30, మార్చి 2023, గురువారం

ప్రకృతితో పరాచికాలా?..... (ఆసక్తి)

 

                                                                         ప్రకృతితో పరాచికాలా?                                                                                                                                                                                                                  (ఆసక్తి)

గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి వాతావరణ జోక్యం పద్దతితో(Geoengineering)భూమి యొక్క వాతావరణాన్ని కృతిమంగా మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.భూమి చుట్టూ అతి నీల లోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా పనిచేస్తున్న ఓజోన్ పొర, గ్రీన్ హౌస్ వాయువుల వల్ల తరిగిపోతోంది. దీనినే 'గ్లోబల్ వార్మింగ్' లేదా 'భూమి వేడెక్కడం' అని అంటారు.

నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, మిధేన్ లాంటి కొన్ని రకాల వాయువులను 'గ్రీన్ హౌస్ వాయువులు అని పిలుస్తారు. ఇవి ప్రకృతి సహజంగా విడుదల అయినప్పుడు భూమిపైన ఇన్ ఫ్రా రెడ్ కిరణాలు ఉత్పన్నం చేసే రేడియో ధార్మికతను తగ్గించి ఉష్ణొగ్రతను నియంత్రించేందుకు సాయం చేస్తాయి.

అయితే శిలాజ ఇంధనాల వినియోగం...అంటే... పెట్రో ఉత్పత్తుల వినియోగం ద్వారా అవసరాన్ని మించి అధికమొత్తంలో విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులు భూగోళంపై ఉష్ణోగ్రతను విపరీతంగా పెంచేస్తున్నాయి. దీంతో భూమి విపరీతంగా వేడెక్కిపోతోంది.

గ్లోబల్ వార్మింగ్ వల్ల మానవాళి అనేక దుష్పరిణామాలను ఎదుర్కోంటోంది. హిమాలయాల్లో హిమానీనదాలు రికార్డు స్థాయిలో కుచించుకుపోతున్నాయి. పరిస్తితులు ఇలాగే ఉంటే 2035 నాటికల్లా తూర్పు మధ్య హిమాలయాల్లో హిమానీ నదాలే కనిపించవట. ఆహార, నీటి సంక్షోభాలను ఎదుర్కోవడమే కాకుండా. వేసవి వడగాల్పుల వల్ల వేలాదిమంది అసువులుబాయాల్సి వస్తుంది. సముద్ర మట్టాలు పెరిగిపోవడం, అడవులు మునిగిపోవడం, కరువు పరిస్థితులు లాంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రకృతితో పరాచికాలా?..... (ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి