12, డిసెంబర్ 2022, సోమవారం

ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)...(PART-2)

 

                                                                              ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)                                                                                                                                                                  (PART-2)

దిగులు, భయం పోటా పోటీ వేసుకుని దివ్యాని గందరగోళానికి గురిచేస్తున్నాయి.

మొన్న జరిగిన సంఘటనను తలచుకుంటే నాన్న ఏదో ఒక చిక్కులో ఇరుక్కోనున్నట్టు అనిపించింది.

రోజు నాన్నతో పనిచేస్తున్న సహ ఉద్యోగి డాక్టర్ సుధీర్ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేరే? రోజు సంఘటనులు గుర్తుకు తెచ్చుకుంటుంటే దివ్యాకు చెమటలు కారుతున్నాయి. ఆమె ఆలొచనలు వెనక్కు వెళ్ళినై.

రోజు ప్రొద్దున, స్టవ్ మీద మరుగుతున్న పులుసులో వేరుగా ఉడకబెట్టిన ములక్కాడ  ముక్కలను వేసి, దాంతో పాటు కొంచంగా ఇంగువ వేసి, గరిటతో బాగా కలిపి, గిన్నెను క్రిందకు దించి పెట్టినప్పుడు----తలకు తుండు చుట్టుకుని, తోటలో నుంచి లేత వంకాయలను కోసుకుని, నవ్వుతున్న ముఖంతో వంటింట్లోకి వచ్చారు నాన్న.

"పులుసు వాసన అధిరిపోయిందమ్మా. మీ అమ్మలాగానే నీకు మంచి చేతి పక్వం ఉందమ్మా. నంచుకోవటానికి ఏం చేశావు?"

"కొబ్బరి,సెనగపప్పు వేసి గోరు చిక్కుడు కూర నాన్నా..."

"తరువాత...?"

"పొండి నాన్నా! అక్కడేదో మీరు కడుపారా వేడి వేడిగా భోజనం చేసేటట్టు మాట్లాడుతున్నారు? మధ్య కొంతకాలంగా ఉప్పు, పులుపు ఏమీ లేకుండా ఉత్త పెరుగు అన్నం రెండు ముద్దలు తిని లేచేస్తున్నారు. రాను రానూ అన్నీ అనుభవించిన మునిలాగా అయిపోయారు"

"ఊహు!అలా చెప్పదమ్మా. అన్ని తెలిసిన మునిలాగా అయ్యుంటే, ఇంటికి తిరిగి వచ్చే వాడినే కాదు! కొండ మీదే ఉండి పోయేవాడిని? సరి...వదిలేయ్! నీకు వంకాయ పొడి వేసి చేస్తే బాగా ఇష్టం కదా...అది చెయ్యి" 

"మీకెందుకు నాన్నా శ్రమ? ఖాలీగా ఉంటే వంటచేస్తానని వంటింట్లోకి వచ్చేస్తారు. అదీ కాకుండా మీరు తోటకు వెళ్ళి కూరగాయలు కొయ్యాలా? తోటమాలిని కేకవేస్తే, అతను కోసి తీసుకురాడా?"

నా చేత్తో వంట చేసిన వంటకలాను రుచిగా ఉందని నువ్వు తింటున్నప్పుడు నా మనసుకు ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా? నా మనసు నీకెందుకు అర్ధమవుతుంది?”

నా వ్యవహారంలో అనవసరంగా జోక్యం చేసుకోకండి అని నువ్వే కదా నిబంధన వేశావు?  తోటలోని చెట్లకున్న కాయలను మన చేతులతోనే కోసి తీసుకువస్తే అందులో ఒక సుఖం ఉందమ్మా. అది తెలుసా నీకు"

"ఇలా మాట్లాడితే ఎలా నాన్నా? అన్నిటికీ ఒక కారణం చెప్పి నా నోరు మూసేస్తారు మీరు" చిరుకోపంతో తండ్రిని చూసింది.

"నువ్వు మాత్రం ఏం చేస్తున్నావ్...? తెల్లవారు జామునే లేచి, పూజకు కావలసిన పువ్వులను నీ చేత్తోనే కోసి మాలగా చేసి దేవుళ్ళ ఫోటోలకు వేస్తున్నావే? ఉద్యోగానికి వెల్తున్న అమ్మాయివి నువ్వు! ఎందుకమ్మా పనికట్టుకుని ఇవన్నీ చేస్తున్నావు అని నేనడిగితే...మనసుకు హాయిగా, రోజంతా కొత్త ఉత్సాహంతోనూ ఉంటుందని సమాధానం చెబుతావే? అదేలాగానే ఇది కూడా..."

నాన్న కూడా చిరుకోపంతో చూశాడు.

దివ్యా ఏదో చెప్పాలని నోరు తెరిచే ముందు వాకిట్లో కారు వచ్చి ఆగిన శబ్ధం వినబడింది.

వెంటనే కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూసింది.

"నాన్నా...మీతో పాటు పనిచేస్తున్న డాక్టర్. సుధీర్ గారు వస్తున్నారు"

"డాక్టర్. సుధీరా? ఆయన ఎందుకు ఇంత ప్రొద్దున్నే ఇళ్ళు వెతుక్కుంటూ వస్తున్నాడో తెలియటం లేదే?"

ఆలొచనతో ముందుకు కదలగా, ముందు గదిలోకి వచ్చాడు విఠల్ రావ్.

పళ్ళరసం నిండిన గాజు గ్లాసులను పళ్లెంలో పట్టుకొచ్చి ఆయన ముందు జాపి "రండు అంకుల్...బాగున్నారా?" అని స్వాగతం పలికి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయింది దివ్యా.

నాన్నకు స్నేహితులెవరూ లేరు. తాను, తన పని అనే ఒక చక్రంలో జీవించే తత్వం కలిగిన మనిషి.

ఎప్పుడైనా అరుదుగా ఎవరైనా ఆయన్ని వెతుక్కుని వస్తే, మర్యాద కోసం రమ్మని చెప్పి నాజూకుగా మాట్లాడి, తన గదిలోకి వెళ్ళిపోతుంది దివ్యా.

వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్ళిన తరువాత, తండ్రి దగ్గర నుండి పిలుపు వస్తేనే తన గదిలో నుండి వస్తుంది.  

రోజు కూడా అలాగే. తడి గుడ్డతో గ్యాసు పొయ్యిని తుడుస్తున్న దివ్యాకి ఆవేశమైన వాదనతో అతీతమైన శబ్ధం వినబడటంతో వంటింటి గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడి వాళ్ళ వాదనను వినడం మొదలుపెట్టింది.

"ఏమిటి విఠల్ నువ్వు? ఇలా అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నావే? మందుల కొండ గురించి మాట్లాడటమే పాపం అనే విధంగా భయపడి చస్తున్నావే? నిన్న రాత్రి టీవీ ప్రోగ్రం చూసుంటే ఇలా మాట్లాడుండవు"

డాక్టర్ సుధీర్ మాటల శ్వరంలో చిరాకు, కోపమూ ఎగిసిపడుతుండటం తెలుస్తోంది.

"మందుల కొండకు, టీవీ చూడటానికీ ఏమిటీ సంబంధం? టీవీ లో నేను చూసే ప్రోగ్రాం ఒకటే. న్యూస్. టీవీలో నేను చూసేది అదొక్కటే"

"అందుకనే నీకు విషయమే తెలియలేదు.మందు కొండలో జరుగుతున్న అద్భుతాల గురించి నిన్న టీవీలో చూపించారు తెలుసా?.

నయం చేయలేని వ్యాధులకు కూడా మూలికలు నిండియున్న అద్భుత కొండట కదా అది?

గంగయ్య స్వామి అనే వైద్యుని గురించి చాలా చెప్పారు. కానీ, టీవీలో కనబడటానికి తనకి ఇష్టంలేదని చెప్పి...గుడారం నుండి బయటకు రావటానికి నిరాకరించారట ఆ వైద్యుడు.

ఇంకో అద్భుతమైన విషయం గురించి కూడా చెప్పారు. వినడానికే చాలా ఆశ్చర్యం వేసింది. నువ్వు మాటిమాటికీ ఆ కొండ ప్రదేశానికి వెళ్ళివస్తుంటావు కదా...దాని గురించి నా దగ్గర చిన్న మాట కూడా చెప్పలేదేమిటి?"

"అక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. నువ్వు ఇప్పుడు ఏ అద్భుతం గురించి అడుగుతున్నావు?"

చిన్న స్వరంతో ప్రశ్నించాడు డాక్టర్ విఠల్ రావ్.

"ఎవరో ఒక దంపతులట...పలు సంవత్సరాల నుండే భార్యా-భర్తలుగా పక్క పక్క గుహల్లో తపస్సు చేస్తున్నారట? ఒక పెద్దాయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనకు వయసు ఎనభై ఉంటుందని చెబుతున్నారు. అది విన్న వెంటనే నేను షాక్ తిన్నాను"

"ఆ పెద్దాయన షాక్ ఏర్పడేంత విషయం ఏం చెప్పారు?"

చిన్నగా అడిగాడు.

"ఒక్కొక్క పౌర్ణమి రోజున సీతమ్మ అనే ఒక ఒకావిడ, తన భర్తతో మధ్యరాత్రి సమయంలో అక్కడకొచ్చి అక్కడున్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటారట. నిజానికి వాళ్ళిద్దరికీ వయసు నూట యాబై సంవత్సరాలకు పైనే ఉంటుందట. అప్పుడు గంగయ్య స్వామి వైద్యుడి దగ్గర కొంచం సేపు మాట్లాడతారట. వాళ్ళను చూడటానికి చాలా మంది వస్తారట"

"అదృష్టం ఉన్నవారు మాత్రం వాళ్లకు దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకుంటారుట. అలా వాళ్ళ దగ్గరకు వెళ్ళిన వారి నుదిటి మీద విబూది అద్ది, నడినెత్తిన చేతులు పెట్టి ఆశీర్వదిస్తారట.

తీరని వ్యాదులు కూడా త్వరగా తగ్గుతాయట. ఆ దంపతుల దర్శనం కోసం, వాళ్ళ ఆశీర్వచనం కోసం చాలామంది పోటీ పడుతూ కాచుకోనుంటారట.

సీతమ్మ మనసు పెట్టి...గుంపులో ఉన్న వాళ్ళను చూస్తూ ఏదో ఒక పేరు చెప్పి పిలుస్తుందట. పేరున్న వ్యక్తికే వాళ్ళ దగ్గరకు వెళ్ళే అపూర్వ సంధర్భం దొరుకుతుంది.

తరువాత కొంచం సేపు కూడా అక్కడ ఉండకుండా వాళ్ళిద్దరూ, కొండకు అవతలివైపుకు వెళ్ళి కిందకు దిగుతారట. చీకట్లో కొండ లోయలోకి దిగటం అంత సులభం కాదుట.

సీతమ్మ తన గుహలోకి వెళ్ళిపోతే...మళ్ళీ తరువాత పౌర్ణమికే బయటకు వస్తుందట.

డాక్టర్ విఠల్... పెద్దాయన టీవీలో కొండ గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్య అంచులకే వెళ్ళిపోయాను. మూలికల మహిమ వలనే నూట యాబై సంవత్సరాలకు పైనే వయసున్న ఆ సీతమ్మ దంపతులు యౌవనముతోనే ఉన్నారు. మరణాన్ని వాయిదా వేయగల మూలిక వాళ్ళు తినుంటారు అని నాకు అనిపిస్తోంది. దీని గురించి నా దగ్గర నువ్వేందుకు చెప్పలేదు? నువ్వు కొండకు అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్న వాడివి కదా? నీకు కచ్చితంగా దీని గురించి తెలిసుంటుంది కదా?"

"అవును నాకు తెలుసు...కానీ, చెప్పాలని నాకు అనిపించలేదు. అదే నిజం. నా కూతురు దగ్గరే నేను విషయాన్ని చెప్పలేదు తెలుసా? ఏవో ఒకటి, రెండు విషయాలు మాత్రమే ఆమె దగ్గర చెప్పాను. దేవుని లీలతో జరుగుతున్న అద్భుతాలను బయటకు చెప్పటానికి నాకు మనసు రాలేదు. చాలా?"

"అదిసరే! నేను తిన్నగా విషయానికే వస్తాను. నువ్వు మనసు పెడితే, వైద్య రంగంలో అతిపెద్ద విప్లవం సృష్టించవచ్చు. ప్రపంచమే వెనక్కు తిరిగి మన సాధనను చూసి ఆశ్చర్యపోతుంది"

"అర్ధంకాలేదు డాక్టర్ సుధీర్! అనవసరమైన బిల్డ్ అప్ ఇవ్వకుండా తిన్నగా విషయానికి వచ్చేయ్..." డాక్టర్ విఠల్ రావ్ మాటల్లో విసుగు ఎక్కువగా ఉన్నది.

నువ్వు మూడు నెలలకొకసారి మందుల కొండకు వెళ్ళటం వలన, వైద్యుడు గంగయ్య స్వామి దగ్గర బాగా సన్నిహితంగా ఉంటున్నావని నాతో ఇంతకు ముందే చెప్పావు. ఆయనకు అన్ని రకాల మూలికల గురించి తెలుసుకదా? యౌవనమును కాపాడుకోవటానికీ, మరణాన్ని వాయిదా వేయటానికి కారణంగా ఉండే మూలికల గురించి ఆయన దగ్గర అడిగి తెలుసుకుందాం"

"తెలుసుకుని ఏం చెయ్యబోతావు? టీవీలో చూసావు కదా? ఆయన వ్యాపార ప్రచార ప్రకటనకు ఇష్టపడరు. తన మొహం టీవీలో రాకూడదని, నివసిస్తున్న గుడారాన్ని విడిచి బయటకు రానేలేదని చెప్పావే? నువ్వూ, నేనూ వెళ్ళి అడిగితే...మూలికల గురించి వివరంగా చెబుతారా? ఇది నీకే మూర్ఖత్వంగా అనిపించటం లేదూ?"

"లేదు విఠల్...నాకు నమ్మకం ఉన్నది. నువ్వు మనసు పెడితే అది జరుగుతుంది. నీకోసం గంగయ్య స్వామి ఏదైనా చేస్తారని నా మనసుకు అనిపిస్తోంది" 

"లేదు... విషయంలో నాకు కొంచం కూడా ఇష్టం లేదు. ఆయన్ని ఏమీ అడగటం నా వల్ల కుదరదు. అడగను కూడా"

డాక్టర్ విఠల్ రావ్ మాటల్లో మొండితనం, పట్టుదల ధోరణి కనబడింది.

"ఒక్క నిమిషం...నేను చెప్పేది విను విఠల్. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఉంటున్న నా స్నేహితుడు డాక్టర్. డేవిడ్ దగ్గర దీని గురించి చెప్పాను. ప్రత్యేకమైన మూలికలు మనకి దొరికితే గనుక, వాటిని ఉపయోగించుకుని కోటానుకోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చని చెప్పాడు"

"యౌవనం తగ్గకుండా ఉండటానికి, మరణాన్ని వాయిదా వేయటానికి మందు దొరికితే, అది ఎంత ఖరీదైనా కొనుక్కుని డబ్బు ఖర్చుపెట్టటానికి ఎవరూ వెనుకాడరు అన్నాడు.

అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు, డబ్బు, అంతస్తు దొరుకుతుందే? ఆలొచించి చూడు. నీ కూతురుకి ఇంకా పెళ్ళి కాలేదు. ఇది మాత్రం జరిగితే, ఆమెకు కిలోల లెక్కన బంగారు నగలు వేసి ఆనందించవచ్చు. ఏమంటావు?"

"మనిద్దరం కలిసి ఒకే చోట ఉద్యోగం చేస్తున్నామనే ఒకే ఒక కారణం వలన ఇంతవరకు నిన్ను కూర్చోబెట్టి, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతూ వచ్చాను. దయచేసి ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేచి వెళ్ళిపో.

మూలికలు మన దేశ నిధులు. దానికి బేరం మాట్లాడి, విదేశాలలో ఉన్న నీ స్నేహితుడితో కలిసి డబ్బు సంపాదించాలని చూస్తున్నావే...ఇది నీకు దేశ ద్రోహం అనిపించటం లేదా?

కొండ మీద జరుగుతున్న అద్భుతాలన్నీ దేవుని లీలలు! ఋషుల కోరికల వలన జరుగుతున్నాయని ఒక పక్క నేను చెబుతుంటే, నువ్వేమిటి మూర్ఖుడులాగా మాట్లాడుతూనే ఉన్నావు?

చెడు ఆలొచనతో  మూలికలకోసం మందుల కొండకు వెడితే ఏం జరుగుతుందో తెలుసా? సర్వ నాశనం అయిపోతాం.

'వినాశకాలే విపరీత బుద్ధి' అని మన పెద్దలు సరదాగానా చెప్పారు? దీనితో విషయానికి పులిస్టాప్ పెట్టు సుధీర్ " - ఉగ్రంగా అరిచాడు డాక్టర్ విఠల్ రావ్.

"మంచి ఆలొచన చెప్పటానికి వచ్చిన స్నేహితుడ్ని అవమానించి పంపుతున్నావు. ఇలా మాట్లాడినందుకు తరువాత చాలా బాధ పడతావు విఠల్ "

అవమానంతోనూ, కోపంతోనూ ఆవేశపడుతూ ఉద్రేకంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు డాక్టర్ సుధీర్.

పరిస్థితుల్లోనే రాత్రి డ్యూటీకి వెళ్ళిన డాక్టర్ విఠల్ రావ్ ఇంటికి తిరిగి రాలేదు.

'డ్యూటి ముగించుకుని ఎనిమిదిన్నరకల్లా కరెక్టుగా ఇంటికి వచ్చే నాన్న, తొమ్మిదైనా ఇంకా రాలేదే? ఆయన సెల్ ఫోనుకు ఫోన్ చేసి చూద్దామా?' అని దివ్యా ఆలొచిస్తున్న సమయంలో దివ్యా చేతిలో ఉన్న సెల్ ఫోన్ మోగింది.

సెల్ ఫోన్ ఆన్ చేసింది. అవతలవైపు తన తండ్రే!

"హలో దివ్యా...ముఖ్యమైన పనిమీద నేను బయట ఊరు వెడుతున్నానమ్మా. తిరిగి రావటానికి కొన్ని రోజులు పడుతుంది"

"ఏమిటి నాన్నా ఇంత సడన్ గా...ఇంత సడన్ గా ఎక్కడికి వెడుతున్నారు?"

"నేను తిరిగి వచ్చిన తరువాత చెబుతానమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా"

మరు క్షణమే ఫోన్ కట్ అయ్యింది.

దివ్యా మళ్ళీ తండ్రి సెల్ ఫోనుకు ఫోను చేసి చూసింది. ఫోను స్విచ్ ఆఫ్ చెయబడుంది.

'నాన్న ఎలాంటి పరిస్థితులలోనూ ఇలా నడుచుకోరే? డాక్టర్ సుధీర్ వలన నాన్నకు ఏదైనా ఆపద జరిగుంటుందా?

ఒక వేల కిడ్నాప్ చేయబడుంటారో?’

కళ్ళల్లో నుంచి వేడి నీరు ఆగకుండా వస్తోంది.

                                                                                                                  Continued...PART-3

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి