నట్టు అనిపిస్తుందిఅంటూ తటపటాయిస్తూ నిలబడ్డాడు.

"అవతలవారికి మనవలన చేయగలిగిన సహాయం చేయాలి. కానీ, వాళ్ళకు ఇబ్బంది కలిగేటట్టు ఒక్కరోజు కూడా నడుచుకోకూడదు అని మీరేగా చెప్పారు? అలాంటి మీరే పక్కింటి బామ్మను ఎందుకు ఇబ్బంది పెడతారు? నాకేమీ భయంగా లేదు. ఇళ్ళు మీరు ఎంతో బాగా డిజైన్ చేసి కట్టించారు. అది నాకు కావలసిన రక్షణ ఇస్తుంది. వెనుక ఉన్న గదిలో తోటమాలి కాపురం ఉంటున్నాడు. ఒక్క పిలుపుకు పరిగెత్తుకు వస్తాడు.

అన్నిటికీ మించి మన పెంపుడు కుక్క టైగర్. ఒక చిన్న పక్షిని కూడా మన ఇంటి గేటు మీద వాలనివ్వదు. వీధి మొత్తం హడలిపోయేలా అరుస్తుందని మీకు తెలుసు. చిన్న వయసు నుంచి నాకు ధైర్యాన్నీ, నమ్మకాన్ని పోసి పెంచారు.

నేనిప్పుడు చిన్న పిల్లను కాదు నాన్నా. ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసిన డాక్టర్ను! ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాను. నా గురించి భయపడకుండా, ప్రశాంతంగా వెళ్ళిరండి..."  అని పోయిన సారి నాన్నకు ధైర్యం చెప్పి పంపించింది.

పోయిన సారి ఆయన తిరిగి వచ్చినప్పుడు..."అమ్మా దివ్యా... సారి తిరిగి రావటానికి నాకు మానసే రాలేదురా.చాలా స్వారస్యమైన విషయాల గురించి విన్నాను. నా కళ్ళతో ఒక అద్భుతమైన దృశ్యం ను చూశాను. ఎంతో అద్భుతం?" అన్నారు.

ఇంటికి తిరిగి వచ్చేందుకే మనస్కరించ లేదు అంటున్నారంటే ఖచ్చితంగా చాలా అద్భుతమైన దృశ్యమే మీ మనసును తాకుంటుంది. అదేమిటో నేను తెలుసుకోవచ్చా?” ఆసక్తిగా అడిగింది.

"తప్పకుండా. నువ్వు దృశ్యం గురించి తెలుసుకోవాలి. లంబసింగి లో నేను వెడుతున్న కొండ ప్రదేశం ఒక ప్రత్యేక శక్తి కలిగినదని చెబుతూంటాను కదా...అది శక్తివంతమైన ప్రదేశం మాత్రమే కాదు, ఒక పుణ్య భూమి అని సారి తెలుసుకున్నాను. సారి నేను చూసిన దృశ్యం నాకు భావాన్ని కలిగించింది"

అవును నాన్నా. మునులు, సన్యాసులు తపస్సు చేసిన గుహలు, వాళ్ళు సంతరించిన స్థలాలు అక్కడ  చాలా ఉన్నాయని చెప్పారు. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు వాళ్ళను కళ్ళార చూశానని చెప్పారు"

"అది మాత్రమే కాదురా. అద్భుతమైన ఔషధ శక్తి కలిగిన చెట్లు అక్కడ చాలా ఉన్నాయి. ఇంకెక్కడా దొరకని అరుదైన రకరకాల ఔషధ శక్తి కలిగిన చెట్లు కొండ ప్రదేశంలో ఉన్నాయి. అనేక రకాల వ్యాధులను గుణపరచగల మూలికలు చాలా ఉన్నాయి...ఇది నా ఆరు సంవత్సరాల పరిశోధనలో తెలిసింది"

"నిన్ను అర్జున్ చేతిలో అప్పగించి...మీ ఇద్దర్నీ పెళ్ళి దుస్తులలో చూసిన తరువాత నేను ప్రశాంతంగా కొండ ప్రదేశంలో ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటూ, అక్కడున్న ఒక గుహలో ఉండిపోతాను. ఇప్పుడు కూడా నా బాధ్యత నెరవేర్చటానికి--అంటే నీకు పెళ్ళి చేయటానికోసమే తిరిగి వచ్చాను"

"...ఎందుకు నాన్నా అలా చెబుతున్నావు? మూడు నెలలకు ఒక సారి మీరు అక్కడికి వెల్తారు. మూడు రోజుల తరువాత మీరు తిరిగి వస్తున్నప్పుడు, కొత్త ఉత్సాహంతో తృప్తిగా వచ్చి దిగుతారు... సారి ఏమైంది మీకు? మీరింకా రిటైర్ అవలేదు. ఉన్నతమైన డాక్టర్ పనిని, ప్రాణంగా చూసుకుంటున్న కూతుర్ని వదిలేసి...అక్కడే ఉండిపోవాలనే నిర్ణయానికి రావడానికి అక్కడ ఏం జరిగింది?"

కొండ మీద పాడుపడిపోయిన శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు...అక్కడ గంగయ్య స్వామి అనే మూలిక వైద్యుడ్ని చూశాను. ఒకర్నొకరు పరిచయం చేసుకుని వైద్యం గురించి మాట్లాడుకున్నాము. ఆయన మూలిక వైద్యం గొప్పతనం గురించి చెప్పారు. అక్కడే మా ఇద్దరి మధ్యా స్నేహం ఏర్పడింది అనుకో..."

" మూలిక వైద్యుడు మీలాగానే శివలింగాన్ని దర్శించుకోవడానికి అప్పుడప్పుడు కొండకు వచ్చి వెల్తుంటారా?"

"శివలింగాన్ని దర్శించుకోవడానికి మాత్రమే కాదమ్మా, ఆక్కడు దొరికే ఔషధ మూలికలను తెచ్చుకోవటానికి వెలుతూ ఉంటారు....ఆయన కొండ క్రింద ఉన్న ప్రదేశంలో ఒక గుడారం వేసుకుని, అక్కడ నివసిస్తూ, ఆయన దగ్గరకు వచ్చే పేషంట్లకు వైద్యం చేస్తూ ఉంటారు.

దీర్ఘకాలిక వ్యాధులు, మరణ భయం పుట్టించే వ్యాధులకు ఆయన వైద్యం చేసి వాటిని గుణపరుస్తాడని చాలా మంది చెప్పటం నేను విన్నాను.

కొండ మీద ఒక శివలింగం ఉన్నట్టు ఎవరికీ తెలియదమ్మా. అక్కడ ఒక చిన్న గుడి కూడా లేదు. ఒక బహిరంగ ప్రదేశంలోనే ఉంటుంది శివలింగం. కొండ ప్రాంతానికి ఎవరైనా వెళ్ళొచ్చు. వెలితే శివలింగాన్ని చూడొచ్చు. కానీ అక్కడికి వెళ్ళటానికి దట్టమైన అడవిని దాటి వెళ్ళాలి. కృర ముగాలకు భయపడి ఎవరూ అటు వెళ్లటం లేదు. నాబోటి మొండి వాళ్ళు మాత్రమే వెడతారు. శివలింగాన్ని చూట్టూ ఉన్న ప్రదేశంలోనే ఔషధ గుణాలు కలిగిన మూలిక చెట్లు ఉన్నాయి.

నిజానికి మూలిక వైద్యుడ్ని కలిసి, మూలికల ఔషధ లక్షణాల గురించి తెలుసుకుని వాటిపై పరిశోధనలు చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ, వైద్యుడ్ని కలవటానికి అతని గుడారానికి ఎన్నిసార్లు వెళ్ళినా ఆయన్ని కలవలేకపోయాను. అలా ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన అసిస్టంట్ ను కలిశాను. వాళ్ళ గురువు, అదేనమ్మా వైద్యుడు ,మూలికలకోసం కొండపైకి వెళ్ళారని చెప్పాడు. అప్పుడే నాకు కొండపైన మూలికలు దొరుకుతాయని తెలిసింది.

నేను ఆయన్ను కలవటానికి కొండపైకి వెళ్లినప్పుడు అక్కడ శివలింగాన్ని చూశాను. చూసిన మరు క్షణం నాలో ఏదో జరిగింది. శివలింగానికి మొక్కుకుని, శివలింగం చుట్టూ మూడు ప్రధక్షిణాలు చేసి, వెను తిరిగినప్పుడు నాకు మూలిక వైద్యుడు కనబడ్డాడు.

పోయిన సారి నేను ఆయన గుడారానికి వెళ్ళినప్పుడు...ఒక కుష్టు రోగిని చూశాను. మూలికలను, ఏవో ఆకులను పేస్టులాగా రుబ్బి అతని వొళ్లంతా పూసున్నారు. అతను నీరసంగా పడుకొని ఉన్నాడు.

ఇలా క్షీణించిపోతున్న వారిని మూలికల వైద్యంతో గుణపరచగలమా? అని అనుమానంగా అడిగాను. మూలికలతో గుణపరచలేని వ్యాధి-- లోకంలోనే లేదని చెప్పవచ్చు. మీరు సారి వచ్చినప్పుడు అతన్ని చూడండి. చూసి ఆశ్చర్యపోతారు నవ్వుతూ చెప్పాడు.

సారి ఆయన గుడారానికి వెళ్ళినప్పుడు ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఆయన శిష్యుడొకడు రుబ్బురోలులో ఒక రాయితో ఏవో మూలికలను రుబ్బుతున్నాడు. కొండ ప్రాంతంలోని పువ్వులను బుట్టలో వేసుకుని అప్పుడు ఒక యువకుడు లోపలకు వచ్చాడు. కొబ్బరి నారతో వేగంగా వాటిని పూలమాలగా కట్టటం మొదలుపెట్టాడు. యువకుడ్ని ఎక్కడో చూసినట్టు అనిపించటంతో, ఎక్కడ చూశానా? అని ఆలొచిస్తున్నప్పుడు, గుడారంలో ఒక గొంతు వినబడింది.

ఏమిటి డాక్టర్.విఠల్ రావ్? ఇతను ఎవరో గుర్తుకు వస్తోందా...లేదా? కుష్టి రోగిగా ఉన్నతనే ఇతను. మూలికల మహిమతో పూర్తిగా మామూలు మనిషిగా అయిపోయాడు చూశారా?’ అని గంగయ్య స్వామి నవ్వుతూ చెప్పారు.

నేను ఆశ్చర్యంతో శిలలా నిలబడిపోయాను. అప్పుడు అక్కడ పచ్చటి ఆకులను రుబ్బుతున్న శిష్యుడు కుంటుకుంటూ నా దగ్గరకు వచ్చి 'పుట్టుకతోనే వికలాంగిగా పుట్టి, నడవటానికే కుదరని నన్ను - గంగయ్య స్వామి గారు గుణపరిచారు. రోజు కుంటుకుంటూ నడిచి మీ దగ్గరకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. తరువాత ఊరికి తిరిగి వెళ్ళటానికి మనసురాక సేవ చేసే భాగ్యం కల్పించడని అడిగితే...ఇక్కడే ఉండిపొమ్మన్నారు. ఇక్కడే ఉండిపోయానుఅన్నాడు.

"నాన్నా! వినేటప్పుడే మైమరిపిస్తోంది! నేరుగా చూసిన మీకు ఎలా ఉంటుందో నేను అర్ధం చేసుకోగలను. ఏది ఏమైనా మీరు నన్ను వదిలి నిరంతరంగా వెళ్ళిపోకండి. నేను తట్టుకోలేను. కాదూ, కూడదూ నిరంతరంగా వెళ్ళిపోవాల్సిందే అని మీరనుకుంటే మీతో పాటూ నన్ను కూడా తీసుకు వెళ్లండి"

తండ్రి చేతులు పట్టుకుని ఏడ్చింది.

"దివ్యా! ఏడవకు. నీ కళ్ళల్లో నుండి ఒక కన్నీటి బొట్టు వచ్చినా నేను తట్టుకోలేను. నిన్ను వదిలి నేను నిరంతరంగా వెళ్లగలనా?...వెళ్ళలేనమ్మా. ఇక విషయం గురించి మనం మాట్లాడొద్దు. సరేనా?!" అంటూ తండ్రి విఠల్ రావ్ రోజు మాట్లాడిన మాటలు -- మళ్ళీ మళ్ళీ ఆమె చెవులకు ప్రతిధ్వని లాగా వినబడుతోంది.

                                                                                                                     Continued...PART-2

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి